Tag Archives: pregnant

Upasana: ఉపాసన జాతకంలో అలాంటి దోషాలు ఉన్నాయా… వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్?

Upasana: ఉపాసన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈమె పేరు కూడా ఒకటి. ఇందుకు గల కారణం మరి కొద్ది రోజులలో తల్లి కాబోతుండడమే కారణమని చెప్పాలి. ఉపాసన రాంచరణ్ దాదాపు పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలా వివాహమైనప్పటినుంచి రాంచరణ్ ఉపాసన దంపతులు ఎంతో ప్రేమగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

ఇకపోతే ఉపాసన రాంచరణ్ దంపతులు పెళ్లయిన పది సంవత్సరాల వరకు పిల్లల గురించి ఆలోచించకపోవడంతో ఈ ప్రశ్నలు పదేపదే ఉపాసనను చాలా ఇబ్బంది పెట్టాయని చెప్పాలి.పిల్లల విషయంలో వీరిద్దరిని చాలామంది వివిధ రకాలుగా ట్రోల్ చేశారు. అయితే ఈ విషయం గురించి తాజాగా ఉపాసన మాట్లాడుతూ నేను ఈ విధమైనటువంటి ట్రోల్స్ కి ఏ మాత్రం బాధపడలేదని చెప్పారు.

ఇక ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ కావడంతో మరి కొద్ది రోజులలో బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారని కుటుంబ సభ్యులు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఉపాసన రాంచరణ్ ప్రస్తుతం హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన జాతకం గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Upasana:ఉపాసనకు విమర్శలు తప్పవా…

ఉపాసన జాతకంలో పలు దోషాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఉపాసన కుమారుడికి కనక జన్మనిస్తే ఆయన మెగా కుటుంబానికి మరింత పేరు ప్రతిష్టలు తెచ్చేవారు అవుతారని అదే అమ్మాయి కనుక పుడితే ఉపాసన క్రేజ్, ఫెమ్ పూర్తిగా విమర్శలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ వార్తలపై మెగా అభిమానులు కొందరు ఆందోళన చెందుతున్న మరి కొందరు మాత్రం ఇవన్నీ వట్టి అవాస్తవాలేనని కొట్టిపారేస్తున్నారు.

Actress Purnaa: 9 నెలల గర్భంతో ఉంటూ చేయకూడని పని చేసిన పూర్ణ.. తిట్టిపోస్తున్న నెటిజన్స్!

Actress Purnaa: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన పూర్ణ రవిబాబు దర్శకత్వం వహించిన అవును సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ సినిమా తర్వాత పూర్ణ నటించిన సినిమాలో అన్ని మంచి హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పూర్ణ మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తలైవి, అఖండ, దృశ్యం 2 వంటి ఎన్నోసినిమాలలో కీలకపాత్రలలో నటించింది.

ఇలా పూర్ణ వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంది. ఇక ఇటీవల దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షాహిన్ అసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొంతకాలానికి తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తన సీమంతానికి సంబందించిన ఫోటోలతో పాటు తనకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

ప్రస్తుతం పూర్ణా 9 నెలల గర్భంతో ఉంది. మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పూర్ణ చేయకూడని పనిచేసే నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా పూర్ణ షేర్ చేసిన ఒక డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పూర్ణ దసరా సినిమాలోని చంకీల అంగీలేసి అనే పాటకు స్టెప్పులు వేసింది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమాలోని ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

Actress Purnaa: ఇలా చేయకూడదని తెలియదా…

ఈ పాటకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా స్టెప్పులు వేసి వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో పూర్ణ కూడా 9 నెలల గర్భంతో ఉన్నప్పటికీ ఈ పాటకు డాన్స్ చేసి వీడియో షేర్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం పూర్ణ చేసిన పనికి సీరియస్ అవుతున్నారు. గర్భవతిగా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఇలా డాన్స్ చేయటం తల్లీ బిడ్డకు మంచిది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పూర్ణ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Devoleena: పెళ్లికి ముందే తలైందంటూ నటిపై దారుణమైన ట్రోలింగ్స్.. ఏం జరిగిందంటే?

Devoleena: ఈమధ్య కాలంలో సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో స్నేహితులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇక సెలబ్రిటీల పెళ్లి అంటే మామూలుగా ఉండదు.

తమ పెళ్లికి సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవలీనా భట్టాచార్జి ప్రేమించిన వ్యక్తిని డిసెంబర్ 14వ తేదీ వివాహమాడింది. అయితే ఈమె తన జిమ్ ట్రైనర్
షాన్వద్ షైఖ్ ని పెళ్లాడినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చేసింది.

ఈమె ఈ విధంగా తన పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో దేవలీనా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే ఈమె పెళ్లికి ఎంతమంది అయితే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం అందుకు రెట్టింపు మంది తనని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇలాంటి ట్రోల్స్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికొస్తే ఈమె పెళ్లి జరుగుతున్న సమయంలో ఈమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

Devoleena: ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదు…


ఇలా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని తెలియడంతో పెద్ద ఎత్తున చాలామంది ఈమెను ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోల్స్ పై స్పందించిన దేవలీనా…నా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని అయినా అలా ఎలా ఆలోచిస్తారు అంటూ ఈమె స్పందించారు. ఇలా తన గురించి వచ్చేటటువంటి ట్రోల్స్ గురించి తాను పెద్దగా పట్టించుకోనని కానీ ఈ విషయం తనని బాధ పెట్టిందని తెలిపారు. ఇలా తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందించి నటి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈమె తెలుగులో కోడలా కోడలా కొడుకు పెళ్ళామా అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.

Marital Affair: భార్య చెల్లిపై కన్నేసిన కామాంధుడు..! 7 నెలల గర్భవతి కాగా చివరికి ఇలా!

Marital Affair: ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎన్ని కేసులు నమోదవుతున్నా కామాంధుల తీరులో మార్పలు రావడం లేదు. వావీవరసలు, చిన్న పెద్ద తేడాలు మరిచి ప్రవర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకువచ్చినా అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు.

Marital Affair: భార్య చెల్లిపై కన్నేసిన కామాంధుడు..! 7 నెలల గర్భవతి కాగా చివరికి ఇలా!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్కువగా లైంగిక దాడులు తెలిసిన వారి వల్లే జరుగుతుండటం విస్మయం కలిగించే అంశం.  కన్నకూతుళ్లను, కూతరు వయసున్న బాలికను కూడా వదలడం లేదు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే కాటేస్తున్నారు. దీంతో ఈ బాధను తమలోతామే కుమిలిపోతున్నారు.

Marital Affair: భార్య చెల్లిపై కన్నేసిన కామాంధుడు..! 7 నెలల గర్భవతి కాగా చివరికి ఇలా!

ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా వేధన పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. మైనర్ అయిన సొంత భార్య చెల్లిలిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక శివమొగ్గలో ఈ ఘటన చోటు చేసుకుంది. చదువుకునేందుకు సొంత అక్క- బావ ఇంటికి వచ్చిన బాలిక పై కన్నేశాడు బావ.

బాలికకు నొప్పులు రాగా…

కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికపై గత కొద్ది రోజులగా భార్యకు తెలియకుండా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మాయమాటలు చెబుతూ.. లైంగిక వాంఛ తీర్చకుంటూ ఉన్నాడు. అయితే ఇటీవల బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా… బాలికకు ఏడు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి ఆస్పత్రి నుంచి బయటకు తీసుకువచ్చారు. బాలికకు నొప్పులు రాగా మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే 7 నెలలకే ప్రసవం కాగా బిడ్డ మరణించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి రాగా.. పోలీసులు సదరు బావను కటకాల్లోకి నెట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ప్రెగ్నెంట్ అంటూ తల్లికి షాక్ ఇచ్చిన అషు రెడ్డి.. కాలితో తంతూ రియాక్ట్ అయిన తల్లి! వ్యూస్ కోసం ఇంత చేయాలా?

సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అషురెడ్డి కూడా ఒకరు. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా లేదు. బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా క్రేజు తెచ్చుకుంది.ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే మొదట అషు రెడ్డి నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో తగిన గుర్తింపు తగ్గకపోవడంతో ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ బాగా ఫేమస్ అయింది. ఒక అనంతరం హౌస్ లో విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఏర్పడిన పరిచయంతో షో అయిపోయిన తర్వాత కూడా విచ్చలవిడిగా తిరిగారు.

ఒక దశలో అయితే ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా అషు రెడ్డి కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా అషు రెడ్డి తాను ప్రెగ్నెంట్ అంటూ వాళ్ళ అమ్మ, ఫ్యామిలీ ముందు కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఇక ఇప్పుడు ఏం చేద్దాం అమ్మ అని తన తల్లిని అడగగా.. ఇంకేముంది ఏమైనా తాగి చచ్చి పోదాం అంటూ ఎమోషనల్ అవుతూ అషు రెడ్డి పై చేయి చేసుకుంది.

చేయి చేసుకోవడమే కాకుండా కాలితో కూడా తన్నింది. అనంతరం లోపలికి వెళ్లి ఉండు మీ నాన్న గారికి ఫోన్ చేసి చెప్తాను అని అనగా.. అమ్మ ఆగమ్మ ఇదంతా ఫ్రాంక్ కావాలంటే కెమెరా చూడు అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది. దానితో అషు తల్లి నువ్వు ఫ్రాంక్ అని చెప్పినా నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయ్యింది. నీ పై నాకు నమ్మకం ఉంది. దయచేసి ఇలాంటివి ఇంకెప్పుడు చేయకు అంటూ మందలించింది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వ్యూస్ కోసం ఇంత దిగజారి పోతావా? అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు.

12 ఏళ్ల బాలికపై కన్నేసిన ఆటో డ్రైవర్.. గర్భవతిని చేసి చివరకు..

అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి కఠిన చట్టాలు తీసుకు వచ్చినా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. సైదాబాద్ ఘటన మరువకముందే ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. ఇలా బాలికలకు, మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతోంది.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నిజామాబాద్ లో చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ 12 ఏళ్ల బాలికపై కన్నేసి.. అత్యాచారం చేసి.. ఆరు నెలల గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని బోదన్ రోడ్‌‌‌‌ లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ మాజిద్.. తన ఇంటి పక్కనే ఉంటున్న ఓ 12 ఏళ్ల బాలికపై కన్నేశాడు.

ఈ క్రమంలో ఓ రోజు అతడు ఆ బాలికను బెదిరించి, మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఇలా ఆ బాలికను బెదిరించి గత కొంత కాలంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే ఇటీవల ఆ బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లిదండ్రలు మందలించారు.

ఆమె 6 నెలల గర్భవతి అని తేలింది. దీంతో అస్సలు విషయం బయటకు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరాయి. అభం శుభం తెలియని తన బిడ్డపై ఆ దుర్మార్గుడు చేసిన పనికి వాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఎనిమిది నెలలుగా ఓ మైనర్ బాలికపై ఐదుగురు అత్యాచారం.. చివరకు ఆమె గర్భం దాల్చడంతో..

ఎనిమిది నెలలుగా ఓ మైనర్ బాలికపై కామాంధులు అత్యాచారం చేశారు. వారి కారణంగా బాలిక ఇటీవల గర్భం దాల్చి.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ అత్యాచారంలో తన బంధువుతో పాటు మరో నలుగురు ఉన్నారు. దీంతో ఆమె ఆ బిడ్డను బావిలో ఆ బాలిక బంధువు పడేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కామాంధులు రెచ్చిపోతున్నారు.

వాయి వరసులు మరిచి అయిన వాళ్లపై కూడా ఏ మాత్రం కనికరంలేకుండా అత్యాచారాలకు పాల్పడతున్నారు. మధ్యప్రదేశ్ లోని గ్రామానికి చెందిన ఓ బాలిక(14) తల్లి మూడేళ్ల క్రితమే మరణించింది. ఉపాధి కోసం ఆ బాలిక తండ్రి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఇంట్లో ఒంటరిగా ఆమె ఉంటున్న విషయాన్ని ఆమె సమీప బంధువు(21) గమనించాడు.

ఇది గమనించి ఆమెపై 8 నెలల క్రితం అత్యాచారం చేశాడు. అతడికి సంబంధించి మరో నలుగురు స్నేహితులు కూడా.. ఈ విషయాన్ని తాము మీ నాన్నకు చెబుతాం అంటూ బెదిరించి .. అత్యాచారం చేశారు. అప్పటి నుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల ఆమె గర్భం దాల్చిన విషయం వాళ్లకు తెలవడంతో టాబ్ లెట్స్ ఇచ్చి ఆ గర్భాన్ని పోగొట్టాలని చూశారు. తీవ్ర నొప్పితో ఆమె రక్తస్రావం అయి.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికను తమ సమీప బంధువు బావిలో పడేశాడు.

బావిలో శిశువు మృతదేహంపై పోలీసులకు సమాచారం అందడంతో మొదట బాలికను అదుపులోకి తీసుకొని విచారంచగా.. ఆమె జరిగినది అంతా చెప్పింది. ఆమెను అత్యాచారం చేసిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడిని..అతడి స్నేహితుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను, అందులో ఉన్న ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

తల్లి కాబోతున్న హీరోయిన్ ఆనంది..! అందుకే ప్రమోషన్స్ కి దూరం..!

పలాస ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా తెరకెక్కిన చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఈ సినిమా గత శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయటం వల్ల పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఎంత వేడుకగా నిర్వహించారు.

సాధారణంగా ఏ సినిమా అయినా విడుదల అవుతుందంటే ఆ సినిమాలోని హీరో హీరోయిన్లు సినిమా ప్రమోషన్లలో పెద్దఎత్తున పాల్గొంటారు. కానీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా హీరోయిన్ మాత్రం ఎక్కడ ప్రమోషన్లలో కనిపించకపోవడంతో శ్రీదేవి హీరోయిన్ ఎక్కడ అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించినటువంటి ఆనంది సినిమా ప్రమోషన్లలో పాల్గొనక పోవడానికి కారణం ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్ర బృందంతో ఏమాత్రం సంబంధం లేకుండా, సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన పోవడానికి గల కారణం ఏమిటంటే.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ తల్లి కాబోతోంది. అందుకే సినిమా షూటింగ్ తర్వాత ఎవరికి కనిపించలేదని, ఈ విషయం తెలిసి చిత్రబృందం కూడా సైలెంట్ అయ్యారని, అందుకే ఈమె ప్రమోషన్స్లో కనిపించలేదని తెలియజేశారు.

ఇక సినిమా విషయానికి వస్తే సూరి బాబు పాత్రలో ఒక గ్రామీణ యువకుడి గా సుధీర్ బాబు కనిపించగా, సోడాల శ్రీదేవిగా ఆనంద్ కనిపించి సందడి చేశారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను భాగం ఆకట్టుకుంటుంది.ఈ సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు సినిమాపై ప్రశంసలు కు కురిపించారు.

సరోగసీ ద్వారా గర్భందాల్చిన మహేష్ హీరోయిన్.. కారణం ఇదే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు సరసన నెంబర్ 1 నేనొక్కడినే చిత్రం ద్వారా పరిచయమైన బ్యూటీ కృతి సనన్.మహేష్ బాబు సరసన నటించినప్పటికీ ఈమెకి ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఆశించినంత ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ బ్యూటీ తన దృష్టి మొత్తం బాలీవుడ్ వైపు మళ్లించింది.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చేజిక్కించుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి సనన్ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న”మిమీ”అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో 20 లక్షలు తీసుకొని ఒక అమెరికా జంటకు బిడ్డను సరోగసి ద్వారా జన్మనిచ్చే తల్లి పాత్రలో కృతిసనన్ సందడి చేయనున్నారు. ఒకవైపు కామెడీతో పాటు మరోవైపు, సెంటిమెంట్ ఉన్న పాత్రను ఎంతో చాకచక్యంగా చూపించారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేశారు.పంకజ్ త్రిపాఠి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. 20 లక్షలు తీసుకొని బిడ్డకు జన్మనివ్వడానికి ఒప్పుకున్న కృతిసనన్ ఆ తర్వాత ఆ జంట తమ బిడ్డ వద్దంటే గర్భంలో దాచుకున్న బిడ్డను చంపుకోలేక కృతి ఆ ప్రాణానికి జన్మనివ్వడం ఈ ట్రైలర్‌లో మనం చూడొచ్చు.

ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలా అనే సందిగ్ధంలో చిత్రబృందం ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నె‌ట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమా ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చాయి.

తల్లికి నెగిటివ్.. కడుపులో బిడ్డకు పాజిటివ్.. చివరికి ఏమైందంటే?

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తారు.తనకు ఏ చిన్నపాటి అనారోగ్యం కలిగినా వెంటనే డాక్టర్లను సంప్రదించి తన బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు పడతారు. ఈ క్రమంలోనే తల్లికి ఏదైనా వ్యాధి సంక్రమించిన అది బిడ్డకు సోకకుండా వైద్య శాస్త్రం బిడ్డకు ఎంతో రక్షణ కల్పిస్తుంది. ఈ క్రమంలోనే తల్లి ఎన్నో రకాల వ్యాధుల బారినపడినప్పటికీ ఆ వ్యాధుల బారిన పడకుండా బిడ్డను రక్షిస్తుంది.

తాజాగా వైద్యులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే ఒక విచిత్ర సంఘటన వారణాసిలో చోటుచేసుకుంది. వారణాసికి చెందిన అనిల్ ప్రజాపతి అనే వ్యక్తి నెలలు నిండిన తన భార్య సుప్రియను ప్రసవం కోసం బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిధిలోని ఎస్‌ఎస్ ఆస్పత్రికి ఈ నెల24 ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే అక్కడి వైద్యులు ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా సుప్రియకు కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.

ఈ క్రమంలోనే వైద్యులు మరుసటిరోజు ఆమెకు ప్రసవం చేశారు. సుప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వైద్యులు పుట్టిన శిశువుకి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ శిశువు పరీక్షల ఫలితాలను చూసి డాక్టర్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా ఫలితాలలో పాజిటివ్ వచ్చింది. తల్లికి కరోనా లేకున్నా బిడ్డకు పాజిటివ్ రావడంతో డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తన భార్యకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. కానీ బిడ్డకు మాత్రం పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పరీక్ష ఫలితాలు తప్పుగా వచ్చి ఉంటాయని ఆయన తెలిపారు. ఈ విషయమే ఆసుపత్రి సూపర్-ఇండెంట్ మాట్లాడుతూ మరి కొద్ది రోజులలో తల్లి బిడ్డ ఇద్దరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని, ప్రస్తుతానికి తల్లీ బిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియజేశారు.