Tag Archives: regina

Regina: అవకాశం కోసం అడిగితే కమిట్మెంట్ అడిగారు… కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన రెజీనా!

Regina: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈవిషయం గురించి మాట్లాడుతూ మేము కూడా కెరియర్ మొదట్లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలియజేశారు. అయితే తాజాగా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా సైతం కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రెజినా ఇండస్ట్రీలో తనకు ఎదురైనటువంటి ఈ చేదు అనుభవం గురించి తెలియజేశారు. తాను 20 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు. అయితే కెరీర్ మొదట్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తాను కొంతమందిని కలిసే సినిమా అవకాశాల కోసం వారిని అడిగానని తెలిపారు.

దీంతో ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి తనకు సినిమా అవకాశం ఇస్తాను కానీ అడ్జస్ట్మెంట్ అవ్వాలని ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పడంతో నాకు అడ్జస్ట్మెంట్ అంటే అప్పుడు తెలియక రెమ్యూనరేషన్ పరంగా అడుగుతున్నారేమోనని నా మేనేజర్ మాట్లాడుతారు అంటూ ఫోన్ కట్ చేశాను. అనంతరం తన మేనేజర్ వచ్చి అడ్జస్ట్మెంట్ అంటే ఆయన మీ నుంచి ఇలాంటి కోరిక కోరుతున్నారని తనకు చెప్పారు..

Regina: నా మేనేజర్ చెప్పే వరకు తెలియదు…


ఈ విధంగా నా మేనేజర్ చెప్పేవరకు ఆయన అలాంటి ఉద్దేశంతో మాట్లాడారని తనకు తెలియలేదు.అలా తాను కూడా మొదటిసారి ఇలాంటి ఇబ్బందిని పేస్ చేశానని అనంతరం తనకు ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురు కాలేదు అంటూ ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ గురించి రెజీనా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ మధ్యకాలంలో ఈమెకు పెద్దగా సినిమాలు సక్సెస్ కాకపోవడంతో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Harish Shankar: హీరోయిన్ ను మర్చిపోయారు.. డైరెక్టర్ హరి శంకర్ ట్విట్ పై స్పందించిన రెజీనా.. సారీ డియర్ అంటూ డైరెక్టర్ రిప్లై!

Harish Shankar: పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ శంకర్ అనంతరం పలువురు హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రెజీనా కసాండ్రా హీరో హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ సినిమా విడుదల అయి ఏడు సంవత్సరాలు కావడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా ఈ సినిమాలో నటించిన కొందరు నటీనటుల పేర్లను ప్రస్తావిస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ అప్పటి విషయాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.అయితే అందరి పేర్లు ప్రస్తావించిన డైరెక్టర్ హీరోయిన్ పేరు ప్రస్తావించడం మర్చిపోయారు ఈ క్రమంలోనే రెజీనా ఈట్వీట్ పై స్పందిస్తూ… బహుశా మమ్మల్ని డైరెక్టర్ మర్చిపోయినట్టున్నారు అంటూనే థాంక్స్ చెప్పారు.

సీతతో అంత ఈజీ కాదు అనే పాత్రను డిజైన్ చేసినందుకు కృతజ్ఞతలని తెలిపారు. ఈ క్రమంలోనే రెజీనా చేసిన ట్వీట్ పై హరీష్ శంకర్ స్పందిస్తూ సో సారీ డియర్ నీతో అంత వీజీ కాదని ప్రూవ్ చేసావ్. సీత పాత్రలో బాగా చేసినందుకు థాంక్స్ అని చెప్పడమే కాకుండా మీతో పని చేయడం చాలా బాగుంది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు.

Harish Shankar: స్పెషల్ థాంక్స్ చెప్పిన సాయి ధరమ్

ఇలా ఈ సినిమా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో హరీష్ శంకర్ చేసిన ట్వీట్ పై మెగా హీరోస్ సాయి ధరంతేజ్ కూడా స్పందిస్తూ థాంక్స్ చెప్పారు.ఇక హరీష్ శంకర్ చాలా కాలం నుంచి ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రకటించినప్పటికీ ఈ సినిమా ఏ మాత్రం పట్టాలెక్కలేదు.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా గురించి పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.

Adivi Sesh: నాకు స్టామినా ఎక్కువ.. మగాళ్ళు, మ్యాగీతో 2 నిమిషాలే అన్నావంట? హీరోయిన్ రెజినాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అడవి శేష్ !

Adivi Sesh: రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె తాజాగా శాకిని డాకిని అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ థియేటర్లో విడుదల కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నివేద థామస్ రెజీనా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రెజీనా మగాళ్ళ గురించి మాట్లాడుతూ మగాళ్లు మ్యాగీ మాదిరే రెండు నిమిషాల్లో అయిపోతారు అంటూ కామెంట్ చేశారు.అయితే ఇది జోక్ అని చెప్పినప్పటికీ ఈ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇలా మగాళ్ళ గురించి రెజీనా చేసిన ఈ కామెంట్స్ పై పలువురు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొనడమే కాకుండా ఈమె చేసిన ఈ కామెంట్స్ పై స్పందిస్తూ నటి రెజీనాకు స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఈ క్రమంలోనే శేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Adivi Sesh: నాకు స్టామినా ఎక్కువ..

ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ ఏంటి ఈ మధ్య మగాళ్లు మ్యాగీ అంటూ ఏదో మాట్లాడావట.. నాకు స్టామినా ఎక్కువ అందుకే ఎక్కువ కాలం సినిమాలు చేస్తుంటానని అందరూ అంటూ ఉంటారని శేష్ సమాధానం చెప్పారు. దీంతో రెజీనా స్పందిస్తూ రెండు నిమిషాల్లో చెబుతా అంటూ ఒక్కసారిగా నవ్వేసింది. ఈ విధంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Acharya-Chiranjeevi: వివాదంలో ఆచార్య స్పెషల్ సాంగ్..పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు..!

Acharya-Chiranjeevi: మెగస్టార్ చిరంజీవి.. తన రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మళ్లీ ఫుల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎంతలా అంటే.. ఏమాత్రం గ్యాప్ లేకుండా..రెస్ట్ లేకుండా.. వరుస సినిమాలకు సైన్ లు చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సినిమా ఆచార్య.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా.. అనూహ్యంగా ఓ ఘటన చోటు చేసుకుంది. వాళ్లు ప్రస్తుతం న్యాయపరమైన ఇబ్బందులతో చిక్కుకున్నారు. గీత రచయిత భాస్కరభట్ల, దర్శకుడు కొరటాల శివపై జనగామకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఫిర్యాదు చేశారు.

ఎందుకంటే.. ఇటీవల ఆచార్య సినిమాలోని ఓ ఐటెం సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో చిరంజీవి సరనన ఆడిపాడిన మద్దుగుమ్మ రెజీనా. ఈ సాంగ్ పెద్ద వివాదాన్ని తెచ్చిపెట్టింది.
ఆ పాటలో ఆర్ఎంపీ వైద్య సంఘాన్ని కించపరిచేవిధంగా పదాలు ఉన్నాయని.. వాటిని చెడుగా చూపించే ప్రయత్నం చేశారని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కావాలనే మనోభావాలను దెబ్బతీస్తున్నారు..

ఇందులో… “యాదేదో నీమరొచ్చనీ కుర్రాళ్లే RMP లు అవుతున్నారే” అనే సాహిత్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ లైన్ వివాదానికి దారి తీసింది. ఈ లైన్‌లను తప్పుగా పేర్కొని.. వాటిని కావాలనే ఇలా చూపించారని ఆరోపిస్తున్నారు. ఆర్ఎంపీల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ లిరిక్స్ ఉన్నాయని.. రాష్ట్ర ఆర్‌ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు. ఆచార్య చిత్ర నిర్మాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరి దీనిపై ఆచార్య మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏమైనా వివిరణ ఇస్తారా.. లేదా.. పాటలో ఏమైనా మార్పులు చేస్తారో చూడాలి. ఆచార్యకి మణి శర్మ సంగీతం అందించగా.. సానా కష్టం పాటను రేవంత్ , గీతా మాధురి ఆలపించారు. చిరంజీవి, రామ్ చరణ్‌లను తొలిసారిగా పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నారు.

శ్రీయ పాత్రలో రెజీనా.. బాలీవుడ్ లో అవకాశం?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం “ఛత్రపతి”. 2005వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ విజయంగా నిలిచింది. సుమారు 16 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

“ఛత్రపతి” రీమేక్ సినిమా ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి సమక్షంలో ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. “ఛత్రపతి” సినిమాను రీమేక్ ను వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ పాత్రలో నటించడం కోసం చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించడానికి రెజీనా
క‌సాండ్రా పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి “ఏక్ ల‌డ్‌కీ కో దేఖా తో ఐసా ల‌గా” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక “ఛత్రపతి”సినిమాకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే తనకు ఇది రెండవ బాలీవుడ్ చిత్రం అని చెప్పవచ్చు.

కుక్కతో ఒంటరిగా బోటింగ్‌కు వెళ్లిన రెజీనా.. వైరల్ ఫోటోలు!

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి అందరికీ తెలిసిందే. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది. అంతే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. ఇక ఈ మధ్య అవకాశాలు కూడా చాలా తగ్గాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో సముద్రం మధ్యలో తన కుక్కతో ఒంటరిగా బోటింగ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి అందరికీ తెలిసిందే.

తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..

శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది.

అంతేకాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.

ఇక ఈ మధ్య అవకాశాలు కూడా చాలా తగ్గాయి.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో సముద్రం మధ్యలో తన కుక్కతో ఒంటరిగా బోటింగ్ చేస్తూ కనిపించింది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.