తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు సరసన నెంబర్ 1 నేనొక్కడినే చిత్రం ద్వారా పరిచయమైన బ్యూటీ కృతి సనన్.మహేష్ బాబు సరసన నటించినప్పటికీ ఈమెకి ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఆశించినంత ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ బ్యూటీ తన దృష్టి మొత్తం బాలీవుడ్ వైపు మళ్లించింది.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చేజిక్కించుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి సనన్ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న”మిమీ”అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో 20 లక్షలు తీసుకొని ఒక అమెరికా జంటకు బిడ్డను సరోగసి ద్వారా జన్మనిచ్చే తల్లి పాత్రలో కృతిసనన్ సందడి చేయనున్నారు. ఒకవైపు కామెడీతో పాటు మరోవైపు, సెంటిమెంట్ ఉన్న పాత్రను ఎంతో చాకచక్యంగా చూపించారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేశారు.పంకజ్ త్రిపాఠి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. 20 లక్షలు తీసుకొని బిడ్డకు జన్మనివ్వడానికి ఒప్పుకున్న కృతిసనన్ ఆ తర్వాత ఆ జంట తమ బిడ్డ వద్దంటే గర్భంలో దాచుకున్న బిడ్డను చంపుకోలేక కృతి ఆ ప్రాణానికి జన్మనివ్వడం ఈ ట్రైలర్లో మనం చూడొచ్చు.
ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలా అనే సందిగ్ధంలో చిత్రబృందం ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్తో పాటు జియో సినిమా ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చాయి.



























