అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి కఠిన చట్టాలు తీసుకు వచ్చినా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. సైదాబాద్ ఘటన మరువకముందే ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. ఇలా బాలికలకు, మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతోంది.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నిజామాబాద్ లో చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ 12 ఏళ్ల బాలికపై కన్నేసి.. అత్యాచారం చేసి.. ఆరు నెలల గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని బోదన్ రోడ్ లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ మాజిద్.. తన ఇంటి పక్కనే ఉంటున్న ఓ 12 ఏళ్ల బాలికపై కన్నేశాడు.
ఈ క్రమంలో ఓ రోజు అతడు ఆ బాలికను బెదిరించి, మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఇలా ఆ బాలికను బెదిరించి గత కొంత కాలంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే ఇటీవల ఆ బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లిదండ్రలు మందలించారు.
ఆమె 6 నెలల గర్భవతి అని తేలింది. దీంతో అస్సలు విషయం బయటకు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరాయి. అభం శుభం తెలియని తన బిడ్డపై ఆ దుర్మార్గుడు చేసిన పనికి వాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు.































