Tag Archives: mahesh babu

Mahesh Babu: ఇలా మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులు అవుతుంది.. మహేష్ బాబు పోస్ట్ వైరల్!

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి మహేష్ బాబు తన నటనతో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.

ఈ విధంగా హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మహేష్ బాబు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కేవలం సినిమాలు విడుదలైన సమయంలో ఆ సినిమాలు కనుక తనకు నచ్చితే ఆ సినిమాల పైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే మాత్రమే ఈయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలుకి తెలుగులో భారీ స్పందన వస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు తెలుగు ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారని తెలుస్తుంది. ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమా పట్ల మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

యాక్టింగ్ ఇరగదీశారు…
ప్రేమలు సినిమాను తెలుగు ఆడియన్స్‌కి చూపించినందుకు కార్తికేయకి పెద్ద థ్యాంక్స్. ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశా.. అసలు చివరిసారిగా ఓ సినిమా చూసి నవ్వుకొని చాలా రోజులైంది. నా ఫ్యామిలీ మొత్తానికి సినిమా బాగా నచ్చింది. యంగ్‌స్టర్స్ అందరూ యాక్టింగ్ ఇరగదీశారు. ఈ చిత్ర బృందానికి కంగ్రాట్యులేషన్స్ అంటూ మహేష్ బాబు చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Mahesh Babu: మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. నమ్రత కూడా కాదంట తెలుసా?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మహేష్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఈ క్రమంలోనే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఈ హీరోయిన్లతో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుంటారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ మళ్లీ మళ్లీ హీరోయిన్లతో షేర్ చేసుకోవాల్సి వస్తే షేర్ చేసుకుంటానని తెలిపారు. త్రిషతో నటించడం చాలా సులభంగా ఉంటుందని అంతేకాకుండా తనతో నా స్క్రీన్ స్పేస్ బాగుంటుందని తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య సీన్స్ అద్భుతంగా ఉండడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అని ఈయన తెలిపారు.

ఫ్రెండ్షిప్ కారణం…
ఇక త్రిష తర్వాత సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తాను ఇష్టపడతానని తెలిపారు. అయితే ఈయన భార్య నమ్రత కూడా హీరోయినే, ఈమెతో కలిసి కూడా మహేష్ బాబు సినిమాలలో నటించారు కానీ ఈయన మాత్రం తన భార్య పేరు చెప్పకుండా త్రిష సమంత అంటూ తనకి ఇష్టమైనటువంటి హీరోయిన్లు మళ్లీమళ్లీ సినిమాలలో నటించాలనుకునే హీరోయిన్ల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: హైదరాబాద్ సమీపంలో భారీ ప్రాపర్టీ కొన్న మహేష్.. రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమ్రత?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.

ఇలా మహేష్ బాబు తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా నమ్రత మాత్రం మహేష్ బాబుకు సంబంధించిన విషయాలతో పాటు పిల్లలు, కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా వీరి బిజినెస్ లు అన్నింటినీ కూడా నమ్రతని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు.

ఇలా మహేష్ బాబు నమ్రత దంపతులు ఇప్పటికే భారీ స్థాయిలో ఆస్తులను సంపాదించారనే సంగతి మనకు తెలిసిందే .వీరు హైదరాబాద్ లో మాత్రమే కాకుండా బెంగళూరు చెన్నై వంటి నగరాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఆస్తులను కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఇక నమ్రతకు సంబంధించి ముంబైలో కూడా పెద్ద ఎత్తున ప్రాపర్టీలు ఉన్నాయట.

ఇకపోతే తాజాగా హైదరాబాదులోని శంకర్ పల్లి సమీపంలో ఈ దంపతులు 2.5 ఎకరాల పొలం కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పొలం రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి పనులను పూర్తి చేయడం కోసం నమ్రత బుధవారం శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ కు వచ్చారు. ఇలా ఈమె వచ్చారు అనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని ఆమెతో సెల్ఫీలు దిగారు. అలాగే ఎమ్మార్వో ఆఫీస్ లోని సిబ్బంది కూడా నమ్రతతో కలిసి ఫోటోలు దిగారు.

Mahesh Babu: ఆ మూడు సినిమాలు నా జీవితాన్నే మార్చేశాయి.. మహేష్ కామెంట్స్ వైరల్!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసింది ఈ సినిమా టాక్ పరంగా కాస్త మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ పరంగా మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు ఈ సినిమా కోసం తాను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా అద్భుతంగా సాగుతున్నాయని మహేష్ బాబు తెలిపారు ఇక ఉగాది తర్వాత ఈ సినిమాకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ రాబోతుందని మహేష్ తెలిపారు.

ఇక తన కెరీర్ గురించి కూడా మాట్లాడుతూ ఈయన తన సినీ కెరియర్లో తన కెరీయర్ని మలుపు తిప్పిన సినిమాల గురించి కామెంట్లు చేశారు. తన కెరీర్లో మూడు సినిమాలు తన లైఫ్ మొత్తం మార్చేసాయని తెలిపారు. మురారి పోకిరి శ్రీమంతుడు సినిమాలని చెబుతాను.

రాజమౌళి సినిమాపై అప్డేట్..
ఇందులోని ప్రతి ప్రాజెక్ట్ లో ఓ భిన్నమైన స్టోరీ టెల్లింగ్ నేను చూశాను. అవి నన్ను ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేలా చేశాయనీ మహేష్ బాబు వెల్లడించారు. ఇక గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు మొదట్లో కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చిన అనంతరం ప్రేక్షకులను ఆకట్టుకుందని ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కూడా దూసుకుపోతుందని మహేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: మహేష్ బాబుకు కలిసి రాని తల్లి సెంటిమెంట్… మూడుసార్లు చేదు అనుభవమే?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశను మిగిల్చింది.

ఇలా ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాకపోవడం ఒక కారణం కాగా ఈ సినిమాపై నెగటివ్ టాక్ తో భారీగా వైరల్ చేయడం కూడా సినిమాకు పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సెంటిమెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయిందని చెప్పాలి.

చిన్నప్పుడే కొడుకును వదిలేసి వెళ్లిపోయినటువంటి తల్లికి తన కొడుకు పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అదేవిధంగా ఈ సినిమా విషయంలో మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పాలి.

తల్లిని నమ్ముకుంటే కష్టమే…
మహేష్ బాబుకి తల్లి సెంటిమెంట్ సినిమాలు పెద్దగా కలిసిరావనే విషయాలు గతంలో కూడా నిజమయ్యాయి. అయితే మరోసారి కూడా ఈయనకు తల్లి సెంటిమెంట్ అచ్చి రాలేదని తల్లిని నమ్ముకుంటే మహేష్ బాబుకి చేదు అనుభవమేనని గుంటూరు కారం నిరూపించింది. గతంలో కూడా మహేష్ బాబు తల్లి సెంటిమెంటుతో వచ్చినటువంటి సినిమాలలో నాని అలాగే నిజం సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

Deepak Saroj : హీరోగా అర్జున్ రెడ్డి రేంజ్ సినిమాతో రాబోతున్న అతడు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్?

Deepak Saroj: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది నటించి ఆ తర్వాత కొన్ని ఏళ్లకు హీరో హీరోయిన్లుగా ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ అలా ఎంతోమంది సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ప్రస్తుతం హీరో, హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు. బలగం సినిమాతో కావ్య హీరోయిన్ గా వరుస సినిమాలు కొట్టేస్తుంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజా సజ్జా నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఇదే కోవలో మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా వచ్చేస్తున్నాడు. అది కూడా ఏకంగా అర్జున్ రెడ్డి రేంజ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.

అతను మరెవరో కాదు మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాలో నటించిన బుడ్డోడు. ఆ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్. సినిమాలో హీరో ఆ ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది ఇతనే. అతడు సినిమాలో దీపక్ చాలా సీన్స్ లో కనిపిస్తాడు. అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొని పలు సినిమాల్లో నటించాడు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. కొత్త డైరెక్టర్ యశస్వి దర్శకత్వంలో దీపక్ సరోజ్ హీరోగా రాబోతున్న సినిమా సిద్దార్థ్ రాయ్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు.

దీపక్ ఖాతాలో హిట్ గ్యారెంటీ..

ఈ ట్రైలర్ చూస్తుంటే అందరికి అర్జున్ రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలే గుర్తుకు వచ్చాయి. ఆ రేంజ్ బోల్డ్, ఎమోషన్ కంటెంట్ తో రాబోతున్నాడు దీపక్. త్వరలోనే సిద్దార్థ్ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నాడు. మరి ఈ సినిమాతో హీరోగా కూడా పేరు తెచ్చుకొని దీపక్ సరోజ్ వరుసగా సినిమాలు చేస్తాడేమో చూడాలి మరి. అంతేకాకుండా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏకంగా ఆ రేంజ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుండడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ ను చూసిన అభిమానులు దీపక్ ఖాతాలో హిట్ గ్యారెంటీ ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

SSMB 29 : గుడ్ న్యూస్ చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. రాజమౌళి, మహేష్ సినిమా పనులు మొదలయ్యాయంటూ?

SSMB 29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయ్యి ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు తన తదుపరి సినిమాను దర్శకుడు రాజమౌళితో చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే మొదలు కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ వరల్డ్ సినిమా తర్వాత దర్శకత్వం వహించబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్ల కోసం మహేష్ బాబు అభిమానులు జక్కన్న అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలోనే మహేష్ రాజమౌళి సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని, ప్రపంచదేశాలు చుట్టే సాహస యాత్రలా ఉంటుందని ఒక సందర్భంలో రాజమౌళి చెప్పారు.

మ్యూజిక్ సిటింగ్స్ పనులు మొదలయ్యాయి..

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ రాస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా కథ పూర్తయింది అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని, కీరవాణి అదే పనిలో ఉన్నాడని, దానిపై వర్క్ జరుగుతుందని తెలిపారు. మ్యూజిక్ వర్క్స్ మొదలైంది అంటే సినిమా ఆల్మోస్ట్ మొదలైపోయినట్టే అని మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఇటీవల జర్మనీకి వెళ్లడంతో ఈ సినిమా వర్క్ కోసమే జర్మనీ వెళ్లాడని రూమర్స్ కూడా వచ్చాయి.

ఈ సినిమాని ఎప్పుడెప్పుడు అధికారికంగా ప్రకటించి షూట్ మొదలుపెడతారా అని మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వీలైనంత తొందరగా ఈ సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి కూడా మహేష్ బాబు కోసమే ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి మరి.

Sitara Ghattamaneni: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తున్న సితార.. చాలా గ్రేట్ అంటూ?

Sitara Ghattamaneni: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి చిన్న వయసులోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సెలబ్రిటీ పిల్లల్లో సితార ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిట్టి పాపకు సోషల్ మీడియాలో హీరోయిన్స్ లో అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా మామూలుగా సెలబ్రిటీ పిల్లలు అంటే కాస్త స్టైలిష్ గా మోడల్ గా ఉంటారు. కానీ సితార మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. అంతేకాకుండా పండుగ సమయాలలో లంగా ఓణి వంటివి ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

4

అలా ఈమె చిన్న వయసులోనే తన మంచి మనసుతో ఎంతోమందికి సహాయం చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. మొన్నటికి మొన్న ఒక జ్యువెలరీ యాడ్స్ లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ యాడ్ కాను సితార దాదాపుగా కోటి రూపాయల వరకు పారితోషికాన్ని అందుకుంది. ఇకపోతే ఇటీవల కాలంలో సితారకు సంబంధించిన ఏదో ఒక విషయం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా సితార తరచూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. అలా చిన్న ఏజ్ లోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. తండ్రి మహేష్ బాబు బాటలోనే నడుస్తూ కొన్ని మంచి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది సితార.

లక్షల్లో సంపాదన..

చదువుతో పాటు మరో పక్క మన కల్చరల్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటూ ఉంటుంది. ఈమె సింప్లిసిటీకి ప్రతి ఒక్కరూ కూడా ఫిదా అవ్వాల్సిందే. కాగా సితార యూట్యూబ్ ఛానల్ ద్వారా తన డాన్స్ వీడియోలతో పాటు తనకు సంబంధించిన అన్ని వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక కేవలం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక యూట్యూబ్ లో, ఇంస్టాగ్రామ్ లో సితార ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగానే ఉందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా సితార తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సితార నెల సంపాదన గురించి ఒక వార్త వైరల్ గా మారింది. సితార ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు సుమారుగా 30 లక్షల వరకు సంపాదిస్తోందట. ఈ వార్త వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఏంటి ఇంత చిన్న వయసులో కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారా అన్ని లక్షలు సంపాదిస్తుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Sitara: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సితార.. అనాధ పిల్లల కోసం స్పెషల్ స్క్రీనింగ్?

Sitara: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇంత చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది సితార. ఈ ముద్దుగుమ్మకు ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇంత చిన్న వయసులోనే తండ్రి అడుగుజాడల్లో ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంటోంది. సితార గొప్ప మనసుకు నిదర్శనంగా గతంలో చాలానే జరిగిన విషయం తెలిసిందే.

పేద పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం తన పుట్టినరోజు వేడుకలను అనాధ పిల్లలతో కలిసి జరుపుకోవడంతో పాటు వారికి బహుమతులను కూడా ఇవ్వడం ఇలా ఎన్నెన్నో మంచి మంచి పనులు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది సితార. కాగా ఎప్పటికప్పుడు ఘట్టమనేని అభిమానులు కూడా సితార చేసే మంచి పనుల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలే ఆమె ఒక లగ్జరీ జువెలరీ యాడ్ లో నటించగా దాదాపు కోటి రూపాయల రెమ్యూనరేషన్ రావడంతో ఆ డబ్బును కూడా చేసేసి అందరి చేత గ్రేట్ అంటూ మన్నలను కూడా పొందింది.

అనాధ పిల్లల కోసం స్పెషల్ స్క్రీనింగ్..

ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి తన గొప్ప మనసును చాటుకుంది సితార. మరి ఇంతకీ ఆమె ఏం చేసింది అన్న విషయానికొస్తే.. తాజాగా సితార అనాథ పిల్లలకు గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ వేయించి మంచి మనసు చాటుకుంది. చిన్న వయస్సులోనే ఇంత గొప్పగా ఆలోచించే గుణం సితారకే సొంతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో మహేష్ బాబు ఫౌండేషన్. చీర్స్ ఫౌండేషన్ తరపున స్పెషల్ షో ఏర్పాటు చేయించారని తెలుస్తోంది. భవిష్యత్తులో సితార మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంత చిన్న వయసుకి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అందరి చేత శభాష్ అనిపించుకున్న సితార ఇంకా మంచి మంచి పొజిషన్లకు వెళ్లాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Mahesh Babu: సినిమాలు బిజినెస్.. మహేష్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అయితే మహేష్ బాబు సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలను కూడా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన నిర్మాతగా కూడా సినిమాలను నిర్మించడమే కాకుండా ఏషియన్ వారితో కలిసి హోటల్ బిజినెస్ అలాగే మల్టీ ఫ్లెక్స్ థియేటర్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా వీటి ద్వారా భారీ స్థాయిలో లాభాలను కూడా అందుకుంటున్నారు. సినిమాల ద్వారా డబ్బు సంపాదించి వాటిని బిజినెస్ లో పెట్టుబడి పెట్టడం బిజినెస్ ద్వారా కోట్లలో ఆదాయం పొందడం జరుగుతుంది.

ఈ విధంగా మహేష్ బాబు భారీగా సంపాదిస్తున్నప్పటికీ దానిలో కొంత భాగం మహేష్ బాబు ఫౌండేషన్ కోసం ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ ద్వారా మహేష్ బాబు ఇప్పటికే వేల సంఖ్యలో చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మ అందించడమే కాకుండా బుర్రపాలెం దత్తత తీసుకొని గ్రామంలో మౌలిక సదుపాయాలు అన్నిటిని కూడా సమకూరుస్తూ ఉన్నారు.

లండన్ లో కూడా ఆస్తులు…

ఈయన వెండితెరపై మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు మరోవైపు బిజినెస్ అంటూ ఈయన భారీగానే సంపాదిస్తున్నారు సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడా పెట్టారనే తెలుస్తుంది. కోట్ల విలువ చేసే కార్లు బంగ్లాలు ఉన్నాయి. కేవలం హైదరాబాదులోనే కాకుండా బెంగళూరులో కూడా కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది అయితే ఈయన ఇండియాలోనే కాకుండా లండన్ లో కూడా ఆస్తులు కొనుగోలు చేశారు అంటూ ఇదివరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.