Tag Archives: sri ram

ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన సమీకరణాలు.. డేంజర్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్..?

బిగ్ బాస్ 5 తెలుగు 14వ వారం వినోదాత్మకంగా సాగుతోంది. హౌస్‌లో ప్రస్తుతం మానస్ , వీజే సన్నీ, ఆర్‌జే కాజల్, శ్రీరామ చంద్ర, షణ్ముఖ్ జస్వంత్ మరియు సిరి హన్మంత్‌ లు ఉన్నారు. ఇక 14 వ వారం ముంగింపు దశకు చేరుకుంటుండటంతో టాప్ 5 లో ఎవరు ఉంటారనే దానిపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

షోలో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా శ్రీరామ చంద్ర నిలవగా.. ఇక మిగిలిన ఆ నలుగురు ఎవరనే దానిపై కాస్త ఉత్కంఠనే చెప్పాలి. ఎలిమినేషన్ లో ఉన్న 5 గురులో షణ్ముఖ్, సన్నీకి ఎక్కువగా ఓట్లు పోలవుతున్నాయి. వీళ్లిద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పరిశీలిస్తే.. వీరిద్దరూ కూడా టాప్ ఫైనలిస్ట్‌లలో ఖచ్చితంగా ఉంటారని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ వారం కాజల్, సిరి, మానస్ లల్లో మాత్రం హౌజ్ నుంచి ఒకరు వెల్లి పోయే అవకాశం ఉంది. అయితే దీనిలో సిరి సేవ్ అయిపోతుందని చెప్పవచ్చు.

ఎందుకంటే.. రీసెంట్ ఎపిసోడ్లలో షణ్ముక్ ఎక్కువగా సిరిని తిడుతూ తననీ కమాండ్ చేయడం వల్ల ఈమెకు ప్లస్ అయ్యిందని.. అందుకే ఆమెకు కూడా ఓట్లు బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీరామ చంద్ర, కాజల్ మధ్య గొడవలో కాజల్ కు మైనస్ అయిందనే చెప్పాలి. ఈ ఒక్క ఎపిసోడ్ కారణంగానే ఓట్ల శాతం తారుమారయ్యాయి.

మానస్ ఈ వారం మొదటి నుంచి డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఇతడికి ఇంతకాలం కలిసి వచ్చిన అంశం ఏంటంటే.. కేవలం సన్నీతో స్నేహం మాత్రమే. ఇప్పుడు సన్నీ ష్యాన్స్ కేవలం అతడికే ఓట్లు వేస్తున్నారు. దీంతో ఒట్ల పరంగా మానస డేంజర్లోనే ఉన్నాడు. మానస్ టాస్క్‌లలో శారీరక బలం మరియు కాజల్ మైండ్ గేమ్‌లు వారి ప్రయాణానికి హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరిలో ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు బ్యాగ్ ప్యాక్ చేస్తారో వేచి చూడాలి.

కెప్టెన్ యానీ మాస్టర్.. కోపంతో సిరి.. అసలు హౌస్ లో ఏం జరుగుతుందంటే?

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లకు ఒక టాస్క్ ను ఇచ్చాడు. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ ఒకరినొకరు తోసుకుంటూ, టార్చర్ చేసుకుంటూ కనిపించారు. ఈరోజు కూడా ఇదే కాకుండా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కుటుంబ సభ్యులకు సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ టాస్క్ ను ఇవ్వగా ఇందులో సూపర్ విలన్స్ విజయవంతంగా టాస్క్ ను పూర్తిచేసి విజేతలుగా నిలిచారు.

ఈ టాస్క్ లో గెలిచినందుకు విలన్స్ టీమ్ సంతోషంగా గంతులేశారు. ఇక జెస్సీ కూడా విలన్స్ టీమ్ కావడంతో ప్రియాంక కంగ్రాట్స్ చెప్పడానికి వెనుక నుంచి వచ్చి హగ్ ఇచ్చింది.అప్పుడు మానస్ ప్రియాంకకు ముద్దు పెట్టి షాక్ ఇచ్చాడు. ఇదంతా చూసిన శ్రీరామ్ పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు. ఇక ఇదే విషయంపై శ్రీరామ్,షణ్ముఖ్ జస్వంత్ ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు.

ఒక చిక్కకు దొరక్కు అనే టాస్క్ లో యాని మాస్టర్ విజేతగా నిలిచింది. మీ టాస్క్ లో భాగంగానే షణ్ముఖ్ జస్వంత్ తనపై ఎక్కువ బాల్స్ వేశాడని సిరి కోప్పడింది.నువ్వు ఫేక్ అంటూ షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కొన్ని మాటలు అనేసింది సిరి. జెస్సీ నేను తెలియక చేసిన దానికి ఎంత చేశావు షన్ను నువ్వు ఇప్పుడు దానికి నేను డబుల్ బాధపడుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యింది.నువ్వు లోపల ఒకటి పెట్టుకుంటావ్..బయటకు ఒకలా ఉంటావు అంటూ షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది.

అప్పుడు షణ్ముఖ అరే ఇది ఇండివిడ్యువల్ గేమ్ ఆడమంటారు మీరు ఆడతారు..నేను ఆడితే మీకేంట్రా నొప్పి అంటూ జెస్సి తో చెప్పాడు. ఇక ఆ తర్వాత సిరి తో క్లోజ్ అవ్వడానికి షణ్ముఖ్ జస్వంత్ ప్రయత్నించినా ఆమె దగ్గరకు రానివ్వలేదు. రవి,సన్నీ,విశ్వ కూర్చుని తో మాట్లాడుతున్నారు. సన్నీ, షణ్ముఖ్ గురించి సిరి తో మాట్లాడుతుండగా మధ్యలో రవి కల్పించుకుని ఒరేయ్ వారిద్దరి మధ్య లోకి వెళ్ళకు తర్వాత వాళ్లిద్దరు కలిసిపోతారు మనం ఎదవలు అవుతామ్. నేను ఇప్పటికే చాలా సార్లు అయ్యాను అంటూ రవి కామెడీ చేశాడు.

బిగ్ బాస్: ప్రియాంక పరువు తీసిన మానస్.. ఏం జరిగిందంటే?

బుల్లితెరపై బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 62 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ లవ్ ట్రాక్స్ కు అడ్డగా మారిపోయింది.కంటెస్టెంట్ ల మధ్యలో లవ్ నడిపిస్తూ.. కావలసినదిగా ప్రోమో ఇప్పుడు చూసిన కట్ చేసుకొని రీ ప్లే చేయడం బిగ్ బాస్ కు సరదా. అయితే ఇదేమీ కొత్త కాదు. గత సీజన్ లలో కూడా ఇలాంటి ప్రోమోలు చాలానే ప్రసారం అయ్యాయి.

ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను సూపర్ విలన్ టీమ్ విజయవంతంగా పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఇక విలన్స్ టీమ్ సంతోషంతో సందడి చేశారు. ఈ క్రమంలోనే జెస్సీ కూడా విలన్స్ టీమ్ కావడంతో అతడికి వెనక వైపు నుంచి వచ్చి హగ్ ఇచ్చింది ప్రియాంక.

అయితే జెస్సి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చిన ప్రియాంకకు ముద్దు పెట్టి షాక్ ఇచ్చాడు. ఇక దీని చూసిన శ్రీరామ్ పగలబడి నవ్వుతున్నాడు. ఇదే విషయంపై షణ్ముక్, శ్రీరామ్ ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు.మానస్ ఎక్కడ ఉన్న వ్యక్తి మరి సపర్యలు చేసే ప్రియాంక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కూడా అతడిని వెతికే పనిలో పడింది.

ఈ క్రమంలోనే మానస్ కూర్చొని తింటుండగా, ప్రియాంక వచ్చి అతని ముందు మెలికలు తిరిగింది. ఏంటి కంటెంట్ కోసం ట్రై చేస్తున్నట్టు ఉన్నావ్ అంటూ ప్రియాంక పరువు తీసేసాడు. అప్పుడు ఆమె నువ్వు అనుకుంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను అని అంది. అప్పుడు వెంటనే మానస్ ఎందుకు అంత సీన్ చేస్తున్నావ్? తినాలా వెళ్లిపోవాలా?అంటూ సీరియస్ అయ్యాడు. ఈ విషయం పట్ల సిరి,ప్రియాంక మధ్య చర్చ నడుస్తూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంట కదా అనేసి అడగ్గా ప్రియాంక తెగ సిగ్గుపడింది.

ఈ వారం నామినేషన్ నుంచి బయటపడిన అనీ మాస్టర్..!

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. దీనితో వీక్షకులు ప్రతి ఒక్క ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాస్క్ లో భాగంగా గొడవ పడడం, వెంటనే కలిసిపోవడం లాంటివి చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్.

ఇది ఇలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. కెప్టెన్ షన్ను మినహా మిగిలిన అందరూ నామినేషన్ లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ తాజాగా వీరికి ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ నామినేషన్స్ నుంచి ఒకరు తప్పించుకునే అవకాశం కల్పించాడు. బ్యాగేజ్ జోన్,డేంజర్ జోన్, సేఫ్ జోన్ అంటూ మూడు భాగాలుంటాయి.

టాస్క్ లో గార్డెన్ ఏరియాలో ఒక సేఫ్ జోన్ డోర్ లోకి తమ ఫోటో కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులు ఫోటోలు ఉన్న భాగాలు తీసుకొని పరిగెత్తాలి.ఇలా వెళ్లే క్రమంలో ఎవరు అయితే చివరగా సేఫ్ జోన్ లోకి వెళ్ళ్తారో, అతడితో పాటు అతని చేతిలో ఎవరి ఫొటో ఉన్న బ్యాగ్ ఉందో ఆ ఇద్దరు డేంజర్ జోన్ కి వెళ్తారు. ఈ గేమ్ లో కాజల్,శ్రీరామ్ తొలిరౌండ్ లోనే డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

కాజల్ ఫోటో ఉన్న బ్యాగు తీసుకున్న శ్రీరామ్ చంద్ర ముందుగా గార్డెన్ లోకి వచ్చినప్పటికీ కావాలనే సేఫ్ జోన్ లోకి వెళ్లన్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో అని మాస్టర్ విన్ అయింది. గత వారం అని మాస్టర్ కు వచ్చిన పవర్ ను వాడే సమయం వచ్చిందని తెలిపారు బిగ్ బాస్. దీంతో ఒకరిని నామినేషన్ నుంచి తప్పించవచ్చని చెప్పగా అనీ మాస్టర్ మానస్ ను నామినేషన్స్ నుంచి తప్పించింది. అలా ఆ ఇద్దరు బయట పడ్డారు.

ఎమోషనల్ అయిన శ్రీరామ్… ముద్దులు పెడుతూ తనను ఓదార్చిన ప్రియాంక..!

తెలుగు బిగ్ బాస్ ఎంతో విజయవంతంగా ఏడు వారాలను పూర్తి చేసుకుంది. 7 వ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయింది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ లు 50 రోజులు పూర్తి చేసుకోవడంతో బిగ్ బాస్ వారికి ఒక సర్ ప్రైస్ ఇచ్చారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని చెప్పారు. అయితే ఆ లెటర్స్ అందుకోవాలంటే వారు ఒకటి వదులుకోవాలని నామినేషన్ గురించి హింట్ ఇచ్చారు.

ఇలా బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవర్ రూమ్ లోకి ఇద్దరు పోస్ట్ మాన్ లో పంపించి హౌస్ లో ఉన్న కంటెస్ట్ లకు వచ్చిన లెటర్లను అందుకోవాలి. అందులో ఒకరు లెటర్ ను అందుకోగా మరొకరు నామినేట్ కావాల్సి ఉంటుంది. ఇలా పవర్ రూమ్ లోకి వెళ్ళిన విశ్వ, లోబోకి రవి, శ్రీరామ్ లెటర్స్ అందాయి. రవి ఫ్యామిలీ కోసం శ్రీరామ్ తన లెటర్ ను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు.

అయితే లోబో చెప్పిన మాటలు విన్న రవి శ్రీరామ్ కోసం తన లెటర్ ను ముక్కలు చేసి శ్రీ రామ్ కి వచ్చిన లెటర్ చదివాడు.అయితే ఆ లెటర్ ని పట్టుకొని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ తనకు తన ఫ్యామిలీ గుర్తుకు రావడంతో ఒంటరిగా కూర్చొని ఎంతో బాధ పడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు . అయితే ఇది గమనించిన పింకీ శ్రీరామ్ వద్దకు వెళ్ళింది.

శ్రీరామ్ ను హగ్ చేసుకొని తనని ఓదారుస్తూ తన పై ముద్దుల వర్షం కురిపించింది. ఇలా ముద్దులతో ప్రియాంక శ్రీరాములు ఓదార్చగా అనీ మాస్టర్ కలుగజేసుకొని వీరి పై సెటైర్లు వేసింది ఈ వంకతో ఇలా ముద్దులు పెట్టుకుంటారా అంటూ అనీ మాస్టర్ అన్నారు.

బిగ్ బ్రేకింగ్.. ఏడో వారంలో నామినేషన్లో ఉన్నది వీళ్లే..

తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ది రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో వారంలోకి అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆరు వారాల్లో ఎప్పుడు జరగని విధంగా ఈ సారి నామినేషన్లు జరగుతున్నాయి.

బిగ్ బాస్ లో ప్రస్తుతం 13 మంది ఉన్నా.. లోబో సీక్రెట్ రూంలో ఉన్నాడు కాబట్టి ఇక 12 మంది మాత్రమే ఆట ఆడుతున్నారు. కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతున్నా కొలది ఆటలో కూడా మజా పెరిగిపోతోంది.ముగ్గురు వేట‌గాళ్ల చేతిలో నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను ఉంచిన‌ట్లు తెలుస్తోంది.

దీనిలో ప్రియాంక ఎంతో అగ్రెసివ్ గా కనిపిస్తుంది. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చిందులు వేస్తుంది. అయితే నామినేషన్ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం 9 మంది ఉన్నట్లు లీకురాజాల ద్వారా తెలిసింది. ఇక ఈ వారం లోబో, శ్రీరామ్‌, ప్రియ‌, యానీ, ర‌వి, పింకీ, కాజ‌ల్‌, జెస్సీ, సిరి నామినేట్ అయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

మొదటి నుంచి కూడా బిగ్ బాస్ నుంచి లీకులు వస్తూనే ఉన్నాయి. ఈ సారి కూడా ఇది నిజమైతదో .. లేదో తెలియాలంటే ఈ రోజు వచ్చే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక 13 మందిలో ఆ 9 మంది నామినేట్ కాగా మిగిలిన వారు నామినేషన్లో లేరని తెలుస్తోంది.

కాజల్ కి మిడిల్ ఫింగర్ చూపించి అవమానించిన లోబో.. నేనైతే వేలు నరికేసేదాన్ని..!

బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగు వారాలు పూర్తి చేసుకొని హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే 5వ వారం ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం మరింత గొడవలు వివాదాల నడుమ కొనసాగుతోంది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న శ్రీరామ్ ఎవరి ఫుడ్ వాళ్లు చేసుకోవాలని చెప్పడంతో సిరి గ్యాంగ్, శ్రీరామ్ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇలా ఒకరిపై ఒకరు కోపంతో భోజనం పై అలుక చూపి పస్తులు పడుకున్నారు. ఇక ఇక మరుసటి రోజు ఉదయం గొడవలు కొట్లాటలు మరిచిపోయి అందరూ కలిసి టిఫిన్ లాగించారు.

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ లో కాజల్, రవి మధ్య మరోసారి గొడవ చోటు. ఈ క్రమంలోనే కాజల్ పాట పాడుతూ దానిని సాగదీస్తూ గత నెల రోజుల నుంచి లోబో, రవి వాష్ రూమ్ క్లీనింగ్ కే పరిమితమయ్యారని, కిచెన్ వైపు అసలు చూడటం లేదని డాన్సులు చేస్తూ చెప్పడంతో అందుకు స్పందించిన రవి మజాక్ అనేది కొంత వరకు అయితే బాగుంటుంది అంటూ తనకి వార్నింగ్ ఇచ్చాడు.

ఇక కాజల్ అన్న మాటలకు లోబో స్పందిస్తూ ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించాడు. లోబో అలా మిడిల్ ఫింగర్ చూపించడంతో హర్ట్ అయిన కాజల్ లోబోను నిలదీసి తప్పు అంటూ వాదించింది. ఇదే విషయాన్ని కాజల్ ప్రియాంక దగ్గర చెబుతూ బాధ పడటంతో అందుకు స్పందించిన ప్రియాంక నేనైతే ఆ వేలు విరిచేసేదాన్ని అని అనగా అందుకు కాజల్ బిగ్ బాస్ హౌస్ లో హింసకు తావు లేకపోవటం వల్ల తాను కూడా ఏమీ చేయలేక పోయానని చెప్పింది.

ఇక ఈ విషయంపై రవి నెలరోజుల నుంచి నేను కిచెన్ లో పని చేయలేదని నువ్వు ఎలా చెబుతావు అంటూ తనతో గొడవకు దిగాడు. దీంతో మాట మార్చిన కాజల్ నేను కేవలం మీకి కిచెన్ డ్యూటీ రాలేదని మాత్రమే చెప్పానని మాట మారుస్తుంది. ఇలా వీరిద్దరి మధ్య గొడవ చోటుచేసుకోవటంతో మానస్ ఇన్వాల్వ్ అవుతూ ఎందుకలా అరుస్తున్నారు అంటూ మాట్లాడతాడు లోబో మిడిల్ ఫింగర్ చూపిస్తే అలా చేయకూడదని చెప్పకుండా తనకు సపోర్ట్ చేస్తున్నావ్ అని కాజల్ అనడంతో రవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ విషయంపై లోబోను హెచ్చరించానని తెలియజేశాడు. ఇలా వీరిద్దరి మధ్య మరోసారి గొడవ చోటు చేసుకుంది.

ఆ కంటెస్టెంట్ కు ఈవారం రెడ్ కార్డు తప్పదా.. ఈ వారం డైరెక్ట్ గా ఎలిమినేట్ కాబోతున్నాడా..?

బిగ్ బాస్ 5 ప్రారంభమయ్యే అప్పుడే ఐదు వారాలు కావస్తోంది. 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో రసవత్తరంగా కొనసాగుతూ ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ కాగా ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారంలో 8 మంది నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు.అయితే గత నాలుగు వారాల నుంచి ఒక్కసారిగా నామినేషన్ లిస్ట్ లో లేని యూట్యూబ్ స్టార్ట్ షణ్ముక్ ఈవారం నామినేషన్ లిస్ట్ లోకి చేరాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి అసలు తన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడా లేదా అన్న విధంగా ఉండే షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా నామినేషన్ లిస్ట్ లోకి చేరే సరికి అతని అసలు రూపం బయట పెడుతున్నాడు. అయితే షణ్ముఖ్ ఎవరితోనూ గొడవ పడకుండా ఉన్నప్పటికీ అతను నామినేషన్ లోకి రావడానికి గల కారణం అతను హౌస్ సభ్యులతో కలవకుండా తన పని తాను చేసుకుంటూ ఉండటానే కారణంగా చెబుతూ ఏకంగా ఎనిమిది మంది ఇతనిని నామినేట్ చేశారు .

గొడవలకు ఎంతో దూరంగా ఉండే షన్ను, అసలు కారణం ఏమిటో తెలియకుండా కెప్టెన్ శ్రీరామ్ తో జెస్సీ గురించి గొడవ పడ్డాడు. ఇలా శ్రీరామ్ తో గొడవకు దిగిన షణ్ముఖ్ మొదటి నుంచి తాను ఎవరితో కలవకుండా తప్పు చేశానని ఇకపై హౌస్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ తోను అతను ఈ విధంగా ఉంటానంటూ వింతవింతగా ప్రవర్తిస్తున్నాడు.షణ్ముఖ హౌస్లో చేస్తున్నటువంటి వింత ప్రవర్తన చూసిన నెటిజన్లు పెద్దఎత్తున తన గురించి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఒక్కసారి నామినేషన్ లిస్ట్ లో ఉంటే తట్టుకోలేకపోతున్నావు హౌస్ లో ఇలాగే బిహేవ్ చేస్తే తప్పకుండా ఈవారం రెడ్ కార్డు (ఓటింగ్ లేకుండా హోస్ట్ నేరుగా అతని హౌస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది) ద్వారా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. షణ్ముఖ జశ్వంత్ తన పద్ధతి మార్చుకోకపోతే ఈ వారం తన డేంజర్ జోన్ లో పడతాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నవ్వులు పూయించిన లోబో.. వెయిట్ తగ్గలేక బోల్తా పడిన ఆ జంట..!

బిగ్ బాస్ 5 రియల్టీ హౌస్ లో కంటెస్టెంట్స్ తగ్గుతున్నా కొద్ది.. టాస్క్ తీవ్రత కూడా పెంచుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. తాజాగా టీవీలో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ లో ఉన్న 16 మందిని జంటలుగా విడిపొమ్మని చెప్పాడు. దీని కంటే ముందు వాళ్లు వెయిట్ ను చెక్ చేసి.. ఓ బోర్డు మీద రాశారు. అందులో ప్రతీ ఒక్కరి వెయిట్ కనిపిస్తుందట.

అలా జరగుతున్న క్రమంలోనే ఇంట్లో ఉన్న తిను బండారాలు మొత్తం రేషన్ రూంలో పెట్టి తాళం వేసేశారు. దీంతో వాళ్ల వెయిట్ ను అంతక ముందు ఉన్న దాని కంటే తగ్గాలని.. అలా అయితేనే కెప్టెన్సీ టాస్క్ లో ఫర్ ఫామ్ చేసేందుకు చాన్స్ ఉంటుందని తెలిపారు. దీంతో వాళ్లు ఎనిమిది జంటలుగా విడిపోయారు. ఎవరికీ వారు కసరత్తు మొదలు పెట్టారు.

ఇలా చేస్తున్న దానిలో లోబో కాసేపు నవ్వులు పూయించాడు. నటరాజ్ తో లోబో జంటగా ఏర్పడ్డాడు. ఇక నటరాజ్ చెప్పిన మాట వింటూ.. లోబో అతడి ముందు బయపడినట్లుగా చేశారు. గెలవాలంటే తగ్గాల్సిందేలో ఎవరికి వారు తగ్గడానికి ప్రయత్నించారు. ఈ క్రమలోనే మధ్యలో టాస్క్ లు ఇస్తున్నాడు. అందులో మొదటిది.. ‘పట్టుకోండి చూద్దాం’. దీనిని ఒక జంట పవర్ రూంకి వెళ్లి.. ఆ జంటకు ఎవరు ప్రతి జంటగా రావాలని కోరుకుంటున్నారో చెప్పాలి.

ఇలా మొదట నటరాజ్ ఆ పవర్ రూం యక్సెస్ పొంది.. శ్రీరామ్, హమిదాను సెలెక్ట్ ఈ టాస్క్ కు ఎంపిక చేసుకున్నారు. కానీ చివరకు ఆ టాస్క్ లో నటరాజ్, లోబో ఓడిపోయి.. వాళ్లకు ఉన్న వెయిట్ కంటే.. మరి కొంత బరువును పెంచుకున్నారు. శ్రీరామ్, హమిదా వెయిట్ ను తగ్గించుకున్నారు. దీంతో నటరాజ్ కాస్త అసహనానికి గురయ్యి.. లోబోతో విచిత్రంగా మాట్లాడుతుండగ.. లోబో ముఖ కవలికలు నవ్వు తెప్పించాయి.

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సింగర్ శ్రీరామ్, RJ కాజల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

బుల్లితెర పై ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకాభిమానం సంపాదించుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. గతంలో నాలుగు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా ఐదవ సీజన్ ను ప్రారంభించింది. గత రెండు సీజన్ల మాదిరిగానే ఐదవ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లకు నాగార్జున గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలోకి నాలుగవ కంటెస్టెంట్ గా ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్ శ్రీ రామచంద్ర ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా స్టేజ్ పై నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలోని “నేను నేనుగా లేనే నిన్న మొన్న లా” అనే పాటను లైవ్ లో పాడి అందరిని సందడి చేశారు. శ్రీ రామచంద్ర పలు భాషలలో వందల సంఖ్యలో పాటలు పాడి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈక్రమంలోనే 2010వ సంవత్సరంలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ సింగింగ్ కార్యక్రమం ఇండియన్ ఐడల్ విన్నర్ గా నిలిచి మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే శ్రీ రామచంద్రకు హీరోగా అవకాశాలు కూడా వచ్చాయి. సింగర్ శ్రీరామచంద్ర హీరోగా మూడు సినిమాలలో నటించారు. అయితే ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేయకుండా సింగర్ గా స్థిరపడిన శ్రీ రామచంద్ర బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా వేదికపైకి వచ్చిన శ్రీరామచంద్ర నాగార్జున కోసం గీతాంజలి సినిమాలో నుంచి ఒక పాటను పాడి అతనికి డెడికేట్ చేస్తూ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి 17 వ కంటెస్టెంట్ గా, ఫేమస్ యూట్యూబర్, సింగర్, రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ కాజల్ బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎంతో చిలిపిగా అల్లరి పనులు చేస్తూ ఉండే కాజల్ బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇవ్వడంతోనే నాగార్జునతో ఐలవ్యూ చెప్పించుకుంది. అలాగే తన ఫస్ట్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ కూడా నాగార్జున గారితోనే అనే విషయాన్ని కూడా వెల్లడించారు. యూట్యూబర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ బిగ్ బాస్ హౌస్ లో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.