Tag Archives: sai pallavi

Saipallavi: ఆ హీరో కోసం ఇంట్లో వారితో తన్నులు తిన్న సాయి పల్లవి… భారీగానే రిస్కు చేసిందిగా?

Saipallavi: సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా ఎంతో అద్భుతమైన నటన నాట్యంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె వచ్చిన అవకాశాలు అన్నింటిని వినియోగించుకోకుండా కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను అలాగే గ్లామర్ షో కి తావు లేకుండా ఉన్నటువంటి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు.

ఇలా సాయి పల్లవి నటించినది తక్కువ సినిమాలే ఆయనప్పటికీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ సరసన ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి తన ఫేవరెట్ హీరో గురించి పలు విషయాలను తెలియజేశారు.

తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. అయితే ఇంటర్ చదువుతున్న సమయంలో తన సినిమా విడుదలయితే తన ఇంట్లో వారికి తెలియకుండా చూడటం కోసం వెళ్లానని తెలిపారు అయితే ఇంటికి చాలా ఆలస్యంగా రావడంతో తన తండ్రి చేతిలో బాగా తన్నులు తిన్నానని సాయి పల్లవి ఈ సందర్భంగా తెలిపారు. సినిమా చూడాలనిపిస్తే మాకు చెబితే మేమే తీసుకెళ్తాం కదా తిట్లు కూడా తిట్టారని సాయి పల్లవి తెలిపారు.

Saipallavi: ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి…


నాకెంతో ఇష్టమైన హీరో కోసం నేను చేసినటువంటి అతిపెద్ద రిస్క్ అదేనని ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గురించి సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని తాను మొదటిసారి ఫిదా సినిమా షూటింగ్ సమయంలో కలిశానని అదే తనని కలవడం మొదటి సారి, ఆయన ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Virupaksha: హీరోని డామినేట్ చేస్తుందన్న కారణంతోనే విరూపాక్ష సినిమా నుంచి ఆ హీరోయిన్ ని తప్పించారా?

Virupaksha: సాయిధరమ్ తేజ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అద్భుతమైన హిట్ అందుకొని ఏకంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించారు. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ సరసన నటి సంయుక్త మీనన్ నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన హిట్ అందుకొని అన్ని భాషలలో మంచి కలెక్షన్లను రాబట్టింది.ఇలా ఎంతో అద్భుతమైన ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిజానికి ఈ సినిమాలో మొదటి ఛాయిస్ హీరోయిన్గా సంయుక్త మీనన్ కాదని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ ఛాయిస్ నటి సాయి పల్లవి.

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా నటి సాయి పల్లవిని తీసుకోవాలని భావించారట అయితే సాయి పల్లవి ఇండస్ట్రీలో చాలా క్రేజీ హీరోయిన్.ఈమె అద్భుతమైన నటనతో నాట్యంతో హీరోలను డామినేట్ చేస్తూ కనిపిస్తారు ఈ తరుణంలోని ఈ సినిమాలో కూడా సాయి పల్లవిని తీసుకుంటే హీరో పాత్రను డామినేట్ చేస్తుందని భావించారట.

Virupaksha: సాయి పల్లవి అయితే మరో లెవెల్ లో ఉండేది…


ఇలా హీరో క్యారెక్టర్ ను డామినేట్ చేసే విధంగా సాయి పల్లవి ఉంటుందనీ భావించిన నిర్మాతలు ఈ సినిమాలో సాయి పల్లవి స్థానంలో నటి సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.ఒకవేళ ఈ సినిమాలో కనుక సంయుక్త బదులు సాయి పల్లవి కనుక నటించి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sai Pallavi: ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది…. బ్యూటిఫుల్ లొకేషన్లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన సాయి పల్లవి!

Sai Pallavi: నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకోకుండా ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటారు. ఇలా నటిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

ఇకపోతే సాయి పల్లవి గత కొంతకాలంగా ఎలాంటి తెలుగు సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. విరాటపర్వం సినిమా తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ నిర్మాణంలో హీరో శివ కార్తికేయన్ తో కలిసి తమిళ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

సాయి పల్లవి ప్రస్తుతం కాశ్మీర్ వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా రెండు రోజులుగా ఈమె కాశ్మీర్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా తన వెకేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ సాయి పల్లవి షేర్ చేశారు. చుట్టూ మొక్కలతో ఎంతో ఆహారకరమైన వాతావరణంలో ఈమె దిగినటువంటి సింపుల్ ఫోటోని షేర్ చేశారు.

Sai Pallavi: నేచర్ ఎంజాయ్ చేస్తున్న నేచురల్ బ్యూటీ….

ఈ విధంగా సాయి పల్లవి ఈ ఫోటోలను షేర్ చేస్తూ ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం సాయి పల్లవి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసిన నెటిజన్స్ నేచురల్ బ్యూటీ నేచర్ ను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Saipallavi: ఎన్టీఆర్ భార్యగా సాయి పల్లవి… క్లారిటీ ఇచ్చిన దేవర టీమ్!

Saipallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా, నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి ప్రస్తుతం ఎలాంటి తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అయితే ఈమె హీరోయిన్ గా ఎంతో విభిన్నమైన కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి తెలుగులో చివరిగా విరాటపర్వం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ నిర్మాణంలో హీరో శివ కార్తికేయన్ కి జోడిగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ తెలుగు సినిమాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఇకపోతే సాయి పల్లవి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈమె ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ కి భార్య పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఇందులో ఎన్టీఆర్ ద్విపత్రాభినయంలో నటిస్తున్నారని ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలో కనిపించడంతో తండ్రి పాత్రలో నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ కి సాయి పల్లవి భార్యగా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

Saipallavi: అవన్నీ అవాస్తవాలే…


ఈ విధంగా సాయి పల్లవి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో చిత్ర బృందం ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.సాయి పల్లవి దేవర సినిమాలో ఎన్టీఆర్ కి భార్య పాత్రలో నటిస్తుంది అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలన్ని పూర్తిగా ఆవాస్తవమేనంటూ ఈ వార్తలను కొట్టి పారేశారు. దీంతో సాయి పల్లవి ఎన్టీఆర్ సినిమాలో నటించలేదనే క్లారిటీ వచ్చేసింది.

Sitara: సారంగ దరియా అంటూ సాయి పల్లవిని మైమరిపించిన సితార… వైరల్ అవుతున్న వీడియో!

Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే ఎంతో టాలెంట్ కలిగినటువంటి సితార చాలా చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేయడంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ఇలా సితార దూకుడు కనక చూస్తుంటే అతి త్వరలోనే ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి సితార సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

సితార ప్రత్యేకంగా డాన్స్ లో శిక్షణ తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె ఎన్నో అద్భుతమైన పాటలకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సాయి పల్లవి నటించిన సారంగదరియా పాట ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. ఈ పాటకు ఎంతోమంది డాన్స్ చేస్తూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.

Sitara: హీరోయిన్గా సక్సెస్ అవడం గ్యారెంటీ…


ఈ క్రమంలోనే సితార సైతం ఈ పాటకు అద్భుతమైన డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.ఇలా సారంగదరియా అంటూ సాయి పల్లవిని కూడా మైమరిపించే విధంగా సితార చేసినటువంటి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ డాన్స్ వీడియో చూసినటువంటి మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు కూతురు చాలా టాలెంట్ అని,ఇండస్ట్రీ లోకి వస్తే హీరోయిన్ గా సక్సెస్ అవుతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Sai Pallavi: వామ్మో సాయి పల్లవి భారీగానే ఆస్తులు కూడా పెట్టిందిగా… ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి వృత్తి పరంగా డాక్టర్ అయినప్పటికీ సినిమాలపై మక్కువతో ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి పల్లవి ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలను తగ్గించిందని చెప్పాలి.సాయి పల్లవి వచ్చిన అవకాశాలు అన్నింటిని సద్వినియోగం చేసుకోకుండా కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు భవిష్యత్తులో తనకు అలాంటి పాత్రలలో నటించే అవకాశాలు రాకపోతే తాను తన వైద్య వృత్తిలో స్థిరపడతానంటూ ఈమె కామెంట్ చేశారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఫిదా సినిమా ద్వారా పరిచయమైనటువంటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్నారు.

ఇకపోతే సాయి పల్లవి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంత మేర ఆస్తులు కూడా పెట్టారు ఈమె మొత్తం ఆస్తులు విలువ ఎంత ఏంటి అనే విషయం గురించి ప్రస్తుతం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయి పల్లవి 1992 కోయంబత్తూర్ లో జన్మించారు. అయితే వీరికి కోయంబత్తూర్ లో ఒక లగ్జరీ ఇల్లు ఉందని తెలుస్తోంది.

Sai Pallavi: భారీగా ఆస్తులు సంపాదించిన సాయి పల్లవి..

వీటితోపాటు సాయి పల్లవికి ఈమెకు అంతగా ఆస్తులు లేకపోయినా ఆడి q3 మిక్స్బ్ షల్ లాన్సర్ ఈవో ఎక్స్ మరియు సుజుకి నెక్సా కార్లు సాయిపల్లవికి ఉన్నాయట. ఇక ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అందరిలాగా ఈమె ఖరీదైన వస్తువులను కొనడానికి ఏమాత్రం ఇష్టపడరట. చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతూనే సాయి పల్లవి దాదాపు 25 కోట్ల వరకు ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం.

Saipallavi: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సాయి పల్లవి… అదే కారణమా?

Saipallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి పరిచయం అవసరం లేదు.ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో డాన్స్ తో ఫిదా చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

ఇలా తనకు అనుగుణంగా తనకు నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకొని వరుస హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇలా సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఈమె పెళ్లి చేసుకోబోతుందని అందుకే సినిమాలకు దూరంగా ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి

ఇకపోతే తాజాగా సాయి పల్లవి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని అయితే అందుకు గల కారణం కేవలం ఆమె వైద్యవృత్తిలో స్థిరపడటమే కారణమని తెలుస్తుంది. ఈమె ఇండస్ట్రీలోకి రాకముందే వైద్య విద్యను అభ్యసించిన సంగతి మనకు తెలిసిందే.గతంలో కూడా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తాను సినిమాలలో కొనసాగకపోతే వైద్య వృత్తిలో స్థిరపడతానని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Saipallavi: హాస్పిటల్ నిర్మాణంలో బిజీగా ఉన్న సాయి పల్లవి..

ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సాయి పల్లవి తన చెల్లెలితో కలిసి కోయంబత్తూర్ లో హాస్పిటల్ నిర్మాణం కోసం పలు కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ అనుమతి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని,ప్రస్తుతం ఈమె హాస్పిటల్ నిర్మాణ పనులలో బిజీగా ఉండటం వల్లే సినిమాలకు దూరంగా ఉన్నారని భవిష్యత్తులో తాను పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి వైద్య వృత్తిలో కొనసాగుతుందని తెలుస్తోంది. సాయి పల్లవి సినిమాలకు దూరమవుతుందని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Sai Pallavi: వారసులకే గౌరవ మర్యాదలు ఇస్తారు… వారసత్వం పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

Sai Pallavi:తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ పవర్ స్టార్ గా నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని హీరోలకు దీటుగా నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఆగ్ర హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వారసత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవి డాన్స్ షో ల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకొని అనంతరం హీరోయిన్గా అవకాశాలను అందుకున్నారు.సాయి పల్లవి పక్కన డాన్స్ చేయాలంటే హీరోలు కూడా కాస్త తడబడతారు అనే విషయం మనకు తెలిసిందే.

ఇలా ఎన్నో డాన్స్ షోలలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈమె చివరి వరకు వెళ్లి రన్నర్ గా రావడంతో ఈమె ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో ‘ఉంగళిల్ యార్ అడుత ప్రభుదేవా’ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆ సమయంలో ఫైనల్ వరకూ వెళ్లి  రన్నర్ గా తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే ఇలాంటి డాన్స్ షోలలో టాలెంట్ ఉన్నవారికి గుర్తింపు ఉండదని కేవలం వారసులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

Sai Pallavi: అలాంటి షోలు అంటే అసహ్యం…

ఇలాంటి రియాలిటీ షో లలో ఎంతో కష్టపడి పాల్గొన్నప్పటికీ వారి కష్టానికి ఫలితం ఉండదు కేవలం వారసులకు మాత్రమే గౌరవం ఇచ్చి వారికి పట్టం కడతారు.అందుకే తనకు ఇలాంటి రియాలిటీ షోల్ అంటే చాలా అసహ్యం అంటూ ఈ సందర్భంగా ఈమె తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సాయి పల్లవి డాన్స్ షో ల గురించి వారసత్వం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pooja Hegde: ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకున్న పూజ.. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావంటూ ట్రోలింగ్!

Pooja Hegde: పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలలో నటించిన పూజ హెగ్డేకు ఇండస్ట్రీలో భారీ డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఈమెకు వరుస అవకాశాలు రావడంతో ఈమె నటించిన వరుస మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

సాధారణంగా మూడు వరుస ఫ్లాప్స్ అయితే ఆ హీరోయిన్ కి అవకాశాలు రావడం చాలా వరకు తగ్గిపోతాయి. కానీ మన బుట్ట బొమ్మకు మాత్రం అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. వరుస ఫ్లాప్స్ ఎదుర్కొన్నప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా 2021 సంవత్సరానికి గాను సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా పూజా హెగ్డే ఉత్తమ నటిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి అవార్డు అందుకున్నారు.

ఈ విధంగా ఉత్తమ నటిగా ఈమె అవార్డు అందుకోవడంతో ఎంతోమంది నేటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర పెద్దగా చెప్పుకోదగిన పాత్ర కాదు.ఇందులో ఈమె సాధారణ హీరోయిన్ పాత్రలో నటించారు. అయినా ఈమెకు ఉత్తమ నటిగా అవార్డు రావడం ఏంటి అని కొందరు కామెంట్లు చేయడం మరికొందరు మాత్రం డబ్బులు ఇచ్చి ఈ అవార్డును కొనుక్కున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు ఉత్తమ నటి అవార్డు రావడం ఏంటి…

నిజానికి సైమా అవార్డులలో ఉత్తమ నటి నామినేషన్ లో భాగంగా లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలకు గాను సాయి పల్లవి నామినేషన్స్ లోకి వచ్చారు. శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి పాత్ర అద్భుతం అని చెప్పాలి. ఇలా ఈమెను కాకుండా ఉత్తమ నటి అవార్డు పూజ హెగ్డే ను వరించడంతో నేటిజన్స్ ఈ అవార్డుపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఉత్తమ నటి అవార్డు రావడం ఏంటి అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో నటించినని ముఖానే చెప్పిన హీరోయిన్… ఎవరంటే?

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.

ఇకపోతే ఈ రౌడీ హీరో సినిమాలు వస్తున్నాయని తెలిస్తే అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పాలి. ఇలా విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చేంత అభిమానులు ఉన్నారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం విజయ్ దేవరకొండకు అభిమానులుగా మారిపోయారు. ఆయన పక్కన ఛాన్స్ వస్తే చాలు నటించడానికి సిద్ధంగా ఎంతోమంది ముద్దుగుమ్మలు ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ వంటి వాళ్ళు కూడా తనతో డేట్ కి వెళ్లాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం వస్తే ముఖానే నటించనని ఒక హీరోయిన్ చెప్పారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికొస్తే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన డియర్ కామ్రేడ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో తాను నటించనని చెప్పారట.

Vijay Devarakonda: ఎప్పటికీ ఆ హీరోతో నటించను…

ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉండడంతో అలాంటి సన్నివేశాలలో తాను నటించలేనని అందుకే ఈ సినిమాని వదులుకున్నట్లు సమాచారం.ఈ సినిమానే కాదు భవిష్యత్తులో తనతో కలిసి ఎలాంటి సినిమాలలో కూడా నటించమని సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల ఎంపిక తన సినిమాల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుందని అందుకే తన సినిమాలలో నటించడానికి తాను సిద్ధంగా లేనంటూ సాయి పల్లవి విజయ్ దేవరకొండ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.