Tag Archives: special song

Urvashi Rautela: వామ్మో బ్రో సినిమా స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…మరీ ఈ రేంజ్ లోనా?

Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం బ్రో. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వినోదయం చిత్తం సినిమాకు రీమేక్ చిత్రంగా తెలుగులో తెరకెక్కుతోంది దాదాపు షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. తమిళంలో నటుడు సముద్రఖని నటించిన ఈ సినిమా తెలుగులో ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించబోతున్నారు.

ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఇక తమిళంలో స్పెషల్ సాంగ్ లేకపోయినప్పటికీ తెలుగులో స్పెషల్ సాంగ్ ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ పాటలో నటించడానికి నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక చేశారు.ఈ పాటలో రకుల్ నటించాల్సి ఉండగా చివరి క్షణంలో రకుల్ హాండ్ ఇవ్వడంతో ఊర్వశీ రౌతెల ఎంట్రీ ఇచ్చారు.

హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక సెట్ ఏర్పాటు చేసి అక్కడ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ పాట కోసం ప్రస్తుతం ఊర్వశి హైదరాబాద్లోనే ఉన్నారు. ఇకపోతే ఈ పాట కోసం ఈమె తీసుకునే రెమ్యూనరేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఐదు నిమిషాల పాటు కోసం ఊర్వసి భారీగానే డిమాండ్ చేశారని తెలుస్తోంది.

Urvashi Rautela: రెండు కోట్లు డిమాండ్ చేసిన నటి..

ఈ పాటలో డాన్స్ చేయడం కోసం ఊర్వశి రౌతేల ఏకంగా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. ఇలా రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తేనే తాను ఈ పాటలో చేస్తానని డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా చేసేదేమీ లేక ఈమె అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఐదు నిమిషాల పాటు కోసం రెండు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

Shriya: చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్న శ్రేయ… భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన నటి!

Shriya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారక ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రేయ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు.అలాగే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతరం ఈమె వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా తన కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ శ్రేయ ఎంత బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె చిరంజీవి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న భోళా శంకర్ సినిమాలో శ్రేయ నటించబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తున్నారు. అలాగే చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఈ పాటలో సీనియర్ నటి శ్రేయ నటించబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ పాటలో ఈమె నటించడం కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.ఇలా భారీ స్థాయిలో శ్రేయ డిమాండ్ చేయడంతో మేకర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారట.

Shriya:కోటి డిమాండ్ చేసిన శ్రేయ…

సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రేయ ఇలా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.అయితే ఈమెకు భారీ స్థాయిలో ఆదరణ ఉండటం వల్లే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న మేకర్స్ ఈమె అడిగినది ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.ఇక చిరంజీవి శ్రేయ ఇదివరకే ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో జంటగా నటించిన విషయం మనకు తెలిసిందే.

Samantha: పుష్ప 2 కోసం మళ్లీ సమంతని కలిసిన నిర్మాతలు… స్పెషల్ సాంగ్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

Samantha: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రికార్డులు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వేషధారణ నటన సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రష్మిక నటన కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఉ అంటావా ఉ ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ సినిమాకి హైలైట్ గా చెప్పవచ్చు.

ఈ స్పెషల్ సాంగ్ లో సమంత నటించింది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ పాట విడుదల చేయటంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ క్రమంలో పుష్ప2 లో కూడా సమంతతో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా దీనికోసం పుష్ప 2 మేకర్స్ సమంతను సంప్రదించారని, కానీ ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప2 సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం మేకర్స్ ఆమెను సంప్రదించలేదని సమంతా సన్నిహితుల నుండి సమాచారం. ఇటీవల అనారోగ్యం నుండి కోలుకున్న సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇక విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో తొందర్లోనే పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరిలో విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఏప్రిల్ 14వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైజాగ్ లో ఈ సినిమాకు సంబందించిన ఒక షెడ్యూల్డ్ షూటింగ్ పూర్తి చేశారు.

Samantha: శరవేగంగా పుష్ప సీక్వెల్ షూటింగ్…

పుష్ప సినిమా ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి థియోటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా నార్త్ ఇండస్త్రీ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. దీంతో పుష్ప 2 సినిమా పై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా సుకుమార్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

Samantha: బాలీవుడ్ హీరోతో మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇక రచ్చ రచ్చే?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.విడాకులు తీసుకున్న తర్వాత ఈమె ఏకంగా ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలా వరుస సినిమాలు, స్పెషల్ పాటలతో సమంత ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే సమంత ఇదివరకే పుష్ప సినిమాల్లోని ఉఅంటావా మామ అనే పాట ద్వారా ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Samantha: బాలీవుడ్ హీరోతో మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇక రచ్చ రచ్చే?

ఈ పాటతో ఈమె పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇలా ఐటమ్ సాంగ్ ద్వారా తన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో అందరిని సందడి చేసిన సమంత తాజాగా మరొక స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పెద్దఎత్తున వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈసారి ఏకంగా ఈమె బాలీవుడ్ హీరో తో సందడి చేయనున్నట్లు సమాచారం.

Samantha: బాలీవుడ్ హీరోతో మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇక రచ్చ రచ్చే?

అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండాలని డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.ఈ పాట హిందీలో మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని డైరెక్టర్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

పూజ స్థానంలో సమంత…

ఇకపోతే ఈ పాటలో ముందుగా నటించడానికి పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకోవడంతో యానిమల్ చిత్రంలో కూడా సమంత అయితే బాగుంటుందనే ఉద్దేశంతో డైరెక్టర్ సమంత సంప్రదించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలబడాలి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె యశోదా ఖుషి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.

Acharya-Chiranjeevi: వివాదంలో ఆచార్య స్పెషల్ సాంగ్..పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు..!

Acharya-Chiranjeevi: మెగస్టార్ చిరంజీవి.. తన రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మళ్లీ ఫుల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎంతలా అంటే.. ఏమాత్రం గ్యాప్ లేకుండా..రెస్ట్ లేకుండా.. వరుస సినిమాలకు సైన్ లు చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సినిమా ఆచార్య.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా.. అనూహ్యంగా ఓ ఘటన చోటు చేసుకుంది. వాళ్లు ప్రస్తుతం న్యాయపరమైన ఇబ్బందులతో చిక్కుకున్నారు. గీత రచయిత భాస్కరభట్ల, దర్శకుడు కొరటాల శివపై జనగామకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఫిర్యాదు చేశారు.

ఎందుకంటే.. ఇటీవల ఆచార్య సినిమాలోని ఓ ఐటెం సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో చిరంజీవి సరనన ఆడిపాడిన మద్దుగుమ్మ రెజీనా. ఈ సాంగ్ పెద్ద వివాదాన్ని తెచ్చిపెట్టింది.
ఆ పాటలో ఆర్ఎంపీ వైద్య సంఘాన్ని కించపరిచేవిధంగా పదాలు ఉన్నాయని.. వాటిని చెడుగా చూపించే ప్రయత్నం చేశారని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కావాలనే మనోభావాలను దెబ్బతీస్తున్నారు..

ఇందులో… “యాదేదో నీమరొచ్చనీ కుర్రాళ్లే RMP లు అవుతున్నారే” అనే సాహిత్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ లైన్ వివాదానికి దారి తీసింది. ఈ లైన్‌లను తప్పుగా పేర్కొని.. వాటిని కావాలనే ఇలా చూపించారని ఆరోపిస్తున్నారు. ఆర్ఎంపీల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ లిరిక్స్ ఉన్నాయని.. రాష్ట్ర ఆర్‌ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు. ఆచార్య చిత్ర నిర్మాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరి దీనిపై ఆచార్య మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏమైనా వివిరణ ఇస్తారా.. లేదా.. పాటలో ఏమైనా మార్పులు చేస్తారో చూడాలి. ఆచార్యకి మణి శర్మ సంగీతం అందించగా.. సానా కష్టం పాటను రేవంత్ , గీతా మాధురి ఆలపించారు. చిరంజీవి, రామ్ చరణ్‌లను తొలిసారిగా పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నారు.

పుష్ప సినిమాలో మెరవనున్న సమంత.. ఒక్క సాంగ్ కు ఎంత డిమాండ్ చేశారో తెలుసా..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయనున్నారు. అన్నింటిని ఒకేరోజు రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్ను ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశారు. అవి యూట్యూబ్ ఓ సెన్సేషనల్ హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండబోతోందట. దానిలో సమంత ఈ సాంగ్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దాని కోసం అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ సెట్ కూడా వేశారని, వచ్చే వారం ఈ పాటని షూట్ చేస్తారని సమాచారం.

ఈ పాట కోసం సమంత ఏకంగా రూ.కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం. సమంత ఈ సినిమాలో కనపడితే .. సినిమాకు కాస్త మైలేజ్ వస్తుందనే నమ్మకంతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక సుకుమార్ దర్శకత్వంలో సమంత రంగస్థలం సినిమాలో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ సరసన సమంత సన్ ఆఫ్ సత్యమూర్తిలో జోడీగా నటించింది. ఈ అప్ డేట్ వినగానే అభిమానులు ఆ పాట కోసం వెయిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఐ యామ్ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సమంత శాకుంతలం సినిమాలో నటిస్తుండగా.. ఆమెకు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.