Tag Archives: nandu

Geetha Madhuri: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. ఈ పూజ ఎందుకు చేస్తారో తెలుసా?

Geetha Madhuri: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో గీతామాధురి ఒకరు. ఈమె నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే ఈ దంపతులకు ఇటీవల ఒక కుమార్తె కూడా జన్మించారు. అయితే తాజాగా గీతామాధురి మరోసారి తల్లి కాబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈమె ప్రస్తుతం 9వ నెల గర్భంతో ఉన్నారు.

ఈమెకు ఫిబ్రవరి నెలలోనే డెలివరీ డేట్ ఇచ్చినట్లు గతంలో ఓ సందర్భంలో గీతామాధురి తెలియజేశారు. ఈ క్రమంలోనే ఘనంగా సీమంతపు వేడుకలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సీమంతపు వేడుకలతో పాటు తన భర్తతో కలిసి గీతామాధురి ఉదకశాంతి పూజ చేశారు. ఈ పూజకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది అసలు ఉదకశాంతి పూజ అంటే ఏంటి ఈ పూజ ఎందుకు చేస్తారనే విషయం గురించి సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఉదకశాంతి పూజ అంటే మంత్రంతో జలాన్ని పరిశుద్ధం చేసి ఆ మంత్ర జలాన్ని ఇల్లు మొత్తం చల్లడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దోషాలు మొత్తం తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ పూజను చాలామంది ఐశ్వర్యం కోసం ఆరోగ్యం కోసం ఆయుష్షు కోసం కూడా చేస్తుంటారు.

ఆరోగ్యం కోసం..

ఇక గీత మాధురి గర్భంతో ఉన్నప్పుడు ఈ పూజ చేశారు అంటే తన బిడ్డ ఆరోగ్యం కోసమే ఈమె ఈ పూజ నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు పై ఎంతోమందిని నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేయడమే కాకుండా ఈమెకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Geetha Madhuri: క్యాసినో ఆడి గీత మాదురి డబ్బులు పోగొట్టుకుంది… నటుడు నందు కామెంట్స్ వైరల్!

Geetha Madhuri: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సింగర్ గీత మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్లే బాక్స్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నార. అయితే గీత మాధురికి ఒక చెడ్డ అలవాటు ఉందని గతంలో ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు .తాను క్యాసినోకి బానిసగా మారిపోయానని ఈమె తెలిపారు.

ఇలా ఈ ఆట ఆడి చాలా డబ్బులు పోగొట్టుకున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా గీత తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నటుడు నందు నటించిన వెబ్ సిరీస్ వధువు ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈయన తన భార్య గీత మాధురికి ఉన్నటువంటి క్యాసినో పిచ్చి గురించి పలు విషయాలు వెల్లడించారు. ఒకసారి మేము ఇద్దరం లండన్ కు వెళ్ళగా అక్కడ ఈమె ఈ ఆట ఆడటం నేర్చుకుందని తెలిపారు.

గీత మాధురి చాలా తెలివైన అమ్మాయి. కానీ ఈ క్యాసినో కారణంగా పెద్ద ఎత్తున డబ్బును పోగొట్టుకుందని ఈయన తెలియజేశారు. నేను వద్దని చెప్పిన ఈసారి ఎలాగైనా డబ్బు గెలవాలి అంటూ మరోసారి డబ్బు పెట్టి ఆడిందని అయితే అప్పుడు కూడా డబ్బు పోవడంతో నేను విసుగు వచ్చి డబ్బులు అన్ని విసిరేసి బయటకు వచ్చాను దాంతో ఆగు బుజ్జి నేను కూడా వస్తున్నాను అంటూ ఆమె బయటకు వచ్చింది.

పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చారు…

అక్కడ మేమిద్దరం గొడవ పడుతున్నామని పోలీసులు మమ్మల్ని అరెస్టు చేయడానికి వచ్చారు కానీ మేమిద్దరం భార్యాభర్తలని వారిని ఒప్పించడానికి చాలా కష్టపడి చివరికి అక్కడ నుంచి తప్పించుకున్నాము అంటూ ఈయన తెలిపారు. ఇప్పటికీ కూడా తాను క్యాసినో ఆడుతుందని అయితే ఐదు లేదా పదివేల రూపాయలు డబ్బు పెట్టి మాత్రమే ఆడుతుంది అంటూ నందు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rashmi Gautam: ఫ్రాంక్ వీడియోపై స్పందించిన రష్మీ.. ప్రమోషన్ లో పాల్గొనడం ఇష్టం లేదంటూ కామెంట్స్?

Rashmi Gautam: గత రెండు రోజులుగా యాంకర్ రష్మీ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సింగర్ గీత మాధురి భర్త నందు రష్మీ ఫోన్ ఎత్తదు ప్రమోషన్లకు రాదు అంటూ పెద్ద ఎత్తున ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చివరికి ఆ వీడియోలో ఇది ఫ్రాంక్ అంటూ రశ్మిని ఇబ్బంది పెట్టిన విషయం మనకు తెలిసిందే.అయితే అసలు మ్యాటర్ ఏంటి అనే విషయానికి వస్తే నందు రష్మీ జంటగా గత రెండు సంవత్సరాల క్రితం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా రెండు సంవత్సరాలు తర్వాత నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మీకి ఫోన్లు చేసి సినిమా ప్రమోషన్లకు రావాలి అంటూ పిలవగా తాను ప్రమోషన్లకు రానని చెప్పి ఆపై ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నందు రష్మీ ఈ వీడియో పై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ రష్మిని ప్రశ్నిస్తూ అది నిజంగానే ఫ్రాంక్ వీడియోనా అంటూ ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు రష్మీ సమాధానం చెబుతూ అది ఫ్రాంక్ వీడియో అయినప్పటికీ తాను చెప్పిన సమాధానం మాత్రం నిజమేనని తెలియజేశారు.రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాకి ఉన్నఫలంగా ప్రమోషన్లకు రావాలి అంటే నేను కూడా అందుకు సిద్ధంగా ఉండాలి నేను ఇప్పటికే ఎన్నో టీవీ షోలకు కమిట్ అయ్యి బిజీగా ఉన్నాను. ఇలా ఉన్నఫలంగా రావాలి అంటే కుదరదని చెప్పి ఫోన్ పెట్టేసాను అటు సమాధానం చెప్పారు.

Rashmi Gautam: టీవీ షోలతో బిజీ..

అయినప్పటికీ తరచూ వీరు ఫోన్ చేస్తూనే ఉన్నారు.అందుకే తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏకంగా నేను షెడ్యూల్లో పాల్గొంటున్న సమయంలో అక్కడికే వచ్చారు అంటూ రష్మీ తెలిపారు. ప్రమోషన్లకు వెళ్లడానికి ఎందుకు ఇష్టం లేదు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. అక్కడికి వెళ్తే వాళ్లు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు ఆ సమాధానాలను తాను చెప్పలేననీ ఈ సందర్భంగా రష్మీ ఈ వీడియో గురించి క్లారిటీ ఇచ్చారు.

Geetha Madhuri: ఘనంగా గీతామాధురి కూతురు మూడవ పుట్టినరోజు వేడుకలు… వైరల్ అవుతున్న ఫోటోలు?

Geetha Madhuri:టాలీవుడ్ ప్లే బాక్స్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ గీత మాధురి గురించి పరిచయం అవసరం లేదు. ఈమె పాటలకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇకపోతే గీతామాధురి నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ దంపతులకు 2019 ఆగస్టు నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

గీతా మాధురి తన కూతురికి దాక్షాయిని అని నామకరణం చేశారు. ఇకపోతే ఆగస్టు 9వ తేదీ తన కూతురు మూడవ ఏట అడుగు పెట్టింది. ఇక తన కూతురి మొదటి రెండు బర్తడేలు కరోనా కారణం వల్ల పెద్దగా సెలబ్రేట్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే గీతామాధురి తన కూతురు మూడవ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ పుట్టినరోజు వేడుకలకు అత్యంత సన్నిహితులు బంధుమిత్రులు హాజరయ్యారు.ఈ క్రమంలోనే దాక్షాయిని మూడవ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను గీతామాధురి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది ఈమె అభిమానులు తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Geetha Madhuri: బిగ్ బాస్ రన్నర్ గా గీత మాధురి..

ఇకపోతే గీతామాధురి సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం ఈమె బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గీతా మాధురి రన్నర్ గా నిలిచారు.ఇక ఈమె భర్త నందు సైతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే గీతామాధురి తాజాగా తన కూతురి బర్త్డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో ఒకసారిగా వైరల్ అయ్యాయి.