అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి కఠిన చట్టాలు తీసుకు వచ్చినా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. సైదాబాద్ ఘటన మరువకముందే ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. ఇలా బాలికలకు, మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతోంది.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నిజామాబాద్ లో చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ 12 ఏళ్ల బాలికపై కన్నేసి.. అత్యాచారం చేసి.. ఆరు నెలల గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని బోదన్ రోడ్ లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ మాజిద్.. తన ఇంటి పక్కనే ఉంటున్న ఓ 12 ఏళ్ల బాలికపై కన్నేశాడు.
ఈ క్రమంలో ఓ రోజు అతడు ఆ బాలికను బెదిరించి, మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఇలా ఆ బాలికను బెదిరించి గత కొంత కాలంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే ఇటీవల ఆ బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లిదండ్రలు మందలించారు.
ఆమె 6 నెలల గర్భవతి అని తేలింది. దీంతో అస్సలు విషయం బయటకు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరాయి. అభం శుభం తెలియని తన బిడ్డపై ఆ దుర్మార్గుడు చేసిన పనికి వాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…