Tag Archives: sri devi drama company

Sudigali Sudheer: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పేసిన సుధీర్!

Sudigali Sudheer:సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెరపై కమెడియన్గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వెండితెరపై హీరోగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు.

ఇలా నటుడిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.సుధీర్ ఏ కార్యక్రమానికి వెళ్లిన యాంకర్ రష్మీ గురించి అదే విధంగా ఆయన పెళ్లి గురించి తప్పనిసరిగా ప్రశ్నలు తనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు మరోసారి తన పెళ్లి గురించి ప్రశ్నలు వచ్చాయి.

ఈ సందర్భంగా యాంకర్ సుదీర్ ని ప్రశ్నిస్తూ మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని మీరు కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సుధీర్ సమాధానం చెబుతూ పెళ్లి చేసుకోవాలని ఆలోచన మనలో ఉంటే మనం చేసుకోబోయే అమ్మాయిలు ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని ఉంటాయి అయితే నాకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే లేదు అంటూ సమాధానం చెప్పారు.

Sudigali Sudheer: పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు…


ఇలా సుధీర్ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు అంటూ షాకింగ్ సమాధానం చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి ఇక ఎవరైనా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నవారు అయితే తనకు కాబోయే భార్య కూల్ అలాగే హ్యాపీగా ఉంటే చాలని కోరుకుంటారు అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Hyper Aadi: సుడిగాలి సుదీర్ వల్ల మల్లెమాలకు పేరు రాలేదు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో మాత్రం తన స్టైల్ లో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ కార్యక్రమాల ద్వారా సుడిగాలి సుదీర్ కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈయనకు కూడా సినిమా అవకాశాలు రావడంతో సుడిగాలి సుదీర్ సైతం ఈ కార్యక్రమాల నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో సుధీర్ చేయకపోయినా సుదీర్ పై పంచులు వేస్తూ తరచూ సుడిగాలి సుదీర్ లో గుర్తు చేసుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సుధీర్ పట్ల పంచు డైలాగులు వేయడమే కాకుండా సుదీర్ స్థానాన్ని ఆక్రమించుకున్నారని చెప్పాలి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హైపర్ ఆదికి ఒక ప్రశ్న ఎదురయింది.సుధీర్ తిరిగి మల్లె మాల వారి కార్యక్రమాలలోకి వస్తే ఆయన ప్లేస్ తిరిగి ఆయనకు ఇస్తారా అంటూ యాంకర్ ప్రశ్నించారు.

Hyper Aadi: మేం లేకపోతే సుదీర్ ఫేమస్ కారు…


ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ కేవలం సుధీర్ అనే వ్యక్తి వల్ల మల్లెమాలవారికి పేరు రాలేదు. మేమందరం సుధీర్ వెంట ఉంటూ ఆయనపై పంచ్ డైలాగులు వేయటం వల్ల సుదీర్ ఫేమస్ అయ్యారు. మేము లేకపోతే సుదీర్ అంత ఫేమస్ అయ్యే వారు కాదని హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో సుడిగాలి సుదీర్ అభిమానులు మాత్రం హైపర్ ఆది పై కాస్త గుర్రుగా ఉన్నారు.

Rashmi: తెలియక తప్పు చేస్తే క్షమించండి… వైరల్ అవుతున్న రష్మీ పోస్ట్!

Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రష్మీ కేవలం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే కాకుండా,ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి మొదట్లో బుల్లితెర సీరియల్ నటుడు అంబంటి అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఇలా ఈయన వ్యాఖ్యాతగా ఉన్న సమయంలో ఈ కార్యక్రమానికి పెద్దగా ఆదరణ రాలేదని చెప్పాలి. అయితే ఈ కార్యక్రమానికి రేటింగ్ రాకపోవడంతో అంబంటి అర్జున్ స్థానంలో యాంకర్ గా సుడిగాలి సుదీర్ ను నియమించారు. ఇలా సుదీర్ వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు అని చెప్పాలి.

ఇక కొంతకాలం పాటు సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంతరం ఈ కార్యక్రమం నుంచి సుధీర్ బయటకు వెళ్లిపోవడంతో ఈ స్థానంలోకి రష్మీ యాంకర్ గా వచ్చారు. అయితే ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఏడాది పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు రష్మికి విభిన్న రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Rashmi: మీ సపోర్ట్ ఉండాలి..


ఈ విధంగా అభిమానులు రష్మికి శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈమె కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే రష్మీ సందిస్తూ ప్రతి ఆదివారం ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఎంతో మంచిగా ఆదరిస్తున్నందుకు ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకున్నారు. అలాగే తమ నుంచి ఏదైనా తప్పు జరిగిన తమని క్షమించాలి అంటూ ఈ సందర్భంగా రష్మి చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Anchor Rashmi: లవ్ సక్సెస్ అయిన ఆనందంలో యాంకర్ రష్మీ.. మరి సుదీర్ పరిస్థితి ఏంటి..?

Anchor Rashmi: గ్లామరస్ యాంకర్ రష్మి గౌతమ్ జబర్దస్త్ షో కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా రాణిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మి సుడిగాలి సుదీర్ తో ప్రేమలో ఉన్నట్లు ఎంతో కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెర పై వీరి కెమిస్ట్రీ వల్ల వీరిద్దరూ కూడా ప్రేమికులుగా బాగా పాపులర్ అయ్యారు.

అంతే కాకుండా బుల్లితెర మీద నాలుగైదు సార్లు వివాహం చేసుకున్న వీరిద్దరూ నిజజీవితంలో కూడా వివాహం చేసుకోబోతున్నట్లు ఇంతకాలం వార్తలు వినిపించాయి. ఇలా వీరిద్దరూ కేవలం షో కోసం మాత్రమే అలా ప్రేమికులుగా నటిస్తున్నట్లు ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు..ఇక తాజాగా రష్మీ కూడా తన లవ్ స్టోరీ గురించి అందరి ముందు బయట పెట్టింది.

తాజాగా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో తన లవ్ సక్సెస్ అయినందుకు రష్మీ ఆనందం వ్యక్తం చేసింది. రష్మీ గత కొంతకాలంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు తెలిపింది. అయితే తన ప్రేమ సక్సెస్ అవుతుందో లేదో తెలుసుకోవటానికి ఆర్య సినిమాలో లాగా మూడు కప్పులు పెట్టి అందులో రాళ్లు వేసింది. అయితే అదృష్టం కొద్దీ రష్మి విసిరిన రాయి ఆ కప్పులో పడింది.

ఇలా పడటంతో రష్మి తన ప్రేమ సక్సెస్స్ అయ్యిందంటు తెగ సంబరపడిపోయింది. అంతే కాకుండా ఆ ఆనందంలో నా పొలంలో మొలకలోచ్చాయి అంటూ తీన్ మార్ డాన్స్ ఇరగదీసింది. ఇదిలా ఉండగా తన ప్రేమ సక్సెస్ అవుతుందని రష్మీ ఆనందంలో ఉన్న సంగతి అటువైపు ఉంచితే… ఇంతకాలం రష్మీ ని ప్రేమించిన సుధీర్ పరిస్థితి ఏంటి అంటూ అందరూ ఆలోచనలో పడ్డారు.

Anchor Rashmi: సుధీర్ ఏమైపోవాలి…


చాలాకాలంగా సుధీర్ రష్మీ ఆన్ స్క్రీన్ మీద జంటగా కనిపించడం లేదు. బయట కూడా వీరిద్దరూ ఎక్కువగా కలిసి కనిపించిన సందర్భాలు లేవు. దీంతో రష్మి, సుధీర్ ప్రేమకు పులిస్టాప్ పడినట్లే అని అందరూ భావిస్తున్న తరుణంలో.. రష్మి ఇలా తన వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిని ప్రేమించినట్లు ఆ ప్రేమ సక్సెస్ అవుతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తుంది. అయితే తాను ప్రేమించిన వ్యక్తి గురించి అతనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి రష్మీ మాత్రం వెల్లడించలేదు.

Sridevi Drama Company: వేదికపై కొట్టుకున్న సీరియల్ ఆర్టిస్టులు… అవమానంతో వెళ్లిపోయిన నటి కరుణ!

Sridevi Drama Company: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఎంతో మంచి క్రేజ్ ఉంది ప్రతి ఆదివారం ఏదో ఒక కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ తో పాటు బుల్లితెర నటీనటులు కూడా పాల్గొంటూ సందడి చేస్తుంటారు. ఇక వచ్చే ఆదివారం ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు అనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా యాంకర్ రష్మీ టీవీ నటిమలు అయినటువంటి భావన కరుణ మధ్య ఒక చిన్న పోటీ పెట్టారు. మ్యూజిక్ ఆగేలోపు ఎవరైతే ఆ బంతి తెచ్చి నా చేతిలో పెడతారో వాళ్ళే విన్ అయినట్టు అని చెబుతారు ఈ ఆటలో భాగంగా భావన గెలిచారు. ఇలా ఈ ఆటలో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వారికి చెంప దెబ్బ అయిన కొట్టాలి లేదా వారిని హగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే భావన మీరు గెలిచారు కనుక చెల్లిని హగ్ చేసుకుంటారా లేదా కొడతారా అని చెప్పడంతో భావన తనని కొట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చి వేదికపై కరుణను లాగిపెట్టి చెంపపై కొట్టారు.ఇలా ఎక్కడో జరిగిన విషయాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ తనని కొట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఆర్గ్యుచేసిన కరుణ అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Sridevi Drama Company:టిఆర్పి రేటింగ్ కోసమేనా…

ఇలా వేదికపై ఈ ఇద్దరు కొట్టుకోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ కావడంతో కేవలం ఎపిసోడ్ పై హైలెట్ అవ్వడం కోసం ఎపిసోడ్ రేటింగ్ పెరగడం కోసమే మల్లెమాలవారు ఇలా ప్రోమో కట్ చేసి ఉంటారంటూ మరోసారి మల్లెమాల వారి వ్యవహార శైలిపై కామెంట్లు చేస్తున్నారు.మరి భావన ఎపిసోడ్ రేటింగ్ కోసమే అలా కొట్టారా లేదంటే నిజంగానే కొట్టారా అనేది తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.

Tv Actress Srivani: ఘనంగా సీరియల్ నటి శ్రీవాణి గృహప్రవేశం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Tv Actress Srivani: ఇండస్ట్రీలో సినిమా నటీనటులతో పాటు సీరియల్ నటీనటులకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ లో నటిస్తూ ప్రతిరోజు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్ నటీనటులకు హీరో హీరోయిన్లు స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఇలా ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ లో నటిస్తూ నటిగా గుర్తింపు పొందిన బుల్లితెర నటి శ్రీ వాణి కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నటిగా మంచి గుర్తింపు పొందింది.

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో నటిస్తూ.. అలాగే బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోలో సందడి చేస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా ఇటీవల సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన విశేషాలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో హోం టూర్ వీడియోస్, షాపింగ్ వీడియోస్ అంటూ ప్రతిరోజు తన సందడి చేశారు రోజువారి జీవితంలో జరిగే విశేషాల గురించి వీడియో రూపంలో యూట్యూబ్ లో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.

ఇక జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలలో కూడా తన భర్త తో కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఏదో ఒక వీడియోని షేర్ చేస్తున్న శ్రీవాణి ఇటీవల తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన షాపింగ్ విశేషాలను కూడా వీడియో రూపంలో పంచుకుంది. ఇక ఇటీవల శ్రీవాణీ నూతన గృహప్రవేశానికి సంబంధించిన వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tv Actress Srivani: సొంత ఇంటి కల నెరవేర్చుకున్న శ్రీవాణి….

గృహప్రవేశ కార్యక్రమానికి పలువురు సీరియల్ నటీనటులతో పాటు కమెడియన్లు కూడా హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. చాలాకాలంగా సొంతింటి కళ నెరవేర్చుకోవటం కోసం శ్రీవాణి దంపతులు చాలా కష్టపడ్డారు. ఇంతకాలానికి వారి కల నెరవేరటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీవాణికి పలువురు సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Aadi -Akhil: ఢీ 14 కోసం హైపర్ ఆది, అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

Aadi -Akhil: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఢీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమం 14 వ సీజన్ కొనసాగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది, అఖిల్, నవ్యస్వామి, రవి కృష్ణ వంటి వారు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఈయన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

ఇక ఢీకార్యక్రమంలో మెంటర్ గా ఉన్నటువంటి హైపర్ ఆది తన కామెడీ పంచ్ డైలాగులతో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఒక కాల్ షీట్ కి ఏకంగా ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.ఈయన జడ్జెస్ తో పాటుగా ఈ కార్యక్రమంలో రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం.

Aadi -Akhil: భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అఖిల్…

ఇకపోతే ఈ కార్యక్రమంలో బుల్లితెర నటుడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ సైతం మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అఖిల్ ఈ కార్యక్రమంలో కొనసాగుతూ కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. సాధారణంగా ఒకసారి మల్లెమాల వారి కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిని తిరిగి తీసుకోరు. కానీ అఖిల్ మాత్రం ఈ కార్యక్రమం నుంచి వెళ్లి బిగ్ బాస్ లో పాల్గొని, తిరిగి ఢీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు అఖిల్ ఒక వారానికి సుమారు రెండున్నర లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఒక్కో కాల్ షీట్ కి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

Hyper Aadi: పాయల్ రాజ్ పుత్ తో పులిహోర వేషాలు వేసిన ఆది బ్రో అంటూ ఆది పరువు తీసిన నటి!

Hyper Aadi: బుల్లితెరపై హైపర్ ఆదికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అన్ని తానే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో ఆది సాయికుమార్ హీరోయిన్ పాయల్ హాజరయ్యారు.

 

ఈ విధంగా హీరోయిన్ వేదిక పైకి రాగానే హైపర్ ఆది తనతో పులిహోర వేషాలు వేయడానికి తెగ ప్రయత్నాలు చేశారు.ఈ క్రమంలోనే వేదికపై చిత్ర బృందంతో మాట్లాడుతూ ఉండగా పొట్టి నరేష్ తన వద్దకు వెళ్లి మాట్లాడటంతో పాయల్ తన బుగ్గను నరేష్ బుగ్గకు అనిచ్చి ముద్దు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఈ క్రమంలోనే హైపర్ ఆది తనకు కూడా అలాంటిదే ఒకటి ఇచ్చేయమని అడుగుతారు.

ఈ క్రమంలోనే పాయల్ పొట్టి నరేష్ కు ఎలా అయితే బుగ్గను ఆనించిందో హైపర్ ఆదికి సైతం అలాగే తన బుగ్గను తాకిస్తూ బ్రో అనేసింది. దీంతో ఒక్కసారిగా స్టేజ్ మొత్తం నవ్వులు పూయగా హైపర్ ఆది మొహం మాత్రం తెల్ల బోయింది. మొత్తానికి అందరూ ముందే బ్రో అంటూ పాయల్ హైపర్ ఆది పరువు తీసేసింది.

Hyper Aadi: ఎమోషనల్ అయినా హైపర్ ఆది…

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇకపోతే ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బుల్లితెర సెలబ్రిటీలు ఆటపాటలతో ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది ఓ విషయంలో పూర్తిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Hyper Aadi: అందరి ముందు పూర్ణను హనీమూన్ గురించి అడిగి పరువు తీసిన ఆది.. సిగ్గుతో తలదించుకున్న పూర్ణ !

Hyper Aadi:వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో ఆది సాయికుమార్, నటి పాయల్ రాజ్ పుత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది పెద్ద ఎత్తున సందడి చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పటిలాగే ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ అందరిని సందడి చేశారు ఈ క్రమంలోనే ఆది హీరో ఆది సాయికుమార్ తో మాట్లాడుతూ ఉండగా.. మధ్యలో పూర్ణ జోక్యం చేసుకొని హైపర్ ఆది ఫ్లర్ట్ చేస్తున్నారు. హీరో ఆది చాలా క్వైట్ గా ఉన్నారు అంటూ ఈమె కామెంట్ చేశారు. దీంతో హైపర్ ఆది వెంటనే పూర్ణ గారు మీ హనీమూన్ బాగా జరిగిందా? అని ప్రశ్నించారు.

అందరి ముందు హైపర్ ఆది పూర్ణను హనీమూన్ గురించి అడగడంతో ఒక్కసారిగా ఆమె సిగ్గుతో తలదించుకుంది. ఇక షో టైం లో హైపర్ ఆదికి ఎవరు ఎక్కడ దొరికిన తను పంచులతో ఆట ఆడుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్ణను
ఇలా హనీమూన్ గురించి ప్రశ్నించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Hyper Aadi: వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ…

ఇకపోతే పెళ్లి కాకుండానే హనీమూన్ ఎలా జరిగిందని అడగడం ఏంటి విడ్డూరంగా అంటూ పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. అయితే పూర్ణ ప్రముఖ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.ఇలా తన పెళ్లి జరుగుతుందన్న నేపథ్యంలోనే హైపర్ ఆది తన హనీమూన్ గురించి ప్రశ్నించారు. దీంతో నేటిజన్లు యధావిధిగా హైపర్ ఆది వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Hyper Aadi: వాళ్లు చేసిన పనికి కంటతడి పెట్టుకున్న హైపర్ ఆది.. ఆదిపై ఇంత పగ ఉందా.. వైరల్ అవుతున్న వీడియో?

Hyper Aadi: హైపర్ ఆది ఏ కార్యక్రమంలోనైనా అడుగుపెట్టారంటే అక్కడ తన పంచ్ డైలాగులతో అందరిని కడుపుబ్బ నవిస్తారు.ఇలా హైపర్ ఆది కామెడీ టైమింగ్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఈయన చేసే కామెడీ శృతి మించి పలు వివాదాలకు కారణమయ్యే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ఈయన తీవ్ర విమర్శల పాలయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కంటెంట్ లో తమ ఆటపాటలతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం చివరిలో యాంకర్ రష్మీ ఒక టాస్క్ నిర్వహించారు.ఇందులో భాగంగా కొందరి కమెడియన్ ఫోటోలను టేబుల్ పై పెట్టి ఎవరి వల్ల బాధపడి ఉంటారో తమకు నచ్చిన వారి ఫోటో తీసి చింపేయడం లేదా కాల్చి వేయడం చేయాలి అని టాస్క్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే మొదట ఆటో రాంప్రసాద్ వేదిక పైకి వచ్చి తాను హైపర్ ఆది వల్ల ఒక విషయంలో చాలా బాధపడ్డానని తనకు సారీ చెబుతూ తన ఫోటో కాల్చివేశాడు.ఇక పరదేశి నాకు అన్ని హైపర్ ఆది అన్న అయినప్పటికీ ఆయన వల్ల నేను చాలా బాధపడ్డాను అంటూ తన ఫోటో చింపి వేశాడు. ఇలా ఒక్కొక్కరు వచ్చి హైపర్ ఆది ఫోటో చింపి వేయడంతో హైపర్ ఆది ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Hyper Aadi: హైపర్ ఆది ఎవరిని టార్గెట్ చేశారు…

ఇక చివరికి రష్మీ కూడా హైపర్ ఆది ఫోటో తీసుకొని చింపి వేసింది. తాను హైపర్ ఆది ఫోటో చింపి వేయడానికి కారణం కూడా తెలిపింది.తాను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ లో హైపర్ ఆది మాట్లాడుతూ రష్మీ ఎప్పుడు వచ్చావు అని అడగకుండా ఎప్పుడు వెళ్ళిపోతావు అని ప్రశ్నించాడని దానివల్ల తను చాలా బాధపడ్డానని ఈమె రీజన్ తెలిపారు.ఇకపోతే చివరికి హైపర్ ఆది వంతు వచ్చింది. ఈయన కూడా ఒకరి ఫోటో చేతిలో పట్టుకున్నారు. అయితే ఆయన ఎవరిని టార్గెట్ చేశారు అన్నది మాత్రం సస్పెన్స్ పెట్టారు.మరి హైపర్ ఆది ఎవరిని టార్గెట్ చేశారనే విషయం తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.