కరోనా మహమ్మారి కొన్ని వేల కుటుంబాలను చీకటిబయం చేసింది. ఎంతో మంది విధి లేక రోడ్డున పడ్డవారు కూడా ఉన్నారు. కరోనా నియంత్రణకు కేవలం నివారణ ఒక్కటే మార్గం అని వైద్యులు, అధికారులు మొదటి నుంచి చెబుతున్నారు.
కచ్చితంగా మాస్క్, శానిటైజర్లను ఉపయోగించాలని.. కరోనా నిబంధనలు పాటించాలిన చెబుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చినదగ్గర నుంచి కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకున్నట్లే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు.. తమిళనాడు లోని మైలాడుతురై జిల్లా అధికార యంత్రాంగం మందుబాబులకు షాక్ ఇచ్చింది.
తమిళనాడు ప్రభుత్వం నియంత్రణలో ఉన్న టాస్మాగ్ దుకాణాలలో మద్యం కొనుగోలు చేసేవారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపెట్టాలనే నిబంధన పెట్టింది. ప్రజలు ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని.. కోవిడ్-19 రహిత జిల్లాగా మార్చేందుకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ ప్రకటనతో మద్యం ప్రియులు కొంత మంది టెన్షన్ పడుతున్నారు.
మద్యం తాగడం అలవాటుగా మారిన వారు సడన్ గా ఇళా బంద్ చేస్తే తట్టుకోలేరు. కనుక వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు మద్యం దుకాణాలకు కాకుండా.. ఇక వ్యాక్సిన్ కేంద్రాలకు పరుగు పెడుతున్నారు. మందుబాబులకు కాస్తంత అసహనం అనిపించినా.. ఈ ఆలోచన చాలా బాగుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా చేస్తే బాగుంటదని అభిప్రాయపడుతున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…