జార్ఖండ్ డైనమేట్.. ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు అంటూ ఉండరు. రెండు ప్రపంచ కప్ లను అందించిన ఏకైక కెప్టెన్ కూడా. అంతేకాకుండా దేశీయంగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో సారి తన సత్తా చాటి కప్ ను ఎగురేసుకొని వెళ్లాడు. మొత్తంగా అతడి సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ ను 2021 సీఎస్ కే తరఫున సాధించాడు.

వరుసగా నాలగోసారి చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అందించాడు. ఐపీఎల్ సీజన్ 2021 టైటిల్ ను క్రికెట్ అభిమానులకు బహుమతిగా ఇచ్చాడు ఎంఎస్ ధోని. ఇటువంటి సమయంలో ధోని మరో శుభవార్తను చెప్పబోతున్నాడు. అదేంటంటే.. సోషల్ మీడియాలో ధోని భార్య సాక్షి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచాక ఆ ఫొటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే అందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటి..? అంటారా.. విషయానికి వస్తే.. ఈ ఫొటోల్లో సాక్షి బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆమె తల్లికాబోతుందా.. అన్న అనుమానం కలుగచేశారు. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లువిరిసింది.
Omo Sakshi is pregnant ???????? congratulations mahi n sakshi… that's why they were more emotional yesterday .. that family hug ???? pic.twitter.com/YXVzO0wdyZ
— ???? CSK WON BICH ???????? (@exorgasmsoul) October 16, 2021
ఇది అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు కానీ.. అదే నిజమని నెటిజన్లు నమ్ముతున్నారు. 2015లో ధోనికి ఒక కూతురు పుట్టిన విషయం తెలిసిందే.. అయితే ఆ కుటుంబంలో మళ్లీ 2022లో ఓ కొత్త సభ్యుడు రోబోతున్నాడని.. సురేశ్ రైనా భార్య ప్రియాంక రైనా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిలో ఎంత నిజం ఉందో అధికారికంగా ప్రకటన తర్వాత తెలుస్తుంది.































