జార్ఖండ్ డైనమేట్.. ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు అంటూ ఉండరు. రెండు ప్రపంచ కప్ లను అందించిన ఏకైక కెప్టెన్ కూడా. అంతేకాకుండా దేశీయంగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో సారి తన సత్తా చాటి కప్ ను ఎగురేసుకొని వెళ్లాడు. మొత్తంగా అతడి సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ ను 2021 సీఎస్ కే తరఫున సాధించాడు.
వరుసగా నాలగోసారి చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అందించాడు. ఐపీఎల్ సీజన్ 2021 టైటిల్ ను క్రికెట్ అభిమానులకు బహుమతిగా ఇచ్చాడు ఎంఎస్ ధోని. ఇటువంటి సమయంలో ధోని మరో శుభవార్తను చెప్పబోతున్నాడు. అదేంటంటే.. సోషల్ మీడియాలో ధోని భార్య సాక్షి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచాక ఆ ఫొటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే అందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటి..? అంటారా.. విషయానికి వస్తే.. ఈ ఫొటోల్లో సాక్షి బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆమె తల్లికాబోతుందా.. అన్న అనుమానం కలుగచేశారు. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లువిరిసింది.
ఇది అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు కానీ.. అదే నిజమని నెటిజన్లు నమ్ముతున్నారు. 2015లో ధోనికి ఒక కూతురు పుట్టిన విషయం తెలిసిందే.. అయితే ఆ కుటుంబంలో మళ్లీ 2022లో ఓ కొత్త సభ్యుడు రోబోతున్నాడని.. సురేశ్ రైనా భార్య ప్రియాంక రైనా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిలో ఎంత నిజం ఉందో అధికారికంగా ప్రకటన తర్వాత తెలుస్తుంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…