Tag Archives: special pooja

Pooja Hedge: వేణు స్వామిని కలిసి ప్రత్యేక పూజలకు ఏర్పాటు చేసుకున్న పూజా హెగ్డే… కెరియర్ కోసమే పూజలా?

Pooja Hedge: పూజా హెగ్డే పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్ కావడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ కావడం లేదా కొన్ని సినిమాల నుంచి మధ్యలో తప్పుకోవడం వంటివి జరుగుతున్నాయి.

ఈ విధంగా పూజ హెగ్డే సినీ కెరియర్ కాస్త ఇబ్బందులలో ఉందనే చెప్పాలి. అయితే ఈ ఇబ్బందులను అధిగమించడం కోసం ఈమె ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామిని కలిసారని తెలుస్తోంది. వేణు స్వామి సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అదేవిధంగా మరికొంతమంది హీరోయిన్స్ ఈయన చేత జాతక పరిహార పూజలు కూడా చేయించుకున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి రష్మిక సైతం ఈయన చేత పూజలు చేయించుకొని వరుస అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే పూజా హెగ్డే కెరియర్ కూడా కాస్త ఇబ్బందులలో పడటంతో ఈమె కూడా వేణు స్వామిని సంప్రదించి తన జాతకం చూయించుకున్నారని తెలుస్తోంది.

Pooja Hedge: కెరియర్ కోసం ప్రత్యేక పూజలు…


ఈ క్రమంలోనే తన జాతకంలో దోషాలు ఉండడంతో వాటిని పరిహారం చేయడం కోసం ఈమె పూజకు కావలసిన ఏర్పాట్లు అన్నింటిని కూడా చేసుకున్నారని సమాచారం.అయితే త్వరలోనే ఈమె కూడా వేణు స్వామి చేత పూజలు చేయించుకొని తన సినీ కెరియర్లో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకుపోతుందని పలువురు పూజా హెగ్డే కెరియర్ గురించి కామెంట్లు చేస్తున్నారు

Allu Arjun: అల్లు అర్జున్ ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు… ఆ దోష ప్రభావమే కారణమా?

Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బన్నీ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ జాతకం ప్రకారం ఆయన జాతకంలో పెద్ద దోషము ఉందని తెలుస్తుంది. ఈ దోషం కారణంగా ఆయన సినీ కెరియర్ పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ప్రముఖ పండితులు అల్లు అర్జున్ జాతకం తెలియజేశారట. ఇలా అల్లు అర్జున్ జాతకంలో దోషం పోవాలి అంటే పరిహారం చేయాల్సిందేనని పండితులు చెప్పారట.

ఈ విధంగా బన్నీ జాతకం గురించి పండితులు చెప్పడంతో కంగారు వ్యక్తం చేసిన అల్లు అరవింద్ వెంటనే తన ఫామ్ హౌస్ లో ఈ దోష పరిహారానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆయన ఫామ్ హౌస్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Allu Arjun: కెరియర్ పై ప్రభావం చూపనుందా…


ఈ పూజా కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ అల్లు స్నేహారెడ్డి అయాన్ అర్హ నలుగురు పాల్గొన్నారని సమాచారం.ఈ విధంగా అల్లు అర్జున్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Dimple Hayathi: సక్సెస్ కోసం వేణు స్వామిని నమ్ముకున్న నటి డింపుల్… వేణు స్వామితో ప్రత్యేక పూజలు!

Dimple Hayathi: డింపుల్ హైయతి కిలాడి సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అదేవిధంగా ఈమధ్య పోలీస్ అధికారితో వివాదం కారణంగా పెద్ద ఎత్తున ఈమె వార్తలలో నిలిచారు.

ఇలా పలు వివాదాలను ఎదుర్కోవడమే కాకుండా కెరియర్ పరంగా ఏమాత్రం సక్సెస్ లేకపోవడంతో ఈమె ఒకసారి తన జాతకాన్ని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి చూపించారట. ఈ విధంగా వేణు స్వామి ఈమె జాతకం చూసిన అనంతరం జాతక దోషాలు ఉన్నాయని తెలియజేయడంతో తన చేత ప్రత్యేకంగా జాతక పరిహార పూజలు చేయించారని తెలుస్తోంది.

వేణు స్వామి గత కొంతకాలంగా సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పిన మాటలు కూడా నిజం కావడంతో ఎంతోమంది ఈయనని ఈయన మాటలని నమ్ముతున్నారు. ఇక వేణు స్వామి చేత ఇదివరకే రష్మిక నిధి అగర్వాల్ వంటి సెలబ్రిటీలు ప్రత్యేకంగా పూజలు చేయించారు.

Dimple Hayathi: ఇండస్ట్రీలో సక్సెస్ సాధించేనా…


ఈ క్రమంలోనే డింపుల్ హైయతి సైతం తన జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం అలాగే ఇండస్ట్రీలో సక్సెస్ అవడం కోసం వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈ పూజ తర్వాత అయినా ఈమెకు ఇండస్ట్రీలో కలిసి వస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Anchor Suma: భర్తతో కలసి యాంకర్ సుమ ప్రత్యేక పూజలు… వైరల్ అవుతున్న ఫోటోలు..?

Anchor Suma: టాలీవుడ్ లో టాప్ యాంకర్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సుమ. కేరళకు చెందిన సుమ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో యాంకర్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. చక్కగా తెలుగు మాట్లాడుతూ..తన మాటలతో, చిలిపి చేష్టలతో ఎంతోకాలంగా ప్రేక్షకులను నవ్విస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకొని ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది.

ఎంతోమంది యాంకర్లు ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా సుమ క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. ఇలా యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా నిరూపించుకుంది.
ఇటీవల జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయినా కూడా ఆ సినిమాలో సుమా నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఇలా నటిగా, యాంకర్ గా బిజీగా ఉండే సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యక్తివ్ గా ఉంటుంది.

సొంతం యూట్యూబ్ ఛానల్ ద్వారా తరచూ వీడియోలు షేర్ చేయటమే కాకుండా ఇన్ స్టా లో రీల్స్ చేస్తూ సందడి చేస్తోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో తరచూ తన ఫోటోలు, ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ ఫాల్లోవర్స్ ని పెంచుకుంటుంది. ఇక తాజాగా సుమ తన భర్తతో కలిసి ఒక ప్రత్యేకమైన పూజలో పాల్గొన్న ఫోటోలు ,వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Anchor Suma: లక్ష్మీ పూజలో రాజీవ్ దంపతులు…

గతంలో రాజీవ్ కనకాల సుమ విడాకుల గురించి వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలపై సుమా స్పందించి వారిద్దరి మధ్య గొడవలు ఉన్నది వాస్తవమేనని కాకపోతే ఇద్దరు విడిపోయేంత గొడవలు కాదని క్లారిటీ ఇచ్చింది.ఇక తాజాగా కుటుంబం సంక్షేమం కోసం సుమ, రాజీవ్ కనకాల ఇద్దరు కలిసి లక్ష్మి పూజ నిర్వహించారు. ఈ పూజకి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nidhi Aggarwal: నటి నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు…. అందుకోసమే పూజలు చేశారా?

Nidhi Aggarwal: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పిన విషయాలు నిజం కావడంతో ఈయన చేసే వ్యాఖ్యలను నమ్మే వారి సంఖ్య రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు ఇండస్ట్రీలో సక్సెస్ అవడం కోసం ఈయన చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటున్నారు.

ఇదివరకే నటి రష్మిక మందన్న వేణు స్వామితో తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేయించడంతో తనకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయని తెలియజేశారు. అయితే తాజాగా మరొక నటి నిధి అగర్వాల్ సైతం వేణు స్వామి చేత ఇంట్లో రాజా శ్యామల పూజ చేయించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

వేణు స్వామి బృందం సమక్షంలో నిధి అగర్వాల్ ప్రత్యేకంగా పూజలు చేశారు.అయితే ఈమె జాతకంలో ఏదైనా దోషాలు ఉన్న కారణంగా ఇలాంటి పూజలు చేశారా లేకపోతే ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకొని సక్సెస్ సాధించడం కోసం పూజలు చేశారా అనే విషయం తెలియదు కానీ ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Nidhi Aggarwal: ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన నిధి

ఇక నిధి అగర్వాల్ నాగార్జున నటించిన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ తదుపరి చిత్రం పూరి జగన్నాథ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటు తెలుగులోను తమిళంలో కూడా సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేకపోవడంతో ఇలా పూజలు చేయించారని పలువురు భావిస్తున్నారు.

Samantha: పళని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు… వైరల్ అవుతున్న ఫోటోలు!

Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత పూర్తిగా తన సినిమా షూటింగులకు కూడా దూరమయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఈమె తిరిగి తన సినిమా షూటింగులలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే సమంత ఆరోగ్యం కాస్త కోలుకోవడంతో ఈమె పలు ఆలయాలను దర్శిస్తూ తన ఆరోగ్యం గురించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సమంత తమిళనాడులోని పళనిశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈమె కొండకింది భాగం నుంచి పై వరకు మెట్ల మార్గం గుండా వెళ్తూ పూజలు చేశారు.

Samantha: ప్రతి మెట్టుపై దీపాలు వెలిగించిన సమంత…

ఇలా ప్రతి మెట్టు ఎక్కుతూ ప్రతి మెట్టుపై కర్పూర హారతులు వెలిగిస్తూ సమంత ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా సమంత ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె త్వరలోనే తాను కమిట్ అయినా సినిమా షూటింగులలో పాల్గొనబోతున్నారు. సమంత ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటించగా, తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు.

Balakrishna: తారకరత్న కోసం మరోసారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న బాలయ్య!

Balakrishna: నందమూరి తారకరత్న నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్ర ప్రారంభమైన కొంత సమయానికి తారకరత్న స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే తనని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

తారకరత్నకు పల్స్ రేట్ పూర్తిగా పడిపోవడంతో వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి సిపిఆర్ చేసిన అనంతరం పల్స్ రేట్ మొదలైందని అయితే ఆయన ఇంకా స్పృహలోకి రాలేదని తెలుస్తుంది.ఇకపోతే ఈయన స్పృహ తప్పి పడిపోయిన సమయంలో ఆయన మెదడుకు ఆక్సిజన్ అందక మెదుడు పనితీరు కూడా పనిచేయలేదని దీంతో ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఈయనకు చికిత్స జరుగుతోందని తెలుస్తోంది.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని వార్తలు రావడంతో బాలయ్య బెంగళూరులోనే ఉంటూ తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రాన్ని చదివిన విషయం మనకు తెలిసిందే. ఇలా మృత్యుంజయ మంత్రం చదివిన తర్వాత తారకరత్న శరీరం వైద్యానికి సహకరించిందని తెలిపారు. ఇక ఈయన కోలుకోవాలని చిత్తూరులోని మృత్యుంజయ ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు కూడా చేశారు.

Balakrishna: తారకరత్న కోసం పూజలు నిర్వహిస్తున్న బాలయ్య…

తారకరత్న మెదడుపై పూర్తిగా ప్రభావం చూపిందని తెలియడంతో విదేశీ నిపుణుల సమక్షంలో ఈయనకు చికిత్స జరగనున్న నేపథ్యంలో మరోసారి బాలయ్య తారకరత్న కోసం మృత్యుంజయ మంత్రాన్ని జపించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా చేయబోతున్నారని తెలుస్తోంది.ఇలా తారకరత్న ఆరోగ్యం కోసం బాలయ్య ఎంతో శ్రమిస్తున్నారని ఆయన క్షేమంగా తిరిగి బయటకు రావాలని అభిమానులు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.