Tag Archives: rana

Prabhas: ప్రభాస్ కెరియర్ టర్న్ అవ్వటానికి రానా కారణమా.. ఆ సినిమా రిజెక్ట్ చేయడంతో?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రభాస్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైనటువంటి మాస్ యాక్షన్ సినిమాలను చేశారు అంతేకాకుండా ప్రభాస్ ఎన్నో ప్రేమ కథ సినిమాలలో కూడా నటించారు. ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మచ్చ సక్సెస్ కావడంతో ఈయన వరుసగా పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే ఈయన బాహుబలి సినిమా చేయకముందు డార్లింగ్ సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.

ఇలా ఒక్కసారిగా ప్రభాస్ సినీ కెరియర్ టర్న్ అవ్వటానికి రానా కారణమని తెలుస్తుంది. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ కరుణాకర్ డార్లింగ్ సినిమా కథతో రానా వద్దకు వెళ్లారట ఈ సినిమా కథ మొత్తం విన్నటువంటి రానా ఈ సినిమాని రిజెక్ట్ చేశారు అయితే ఆయన సినిమా రిజెక్ట్ చేయడానికి కారణం చెప్పలేదు కానీ ఈ సినిమాలో నటించడానికి ఇష్టం చూపలేదు.

డార్లింగ్ రానా చేయాల్సి ఉండేదా..

ఈ విధంగా రానా ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో కరుణాకర్ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులను చేసుకొని ప్రభాస్ వద్దకు వెళ్లారట. ఇలా ఈ కథ విన్నటువంటి ప్రభాస్ ఈ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా రానా రిజెక్ట్ చేయడంతోనే డార్లింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా ప్రభాస్ చేశారు. ఈ సినిమాతో ఈయన సినీ కెరియర్ లో సక్సెస్ అయ్యారు. ఇక వీరిద్దరూ కలిసి బాహుబలి సినిమాలో నటించారు ఈ సినిమా ఇద్దరిని పాన్ ఇండియా హీరోలుగా మార్చేస్తుంది.

Rana: నన్ను ఏదైనా అడగాలంటే అవయవాలు దానం చేయాలి… రానా కామెంట్స్ వైరల్!

Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు. ఈయన లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇలా దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి రానా ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో నటించడానికి కూడా రానా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా రానా గుర్గావ్ లో జరిగిన సినాప్స్ వేడుకలలో రానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఆరోగ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రానా ఇటీవల కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన తన అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ..

ప్రకృతికి మించిన వైద్యం లేదు…
ఎవరైనా నా ఆరోగ్యం గురించి ఏదైనా అడగాలి అంటే ముందుగా మీరు అవయవాలు దానం చేస్తానని చెప్పండి. అలాంటి ఆలోచన మీకు ఉంటేనే నన్ను నా ఆరోగ్యం గురించి అడగండి లేదంటే ఆలోచనను విరమించుకోండి అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనిషి చివరిదశలో ఉన్నప్పుడే జీవితాన్ని విభిన్నంగా చూస్తాడు.ఆ క్షణం ఆలోచన విధానం మారిపోతుంది. ఇందుకు నేను మినహాయింపు కాదని తెలిపారు. అనారోగ్య సమస్యల కారణంగా బాహుబలి సినిమా సమయంలో పెరిగిన బరువు పూర్తిగా తగ్గిపోయానని అనంతరం అరణ్య సినిమా కోసం ఏడాది పాటు అడవులలో తిరుగుతూ ఉన్నానని ప్రకృతికి మించిన వైద్యం మరేది లేదంటూ ఈ సందర్భంగా రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Rana: బాలీవుడ్ హీరోయిన్ కు క్షమాపణలు చెప్పిన రానా… అసలు ఏం జరిగిందంటే?

Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు.అయితే తాజాగా నటుడు రానా బాలీవుడ్ హీరోయిన్ కు క్షమాపణలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా రానా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అలాగే నటుడు దుల్కర్ సల్మాన్ కు క్షమాపణలు చెబుతూ ఈయన ట్వీట్ చేశారు.

తాజాగా రానా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని అలాగే రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రానా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో ఈయన బాలీవుడ్ నటికీ పరోక్షంగా క్షమాపణలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రానా మాట్లాడుతూ తాను యాక్టింగ్ స్కూల్లో చదివే సమయంలో దుల్కర్ తన జూనియర్ అని తెలియజేశారు.తను చాలా మృదుస్వభావి. ఓపిక చాలా ఎక్కువ. ఓ సారి నేను హిందీ సినిమా షూటింగ్‌కు వెళ్లాను. ఆ చిత్ర నిర్మాతలు నాకు చాలా సన్నిహితులు. సెట్ లో దుల్కర్ ఒకవైపు నిల్చుని ఉండగా ఆ సినిమాలో నటిస్తున్నటువంటి ఒక స్టార్ హీరోయిన్ తన భర్తతో ఫోన్లో షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.

Rana: సోనమ్ పై భారీ ట్రోల్స్..


ఆమె ప్రవర్తన అక్కడ ఎవరికీ నచ్చలేదు ఆ సమయంలో దుల్కర్ చాలా ఓపికగా ఉన్నారని రానా తెలిపారు. అయితే ఆ హీరోయిన్ గురించి తాను తర్వాత నిర్మాతలతో మాట్లాడానని ఈయన తెలియజేశారు. అయితే పరోక్షంగా రానా మాట్లాడినటువంటి సంఘటన
‘ది జోయా ఫ్యాక్టర్‌’ అనే సినిమా సెట్‌లో జరిగిందని నెటిజన్లు నిర్దారణకు వచ్చారు. దీంతో సోనమ్‌కపూర్‌ను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ఇలా రానా చేసిన ఈ వ్యాఖ్యలకు హీరోయిన్ పై ట్రోల్స్ రావడంతో ఈయన దుల్కర్ సల్మాన్ తో పాటు హీరోయిన్ సోనం కపూర్ కి కూడా క్షమాపణలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.

Keerthi Suresh: బాటిల్ దించకుండా కల్లు మొత్తం తాగేసిన కీర్తి సురేష్… షాక్ లో ఉన్న రానా…నాని వీడియో వైరల్!

Keerthi Suresh: నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ ఇదివరకే నేను లోకల్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ మరోసారి దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నార్త్ టు సౌత్ పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రస్తుతం నాని ముంబైలో హీరో రానాతో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలలో భాగంగా నటి కీర్తి సురేష్ చేసిన పనికి రానా, నాని ఇద్దరూ షాక్ లో ఉండిపోయారు.ఇంతకీ కీర్తి సురేష్ ఏం పని చేసింది అనే విషయానికి వస్తే…

దసరా సినిమాలో నాని మందు తాగే సన్ని వేషాలలో ఎత్తిన సీసా దించకుండా మందు తాగే సీన్స్ ఉన్నాయట. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా నాని మరోసారి అలా మందు తాగి చూపించారు. నాని సీసా ఎత్తకుండా మందు తాగి చూపించడంతో రానా కూడా అలాగే చేశారు. ఇక వీరిద్దరిని చూసిన కీర్తి సురేష్ తానేమి తక్కువ కాదంటూ ఆమె కూడా కల్లు సీసా ఎత్తి దించకుండా గుట గుట తాగేశారు.

Keerthi Suresh: బొగ్గు గనుల నేపథ్యంలో…


కీర్తి సురేష్ ఇలా తాగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ఆమెను మరింత తమ అరుపులతో ప్రోత్సహించారు. ఇక కీర్తి సురేష్ ఇలా చేయడంతో నాని, రానా ఇద్దరు కూడా షాక్ లో ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు పని చేయగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ పై కామెంట్స్ చేసిన నటుడు శివకృష్ణ… ఇది మన సంస్కృతి కాదంటూ కామెంట్స్!

Rana Naidu: కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీలకు మంచి ఆదరణ వచ్చింది. అయితే సినిమాలకు మాదిరిగా ఓటీటీలలో ప్రసారమయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లకు సెన్సార్ లేకపోవడంతో అడల్ట్ కంటెంట్ మొత్తం ఓటీటీలలో ప్రసారమవడంతో ఎంతోమంది ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు వెబ్ సిరీస్ లను చూసి చెడిపోతున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒకప్పుడు సెన్సార్ సభ్యుడిగా ఉన్నటువంటి నటుడు శివకృష్ణ తాజాగా ఒక వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను తాజాగా ఒక వెబ్ సిరీస్ చూశానని, ఆ వెబ్ సిరీస్ చాలా దారుణంగా ఉందని ఆల్మోస్ట్ అది ఒక బ్లూ ఫిలిం లా ఉందని ఈయన మండిపడ్డారు.

ఈ మధ్యకాలంలో ఇలాంటి దారుణమైన సినిమాలు వెబ్ సిరీస్ తాను చూడలేదని ఇలాంటి వెబ్ సిరీస్ లు మన సంస్కృతి సాంప్రదాయాలు కాదంటూ ఈయన మండిపడ్డారు.భార్యాభర్తలు పడక గదిలో పడుకున్నప్పుడు తలుపులు తీసేయడం పిల్లలు చూడటం ఏంటి? ఇది అసలు మన సంస్కృతేనా? ఇలాంటివి చూసి పిల్లలు చెడిపోతున్నారని ఈయన మండిపడ్డారు.

Rana Naidu: వెబ్ సిరీస్ లకు సెన్సార్ తప్పనిసరి….

ఒక దేశం ఆర్థికంగా నష్టపోతే తిరిగి కోలుకోవచ్చు కానీ సంస్కృతి సాంప్రదాయాలను కనుక నష్టపోతే తిరిగి తిరిగి దేశాన్ని కాపాడటం చాలా కష్టమని తెలిపారు. అందుకే ఓటిటిలలో కూడా ప్రసారమయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లకు కూడా సెన్సార్ తప్పనిసరి అంటూ ఈ సందర్భంగా ఈయన తెలిపారు. ఇక ఈయన వెబ్ సిరీస్ పేరు ప్రస్తావించకుండా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు ఈయన రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి మాట్లాడారని భావిస్తున్నారు.

Net Flix: రానా నాయుడుతో ఉన్న ఇమేజ్ కాస్త డామేజ్ చేసుకున్న నెట్ ఫ్లిక్స్… ఇక కోల్పోవడం కష్టమేనా?

Net Flix: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీలకు ఎంతో మంచి ఆదరణ వచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను మంచిగా ఎంటర్టైన్ చేసింది. ఇలా ఎన్నో ఓటీటీ సమస్థలు కరోనా సమయంలో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇలా అత్యంత ఆదరణ పొందినటువంటి వాటిలో నెట్ ఫ్లిక్స్ ఒకటి.

మన తెలుగులో నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తక్కువగానే ఉన్నప్పటికీ తెలుగులో మంచి ఆదరణ పొందడం కోసం
నెట్ ఫ్లిక్స్ సరికొత్త ప్రయోగం చేసింది అయితే ఈ ప్రయోగంలో భాగంగా నెట్ ఫ్లిక్స్ కు భారీగా కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పాలి.

ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వెంకటేష్ తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా తెలుగులో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవాలని ప్రయత్నం చేసిన నెట్ ఫ్లిక్స్ కు ఘోర పరాభవం ఎదురైంది. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హీరో ఆయన సినిమాలు కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఉంటాయి.


Net Flix:ఒక్క వెబ్ సిరీస్ తో క్రేజ్ మొత్తం కోల్పోయిన వెంకీ…

అలాంటి హీరోని పట్టుకొని బూతు, శృంగార భరితమైన వెబ్ సిరీస్ చేయడంతో ఎంతోమంది ఈ వెబ్ సిరీస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క వెబ్ సిరీస్ తో ఇన్ని రోజులు వెంకటేష్ సంపాదించుకున్న క్రేజ్ మొత్తం సర్వనాశనం అయింది. ఈ వెబ్ సిరీస్ చూసినటువంటి అభిమానులు ముందుగా వెంకటేష్ ను తిడుతూ ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ను బండ బూతులు తిడుతున్నారు.. ఈ ఒక్క వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మరింత తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పాలి.

Daggubati Rana: వారికి ప్రభాస్ మహేష్ బాబు అంటే ఎవరో తెలియదు.. షాకింగ్ విషయాలు చెప్పిన రానా?

Daggubati Rana: దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి రానా ఎంతో వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మార్చి 10న నెట్ఫ్లిక్స్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రానా పెద్ద ఎత్తున ఈ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేస్తూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన టాలీవుడ్ హీరోలు అయినటువంటి ప్రభాస్ మహేష్ బాబుల గురించి పలు విషయాలు తెలియజేశారు.గత ఐదు సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ ప్రేక్షకులకు మన తెలుగు హీరోలు ఎవరో కూడా తెలియదు.

ఇప్పుడు మాత్రం తెలుగులో విడుదలైన సినిమాలు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో మంచి సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నేను నటించిన ఘాజి సినిమా హిందీలో కూడా మంచిగా కలెక్షన్లు సాధించిందని తెలిపారు. ఇక బాహుబలి సినిమా ముందు వరకు కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రభాస్ అంటే ఎవరో కూడా తెలియదని రానా తెలిపారు.

బాహుబలి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ముంబైకి చెందిన తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం సినిమాలు చేస్తున్నావని అడగడంతో బాహుబలి సినిమాలో చేస్తున్నానని చెప్పాను. అందులో నువ్వే నా హీరో అని అడిగారు.కాదు ప్రభాస్ అని చెప్పగా ప్రభాస్ అంటే ఎవరు అని తనని ప్రశ్నించినట్లు రానా గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ నటించిన కొన్ని సినిమాల గురించి చెప్పినప్పటికీ తనకు తెలియదని సమాధానం చెప్పారు.

Daggubati Rana: నమ్రత భర్తగా మాత్రమే మహేష్ తెలుసు..

ఇక మహేష్ బాబు గురించి చెబితే ఓ చిన్ను భర్త కదా తెలుసు అంటూ సమాధానం చెప్పారు.ఒక క్షణం పాటు అసలు ఈ చిన్ను ఎవరని తాను ఆలోచించానని ఆ తర్వాత నమ్రతను బాలీవుడ్ వారు చిన్ను అని పిలుచుకుంటారని అర్థమైందని రానా తెలిపారు.గత నాలుగు సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ వారికి ప్రభాస్ అంటే ఎవరో తెలియదు మహేష్ బాబు కూడా నమ్రత భర్తగా మాత్రమే తెలుసు అని తెలిపారు.దీంతో ఒక నాలుగైదు సంవత్సరాల ఆగు మా తెలుగు హీరోలందరూ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ల్యాండ్ అవుతారు అంటూ తనకి చెప్పాను. చెప్పిన విధంగానే తెలుగు హీరోలకు బాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం సంతోషంగా ఉంది అంటూ రానా తెలియజేశారు.

Actor Nani: నెపోటిజాన్ని ప్రోత్సహించేది వాళ్లే… నెపోటిజంపై నాని సంచలన వ్యాఖ్యలు?

Actor Nani: సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటూ పలువురు పెద్ద ఎత్తున నేపొకిడ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఇలా వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని, బయట వారికి అవకాశాలు లేకుండా చేస్తున్నారంటూ ఎంతోమంది ఈ నెపోటిజం పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ.. నెపోటిజం కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఒక రంగంలోనూ ఉందని డాక్టర్ కొడుకు డాక్టర్ అయినప్పుడు ఒక లాయర్ కొడుకు లాయర్ అయినప్పుడు హీరో కొడుకు హీరో అయితే తప్పేంటి అని ప్రశ్నించారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ నెపోటిజం గురించి నాచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాని ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దీంతో ఈయన నేపోటిజం గురించి మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..నాని హీరో రానాతో కలిసి నిజం విత్ స్మిత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నేపోటిజం గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఇండస్ట్రీలో నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నది మరెవరో కాదు ప్రేక్షకులేనని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Actor Nani: రామ్ చరణ్ సినిమాను కోటి మంది చూస్తారు..

సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాని కోటి మంది ప్రేక్షకులు చూస్తారు. అదే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన తన సినిమాని మాత్రం లక్షమందే చూస్తారు. ఇక్కడ ఎవరు నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అంటూ ఈయన ప్రశ్నించారు. ఇలా నెపోటిజం గురించి నాని చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Daggubati Rana: క్రిమినల్ కేసులో ఇరికిన దగ్గుబాటి రానా, సురేష్ బాబు.. కోర్టు నుంచి సమన్లు జారీ?

Daggubati Rana: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సురేష్ బాబు, హీరో రానా దగ్గుబాటి కి తాజాగా కోర్టు నుండి పెద్ద షాక్ ఇచ్చింది. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీంతో వారిని కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. గతంలో షేక్ పేట మండలం సర్వేనెంబర్..

403 లో సినీ నటి మాధవి 1007 గజాల స్థలంను నిర్మాత సురేష్ బాబుకు అమ్మింది. అయితే ఆ స్థలంను సురేష్ బాబు 2014లో అనే వ్యాపారికి హోటల్ ఏర్పాటు కోసం లీజుకి ఇచ్చాడు. అయితే 2018 ఫిబ్రవరిలో లీజు ముగుస్తుండగా ప్లాట్ నెంబర్ 2 లో ఉన్న స్థలాన్ని సురేష్ బాబు18 కోట్లకు అమ్మడానికి అంగీకరించాడు. దీంతో ప్రమోద్ కుమార్ ఐదు కోట్లు సురేష్ బాబుకు చెల్లించాడు.

ఇక లీజు ముగిసిన తర్వాత ఖాళీ చేయటం లేదు అని కేసు కూడా వేశారు సురేష్ బాబు. దీంతో ప్రమోద్.. తన వద్ద రూ. ఐదు కోట్లు అడ్వాన్స్ గా తీసుకొని రిజిస్ట్రేషన్ చేయలేదని కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కోర్టు కేసులు తేలకముందే ఆ స్థలాన్ని సురేష్ బాబు రానాకు విక్రయించాడు.

Daggubati Rana:

దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఈ విషయం గురించి చర్యలు తీసుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఇక వెంటనే కోర్టు సురేష్ బాబును, రానా ను వ్యక్తిగతంగా హాజరు కావాలి అని జనవరి 19న సమన్లు జారిచేసింది. ఇక తర్వాత విచారణ మే ఒకటికి వాయిదా వేయగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది.

Manchu Vishnu: బిగ్ బాస్ 7 హోస్ట్ గా మంచు విష్ణు… ఈ వార్తలలో నిజమెంత?

Manchu Vishnu: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి రియాలిటీ షోలలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమం ప్రస్తుతానికి మారు సీజన్లను పూర్తి చేసుకుంది.

ఇకపోతే త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎన్టీఆర్ రెండవ సీజన్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు అనంతరం తదుపరి సీజన్లన్నింటికీ కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.

నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టింగ్ విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని ఈయన హోస్ట్ గా నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే సీజన్ సెవెన్ కి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించరని ఆయన స్థానంలో ఇతర హీరోలు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. నాగార్జున స్థానాల్లో బాలకృష్ణ, రామ్ చరణ్, రానా వంటి హీరోల పేర్లు వినిపించాయి.

Manchu Vishnu: మంచు విష్ణుని సంప్రదించిన బిగ్ బాస్ నిర్వాహకులు…

అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో పేరు చేరింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమానికి మంచు విష్ణు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు విష్ణువుని సంప్రదించారని సమాచారం. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది.