Samantha: బాలీవుడ్ హీరోతో మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇక రచ్చ రచ్చే?
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.విడాకులు తీసుకున్న తర్వాత ఈమె ఏకంగా ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలా వరుస సినిమాలు, స్పెషల్ పాటలతో సమంత ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే సమంత ఇదివరకే పుష్ప సినిమాల్లోని ఉఅంటావా మామ అనే పాట ద్వారా ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ పాటతో ఈమె పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇలా ఐటమ్ సాంగ్ ద్వారా తన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో అందరిని సందడి చేసిన సమంత తాజాగా మరొక స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పెద్దఎత్తున వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈసారి ఏకంగా ఈమె బాలీవుడ్ హీరో తో సందడి చేయనున్నట్లు సమాచారం.
అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండాలని డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.ఈ పాట హిందీలో మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని డైరెక్టర్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ఇకపోతే ఈ పాటలో ముందుగా నటించడానికి పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకోవడంతో యానిమల్ చిత్రంలో కూడా సమంత అయితే బాగుంటుందనే ఉద్దేశంతో డైరెక్టర్ సమంత సంప్రదించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలబడాలి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె యశోదా ఖుషి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…