Tag Archives: pm modi

AP politics: బాబుని సీఎం చేయటం మోడీ అజెండా కాదు.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ!

AP politics: ప్రస్తుతం జరగబోయే ఏపీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగ మారాయి. జగన్ ఒక్కడే ఒక వైపు ఉండగా మరోవైపు జనసేన టిడిపి బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇలా ఈ పార్టీలన్నీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో మొదటిసారి చిలకలూరిపేట వద్ద ప్రజాగళం అనే పేరిట భారీ సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి విమర్శలు చేస్తారో అన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు .అయితే ఈ సభలో మోడీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సభలో మోడీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఈయన తెలిపారు. ఎక్కడ కూడా జగన్ గురించి మాట్లాడలేదు అలాగే రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదు పోలవరం గురించి ప్రశ్నించలేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ ప్రభుత్వంలోని మంత్రుల గురించి మాట్లాడారే తప్ప జగన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలి అని కూడా ఎక్కడా చెప్పలేదు. ఎన్డీఏకి ఓట్లు వేసి గెలిపించండి అని మాత్రమే కోరారని నాగేశ్వరరావు తెలిపారు. ఇక్కడ మోడీ గారికి చంద్రబాబు నాయుడుని గెలిపించడమే అజెండా కాదని ఈయన తెలిపారు.

జగన్ పై ఎక్కడ విమర్శలు చేయలేదు..
రేపు ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అలాగే జగన్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా మోడీకి అవసరం కనుక ఈయన ఎక్కడ కూడా జగన్ కు ఓటు వేయొద్దని చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండని చెప్పలేదు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలి అనే అజెండా కనుక ఉండి ఉంటే ఈ సభలో జగన్ పై విమర్శలు చేసేవారు కానీ మోడీ ఎక్కడ కూడా అలా ప్రసంగించలేదు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన అనాలసిస్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Narendra Modi: నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగిన ఇటలీ పిఎం జార్జియా మెలోని!

Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా దుబాయిలో జరిగినటువంటి వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్.. కాన్ఫెరెన్స్ ఆఫ్‌ పార్టీస్‌ (COP28) 28వ సమ్మిట్ కు హాజరైన సంగతి మనకు తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, యూకే ప్రధాని రిషి సునక్‌, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సహా ప్రపంచ నేతలంతా కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వాతావరణ మార్పులపై కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగారు. ఇక ఈ ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె COP28లో గుడ్ ఫ్రెండ్స్.. #Melodi” అంటూ ఇటాలియన్ ప్రధాని మెలోని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

COP28 సమ్మిట్ లో పాల్గొన్న మోడీ…

మోదీ ఇటాలియన్ కౌంటర్‌ గురించి మెలోని ప్రస్తావించారు. స్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం రెండు దేశాల ప్రయత్నాల గురించి మాట్లాడారు. అదేవిధంగా సుస్థిరమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం భారతదేశం, ఇటలీల మధ్య సహకార ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. COP28 సమ్మిట్ UAE ప్రెసిడెన్సీలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు జరగనుంది. శుక్రవారం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని తిరిగి ఇండియా చేరుకున్నారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

Rahul: దేశం కోసం మా కుటుంబం(నెహ్రూ కుటుంబం) ప్రాణ త్యాగాలు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, మోదీకి కౌంటర్ ఇచ్చారు. మా కుటుంబ త్యాగాలకు ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

పార్లమెంట్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలకు రాహుల్ ను మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. తాను లేవనెత్తిన అంశాలపై కాకుండా ఇతర అంశాలు మాట్లాడుతూ, తన ప్రశ్నల నుంచి తప్పించుకున్నారని రాహుల్ పేర్కొన్నారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

చైనా- పాక్ ఏకమవడం, రాజ్యాంగ ఉల్లంఘనలు, దేశంలో విభజన రాజకీయాలపై ప్రశ్నించినా సమాధానమే రాలేదన్నారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు.

తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతిగా..

మూడు గంటలకు పైగా ఆయన ప్రసంగంలో ఆ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ కుటుంబ పాలనే(గాంధీల కుటుంబం) కారణమని తిట్టిపోశారు. దేశంలో అత్యవసర పరిస్థితికి, సిక్కుల ఊచకోతకు కారణం కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బలహీనపరిచిందన్నారు. ఈ సందర్భంగా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తప్పుపట్టారు. సరైన చర్చ లేకుండా రాష్ర్టంను విడదీశారని ఆక్షేపించారు. పార్లమెంట్ తలుపులు మూసి అప్రజాస్వమిక పద్ధతుల్లో నాటి బిల్లును ఆమోదించారన్నారు. లోక్ సభలో పెప్పర్ స్ర్ప ఘటనలతో ఆనాడు హింస ఘటనలూ చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోకపోవడంతో నాటి సమస్యలు రెండు తెలుగు రాష్ర్టలలో ఇంకా నలుగుతూనే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరచారన్నారు. తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతి టి.అంజయ్య మరణాంతరం జరిగిన అవమానాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ ఆరోపణలకు మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అంటే భయమని, అందుకు నిదర్శనమే ఈ ప్రసంగమని ఆరోపించారు. తాను లేవనెత్తిన అంశాలను పక్కదోవపట్టించారన్నారు. ఈ ప్రభుత్వ విధానాలతో చైనా – పాకిస్తాన్ దేశాలు ఒక్కటవుతున్నాయని ఇది దేశానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాం. అయినప్పటికీ విషయమై సమాధానమే రాలేదన్నారు. ఈ వైఖరికి దేశ భద్రతకు మంచిది కాదన్నారు. కొవిడ్ మొదటి దశలోనూ మోదీ ప్రభుత్వానికి పలు చేసామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీనో, నెహ్రూ కుటుంబాన్నో విమర్శించడం కాదు మీరు(మోదీ) దేశ రక్షణకు చెప్పాలని డిమాండ్ చేశారు.

KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం..! నిరసనలు తెలపాలని పిలుపు..!

KTR: రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ… ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యానించారు. తెలంగాణకు నేను వ్యతిరేఖం కాదు.. కానీ చర్చించకుండా ఏపీ విభజన చేశారని.. దీంతోనే రెండు రాష్ట్రాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని… కాంగ్రెస్ వల్లే రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.

KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం..! నిరసనలు తెలపాలని పిలుపు..!

తాజాగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం..! నిరసనలు తెలపాలని పిలుపు..!

ప్రధాని మోదీ పదేపదే తెలంగాణను అవమానిస్తున్నారని.. దశాబ్ధాల స్పూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ప్రధానికే అవమానకరం అంటూ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. 

తెలంగాణకు ఎనిమిదేళ్లుగా ఒక్క పనికూడా..

మరోవైపు ఈరోజు కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. బీజేపీ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. రాష్ట్రంలోని మంత్రులు కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా ఒక్క పనికూడా చేయలేదని విమర్శిస్తున్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని అంటున్నారు. దీనికి కౌంటర్గా బీజేపీ పార్టీ కూాడా రియాక్ట్ అయింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ టీాఎర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని మోదీ విమర్శిస్తే మీకేం నొప్పి అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ డౌన్ ఫాల్ ప్రారంభమైందని అన్నారు.

ఈ పథకంలో చేరితే.. భార్యభర్తలకు నెలకు రూ.10 వేలు వస్తాయి..!

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అందులో రైతులకు ఉపయోగపడేవి ఉన్నాయి.. సామాన్యులకు ఉపయోగపడేవి కూడా ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉన్న పథకం గురించి ఇక్కడ తెలుసుకుందాం. దీనిలో జాయిన్ అయితే భార్యభర్తలకు ఇద్దరికీ నెలకు రూ.10 వేలు తీసుకోవచ్చు. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. మనం తెలుసుకునే పథకం.. అటల్ పెన్షన్ యోజన.

ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. దీనిలో జాయిన్ అయిన తర్వాత నెలకు మన వయస్సును బట్టి డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మనకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.5 వేలు లేదా అంతకంటే తక్కువగా పెన్షన్ రూపంలో వస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ అటల్ పెన్షన్ యోజనకు కనీస వయస్సుగా 18 ఏళ్లు.. గరిష్ట వయస్సుగా 40 ఏళ్లు నిర్ణయించారు.

బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకంలో జాయిన్ అవ్వొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ఉంటే అందులో ఈ సర్వీస్ అనే ఆప్షన్ కి వెళ్లి వివరాను నమోదు చేసుకోవచ్చు. ఇలా చేరిన సదరు వ్యక్తి అకౌంట్ నుంచి నెల నెలా డబ్బుల కట్ అవుతూ ఉంటాయి. 40ఏళ్ల వయస్సులో జాయిన్ అయిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి. 18 ఏళ్ల వయస్సులో జాయిన్ అయితే 20 ఏళ్లు వరుసగా కట్టాల్సి ఉంటుంది.

ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో స్కీమ్‌లో రూ.5 వేల పెన్షన్ కోసం నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000కు అయితే రూ.42, రూ.2 వేలకు రూ.84, రూ.3 వేలకు రూ.126, రూ.4 వేలకు రూ.168 కట్టాలి. అదే 40 ఏళ్ల వయస్సులో చేరితే ఆ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా రూ.5 వేల పెన్షన్ కోసం జాయిన్ అయితే 60 ఏళ్లు నిండిన తర్వాత భార్యాభర్తలకు నెలకు రూ.10 వేలు తీసుకోవచ్చు.

పీవీ సింధుకు ఐస్ క్రీమ్ ఆఫర్ చేసిన మోడీ.. రాకెట్ గిఫ్ట్ గా ఇచ్చిన సింధు!

ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలలో భారత క్రీడాకారులు వివిధ క్రీడలలో ఏడు పథకాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సంపాదించుకున్న పివి సింధు ఒలంపిక్ క్రీడలలో రెండు పథకాలను సాధించిన క్రీడాకారిణిగా రికార్డును సొంతం చేసుకుంది.తాజాగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సంపాదించుకున్న పీవీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

తాజాగా భారతదేశానికి ఒలంపిక్ క్రీడలలో పథకాలు తీసుకువచ్చిన క్రీడాకారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గౌరవ సత్కారాలను చేశారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

ఈ క్రమంలోనే పీవీ సింధుతో మాట్లాడుతూ తనకు ముందుగా ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయబోతున్నట్లు తెలిపారు.ఒలంపిక్ క్రీడలలో భాగంగా గత కొంత కాలం నుంచి పీవీ సింధు ఐస్ క్రీమ్ తినకుండా ఉండటం వల్ల కాంస్య పతకాన్ని గెలిచిందని ఈ క్రమంలోనే తనకు ఒక ఐస్ క్రీమ్ ఆఫర్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని పీవీ సింధు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ దగ్గ రనుంచి అరుదైన గౌరవ సత్కారం లభించిందని తెలియజేశారు.

అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పీవీ సింధు చిన్న బహుమతిని అందజేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చినట్లు పీవీ సింధు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం పీవీ సింధు ఒలంపిక్స్ లో ఆడినటువంటి బ్యాడ్మింటన్ బ్యాట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రధాని.. ఎర్రకోట నుంచి కీలక ప్రకటన..!

దేశంలో అన్ని సైనిక్ పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం ఉంటుందని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ వెల్లడించారు. ఎర్రకోటపై నుంచి ప్రధాని మాట్లాడుతూ.. తనకు లేఖలు సైతం రాస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్లలో బాలికలకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు.

ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. రెండున్నరేళ్ల కింద‌ట తొలిసారి మిజోరంలోని సైనిక్ స్కూల్‌లో బాలిక‌ల‌ను అనుమ‌తించిన‌ట్లు మోదీ వెల్లడించారు. భారతదేశ సమగ్రాభివృద్ధికి ప్రతిఒక్కరూ సంకల్పంతో ఉండాలని పేర్కొన్నారు. సైనిక్ స్కూల్స్ సొసైటీ ఈ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో నిర్వహణ జరుగుతోంది.

విద్యార్థుల‌ను చిన్నతనం నుంచే భారత సాయుధ బాలగాల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశంకోసం పోరాడి త్యాగాలు చేసిన మహనీయుల కీర్తిని కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ కరోనా సమయంలో కరోనా వారియర్లు ప్రజా సేవ చేస్తున్నారని మెచ్చుకున్నారు.

ఈ కరోనా సమయంలో భారత్ స్వయంగా కరోనా వ్యాక్సిన్ తయారుచేయడమే కాక… ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇండియా చేపట్టిందని ప్రధాని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 54 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నాని.. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. అందరి అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న వీటిలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం!

ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరికొద్ది గంటల్లో ఎర్రకోట నుండి ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. జాతినుద్దేశించి ప్రసంగించిన ఉన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా ఏడో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం విశేషం.

కాగా స్వతంత్ర భారతంలో మొదటిసారిగా జాతీయ పతాకం ఆవిష్కరించిన వెంటనే.. వింగ్ కమాండర్ బల్దేవ్ సింగ్ నేతృత్వంలోని వైమానిక దళం రెండు విమానాల ద్వారా పూల వర్షం కురిపించనుంది.

ఇక టోక్యో ఒలంపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తో పాటు 32 మంది ఒలంపిక్ విజేతలు మొదటిసారిగా ఎర్రకోట వేడుకలో పాల్గొనున్నారు.

మహిళా తలుచుకుంటే ఏదైనా సాధ్యమే_ మోదీ

మహిళ సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్​’ కార్యక్రమంలో భాగంగా పలు స్వయం సహకార సంఘాలకు(ఎస్​హెచ్​జీ) చెందిన మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు.

మహిళలు తలుచుకుంటే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్​’ కార్యక్రమంలో భాగంగా పలువురు సహకార సంఘాల మహిళలతో ఆయన సమావేశమయ్యారు.

దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది _మోదీ

భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నట్లు వెల్లడించారు. సంక్షోభాలను గట్టేకించడంలో కృషి చేసిన పరిశ్రమల నాయకులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల సమాఖ్య 2021 వార్షిక సమావేశంలో మోది వర్చువల్​గా పాల్గొన్నారు.

కాగా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు వలన భారతదేశంలో ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డ్ లో నమోదు అవడానికి దోహద పడింది మోది అన్నారు.
కంపెనీ స్వదేశానిది కాకపోయినా.. వాటి ఉత్పత్తులు మాత్రం భారత్​లోనే తయారు కావాలనేదే తమ లక్ష్యమన్నారు. దేశంలో ప్రస్తుతం 60 యూనికార్న్​ పరిశ్రమలు ఉన్నాయని.. అందులో 21 కంపెనీలు గడిచిన కొన్ని నెలల్లోనే రికార్డ్ మార్క్​ను అందుకున్నాయని మోదీ తెలిపారు.