Samantha: బాలీవుడ్ హీరోతో మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇక రచ్చ రచ్చే?
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.విడాకులు తీసుకున్న తర్వాత ఈమె ఏకంగా ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలా వరుస సినిమాలు, స్పెషల్ పాటలతో సమంత ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే సమంత ఇదివరకే పుష్ప సినిమాల్లోని ఉఅంటావా మామ అనే పాట ద్వారా ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ పాటతో ఈమె పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇలా ఐటమ్ సాంగ్ ద్వారా తన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో అందరిని సందడి చేసిన సమంత తాజాగా మరొక స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పెద్దఎత్తున వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈసారి ఏకంగా ఈమె బాలీవుడ్ హీరో తో సందడి చేయనున్నట్లు సమాచారం.
అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండాలని డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.ఈ పాట హిందీలో మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని డైరెక్టర్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ఇకపోతే ఈ పాటలో ముందుగా నటించడానికి పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకోవడంతో యానిమల్ చిత్రంలో కూడా సమంత అయితే బాగుంటుందనే ఉద్దేశంతో డైరెక్టర్ సమంత సంప్రదించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలబడాలి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె యశోదా ఖుషి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…