Tag Archives: remuneration

Ram Charan: రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ పై స్పందించిన రామ్ చరణ్.. ఆ స్పెల్లింగ్ కూడా తెలియదు!

Ram Charan: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. 2019లో వినయ విధేయ రామతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌, ఆచార్య సినిమాలతో బిజీగా మారాడు. ఇందులో ఆర్ఆర్ఆర్ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Ram Charan: రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ పై స్పందించిన రామ్ చరణ్.. ఆ స్పెల్లింగ్ కూడా తెలియదు!

ఆచార్య కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అతడు చేయబోయే ప్రతీ సినిమాకు పారితోషికం రూ. 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని.. శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు అతడు రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఇటీవల టాక్ నిపించింది.

Ram Charan: రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ పై స్పందించిన రామ్ చరణ్.. ఆ స్పెల్లింగ్ కూడా తెలియదు!

అయితే దీనిపై అతడు స్పందించాడు. అవన్నీ అసత్యాలు అని కొట్టి పారేశాడు. ఇటీవల అతడు ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించగా.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అక్కడ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చాడు.

రాజకీయ ప్రవేశంపై చరణ్ సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ రేంజిలో రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట కదా.. అని అడగ్గా మొదట.. ఆ 100 కోట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని రామ్ చరణ్ అన్నారు. అసలు అవి నాకు ఎవరు ఇస్తారు అంటూ తిరిగి ప్రశ్నించాడు. అవన్నీ పనీ పాట లేని వాళ్లు స్పష్టించిన పుకార్లు అంటూ చెప్పాడు. ఇవన్నీ అబద్దాలని.. వాటిని నమ్మొద్దని సూచించాడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి లాగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అని చరణ్ అడిగినప్పుడు, “నాకు దాని స్పెల్లింగ్ కూడా తెలియదు” అని చరణ్ రాజకీయ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

Naveen Polishetty: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?

Naveen Polishetty: టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన చిత్రం రాదే శ్యామ్.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోని పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో ఘనంగా జరుపుకుంది.

Naveen Polishetty: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?

ఈ ఈవెంట్ కి ఎంతోమంది మేల్ యాంకర్స్ ఉండగా వారెవరినీ కాకుండా మన జాతి రత్నం నవీన్ పోలిశెట్టిని యాంకర్ గా తీసుకున్నారు.నవీన్ పోలిశెట్టి యాంకర్ గా మారడం ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతుంది. మన తెలుగులో ఎంతోమంది యాంకర్స్ ఉన్నప్పటికీ వారికి పాన్ ఇండియా స్థాయిలో యాంకరింగ్ చేసే అనుభవం లేకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్టింగ్ చేయడం వల్ల సినిమాకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో అతనిని తీసుకున్నట్లు సమాచారం.

Naveen Polishetty: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?

నవీన్ పోలిశెట్టి నటించిన జాతిరత్నాలు సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ ముందుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా కోసం నవీన్ పోలిశెట్టి సైతం తనదైన శైలిలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్టింగ్ చేశారు.

నవీన్ పోలిశెట్టి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే:

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హోస్టింగ్ చేసినటువంటి నవీన్ పోలిశెట్టి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారని పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే నవీన్ పోలిశెట్టి ఈ సినిమాకు యాంకర్ గా చేసినందుకు ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు. కేవలం ప్రభాస్ తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాకు ఫ్రీ గా అతను యాంకరింగ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి నవీన్ పోలిశెట్టి ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

Ramcharan Remuneration: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్.. ఎంతో తెలుసా..?

Ramcharan Remuneration: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. అటు మెగస్టార్ ఫ్యాన్స్, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా.. రామ్ చరణ్ కు సపోర్టు చేస్తారన్న విషయం విధితమే. ఇక ప్రస్తుతం చరణ్.. ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Ramcharan Remuneration: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్.. ఎంతో తెలుసా..?

ఇక ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తుండగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో కలిసి పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక అతడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా రెమ్యూనరేషన్ పెంచేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

Ramcharan Remuneration: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్.. ఎంతో తెలుసా..?

అతడు తీసే ప్రతీ సినిమా ఇక ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుండగా.. శంకర్, గౌతమ్ తిన్ననూరితో తన ప్రతీ ప్రాజెక్ట్‌కి రూ. 100 కోట్లు అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.

హాట్ టాపిక్ గా మారిన రామ్ చరణ్ రెమ్యూనరేషన్:

కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ నీల్ మెగస్టార్ ను, రామ్ చరణ్ కలిసి రెండు కథలను వినిపించడాట. కథలు నచ్చకపోవడంతో అందులో కాస్త మార్పులు చేయాలని సూచించారట. దీనిలో అతడు మార్పులు చేర్పులు చేశాడట. అందులో ఓ కథ ఎక్కువగా యాక్షన్ స్టోరీతో ఉండగా.. దానిని రామ్ చరణ్ ఒప్పుకున్నట్లు.. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రామ్ చరణ్ రెమ్యూనరేషన్ బాలీవుడ్ హీరోల స్థాయిలో దూసుకెళ్లడంతో… టాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత..?

RRR Movie: ఇండియన్ ఫిలీం ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. బాహుబలి1, 2 హిట్ల తరువాత రాజమౌళి సినిమా కావడంతో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత..?

అందుకు తగ్గట్లుగానే సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా ట్రిపుల్ ఆర్ రూపొందుతోంది. దాదాపు రూ. 450 కోట్ల వరకు సినిమాకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈసినిమాకు అసలు ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయం ప్రస్తుతం జనాలను ఆకర్షిస్తోంది. ఇందులో నటించిన నటీనటులతో పాటు టెక్నీషియన్లకు కూడా భారీస్థాయిలో పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత..?

దాదాపుగా రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ ట్రిపుల్ ఆర్ సినిమా తీశారు. ముఖ్యంగా రామ్ చరన్, ఎన్టీఆర్ లు ఈ సినిమాకు చెరో రూ. 45 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు డెరెక్టర్ రాజమౌళి పారితోషకంపై ఎక్కువ ఆసక్తి క్రియేట్ అవుతోంది. అందరి కన్నా ఎక్కువగా రాజమౌళి రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. కాగా నిర్మాతలు రాజమౌళికి ఎంతైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రాజమౌళి సినిమా బిజినెస్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళికి 30 శాతం రెమ్యునరేషన్:

దాదాపు సినిమా లాభాల వాటాలో 30 శాతం వరకు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు సినిమాలో కీలక పాత్ర పోషించిన అజయ్ దేవ్ గన్ కు రూ. 25 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కు రూ. 9 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇదిలా ఉంటే స్టార్స్ రెమ్యునరేషన్, టెక్నీషియన్ రెమ్యునరేషన్ కే దాదాపుగా రూ. 200 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. సినిమా ప్రొడక్షన్ కోసం రూ. 230 కోట్లు, సినిమా ప్రమోషన్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Pushpa-Anasuya: పుష్పలో అనసూయ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. 10 రోజులకు అంత అమౌంటా..?

Pushpa-Anasuya: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప వసూళ్లలో దుమ్మురేపుతోంది. అన్ని భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో బన్నీ ఊర మాస్ లుక్కులో.. ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తుండటంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. .

Pushpa-Anasuya: పుష్పలో అనసూయ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. 10 రోజులకు అంత అమౌంటా..?

అందుకు తగ్గట్లుగానే విడుదలైన తర్వాత అన్ని సెంటర్లలో పుష్ప హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ మ్యాజిక్ తో పాటు సమంత ఐటెం సాంగ్ పుష్పకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అయితే మరో క్యారెక్టర్ ద్రాక్షాయణిగా హాట్ యాంకర్ అనసూయ మంచి క్యారెక్టర్ చేసింది.
రంగమత్తగా రంగస్థలంలో అందర్ని మెప్పించిన పాత్రలో ఒదిగిపోయిన అనసూయ.. పుష్పలో ద్రాక్షాయణిగా.. మంగళం శ్రీను భార్యగా ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించింది.

Pushpa-Anasuya: పుష్పలో అనసూయ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. 10 రోజులకు అంత అమౌంటా..?

అయితే ఈ క్యారెక్టర్ కోసం ఆమె ఎంత పారితోషకం తీసుకున్నదనేది ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది. అయితే అనసూయ దాదాపుగా రోజుకు రూ. 1-1.5 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఆమె పుష్ప సినిమా కోసం దాదాపు 10 రోజుల దాకా కాల్షీట్లు ఇచ్చిందట.. ఈ లెక్కన ఆమెకు సుమారు రూ. 12 లక్షల దాకా పారితోషకం వచ్చినట్లు తెలుస్తోంది. 

రెండో భాగంలో అనసూయ తగ్గేదేలే:

అయితే పుష్ప మొదటి భాగంలో తక్కువ నిడివితోనే అనసూయ క్యారెక్టర్ ఉంది. అయితే రెండో భాగంలో మాత్రం అనసూయ క్యారెక్టర్ లెంత్, ఇంపార్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. రెండో భాగంలో ఫహాద్ ఫాజిల్ తో కలిసి పుష్పపై రివేంజ్ తీసుకునే క్యారెక్టర్ లో అనసూయ కనిపిస్తుందని టాక్.

Sai Pallavi: సాయి పల్లవి తగ్గేదేలే.. ఆ విషయంలో అగ్ర హీరోయిన్లతో సమానంగా..!

Sai Pallavi: ఇటు ఫర్ఫామెన్స్ తో పాటు గ్లామర్ కూడా కావాలంటే.. సాయిపల్లవే కరెక్ట్ అనే భావన ఇటు హీరోల్లోనూ.. అటు డైరెక్టర్ల లోనూ నాటుకుపోయింది. సినిమా చిన్నాదా… పెద్దదా అని చూడకుండా తన పాత్ర బాగుంటే సినిమాను ఖచ్చితంగా ఒప్పుకుంటోంది సాయిపల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ్ , మళయాళం సినిమాలు చేస్తోంది ఈ భామ.

Sai Pallavi: సాయి పల్లవి తగ్గేదేలే.. ఆ విషయంలో అగ్ర హీరోయిన్లతో సమానంగా..!

మళయాళంలో ప్రేమమ్ సినిమా తన నటనతో కేరళ కుర్రకారును అలరించింది. ముఖ్యంగా ప్రేమమ్ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈసినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మరో వైపు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా సరసన విరాట పర్వంలో నటిస్తోంది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Sai Pallavi: సాయి పల్లవి తగ్గేదేలే.. ఆ విషయంలో అగ్ర హీరోయిన్లతో సమానంగా..!

సంపాదన పరంగా సమంత, అనుష్కల సరసన సాయి పల్లవి చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సాయిపల్లవి తన సినిమాల ద్వారా ఎక్కువగానే సంపాదిస్తుందని  తెలుస్తోంది. అయితే క్యారెక్టర్ పరంగా తన పాత్రకు మంచి స్థానం ఉండాలని సాయిపల్లవి అనుకుంటుంది. గతంలో కూడా కొంత మంది స్టార్ హీరోల సినిమాలను కూడా తిరస్కరించింది.

2021 సంవత్సరంలో దాదాపు 3 మిలియన్ డాలర్లకు పైగా..

మహిళల క్యారెక్టర్లను కించపరిచే విధంగా ఉన్నాయంటూ.. కొన్ని క్రేజీ యాడ్స్ ను కూడా వదులుకుంది. దీని వల్ల సాయిపల్లవి రూ. 5-6 కోట్లను కోల్పోయిందట. ఓ సర్వే సంస్థ ప్రకారం  2021 సంవత్సరంలో దాదాపు 3 మిలియన్ డాలర్ల వరకు సంపాదించినట్లు వెల్లడించింది. దీంతో సమంత, అనుష్క సరసన చేరిందట. ప్రస్తుతం సమంత సినిమాకు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటుండగా… అనుష్క రూ.2 కోట్లు తీసుకుంటుందట. సాయిపల్లవి సినిమాకు రూ. 1-1.5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటుందని సమాచారం.

Bigg Boss Telugu : బిగ్ బాస్ సీజన్ 5 లో 19 మంది కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బిగ్ బాస్ 5 ముగిసింది. అందులో సన్నీ విన్నర్ గా గెలిచాడు. రూ.50 లక్షల రూపాలయతో పాటు.. రూ.25 లక్షలు విలువ చేసే ప్లాట్ కూడా సొంతం చేసుకున్నాడు. అంతే కాదు అతడికి 15వారాలు హౌస్ లో ఉన్నందుకు కొంత అమౌంట్ కూడా వచ్చింది. అవి ఎంత..? అస్సలు హౌస్ లో ఉన్న 19 మంది కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఎంత..? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

Bigg Boss Telugu : బిగ్ బాస్ సీజన్ 5 లో 19 మంది కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సాధారణంగా ఎవరైనా.. ఏ ప్రోగ్రాం లేదా సినిమాలో యాక్ట్ చేస్తుంటూ.. అతడికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. దీనిలో ఎక్కువగా బిగ్ బాస్ లో పాల్గొన్న వారికి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలుసుకోవానలి చాలామంది ఉత్సుకత చూపిస్తున్నారు. ఈసారి సీజన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్లకిచ్చిన పేమెంట్స్ చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ నోరెళ్లబెడుతున్నారు. వాళ్లకు ఫైనల్ గా ఎంత వచ్చింది.. అనే విషయాలకు వెళ్తే..

ముందుగా సన్నీ విషయానికి వస్తే.. అతడు వారానికి రూ.2లక్షల చొప్పున అగ్రిమెంట్ తీసుకోగా.. అతడతికి 15వారాలకు రూ.30 లక్షలు వచ్చాయి. దీంతోపాటుగా ప్రైజ్ మనీ 50 లక్షలు, సువర్ణభూమి వారు ఇచ్చిన 25లక్షల రూపాయల విలువగల ల్యాండ్, అలాగే 2 లక్షల రూపాయల విలువగల టివియస్ అపాచీ బైక్ సంపాదించుకున్నాడు. దీంతో 80 లక్షల క్యాష్, 27లక్షల గిఫ్ట్స్ ని అందుకున్నాడు సన్నీ. మొత్తానికి సన్నీ కోటికి పైగా సంపాదించాడు. ఇక రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ విషయానకి వస్తే.. వారానికి అతడికి రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల వరకు మాట్లాడినట్లు సమాచారం. ఈ లెక్కన 15వారాలకు అతడు రూ.70 లక్షలకుపైగా వచ్చాయి.

సిరి రెమ్యూనిరేషన్ విషయానికి వస్తే.. ఈమెకు వారానికి రూ. రెండు లక్షల చొప్పున మాట్లాడారట. దీంతో 15వారాలకు ఈమె రూ.30లక్షలు వచ్చిటన్లు తెలుస్తోంది. మానస్ విషయానికి వస్తే.. వారానికి రెండు లక్షలకు పైగానే వచ్చిందని.. మొత్తం మీద 40 లక్షల వరకూ 15వారాలకి అందుకున్నాడు అని అంటున్నారు. శ్రీరామచంద్రకు వారానికి రూ.3 లక్షలకు పైగానే ఇచ్చారట. అంటే దాదాపు 15 వారాలకు రూ.50లక్షలకు పైగానే అందుకున్నాడనే టాక్ వస్తోంది.

యాంకర్ రవికి హైఎస్ట్ రెమ్యూనిరేషన్ అని సమాచారం. ఇతడికి వారానికి రూ.7 లక్షల నుంచి రూ.8లక్షల మధ్య ఇచ్చారట. మొత్తం 12 వారాలకు రూ. 90 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ లో ఇదే హైఎస్ట్ పారితోషికమని అంటున్నారు. కాజల్ కు రెండు లక్షల చొప్పున రూ.30లక్షలు.. ప్రియాంక సింగ్ 1.75 చొప్పున దాదాపుగా 13 వారాలకి 25 లక్షలు.. అనీమాస్టర్ 11 వారాలకి 33 లక్షలు.. జెస్సీకి 1.5 లక్షలు చొప్పున 10 వారాలకి 15 లక్షలుకుపైనే వచ్చినట్లు సమాచారం.

లోబోకి 18 నుంచీ 20 లక్షలు.. ప్రియాంకకు 7 వారాలకి గానూ 10 లక్షలు.. శ్వేతావర్మకి ఒక్కోవారానికి 1 లక్షరూపాయల చొప్పున ఆరువారాలకి ఆరు లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. నటరాజ్ మాస్టర్ కి నాలుగు వారాలకి 4 లక్షలు.. ఉమాదేవికి మొత్తం రెండు వారాలకు 1.60లక్షలు.. సరయుకు వారానికి రూ.60 వేల చొప్పున ఇచ్చారని సమాచారం. హమీదా 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. విశ్వకు 22 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది. లహరికి కూడా వారానికి 60 వేల చొప్పున.. తీసుకున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ 5లో శ్రీరామచంద్ర రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా..?

తెలుగులో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ పూర్తయింది. 105 రోజుల ఈ జర్నీ ఎట్టకేలకు మొన్న గ్రాండ్ గా ముగిసింది. అయితే హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లు అడుపెట్టగా.. మొదటి వీక్ లో సరయు ఎలిమినేట్ అయింది.

తర్వాత స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్లు అందరూ హౌజ్ నుంచి బయటకు వచ్చేశారు. అందులో ముఖ్యంగా యాంకర్ రవి బయటకు రావడం అటు అభిమానులకు.. సగటు ప్రేక్షకుడికి రుచించలేదు. ఎలిమినేషన్ అంతా ఫేక్ అంటూ ఆరోపించారు. అంతక ముందు విశ్వా విషయంలో కూడా అంతే జరిగింది.

ఆటలో ఎంతో చురుకుగా ఉండే విశ్వా కూడా హౌస్ నుంచి అనూహ్యంగా బయటకు వచ్చాడు. ఇక టాప్ 5లో మిగిలిన సిరి, మానస్, సన్నీ, షణ్ముఖ్ మరియు శ్రీరామంచంద్రలు మిగిలారు. ఇందులో మొదట సిరి ఎలిమినేట్ కాగా.. తర్వాత టాప్ 4 గా మానస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. తర్వాత శ్రీరామచంద్ర టాప్ 3 గా బయటకు వచ్చేశారు.ఇక హౌస్ నుంచి వచ్చిన వాళ్లు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

ఈ విషయాలను తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఈ విషయంలో సోషల్ మీడియాలో తెగ వెతుకుతుంటారు. అయితే తాజాగా ఇండియన్ ఐడల్ 5 విజేత శ్రీరామ్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలిసిపోయింది. ఆ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడికి వారానికి రూ. రెండు నుంచి రూ.3లక్షల చొప్పున అందుకున్నాడట. అతడు మొత్తం 15 వారాలు హౌస్ లో ఉన్నాడు. దీనిని బట్టి చూస్తే అతడు మొత్తంగా రూ. 35 లక్షల వరకు సంపాదించాడని తెలుస్తోంది.

షణ్ముఖ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ప్రైజ్ మనీ కంటే ఎక్కువే సంపాదించాడుగా..!

టైటిల్ ఫేవరేట్ గా 19 మందిలో ఒకడిగా హౌస్ లో అడుగుపెట్టిన షణ్ముఖ్ జశ్వంత్.. రన్నర్ గా నిలవాల్సి వచ్చింది. అతడు ఒంటరిగా గేమ్ ఆడితే గెలిచేవాడేమో అనే మాటలు కూడా వినపడుతున్నాయి. సిరితో స్నేహం కంటే మరో స్టెప్ ఎక్కువగా ఎమోషనల్ కావడంతోనే అతడికి మైనస్ అయిందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. హౌస్ నుంచి బయటకు వచ్చిన వారిలో ఎక్కువగా యాంకర్ రవి సంపాదించాడు. అతడు దాదాపు రూ.90 లక్షల వరకు వెనుకేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే రవి హౌస్ లో ఉన్నంత వరకు ఎక్కువగా షణ్ముఖ్ ను తమ్ముడిగా ట్రీట్ చేస్తూ.. దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. రవికి ఎన్ని పేర్లు పెట్టినా నవ్వుకుంటూనే స్వీకరించాడు. కానీ అతడు అనూహ్యంగా 12వ వారంలోనే బయటకు వచ్చాడు.

షణ్ముఖ్ మొదట్లో 4 వారాల వరకు టాప్ లోనే కొనసాగాడు. చాలామంది ఈ సారి షణ్ముఖ్ జశ్వంత్ కే టైటిల్ వస్తుందని కూడా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. సన్నీ అనూహ్యంగా ముందుకు వెళ్లాడు. ఎదుటివారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్.. సిరి, జెస్సీతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేశాడు. కానీ సన్నీకి వచ్చే మద్ధతు మాత్రం బయట విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా హగ్గులు, కిస్సింగ్ లే అతడి పరాజయానికి కారణం అయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇక అతడి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. అతడు దాదాపు వారానికి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అతు యాంకర్ రవి తర్వాత ఎక్కవగా సంపాదించింది షణ్ముఖ్ కావడం విశేషం. ఈ క్రమంగా చూస్తే.. విన్నర్ కు ఇచ్చిన ప్రైజ్ మనీ రూ.50 లక్షల కంటే.. షణ్ముఖ్ జశ్వంత్ కు వచ్చిన ప్రైజ్ మనీనే ఎక్కువగా ఉంది. పదిహేను వారాలకు అతడు రూ.65లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ తో మానస్ ఎంత వెనకేసాడో తెలుసా..?

బిగ్ బాస్ 5 సీజన్ ముగిసింది. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో సన్నీ విజేతగా నిలిచారు. రన్నరప్ గా షణ్ముఖ్ నిలిచారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ ముగియడంతో కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే మానస్ కు బిగ్ బాస్ ఎంతమొత్తం ముట్టచెప్పాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉన్న మాసస్.. అన్ని టాస్కుల్లో, ఛాలెంజుల్లో తన పని తాను చేసుకుపోయాడు. ఎవరితోనూ ఎక్కువగా వివాదాల జోలికి వెళ్లకుండా క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సన్నీతో మంచి ప్రెండ్ షిప్ మెంటైన్ చేశాడు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో కూడా విన్నర్ సన్నీ.. మానస్ తో స్నేహం గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. టీవీ షోల్లో చేస్తూ.. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మానస్ కు ఎంత రెమ్యూనరేషన్ వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

సీరియళ్లలో యాక్టింగ్ చేస్తూ వారానికి రూ. 1-1.5 లక్షల వరకు మానస్ సంపాదించేవాడు. దాదాపుగా 15 వారాల పాటు మానస్ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు. థర్డ్ రన్నరప్ గా ఉన్నారు. అయితే మానస్ ఆదాయంతో కంపార్ చేసి చూస్తే దాదాపుగా ఓ రూ. 20 లక్షల వరకు వెనకేసినట్లుగా తెలుస్తోంది. ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పాలనే ఆశ ఉందని గతంలో మానస్ అన్నాడు. ఈ డబ్బుతో తన కల సాకారమవుతుందేమో చూడాలి మరి.