Tag Archives: sai pallavi

Sai Pallavi-Shekhar kammula: ఫిదా హీరోయిన్ ను పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..మరో హీరోయిన్ కు అవకాశం..?

Sai Pallavi-Shekhar kammula: శేఖర్ కమ్ముల.. దర్శకత్వంలో తన మార్క్ ను చూపిస్తాడు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల కష్టాలు.. సుఖాలు.. ప్రేమలు ఎలా ఉంటాయో ‘హ్యాపీ డేస్’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రస్తుతం చదువుతున్న.. చదవబోయే ఏ ఇంజనీరింగ్ విద్యార్థి అయినా.. ఈ సినిమాను మర్చిపోలేడు. అంతలా అద్భుతంగా తీశాడు.

Sai Pallavi-Shekhar kammula: ఫిదా హీరోయిన్ ను పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..మరో హీరోయిన్ కు అవకాశం..?

ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ యాసలో వచ్చి.. బంపర్ మెజారిటీ హిట్ సాధించిన మరో చిత్రం ఫిదా. దీనిలో భాను .. హైబ్రిడ్ పిల్ల అంటూ అందరినీ మెప్పించిన హీరోయిన్ సాయి పల్లవి. దీనిలో సాయి పల్లవి తన నటన పరంగా మంచి గర్తింపు తెచ్చుకుంది . తెలంగాణ యాసను అద్భుతంగా పలికింది.

Sai Pallavi-Shekhar kammula: ఫిదా హీరోయిన్ ను పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..మరో హీరోయిన్ కు అవకాశం..?

తర్వాత లవ్ స్టోరీ సినిమాలో కూడా శేఖర్ కమ్ముల సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారు. దీనిలో కూడా ఆమె అందం, అభినయం, డ్యాన్స్ లతో మరోసారి అలరించింది. ఇక లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల తమిళ నటుడు ధనుష్ తో ఓ సినిమా తీయబోతున్నాడు.

దీనిని తెలుగు, తమిళంలో తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏషియన్ గ్రూప్ ఆఫ్ సినిమాస్ యూనిట్ అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి చేస్తే.. ఆమె పాన్ ఇండియాలో అడుగు పెట్టినట్లు అవుతుంది.


సాయి పల్లవిని పక్కన పెట్టేసిన శేఖర్ కమ్ముల..

మొన్నటి వరకు కూడా ఇలానే జరుగుతుంది అనుకున్నారు. కానీ ఈ సారి ధనుష్ నటించే ఈ సినిమాలో సాయి పల్లవిపై శేఖర్ కమ్ముల ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి కాకుండా.. బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో ధనూష్ సరసన నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో సాయి పల్లవి తదుపరి ప్రాజెక్ట్ ఏంటా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ధనుష్ నటించిన జగమే తంధీరమ్ విడుదల ఒక సంవత్సరం పాటు ఆలస్యం అయింది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, సంచనా నటరాజన్, దీపక్ పరమేష్ తదితరులు నటిస్తున్నారు.

Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సెలబ్రేషన్స్.. మామూలుగా లేవుగా?

Shyam Sigha Roy: డిసెంబర్ నెలలో తెలుగులో మంచి సినిమాలు విడుదల అయ్యాయి. అందులో స్టార్ హీరోల దగ్గర నుంచి.. చిన్న హీరోల వరకు ప్రతీ సినిమా థియేటర్లలో విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసుకున్నారు. అయితే ఎన్నో అంచనాల మధ్య డిసెబర్ 17 పుష్ప పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయి.. మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సెలబ్రేషన్స్.. మామూలుగా లేవుగా?

అయితే పుష్ప సినిమా ద్వారా ఏమైనా ఇబ్బంది అవుతాందా..అని ఆలోచించకుండా.. తన కథపై నమ్మకంతో క్రిస్మస్ కు ఒకరోజు ముందు థియేటర్లలోకి వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. దీనిలో నానీ హీరోగా.. డబుల్ రోల్ ప్లే చేశాడు. ఉప్పెన్ ఫేమ్ హీరోయిన్ కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్‌ మరియు సాయి పల్లవి హీరోయిన్లుగా నటించారు.

Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సెలబ్రేషన్స్.. మామూలుగా లేవుగా?

అయితే ఈ సినిమా అనుకున్నట్లుగానే పాన్ ఇండియా లెవల్ లో విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. విడుదల అయిన ప్రతీ సెంటర్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తమ కథపై నమ్మకంతో విడుదల చేసిన ఈ సినిమా అనుకున్నట్లుగానే హిట్ టాక్ తెచ్చుకుంది.

త్వరలోనే సీక్వెల్ ప్లాన్..

అయితే ఈ సినిమాకు సంకృత్యాన్‌ దర్శకత్వం వహించని విషయం తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని.. దానిని దర్శకుడు ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. దీనిలో నాని, వెంకట్‌ బోయినపల్లి చిత్రయూనిట్‌కి షీల్డ్స్‌ను ప్రదానం చేశారు. ఈ సినిమాను వెంకట్‌ బోయినపల్లి నిర్మించిన విషయం తెలిసిందే .

Sai Pallavi: ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అంత పెద్ద సాహసానికి ఒడి గట్టిన సాయి పల్లవి.. చివరికి ఏమైందంటే?

Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ ఏడాది వరుసగా రెండు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా ద్వారా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టారు. అదేవిధంగా డిసెంబర్ 24వ తేదీ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయంలో సాయిపల్లవి హీరోయిన్లుగా శ్యామ్ సింగరాయ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Sai Pallavi: ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అంత పెద్ద సాహసానికి ఒడి గట్టిన సాయి పల్లవి.. చివరికి ఏమైందంటే?

ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ విడుదలయ్యి మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. సాయి పల్లవి ఇందులో దేవదాసి పాత్రలో నటించారు. ఎప్పటిలాగే ప్రతి సినిమాలోలాగే ఈ సినిమాలో కూడా సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇదిలా ఉండగా సాయిపల్లవి ఈ సినిమా విడుదలైన తర్వాత తన చుట్టూ ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేకుండా ఒక పెద్ద సాహసానికి ఒడిగట్టారు.

Sai Pallavi: ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అంత పెద్ద సాహసానికి ఒడి గట్టిన సాయి పల్లవి.. చివరికి ఏమైందంటే?

ఈ క్రమంలోని ఈ సినిమా థియేటర్ ల వద్ద ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏకంగా ఈమె బుర్ఖా ధరించి హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ కి వెళ్లారు. అయితే బుర్ఖాలో ఉన్న సాయి పల్లవిని ఎవరు గుర్తించలేదు. సినిమా పూర్తయిన తర్వాత సాయి పల్లవి బయటకు రాగానే బయట ఒక రిపోర్టర్ సరాసరి సాయిపల్లవి దగ్గరకు వెళ్లి సినిమా ఎలా ఉంది అని తనని అడిగారు.

కారు ఎక్కిన తర్వాత ఐడెంటిటీ రివిల్ చేసిన సాయి పల్లవి:

ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సరాసరి కారులోకి వెళ్ళిన తర్వాత సాయి పల్లవి తన
ఐడెంటిటీ రివీల్ చేయడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయిపల్లవి ఈ విధంగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట తిరగడం కష్టం. ఈమెను ఎవరు గుర్తించలేదు కనుక సరిపోయింది అదే కనుక ఒకవేళ గుర్తుపట్టి ఉంటే అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ఎంతో కష్టతరం అయ్యేదని పలువురు భావిస్తున్నారు. మరి కొంతమంది ఈ సినిమా ప్రమోషన్ లో ఇది ఒక భాగమేనని వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Sai Pallavi: సమంతా, కాజల్ లా స్కిన్ షో నేను చేయలేను..! పుష్ప ఐటెం సాంగ్ పై సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్..!

Sai Pallavi: సినిమాల్లో ఎన్ని సాంగ్స్ ఉన్నా ఐటెం సాంగ్స్ ఉన్న ప్రత్యేకతే వేరు. ఐటెం సాంగ్ ఓ రేంజ్ ఉంటే సగం సినిమా హిట్ అయినట్లే అని భావించే రోజులివి. ముఖ్యంగా పేరున్న హీరోయిన్ సాంగ్ చేసిందా… ఆ పాటకు విపరీతంగా క్రేజ్ ఏర్పడుతుంది.

Sai Pallavi: సమంతా, కాజల్ లా స్కిన్ షో నేను చేయలేను..! పుష్ప ఐటెం సాంగ్ పై సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్..!

హిందీలో చాలా రోజుల నుంచి హీరోయిన్లు ఐటెం సాంగ్ లు  చేస్తున్నారు. తాజాగా తెలుగులో కూడా ఐటెం సాంగ్స్ కి పేరున్న హీరోయిన్లను రికమండ్ చేస్తున్నారు. తాజాగా పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ’’ఊ అంటావా మావా..ఊఊ అంటావా..‘‘ ఎంత హిట్టయిందొ అందరికి తెలుసు. ఈ సాంగ్లో సమంత అందాలు, దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ కలిసి సాంగ్ పెద్ద హిట్ అయింది.

Sai Pallavi: వాళ్లలా ఆ షో నేను చేయలేను..! పుష్ప సాంగ్ పై సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్..!

అయితే ఐటెం సాంగ్స్ ట్రెండ్స్ కొనసాగుతున్న ఈసమయంలో సాయి పల్లవి ఐటెం సాంగ్స్ పై కీలక కామెంట్లు చేసింది. అయితే ఇటీవల నానితో నటించిన శ్యాంసింగరాయ్ సినిమా ప్రమోషన్లలో సాయిపల్లవి సందడి చేసింది. సినిమాను హిట్ చేసేందుకు శ్యాంసింగరాయ్ సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్లను చేసింది. అయితే ఈ సమయంలో సాయిపల్లవికి ఐటెం సాంగ్స్ ఆఫర్ వస్తే ఏం చేస్తుందనే క్వశ్చన్ ఎదురైంది.

‘స్కిన్ షో నాకు నచ్చదు’..

అయితే ఈ ప్రశ్నకు అమ్మడు తన దైన శైలిలో సమాధానం ఇచ్చింది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని.. అయితే సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం వేరు. ఐటెం సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం వేరని.. ఐటెం సాంగ్స్ లో స్కిన్ షో తప్పదని, అది నాకు నప్పదని చెప్పేసింది. కాజల్, సమంత, తమన్నాలా నేను ఐటెం సాంగ్స్ చేయలేనని కుండ బద్దలు కొట్టేసింది సాయిపల్లవి.

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న శ్యామ్ సింగరాయ్ టీం..ఎగబడ్డ జనం..!

గ్రీన్ఇండియా చాలెంజ్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ లోని జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు శ్యామ్ సింగరాయ్ టీమ్. హీరో నాని తో పాటు హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి కలసి పార్క్ లో మొక్కలు నాటారు.

వీరితో పాటు శ్యామ్ సింగరాయ్ ప్రొడ్యూసర్ బోయిన పల్లి వెంకట్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని మొక్కలు నాటారు. దీనిలో భాగంగా నానీ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని నాని పిలుపునిచ్చారు. మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే.. చుట్టు పక్కల పరిసరాలు కూడా ఆహ్లాదకరంగా ఉండాలని.. పర్యావరణంపై కూడా ఓ కన్ను వేసి ఉంచాలన్నారు.
మొక్కలు నాటి.. వాటని సంరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అంటూ సూచించాడు. గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ దోహదపడుతుందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.

సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు ఇలా అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని నాని అన్నారు. మొక్కలు నాటిన తరువాత గ్రీన్ ఇండియా ఈ వెంట్ కు సంబంధించిన బుక్ ను అందుకున్నారు శ్యామ్ సింగరాయ్ టీమ్. వృక్షవేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి నిర్వాహకులు అందజేశారు.

వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ ను నాని, సాయి పల్లవి, కృతిశెట్టి అభినందించారు. ఆ చుట్టుపక్కల అంతా హడావిడిగా తయారయ్యింది. హీరో, హీరోయిన్లను చూడటానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు సినీ బృందం.

సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ సినిమా విడుదల అయ్యేది ఎప్పుడో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళంలో కూడా సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది.

ఆమెకు ఉన్న ఆ క్రేజ్ తోనే భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు సాయిపల్లవి నటించిన సినిమాల్లో దాదాపుగా అన్ని సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. సాయి పల్లవి డాన్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈమె సినిమాల్లో నటించే ముందు ఈమెకు కథ నచ్చితేనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇటీవలే చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరో సినిమాను కూడా వద్దని చెప్పింది.

ఇది ఇలా ఉంటే సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ అక్క చెల్లెలు ఇద్దరు చూడటానికి ఒకేలా కనిపిస్తుంటారు. అయితే గతంలోనే పూజ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా అధికారికంగా ప్రకటన రావడంతో ఇది కాస్త కన్ఫామ్ అయ్యింది. తమిళ ఇండస్ట్రీ లోకి పూజా కన్నున్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఫైట్ మాస్టర్ స్టంట్ సిల్వ దర్శకుడి దర్శకత్వంలో చిత్తరాయి సెవ్వనం అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో సముద్రకని, పూజా కన్నన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో వీరు తండ్రి కూతురుగా నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 3న జీ5 లో విడుదల కానుందని చిత్ర బృందం వెల్లడించారు.

ఇకపై అలాంటి పాత్రలలో నటించడానికి సై అంటున్న సాయి పల్లవి!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈసినిమా తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలలో నటించింది.

ఈ సినిమాలు అన్ని ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో సాయి పల్లవి ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీసాయి.అయితే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ లుగా నిలుస్తుండటంతో ఈమెకు భారీగా డిమాండ్ ఏర్పడింది.

ఇటీవలే నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా అదిరిపోయే సక్సెస్ ను అందుకోవడంతో, తన ఖాతాలోకి మరొక హిట్ ను చేర్చుకుంది. అయితే ఇప్పటివరకు కేవలం సెలక్టివ్ గా ఉండే తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన సాయి పల్లవి ప్రస్తుతం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు ఉ తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఫలానా జోనర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నటించేందుకు ఈ అమ్మడు రెడీ అవుతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే కామెడీ ఓరియెంటెడ్ పాత్రలు మెసేజ్ చేస్తాను అని చెప్పిన సాయి పల్లవి అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ తగిలితే కచ్చితంగా నటిస్తాను అంటోంది. మరి నిజంగానే సాయి పల్లవి కామెడీ రొమాంటిక్ సినిమాల్లో నటిస్తే ఆమె ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే ఊహాగానాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

సినిమాలకు సాయిపల్లవి గుడ్ బై…సేవ చేయాలంటూ..?

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొంత సమయం లోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో సాయిపల్లవి ఒకరు. ఎంతో విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న సాయిపల్లవి గ్లామరస్ పాత్రలలో నటించకుండా అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి అభిమానులకు ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. సాయి పల్లవి వ్యక్తిగత విషయానికి వస్తే…టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైంది. ప్రస్తుతం సాయి పల్లవి శిక్షణ పొందిన ఒక డాక్టర్ అని చెప్పవచ్చు.

ఇలా డాక్టరేట్ పొందిన సాయి పల్లవి తన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి డాక్టర్ వృత్తిని చేపట్టాలని భావించినట్లు ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ క్రమంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుందా అంటే.. తనకు ఏ విధమైనటువంటి ఛాలెంజింగ్ రోల్స్ వచ్చిన తప్పకుండా సినిమాలలో నటిస్తానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు.

ప్రస్తుతం సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్నటువంటి  ‘శ్యామ్ సింగ రాయ్‌’లో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఎంసీఏ విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఆడిషన్స్ కు ఆ నటి రూ.80 చీర కట్టుకొని వెళ్లిందట.. కారణం ఏంటంటే..

అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై హీరో, హీరోయిన్లే కాకుండా సిని పరిశ్రమలో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి వసూళ్లను సాధిస్తే.. మిగతా సినిమాలను కూడా విడుదల చేసేందుకు క్యూ కడతాయి.

అందుకే ప్రతీ ఒక్కరూ ఈ సినిమా విడుదలపై తర్వాత అది సాధించే కలెక్షన్లపై నమ్మకం పెట్టుకున్నారు. ప్రతీ ఒక్కరు ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడానికి కారణం కూడా అదే. అయితే శేఖర్ కమ్ముల దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అతడి దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా ప్రేక్షకుల ఒక విభిన్నమైన అనుభూతిని ఇస్తుంది.

దీనిలో కూడా ఏదో అద్భుతం చేసే ఉంటాడని ప్రతీ ఒక్కరు ఆశలు పెట్టుకున్నారు. సాయి పల్లవి ఫిదా సినిమాలో అతడి డైరెక్షన్లో చేసిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణ యాస సాయి పల్లవి దించేసింది. దీనిలో కూడా తెలంగాణ పరిసరాల నేపథ్యంలో సినిమా ఉండనుందని సినీ వర్గాల టాక్. ఇదిలా ఉండగా.. ఇందులో నాగచైతన్య తల్లిగా సీనియర్ నటి ఈశ్వరీ రావు నటించారు. ఇందులో పేద మహిళగా ఆ క్యారెక్టర్ ఉంటుంది.

అయితే ఆడిషన్స్ కు ఆమెనకు ఫోన్ చేసి రమ్మన్నడప్పుడు ఆమె రూ.80 చీర కట్టుకొని వచ్చిందని.. ఆమెను చూసి తాను ఆశ్చర్యపోయానని శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి నటిని తాను ఎన్నడూ చూడలేదని.. ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉండగా.. ఆమె అరవింద సమేత, అల వైకుంఠపురం, కాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

చిరంజీవి సినిమాను సాయిపల్లవి రిజెక్ట్ చేయడంతో సంతోషం అనిపించిందట.. ఎందుకో తెలుసా..

లవ్ స్టోరీ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దీనికి మెగస్టార్ చిరంజీవి బాలీవుడ్‌ నటుడు అమీర్ ఖాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24 న విడుదల విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా మెగస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది.. కోవిడ్ తర్వాత పిల్లలు పాఠశాలకు వెళ్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో.. అలాంటి అనుభూతి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి ఈవెంట్లలో మాట్లాడుతుంటే ప్రేక్షకుల నుంచి చప్పట్లు వింటున్నప్పుడు వచ్చే ఈ కిక్కే వేరప్ప.. అంటూ మట్లాడారు. 1980 నుంచి తనకు నిర్మాత నారాయణ్ దాస్ పరిచయం అని.. అతడంటే తనకు చాలా ఇష్టం అంటూ చెప్పాడు.

అతడిని గురువులా భావిస్తాను అన్నాడు. నాగ చైతన్య నిలకడగా వ్యవహరించేనటుడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వేడుకకి వచ్చిన అమీర్ ఖాన్‌కి థ్యాంక్స్‌ అంటూ చెప్పాడు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ఫిదా సినిమా చేసేంతవరకు తనకు సాయిపల్లవి అంటే ఎవరో తెలియదని.. ఫిదా చిత్రంలో పాటలకు వేసిన డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయా అంటూ చెప్పాడు. ఓ సినిమాలో నాకు చెల్లెలిగా నటించేందుకు సాయిపల్లవి అయితే బాగుంటుందని చిత్ర బృందం అనుకుంది.

నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదని.. తను ఒప్పుకోకూడదని మనసులో కోరుకున్నా అంటూ చెప్పాడు. ఎందుకంటే అన్నాచెల్లెళ్లుగా నటించాలని నాకు లేదు. మంచి డ్యాన్సర్‌తో కలసి నేనూ డ్యాన్స్‌ చేయాలనుకుంటాను. అనుకున్నట్లుగానే సాయి పల్లవి ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని.. నాకు చాలా సంతోషం వేసిందని చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి ఆకాక్షించారు.