Movie News

సరోగసీ ద్వారా గర్భందాల్చిన మహేష్ హీరోయిన్.. కారణం ఇదే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు సరసన నెంబర్ 1 నేనొక్కడినే చిత్రం ద్వారా పరిచయమైన బ్యూటీ కృతి సనన్.మహేష్ బాబు సరసన నటించినప్పటికీ ఈమెకి ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఆశించినంత ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ బ్యూటీ తన దృష్టి మొత్తం బాలీవుడ్ వైపు మళ్లించింది.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చేజిక్కించుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి సనన్ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న”మిమీ”అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో 20 లక్షలు తీసుకొని ఒక అమెరికా జంటకు బిడ్డను సరోగసి ద్వారా జన్మనిచ్చే తల్లి పాత్రలో కృతిసనన్ సందడి చేయనున్నారు. ఒకవైపు కామెడీతో పాటు మరోవైపు, సెంటిమెంట్ ఉన్న పాత్రను ఎంతో చాకచక్యంగా చూపించారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేశారు.పంకజ్ త్రిపాఠి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. 20 లక్షలు తీసుకొని బిడ్డకు జన్మనివ్వడానికి ఒప్పుకున్న కృతిసనన్ ఆ తర్వాత ఆ జంట తమ బిడ్డ వద్దంటే గర్భంలో దాచుకున్న బిడ్డను చంపుకోలేక కృతి ఆ ప్రాణానికి జన్మనివ్వడం ఈ ట్రైలర్‌లో మనం చూడొచ్చు.

ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలా అనే సందిగ్ధంలో చిత్రబృందం ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నె‌ట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమా ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

5 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

5 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

5 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

5 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

5 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

5 hours ago