Tag Archives: Ritu Varma

Sharwanand: ఆ సినిమా ఫ్లాప్ అవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను.. మూడు నెలలు బయటకు కూడా రాలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత నటీనటులకు హిట్ ఫ్లాప్ సినిమాలు రావడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పుడు చాలామంది ఎంతో డిప్రెషన్ కి గురవుతూ ఉంటారు.అయితే తాను కూడా అలాంటి డిప్రెషన్ కి గురయ్యానని తాజాగా శర్వానంద్ ఇంటర్వ్యూ ద్వారా తన గత సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాజాగా శర్వానంద్ రీతు వర్మ జంటగా శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం.ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఈ సినిమా కోసం దాదాపు 140 రోజుల పాటు ఎండ, వాన,అని లెక్కచేయకుండా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశాను ఈ సినిమా పక్కా హిట్ అవుతుందన్న నమ్మకం కూడా నాలో పెరిగిపోయింది. అయితే ఈ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ కావడంతో ఎంతో డిసప్పాయింట్ అయ్యానని,మూడు నెలల పాటు బయటకు రాకుండా డిప్రెషన్ కి గురయ్యానని ఈ సందర్భంగా శర్వానంద్ వెల్లడించారు.

Sharwanand: ఎండ వానను లెక్కచేయకుండా కష్టపడ్డాను..

ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఇలా డిసప్పాయింట్ చేయడంతో నేను ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నానని ఈ సందర్భంగా శర్వానంద్ తన కెరియర్లో డిజాస్టర్ గా నిలిచినటువంటి పడి పడి లేచే మనసు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.ఇదే కాకుండా తన కెరీర్లో మరికొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా విషయంలో మాత్రం తాను చాలా డిసప్పాయింట్ అయ్యానని తెలిపారు.ఒకే ఒక జీవితం సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ ఈయన ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Nagarjuna: అమల నటన చూసి కంటతడి పెట్టుకున్న నాగార్జున.. సెంటిమెంట్ ను పండించిన అమల!

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్యగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే. వివాహానికి ముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు. ఇలా కుటుంబ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అమల చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో తల్లి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె తాజాగా మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో అమల శర్వానంద్ తల్లి పాత్రలో సందడి చేయబోతున్నారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న అమల ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమా 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో పలువురు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ చూడటానికి నాగార్జున, అఖిల్, అమల, డైరెక్టర్ హను రాఘవపూడి, చందు మొండేటి వంటి ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.

Nagarjuna: అమల నటనకు ఎమోషనల్ అయిన అఖిల్..

ఈ సినిమాలో అమ్మ పాత్రలో అమల ఎంతో అద్భుతంగా నటించిందని ఈమె తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో అద్భుతంగా సినిమా చేశారంటూ ఈయన చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు. ఇక మదర్ సెంటిమెంట్ తో వచ్చినటువంటి ఈ సినిమా చూసిన అఖిల్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమా తప్పకుండా హిట్ అవుతుందని,ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది అంటూ ఈ సందర్భంగా నాగార్జున సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేశారు.

వరుడు కావలెను దర్శకురాలు గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా?

నాగ శౌర్య, రీతు వర్మ హీరో హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. ఈ సినిమా రేపు విడుదల సందర్భంగా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మీడియాతో పలు ఆసక్తికర విషయాల గురించి చర్చించారు లక్ష్మీ సౌజన్య పుట్టిందీ కర్నూలు జిల్లాలో అయితే పెరిగింది మాత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట.

లక్ష్మి వాళ్ళ నాన్న మ్యాథ్స్ లెక్చరర్. ఈమె పదకొండేళ్ళకే పదో తరగతి ఎగ్జామ్ రాసిందట. ఈమెకు చిన్నప్పటినుంచీ నలుగురితో కలిసి ఉండటం, కలిసి తిరగటం లాంటివి ఇష్టమట. అందుకే ఆమెకు సినిమా ఇండస్ట్రీ ఫీల్డ్ కరెక్ట్ అనిపించిందట. తనకు పద్దెనిమిదేళ్ల వయసులో ఇంట్లో పెళ్లి చేస్తానంటే వారిని ఎదిరించి మరీ హైదరాబాదుకు వచ్చిందట. అలా శేఖర్ కమ్ముల, తేజ, కృష్ణవంశీ, ప్రకాష్ కోవెలమూడి లాంటిమంచి మంచి డైరెక్టర్ ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిందట.

ఇలా ఇండస్ట్రీలో పదిహేనేళ్ల జర్నీ తర్వాత ఈమె వరుడు కావలెను సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతోందట. ఇక ఈ కథలో 2017లో చిన్నబాబు కూడా చెప్పగా, స్టోరీ ఐడియా మొదలు అరగంట ఫుల్ ప్రదేశం వరకు అతడికి అంతా నచ్చిందట. అలా ఈ సినిమా కథ మొదలైంది.ప్యాండమిక్ సిచువేషన్ వల్ల రెండేళ్లు ఆలస్యం అయ్యింది. హారిక హాసిని క్రియేషన్స్ ఇలాంటి పెద్ద బ్యానర్ లో నా లాంటి కొత్త డైరెక్టర్ కి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అని తెలిపింది.

ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు భూమి. పేరుకు తగ్గట్టుగానే భూమికి ఉన్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అని తెలిసింది. ఇందులో హీరోయిన్ కు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎదుటి వాళ్ళకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందో వాళ్ల నుంచి అంతే రెస్పెక్ట్ కోరుకుంటుంది. ఒకరిపై ఆధారపడడం, ఒకరిని ఇబ్బంది పెట్టడం లాంటిది చేయదు. అందుకే పర్యావరణానికి ఇబ్బందిలేని ఏకో ఫ్రెండ్లీ బిజినెస్ చేస్తుంది. మరి అలాంటి అమ్మాయిని ప్రేమించాలి అంటే తన కంటే అబ్బాయిల్లో ఎక్కువ కలిసి ఉండాలి. అవన్నీ నాగశౌర్య లో ఉన్నాయి అని తెలిపింది లక్ష్మీ సౌజన్య.

పెళ్లి పై స్పందించిన వరుడు కావలెను హీరోయిన్.. తన పెళ్లి అప్పుడే?

నాగశౌర్య, కలిసి రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల అక్టోబర్ 29న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

రీతు వర్మ మొదట పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఇటీవల హీరో నాని నటించిన టక్‌ జగదీష్‌ చిత్రంలో నటించి అలరించింది. ఇందులో ఈమె బలమైన పాత్రలో నటించి మెప్పించింది. నానికి దీటుగా నటించింది. ఇక ప్రస్తుతం నాగశౌర్యతో కలిసి వరుడు కావలెను చిత్రంతో రాబోతుంది. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మ్యారేజ్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. అయితే రీతూ వర్మ తాజా మీడియాతో తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో మ్యారేజ్‌ చేసుకోనని తెలిపింది. అంతేకాదు ఎప్పుడు చేసుకోబోయేది తెలిపింది. ఇంకా తన మ్యారేజ్‌ రెండుమూడేళ్లు అవుతుందని తెలిపింది.

అయితే మ్యారేజ్‌ విషయంలో ఇంట్లో నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది. పెళ్లిపై తనకు ఫ్రీడమ్‌ ఇచ్చారని, అయితే అప్పుడప్పుడు పెళ్లెప్పుడని సరదాగా ఆటపట్టిస్తుంటారని పేర్కొంది రీతూ వర్మ. మ్యారేజ్‌ చేసుకునేది పూర్తిగా తన ఇష్టమని చెప్పొంది. ప్రస్తుతం తాను సినిమాలపై ఫోకస్‌ పెట్టినట్టు చెప్పింది. అయితే ఏది పడితే అది చేయనని, పాత్రకి ప్రాధాన్యత పాత్రలనే ఎంచుకుని,నచ్చిన సినిమాలే చేస్తానని చెప్పింది రీతూ వర్మ.

ప్రస్తుతం నటిస్తూ వరుడు కావలెను చిత్రం గురించి చెబుతూ, ఇందులో భూమి పాత్రలో కనిపిస్తానని, పాత్ర సవాల్‌గా ఉంటుందని, ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని, అందుకే నో చెప్పకుండా నటించినట్టు చెప్పింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన పాత్ర ఇదని చెప్పింది. ఇది పూర్తిగా లవ్‌ స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ ప్రధానంగా సాగుతుందని తెలిపింది. కాకపోతే దర్శకు రాలు లక్ష్మీ సౌజన్య మహిళ కావడంతో, ఆమె పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సాగుతుందని పేర్కొంది.

ఆకట్టుకుంటున్న వరుడు కావలెను ట్రైలర్.. విభిన్నమైన కాన్సెప్ట్ తో అలా!

లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతూ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రంలో నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల చేత వాయిదా పడుతోంది.చివరికి ఈ సినిమాను అక్టోబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు ఏర్పాటుచేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయడంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉన్నటువంటి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. పెళ్లిచూపులు నచ్చవు అనే కాన్సెప్టుతో మొదలయ్యే ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇందులో నాగ శౌర్య, రీతు భూమి, ఆకాష్ పాత్రలలో కనిపించనున్నారు.

భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు అంటూ ఉన్న వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, ఏ కారణాల చేత వారిద్దరూ విడిపోయారు అనే విషయం ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇక ఇందులో వెన్నెలకిషోర్ చెప్పే డైలాగులు హైలెట్ గా నిలిచాయి. పొగరుబోతులకు కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ఆవిడే విన్నర్ అంటూ వెన్నెల కిషోర్ డైలాగులు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ఈ ట్రైలర్ లో రీతూవర్మను హైలెట్ చేసి చూపించారు. ఇలా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ట్రెండ్అవుతుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.

దసరా కానుకగా వరుడు కావలెను.. అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం..

యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. దసరా రోజు అంటే అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రీతు వర్మ నాని సరసన నటించిన టక్ జగదీశ్ హిట్ టాక్ తెచ్చుకుంది. టక్ జగదీశ్ తర్వాత రీతు వర్మ నటించిన సీనిమా ఇదే. ఇది కూడా దసరా నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనుంది. లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ విడుదల చేయగా.. ఓ రేంజిలో వ్యూస్ తెచ్చుకుంటోంది. ఈ పాట ఇప్పటి వరకు 16 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుని సినిమాకు కావాలసిన ప్రమోషన్‌ను రాబట్టింది. దీనికి థమన్ సంగీతం వహించగా.. శేఖర్ మాస్టార్ కోరియోగ్రాఫర్ గా వహించాడు. ఈ పాటకు శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఇప్పటికే చిత్రబృందం తెలిపింది.