Tag Archives: rashmika mandanna

Rashmika: విజయ్ తో ఆ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకమే… షాకింగ్ పోస్ట్ చేసిన రష్మిక మందన్న!

Rashmika: నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీరిద్దరి కాంబినేషన్లో గీత గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అప్పటినుంచి వీరిద్దరికీ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడమే కాకుండా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా వార్తలు హల్చల్ చేశాయి.

ఈ విధంగా విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారని అయితే ఈ విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటించిన సినిమా నాకు ఎంతో స్పెషల్ అంటూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.గీత గోవిందం తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో ఈమె విజయ్ దేవరకొండతో కలిసి నటించారు..

Rashmika: డియర్ కామ్రేడ్ కి నాలుగేళ్లు…

ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని ఈ సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈమె డైరెక్టర్ భరత్ విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Rashmika: ఎవరు గుర్తుపట్టకుండా బేబీ సినిమా చూడటం కోసం థియేటర్ కి వెళ్లిన రష్మిక… అలా కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్!

Rashmika: ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా సాయి రాజేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ.ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను పెంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకుల అంచనాలను చేరుకున్నటువంటి ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది.

ఈ సినిమా ప్రీమియర్ షో ద్వారానే మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో మౌత్ టాక్ ద్వారానే ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే అభిమానులతో పాటు నటి రష్మిక మందన్న కూడా ఈ సినిమా చూడటం కోసం థియేటర్ కి వచ్చారనీ తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది.

నటి రష్మిక మందన్న తనని ఎవరు గుర్తుపట్టకుండా ప్యాంట్ టీ షర్ట్ ధరించి మొహానికి మాస్ తలకు బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకొని సినిమా మొదలైన తర్వాత బ్యాక్ డోర్ నుంచి థియేటర్లోకి వెళ్లి ప్రేక్షకుల సమక్షంలో సినిమా చూశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి నేటిజన్స్ విజయ్ దేవరకొండతో ఈమె డేటింగ్ లో ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.

Rashmika: తెరపైకి డేటింగ్ రూమర్స్…


ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు నటించిన సినిమాలు ఇలా మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే ఏ సినిమాని చూడటానికి రష్మిక ఇలా వెళ్లలేదు అయితే ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా చూడటం కోసం వెళ్లడంతో ఈమె విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉన్నారని అందుకే తన కాబోయే మరిది సినిమాని చూడడం కోసం ఇలా వెళ్లారు అంటూ సోషల్ మీడియా వేదికగా రష్మిక వ్యవహారంపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Rashmika: వామ్మో రష్మికలో ఈ టాలెంట్ చూశారా… ఏకంగా అన్ని భాషలలో మాట్లాడగలరా?

Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నటి రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం వరుస భాషలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక వివిధ భాష చిత్రాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా రష్మిక తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అందుకే తనకు సోషల్ మీడియాలో ఏకంగా 38 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇలా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి ఈమె తనకు ఏమాత్రం విరామం దొరికిన సరదాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.

తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీరు ఎన్ని భాషలలో మాట్లాడగలరు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతాను ఆరు భాషలలో మాట్లాడగలను అంటూ సమాధానం తెలియజేశారు అదే విధంగా తాను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలను నమస్తే బాగున్నారా అంటూ పలకరిస్తానని ఈమె తెలియజేశారు.

Rashmika: ఆరు భాషలలో మాట్లాడగలను…


ఇలా ఈమె ఆరు భాషలలో మాట్లాడగలను అంటూ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే తనకు తన వృత్తి అంటే చాలా దానిని తాను ఎంతో ప్రేమిస్తున్నానని రష్మిక తెలిపారు. ఇకపోతే తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ గురించి కూడా మాట్లాడుతూ తనకు కొరియన్ చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా తనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను కూడా ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

Rashmika: రష్మిక గురించి ప్రశ్నించిన నెటిజన్… ఆనంద్ దేవరకొండ సమాధానం ఏంటో తెలుసా?

Rashmika: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి తరచూ అనేక రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి రూమర్ల గురించి కొందరు సెలబ్రిటీలు స్పందిస్తూ వాటిని ఖండిస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ఇలాంటి రూమర్ల గురించి పట్టించుకోకుండా వారి షూటింగ్ పనులతో వారు బిజీగా ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక విషయంలో కూడా హీరో ఆనంద్ దేవరకొండ కూడా ఇలాగే వ్యవహరించాడు.హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.’ దొరసాని ‘ సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమైన ఆనంద్ ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా ద్వారా హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత ఆనంద్ హీరోగా వచ్చిన ‘ పుష్పకవిమానం ‘ సినిమా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఆనంద్ ‘ బేబీ ‘ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులతో ఆనంద్ బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆనంద్ అసహనం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

Rashmika: వదినా అంటూ అరుపులు…


ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒక విలేకరి ” మీ సినిమాలోని ఓ పాట ని రష్మిక రిలీజ్‌ చేశారు కదా. ఆ సాంగ్‌ ఈవెంట్‌కి వచ్చిన వాళ్లందరూ ఆమెను ‘వదినా’ అని గట్టిగా పిలిచారు కదా..’’ అని ప్రశ్న అడిగాడు.. దీంతో ఆనంద్‌ స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ‘‘నో.. నేను దీన్ని ఇక్కడితో ఆపేస్తాను’’ అని సమాధానం ఇచ్చాడు. అంటే రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి వినిపిస్తున్న వార్తలపై స్పందించడానికి ఆనంద్ ఆసక్తి చూపటం లేదు. దీంతో వారిద్దరి నిజంగానే రిలేషన్ లో ఉన్నారా? లేదా? అనే అనుమానం ఇంకా అలాగే ఉంది.

Sreeleela: శ్రీ లీల రిజెక్ట్ చేసిన సినిమాతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక…. ఆ సినిమా ఏంటో తెలుసా?

Sreeleela: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి ముద్దు గుమ్మలలో శ్రీ లీల రష్మిక మందన్న ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.ఇలా ఇద్దరు కనడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్లుగా పరిచయమై తెలుగులో ఎంతో అద్భుతమైన ఆదరణ పొందడమే కాకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

ఇక రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమకు చలో సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు రావడమే కాకుండా నేషనల్ క్రష్ గా మారిపోయారు. అయితే ఈమె నేషనల్ క్రష్ అవ్వడానికి మరొక హీరోయిన్ కారణమని తెలుస్తుంది.

రష్మిక నటించిన చలో సినిమా ఎంతో మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా నటించే అవకాశం రష్మికకు కాకుండా నటి శ్రీలీలకు వచ్చిందట. చివరి వరకు ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీలా అనే భావించారు. అయితే చివరి క్షణంలో శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమా అవకాశం రష్మికకు వచ్చిందని తెలుస్తోంది.

Sreeleela: తెలుగులో బిజీ హీరోయిన్ గా శ్రీ లీల..


ఇలా ఈ సినిమాలో రష్మిక నటించే అవకాశం అందుకోవడం ఈ సినిమా మంచి సక్సెస్ కావడం జరిగింది.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు రావడం నేషనల్ క్రష్ అనే గుర్తింపు సంపాదించుకోవడం జరిగింది.ఇక శ్రీ లీల కూడా పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.

Rashmika: రష్మిక మూడ్ బాగా లేకపోతే ఆ పని చేస్తున్నా… ఇదేం అలవాటు రా సామి?

Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక అనంతరం ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. తెలుగు తమిళ హిందీ భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమా షూటింగ్ పనులతో ఏమాత్రం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ విధంగా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా నటి రష్మిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా మనకు ఎవరైనా మూడ్ ఆఫ్ వచ్చిన, మనసు బాగా లేకపోయినా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాము. కానీ రష్మిక ఇందుకు పూర్తిగా భిన్నం అని తెలుస్తుంది.

Rashmika: వంట చేస్తారా…


ఈమె మనసు బాగా లేకపోయినా మూడ్ ఆఫ్ అయితే కనుక వెంటనే కిచెన్ లోకి దూరి ఏదో ఒక రెసిపీ తయారు చేసి అందరికీ వడ్డిస్తారట. ఇలా చేయడంతో తన మనసు తేలిక పడుతుందని రష్మిక ఒక సందర్భంలో తెలియజేశారు. ఇలా నలుగురికి భోజనం పెట్టడం వల్ల తన మనసు ప్రశాంతంగా ఉంటుందని ఈమె ఓ సందర్భంలో తెలియచేశారు. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఈ వార్త వైరల్ కావడంతో మనసు బాగా లేకపోతే వంట చేయడం ఏంటి? అసలు ఇదేం అలవాటు రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Rashmika: ఆ సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి… రష్మిక పోస్ట్ వైరల్!

Rashmika: కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న.మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలు అందుకొని వరుస సినిమాలతో అన్ని భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

పాన్ ఇండియా స్థాయిలో నటిగా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రష్మిక వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా జీవితానికి సంబంధించిన కొన్ని గొప్ప విషయాలను తెలియజేస్తూ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం రష్మిక మందన్న జీవిత సత్యాలను తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది ఇందులో భాగంగా ఈమె తన ఫోటో ఒకదాన్ని షేర్ చేసి కోలుకో, నేర్చుకో, ఎదుగు, ప్రేమించు అంటూ నాలుగు పదాలు షేర్ చేసింది. ఆమె చెప్పింది ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. గతంలోని నిరాశలను వదిలి ముందుకు వెళ్లాలని, జీవితంలో ఎదురైన ప్రతి విషయం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలని, ఆ తర్వాత మంచి వ్యక్తులుగా ఎలా తయారవ్వాలో నేర్చుకోవాలని చెప్పుకొచ్చింది.


Rashmika: నిరాశ వదిలి ముందుకు వెళ్లాలి…

ఇక ఈ ఫోటో షేర్ చేస్తున్న సమయంలో ఆమె చాలా ట్రెడిషనల్ గా కనపడుతూ చేతిలో ఒక ఆకుని కంటికి అడ్డం పెట్టుకొని షేర్ చేసింది. దీంతో రష్మిక షేర్ చేసిన ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. నిహారిక సినిమాల విషయానికి వస్తే ఈమె పుష్ప 2 సినిమాతో పాటు రెయిన్ బో, యానిమల్ సినిమాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ తో కలిసి మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో రష్మిక ఎంతో బిజీగా ఉన్నారు.

Rashmika: పుష్ప 2 లో రష్మిక చనిపోతుందా… వైరల్ అవుతున్న ఫోటో.. నిజం ఏమిటంటే?

Rashmika: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప.అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఇలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇక ప్రస్తుతం పుష్ప సినిమా చిత్రం షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను ప్రారంభించింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి సన్నివేశాలు లీక్ అవ్వకుండా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయినప్పటికీ కొన్ని లీక్ అవుతూనే వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాలో రష్మిక చనిపోతుంది అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. పుష్ప 2 సినిమాలో రష్మిక పాత్ర చనిపోవడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ సినిమాలో రష్మిక పాత్ర చనిపోవడంతోనే సెకండ్ హీరోయిన్ ఆప్షన్ పెట్టుకున్నారా మరి ఎవరు ఆ సెకండ్ హీరోయిన్ అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి

Rashmika: ఆ ఫోటోలో ఉన్నది రష్మిక కాదు..


పుష్ప సినిమాలో రష్మిక చనిపోతుందన్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది రష్మిక కాదని, ఈ ఫోటోలో ఉన్న నటి ఈషా దివేకర్ అని తెలుస్తోంది. ఇది ఓ మరాఠి సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్ అని తెలియడంతో రష్మిక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రష్మిక చనిపోతుందనీ వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.

Rashmika: శ్రీవల్లి పాత్ర పై ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్.. స్పందించిన రష్మీక…?

Rashmika: సాధారణంగా సినిమా సెలబ్రిటీల మీద అందరికీ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వారు ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పొరపాటున మాట్లాడిన మాటల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకుంది.

పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర గురించి ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలలో కీలకపాత్రలలో నటించింది. అలాగే తమిళ్ భాషలో హీరోయిన్ గా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ చేతిలో ఎనిమిది తమిళ సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఫర్హానా సినిమా ద్వారా ఐశ్వర్య రాజేష్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవల్లి పాత్రలో రష్మిక కన్నా తానే బాగా నటించేదానినని తెలిపినట్టు రూమర్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ తను మాట్లాడిన మాటలలో అటువంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది.

Rashmika: వివరణ ఇవ్వాల్సిన పనిలేదు..


ఇక సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యల గురించి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ వివాదంపై రష్మిక కూడా స్పందించింది. ఈ క్రమంలో రష్మిక స్పందిస్తూ ఒక నోట్ విడుదల చేసింది. ఈ నోట్ లో ” హాయ్ లవ్.. ఇప్పుడే జరిగినదంతా చూశాను. నీ మాటలు వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోగలను. నువ్వు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీపై నాకున్న ప్రేమ గౌరవం గురించి నీకు తెలుసు. ఫర్హనా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చావు. ఆల్ ది బెస్ట్… అంటూ లవ్ ఎమోజి సెండ్ చేసింది. దీంతో ఈ వివాదానికి చెక్ పడింది.

Aishwarya Rajesh: రష్మికని నేను కించపరచలేదు… తప్పుగా అర్థం చేసుకున్నారు.. క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్..?

Aishwarya Rajesh: తెలుగు, తమిళ భాషలలో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు పొందిన ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల రష్మీక గురించి ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చకు దారితీసాయి. ఇటీవల మీడియా ముందుకి వచ్చిన ఐశ్వర్య రాజేష్ పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర రష్మిక బదులు తనకు బాగా సెట్ అయ్యేదని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక కన్నా తనే బాగా నటించేదాన్ని అని ఐశ్వర్య రాజేష్ వ్యాఖ్యలు చేసినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ రూమర్లపై ఐశ్వర్య రాజేష్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో తాను చేసిన కామెంట్స్ పై వివరణ ఇస్తూ.. ఓలేఖ విడుదల చేసింది హీరోయిన్ ఐశ్వర్య.

తాను మాట్లాడిన మాటలను తప్పుగా తీసుకొని రష్మిక ని కించపరిచినట్లు రూమర్లు క్రియేట్ చేస్తున్నారని ఈ నోట్ లో తెలిపింది. తాను రష్మికని కించపరిచినట్లు మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనని తెలుగు సినిమాలలో ఎటువంటి పాత్రలలో నటించాలని ఉంది అని ప్రశ్న ఎదురయింది. ఆ ప్రశ్నకు సమాధానంగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు ఎంతో గౌరవం. తెలుగులో అవకాశాలు వస్తాయి తప్పకుండా చేస్తాను.

Aishwarya Rajesh: రూమర్లను ఆపి వేయండి…


పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర నాకు బాగా నచ్చిందని.. ఆ పాత్ర నాకు సరిగ్గా సెట్ అవుతుందని చెప్పాను. కానీ నా మాటలను తప్పుగా అర్థం చేసుకొని నేను రష్మికను కించపరుస్తూ మాట్లాడినట్లుగా రూమర్స్ క్రియేట్ చేశారు. అంతేకానీ రష్మిక నటన గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. రష్మిక నటన పై నాకు ఎంతో అభిమానం ఉంది. దయచేసి ఇటువంటి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయకండి అంటూ విన్నవించుకుంది. దీంతో ఐశ్వర్య రాజేష్ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పడింది.