Tag Archives: mohan babu

Manchu Manoj: డబ్బులు తీసుకొని వారికి ఓటు వేయద్దు.. వారికి మాత్రమే వేయండి: మనోజ్

Manchu Manoj: మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి మంచు మనోజ్ తాజాగా తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటు ఎవరికి వేయాలనే విషయం గురించి మనోజ్ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి మీరు ఓటు వేసే నాయకుడు అందరితో కలిసి ముందుకు వెళుతున్నాడా? దారుణాలకు పాల్పడుతున్నారా అనే విషయాలను గుర్తు పెట్టుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.

మనం ఎన్నుకొని నాయకుడు ఎప్పుడు కూడా మనకు అండగా నిలబడాలి పేదలకు సహాయం చేయాలి అందరితో పాటు కలిసి ముందుకు వెళ్లాలి ఇలాంటి వారికే ఓటు వేయాలి. అయితే డబ్బులు ఇచ్చారని దారుణాలకు పాల్పడుతున్నటువంటి వారికి మాత్రం ఓటు వేయద్దు. ఎవరైతే రాష్ట్రాన్ని సురక్షితంగా పరిపాలిస్తారో అలాంటి వారికే ఓటు వేయాలంటూ ఈయన పిలుపు ఇచ్చారు.

అందరితో కలసి ముందుకు వెళ్తున్నారా..
ఈ విధంగా మనోజ్ ఓటు హక్కు వినియోగించుకోవడం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఎవరికి మద్దతు తెలుపుతున్నారు అనే విషయాలు మాత్రం తెలియడం లేదు తన తండ్రి గతంలో వైసిపి పార్టీకి మద్దతు తెలిపారు .కానీ ఇప్పుడు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇటీవల చంద్రబాబు నాయుడుని కలవడంతో ఈయన టిడిపికే మద్దతు తెలుపుతున్నారంటూ కూడా పలువురు భావిస్తున్నారు.

Mohan Babu: నన్ను కొడితే ఒప్పుకోను.. కావాలంటే తిట్టుకోండి మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా విలన్ గా ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో నటుడు మోహన్ బాబు ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. నిర్మాతగా కూడా ప్రేక్షకుల ముందుకు ఎన్నో గొప్ప సినిమాలను తీసుకువచ్చారు.

ఇకపోతే తాజాగా మోహన్ బాబు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మార్చి 19 వ తేదీన పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున మోహన్ బాబు యూనివర్సిటీలో పుట్టిన రోజు వేడుకలను జరిపారు. అంతేకాకుండా మోహన్ బాబు యూనివర్సిటీ 32వ యాన్యువల్ డే ని కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా హాజరయ్యారు.

మోహన్ లాల్ తనది 50 సంవత్సరాల అనుబంధం అని తెలిపారు. 50 సంవత్సరాల నుంచి తామిద్దరం ఇండస్ట్రీలో కొనసాగుతున్నామని తెలిపారు. అయితే నేను సినిమాలలో బాగా నటించి సంపాదించినది మొత్తం సినిమాలకు నిర్మాతగా మారి నష్టపోయాను అలాంటి సమయంలోనే మోహన్ లాల్ నటించినటువంటి సినిమాని తెలుగులో రీమేక్ చేసి అల్లుడు గారు సినిమాతో హిట్ కొట్టానని తెలిపారు.

విలన్ గా అయిన నటిస్తాను..
అయితే కన్నప్ప సినిమాల్లో కూడా ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్నారు. కానీ ఈ సినిమాలో తనకు నాకు మధ్య సన్నివేశాలు లేవు అందుకే తనతో నటించాలనే కోరిక ఉన్న నేపథ్యంలో నీ సినిమాలో నాకు ఒక అవకాశం కల్పించు విలన్ పాత్రలో అయినా సరే చేస్తాను కానీ విలన్ పాత్ర చేసేటప్పుడు నన్ను కావాలంటే తిట్టుగాని కొట్టేది మాత్రం చేయొద్దు తిట్టే సీన్లు అరిచే సీన్లు ఉంటేనే నేను చేస్తాను అంటూ తన స్నేహితుడు మోహన్ లాల్ ను రిక్వెస్ట్ చేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mohan Babu : అయోధ్య నుంచి పిలుపు వచ్చింది.. భయపడి వెళ్లలేదు : మోహన్ బాబు

Mohan Babu: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రామ మందిరం ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. కనీవిని ఎరుగని రీతిలో ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇక ఈ రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, క్రీడారంగం వారు ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరు కానున్నారు.

ఇప్పటికే సెలబ్రిటీలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు అందుకు సంబంధించిన ఆహ్వానాలు కూడా పంపారు. నేడు అనగా 21వ తేదీన కొందరు అక్కడికి చేరుకోనుండగా మరికొందరు రేపు అనగా 22వ తేదీ అక్కడికి చేరుకోనున్నారు. అయితే తనకు కూడా అయోధ్యకు ఆహ్వానం అందింది అని తెలిపారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. తాజాగా ఫిలింనగర్ లో అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్ట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు అయోధ్యకు ఆహ్వానం అందినప్పటికీ భయపడి తాను వెళ్లలేదని చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరి ఏ విషయంలో మోహన్ బాబు భయపడ్డారు ఆయన ఏం చెప్పారు అన్న వివరాల్లోకి వెళితే.. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలిం నగర్‌లోని దైవ సన్నిధానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అన్ని దేవతా మూర్తులు ఉన్నాయి. విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు.

భయపడి వెల్లలేదు..

అయోధ్య రామాలయ ప్రారంభాన్ని ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఈ వేడుక కోసం నాకు ఆహ్వానం అందింది. సెక్యూరిటీ ఇస్తాము అన్నారు. అయినా భయపడి వెళ్లట్లేదు. కానీ ఇక్కడి దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి 22 వరకు అనేక పూజా కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

https://youtu.be/1UxwX8raSg4

Mohan Babu: అంటరాని వాడు అంటే చెప్పుతో కొడతాను అన్నాను… కులాలు అంటే అసహ్యం: మోహన్ బాబు

Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబు గురించి చెప్పాల్సిన పనిలేదు సీనియర్ నటుడిగా ఇండస్ట్రీలో విలన్ పాత్రలలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నిర్మాతగాను మెప్పించినటువంటి మోహన్ బాబు ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన యూనివర్సిటీ బాధ్యతలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. వృత్తిపరంగా.ఎంతో బిజీగా ఉన్నటువంటి మోహన్ బాబు తాజాగా కులాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మోహన్ బాబు యూనివర్సిటీలో జెండా ఎగరవేసిన అనంతరం ఈయన తన గ్రామంలో ఉన్నటువంటి రైతులతో తన యూనివర్సిటీలో 100 మొక్కలను నాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఇలా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మోహన్ బాబు కులాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు కులాల విభేదాలు అంటే చాలా అసహ్యమని ఈయన తెలియజేశారు. ఒకప్పుడు కులమత బేధాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయంగా వరుస పెట్టి పిన్ని బాబాయ్ అక్క మామ అంటూ చాలా ఆప్యాయంగా పలకరించుకునేవారు కానీ ప్రస్తుతం ఇలాంటి సందర్భాలు ఎక్కడా లేవని ప్రతి ఒక్కరు కులం పేరుతో దూషిస్తున్నారని ఈయన తెలిపారు.

Mohan Babu: కులం పేరుతో దూషిస్తున్నారు…

చిన్నప్పుడు నా స్నేహితుడిని ఒకరు అంటరాని వాడు అంటే తాను కోపంతో చెప్పు తీసుకొని కొడతా అని వార్నింగ్ ఇచ్చానని తెలిపారు. ఇలా కులాలతో దూషించడం నాశనానికి కారణమని అందుకే తనకు కులాలు అంటే అసహ్యం అంటూ మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mohan Babu: బుద్ధి లేదా అంటూ మీడియా పై ఫైర్ అయిన మోహన్ బాబు… ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ బాబు సైతం అలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

మోహన్ బాబు ఇలా ట్రోల్స్ ఎదుర్కోవడానికి కారణమేంటనే విషయానికి వస్తే ఆయన మీడియాపై చిందులు వేయడమే కారణమని తెలుస్తుంది.తాజాగా సబ్ రిజిస్టర్ వారి కార్యాలయానికి మోహన్ బాబు వచ్చారు. వారి ఆస్తులకు సంబంధించిన పనుల నిమిత్తం ఈ కార్యాలయానికి వచ్చినటువంటి ఈయనను మీడియా కవర్ చేసే ప్రయత్నం చేశారు.

ఇలా మీడియా కవర్ చేస్తున్న సమయంలో మోహన్ బాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్ధి లేదా ఆ లోగోలు లాక్కొండయ్యా అంటూ తన బాన్సర్లకు సూచించడంతో బౌన్సర్లు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇలా మీడియా పట్ల మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుద్ధి లేదా అంటూ తిట్టడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mohan Babu:చెప్పించుకునే స్థితికి రాకండి..


ఈ వీడియో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ… మోహన్ బాబు పై ట్రోల్స్ చేస్తున్నారు. మీరు కలెక్షన్ కింగ్ అనిపించుకుంటే సరిపోదు మీ మాటలు కూడా అలాగే ఉండాలి మీడియా కవర్ చేస్తే మీకు వచ్చిన నష్టమేంటి.. మీరు ఒకరికి చెప్పే స్థాయిలో ఉండి ఇలా చెప్పించుకునే స్థితికి రాకండి అంటూ నేటిజన్స్ ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Manchu Lakshmi: నలుగురు పిల్లలని కనాలనుకున్నాను… కానీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి!

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మీప్రసన్న ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఇక్కడ సక్సెస్ కావడం కోసం కృషి చేస్తున్నారు. ఇలా నటిగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె సరైన స్థాయిలో హిట్ అందుకోలేకపోతున్నారు. ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.

ముఖ్యంగా మనోజ్ మౌనిక పెళ్లి విషయంలో ఈమె తీసుకున్నటువంటి బాధ్యతల గురించి తెలియజేశారు మనోజ్ మౌనికల వివాహం చేయడానికి చాలా టెన్షన్ పడ్డానని తెలిపారు. ఇద్దరి కుటుంబాలకు చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అన్న సందేహం నాన్నకి ఉండేది.

ఇక నాన్నను పెళ్ళికి ఒప్పించడం నావల్ల కాలేదు అందుకే ఓసారి యాదాద్రి వెళ్లినప్పుడు ఎలాగైనా వీరి పెళ్లికి నాన్నను ఒప్పించు దేవుడా అంటూ భారం మొత్తం తనపై వేశానని తెలిపారు మొత్తానికి మనోజ్ మౌనిక వివాహం జరిగిపోయిందని అందుకే వారిద్దరిని యాదాద్రి తీసుకెళ్లానని తెలిపారు.ఇక పెళ్లికి ముందు మనోజ్ మౌనిక ఇద్దరు మా ఇంట్లోనే ఉండేవారని ఇప్పుడు వేరుగా ఉంటున్నారని లక్ష్మీ ప్రసన్న తెలిపారు.

Manchu Lakshmi: రాజకీయాలపై ఆసక్తి లేదు…


ఇక మనోజ్ నాకు ఏ చిన్న సహాయం కావాలన్నా వెంటనే చేసి పెడతారని తనకు చాలా సాయంగా ఉంటారని తెలియజేశారు.ఇక తన కూతురి గురించి మాట్లాడుతూ తాను నలుగురు పిల్లలని కనాలని అనుకున్నాను కాకపోతే దేవుడు నాకు ఒకరిని ఇచ్చారు అంటూ తెలియచేశారు. ఇక రాజకీయాల గురించి ప్రశ్నలు రావడంతో అసలు తనకు రాజకీయాలు అంటేనే ఆసక్తి లేదని ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Manchu Manoj: అనాధ ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు.. మంచు మనోజ్ మీద ప్రశంసలు..?

Manchu Manoj: మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. అయితే వ్యక్తిగత విషయాల వల్ల కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అంతే కాకుండా సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా మనోజ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

ఇటీవల మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడంతో అప్పటినుండి తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా మనోజ్ చేసిన ఒక మంచి పని వల్ల వార్తల్లో నిలిచాడు. ఇక తాజాగా మనోజ్ తన పుట్టిన రోజును జరుపుకొన్నారు. అయితే ఎప్పటిలా కాకుండా ఈ ఏడాది తన పుట్టిన రోజుని చాలా సింపుల్ గా ఒక అనాధ ఆశ్రమంలో జరుపుకున్నాడు.హైదరాబాద్‌లోని గాజులరామారం ‘కేర్ అండ్ లవ్’ అనాథ ఆశ్రమంలో అక్కడి చిన్నారులతో కలిసి మనోజ్ తన బర్త్ డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు.

మనోజ్ అక్కడ పిల్లలతో సరదాగా మాట్లాడి వారి బాగోగుల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత అందరి సమక్షంలో కేక్ కట్ చేసాడు. ఆ తర్వాత వారికి నోట్ పుస్తకాలు, బొమ్మలు, బ్యాగ్స్, స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ…ఇలా తన బర్త్‌డేను చిన్నారుల మధ్య సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మంచు మనోజ్ తెలిపారు. ‘పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపాడు.

Manchu Manoj: పిల్లలకు మరింత సేవ చేస్తాను…


భవిష్యత్తులో పిల్లలకు మరిన్ని సేవలు అందిస్తానని..వారి కళ్లలో ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మనోజ్ ఇలా అనాధ పిల్లలతో మీరు ఆడంబరంగా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడంతో అందరూ మనోజ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

Mohan Babu: మామయ్య అన్నం తినిపించేవారు… అత్తయ్య అలా చూసుకున్నారు: మౌనిక

Mohan Babu: మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండవ వివాహం కావటం గమనార్హం. మనోజ్,మౌనిక రెడ్డి వివాహాన్ని లక్ష్మీ ప్రసన్న తన నివాసంలో దగ్గరుండి అన్ని తానై ఘనంగా జరిపించింది. ఇక వివాహం జరిగిన తరువాత మొదటిసారిగా మంచు మనోజ్, మౌనిక రెడ్డి కలిసి టీవి షోలో పాల్గొన్నారు.

వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షో లో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ షో లో మౌనిక రెడ్డి తన మామ మంచు మోహన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ షో లో మౌనిక రెడ్డి మాట్లాడుతూ…” మామయ్య చాలా సరదాగా ఉంటారు. మనోజ్ ని వివాహం చేసుకోక ముందు నుండి మామయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు.

పెళ్లి కాకముందు ఇంటికి వెళ్లిన సమయంలో మామయ్య నాకు అన్నం తినిపించారని మౌనిక తెలిపింది. నా కొడుకును, నన్ను మోహన్ బాబు కుటుంబ సభ్యులు సొంతవాళ్లలా దగ్గరకు తీసుకున్నారని భూమా మౌనిక ఎమోషనల్ అయ్యింది. ఇక తన అత్త గారి గురించి మాట్లాడుతూ ..’ అత్తయ్య ఫోన్ చేసి తరచూ తనతో మాట్లాడుతూ ఉంటారని, అమ్మ చనిపోయిన సమయంలో అత్తయ్య నాకు చాలా దైర్యం చెప్పారు.

Mohan Babu:మంచు కుటుంబంలోకి కోడలుగా రావడం నా అదృష్టం…

ఇలాంటి కుటుంబంలోకి కోడలిగా రావడం దేవుడిచ్చిన వరం అని మౌనిక రెడ్డి తెలిపింది. అలాగే మంచు లక్ష్మితో కూడా తనకు ఒక అందమైన అనుబంధం ఉందని మంచు లక్ష్మి నన్ను చిన్నపిల్లలా చూస్తుందని ,తానే దగ్గరుండి మనోజ్ తో నా పెళ్లి జరిపించింది అంటూ అత్త ,మామ, ఆడపడచు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Shaakuntalam: అందుకే శాకుంతలం సినిమాలో ఎన్టీఆర్ ను తీసుకోలేదు.. నీలిమ గుణ కామెంట్స్ వైరల్!

Shaakuntalam: సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా మైథాలజికల్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నీలిమ గుణం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వచ్చారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నీలిమ గుణ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాణ విషయంలో దిల్ రాజు తమకు చాలా సపోర్ట్ ఇచ్చారని తెలిపారు.

ఇక సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని నీలిమ తెలియజేశారు.ఇకపోతే మోహన్ బాబు గారితో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలనేదే నా కల అయితే ఈ సినిమా విషయంలో ఆకల నెరవేరిందని నీలిమ తెలియజేశారు. ఇకపోతే శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్రలో నటించిన దేవ్ మోహన్ పాత్ర గురించి ఈమె పలు విషయాలు తెలియజేశారు.

Shaakuntalam: దుష్యంతుడి పాత్ర పరిమితం కావడమే…


ముందుగా ఈ పాత్రలో చేయడం కోసం ఎన్టీఆర్ ను అనుకున్నామని నీలిమా తెలిపారు. అయితే తారక్ ను సంప్రదించలేదని తెలియజేశారు. దుష్యంతుడి పాత్ర పరిమితం కావడం చేతనే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ను సంప్రదించలేదని ఈ సందర్భంగా నీలిమ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mohan Babu: మంచు వారింటిలో సందడి చేసిన బలగం టీమ్…బలగం టీమ్ ను సన్మానించిన మోహన్ బాబు!

Mohan Babu: ప్రస్తుతం బలగం సినిమా పేరు మారుమోగుతోంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తెలంగాణ యాస,భాషలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్క తెలంగాణ ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ప్రభావం ఎంతగా పడింది అంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తెర కట్టి సినిమాని చూసేలా ఈ సినిమా ప్రభావం అందరిపై పడింది.

ఇకపోతే ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది అన్నదమ్ములుఅక్క చెల్లెలు వివాదాల ద్వారా మాట్లాడుకోకపోయినా ఈ సినిమా ద్వారా తిరిగి కలుసుకునేలా ఈ సినిమా అందరిపై ప్రభావం చూపుతోంది. ఇక ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను మాత్రమే కాకుండా సెలబ్రిటీలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమా చూసినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇదివరకే డైరెక్టర్ వేణుని తన ఇంటికి ఆహ్వానించి ఆయనను సన్మానించిన విషయం మనకు తెలిసిందే. మోహన్ బాబు కూడా ఈ సినిమాని చూశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు విష్ణు బలగం సినిమా బృందాన్ని తమ ఇంటికి ఆహ్వానించి సన్మానం చేశారు.

Mohan Babu: నటనలో జీవించేసారు…


ఈ క్రమంలోనే ప్రియదర్శి వేణు రూప లక్ష్మిని తమ ఇంటికి ఆహ్వానించి వారికి ప్రత్యేకంగా సన్మానం చేయడమే కాకుండా సినిమాపై కూడా ప్రశంశాలు కురిపించారు.ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ వేణు తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన సినిమా చేశారని తెలిపారు అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా తమ పాత్రలలో జీవించారని మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.