Actress Meena: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ తాజాగా హఠాన్మరణం చెందారు. కరోనా బారినపడ్డ విద్యాసాగర్ గత కొంతకాలంగా పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొంత సమయం క్రితమే కన్నుమూశారు.
ఈ వార్త ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం నింపింది. తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఒక వెలుగు వెలిగిన మీన 2009 లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని వివాహం చేసుకుంది. అప్పటినుండి వీరిద్దరూ ఏంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు . వీరికి నైనిక ఒక పాప కూడా ఉంది.
ఇదిలా ఉండగా మీనా భర్త విద్యాసాగర్ గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. అంతే కాకుండా ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంది. ఆ సమయంలో సరైన చికిత్స తీసుకొని అందరూ కరోనా నుండి బయటపడ్డారు. కానీ విద్యాసాగర్ మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న విద్యాసాగర్ కి కరోనా వచ్చిన తర్వాత ఊపిరితిత్తుల పనితీరు మరింత క్షీణించింది. ఈ క్రమంలో ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అధికం అయ్యింది.
అందువల్ల మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యాసాగర్ను చేర్పించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అధికమవడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పారు. అయితే ఆ ఊపిరితిత్తులు కేవలం బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి మాత్రమే సేకరించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో సరైన సమయంలో ఊపిరితిత్తులు ఇచ్చే దాతలు లభించకపోవడంతో మందులతోనే అతడి ఆరోగ్య సమస్యలను నయం చేయటానికి డాక్టర్లు ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తూ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. కాగా మీనా భర్త హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు మీనా కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…