Tag Archives: Sugar

Pregnant After 40 Years: మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం మంచిదేనా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Pregnant After 40 Years: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్యా ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లలని ప్లాన్ చేయడం లేదు అందుకే ప్రస్తుత కాలంలో మహిళలందరూ కూడా 30 తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా మహిళలు 40 కి దగ్గర పడుతున్న సమయంలో పిల్లలను కనడం వారి ఆరోగ్యానికి మంచిదేనా పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందా అనే విషయానికి వస్తే…

40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల్ని కనడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కనడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఎంతో మంచిదని ఈ సమయంలో పిల్లలను కనడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి మహిళలలో విడుదల అయ్యే అండాల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా అరుదు ఒకవేళ పుట్టిన ఎన్నో రకాల సమస్యలతో జన్మిస్తూ ఉంటారు.

40 సంవత్సరాల వయసు దగ్గరకు పడే మహిళలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పిల్లల్ని కనుక కణాలని భావిస్తే వారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. 30 సంవత్సరాల లోపు మొదటి బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిది అయితే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆరు ఏడు నెలల వ్యవధిలోని మరొకసారి గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం.

18 నెలల గ్యాప్ అవసరం…


మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు 18 నుంచి 23 నెలల గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే రెండో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఐదు నెలల గ్యాప్ లోనే మరోసారి గర్భం దాల్చితే అది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇలా గర్భం దాల్చడం వల్ల రక్తస్రావం జరగడం, తల్లి ఆరోగ్యం పై అధిక ప్రభావం చూపడం వంటివి జరుగుతుంటాయి.అందుకే పిల్లల విషయంలో సరైన ప్లానింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

బెల్లం, పాల మిశ్రమంతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టేయవచ్చు..

పాలల్లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతీ ఒక్కరూ పాలను తీసుకుంటారు. ప్రతిరోజు పాలు తాగితే ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవు. కొంతమంది అయితే అసలు పాలు తాగడానికి ఇష్టపడరు.

అలాంటి వాళ్ళు పాలలో చక్కెరతో పాటు ఏదన్నా ఫ్లేవర్ కలుపుకుని తాగుతారు. ఇలా పాలల్లో పంచదార కలుపుకొని తాగడం కంటే.. బెల్లం కలుపుకొని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.. దాని గురించి తెలుసుకుందాం..

జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు.. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఈ పాలు, బెల్లం మిశ్రమంలో ఉండే పోషకాల వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్త హీనతతో బాధపడే వారు.. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే. ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు పాలలో బెల్లం కలుపుకొని తాగడం వలన ఎముకలు దృడంగా అవడమే కాకుండా మొకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. చుండ్రు ఎక్కువగా ఉన్నవాళ్లు దీనిని తీసుకుంటే.. ఎక్కువగా ఆ సమస్య నుంచి బయపడొచ్చు. ఈ మిశ్రమానికి కర్పూరం, తులసి ఆకులు కలిపితే రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఈ మిశ్రమాన్ని కలుపుకొని తాగడం వల్ల చర్మం చాలా కాంతివంతంగా అవుతుంది.

బెల్లం కూడా ఇక పంచదార రూపంలో .. ఉత్పత్తి చేయడానికి ఐదు కంపెనీలు ముందుకు.. !

బెల్లంలో అనేక పోషక విలువలు ఉంటాయి.. అయినా కూడా చాలామంది పంచదారనే ఇష్టపడుతుంటారు. పంచదారకు ఉన్నంత డిమాండ్ బెల్లానికి ఉండదు. దానికి గల కారణం పంచదార మనకు పలుకుల రూపలంలో లభించడమే. అందుకే ఎక్కువగా పంచదారను ఇష్టపడతారు. పలుకులుగా ఉండటంతో దానిని సలుభంగా ప్యాకింగ్ చేసి ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లే విధంగా ఉటుంది. అందుకనే దీనిపై మక్కువ ఉంటుంది.

అయితే బెల్లాన్ని కూడా పలుకుల రూపలంలో ఉత్పత్తి చేసేందుకు ఇటీవల అనకాపల్లిలోని ANGRAU యూనివర్సిటీలోని రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ లో ఒక టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీనిపై పేటెంట్ హక్కును కూడా పొందారు. దీంతో దీనికి కావాల్సిన మెషినరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టెక్నాలజీని 5 కంపెనీలకు నాన్-ఎక్స్‌క్లూజివ్ ప్రాతిపదికన బదిలీ చేసింది.

వోవెల్ టెక్నాలజీస్(మహారాష్ట్ర), చక్రవర్తి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తిరుపతి), కెవిఎల్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్(సికింద్రాబాద్‌), జయలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్(సికింద్రాబాద్‌), శుభం ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(విశాఖపట్నం) కంపెనీలు గ్రాన్యులర్ రూపంలో బెల్లాన్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతున్నాయి.

చక్కెర కంటే బెల్లం శ్రేష్టమైనదని.. అనకాపల్లిలోని RARS లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా వ్యవహరిస్తున్న డా. పీ.వీ.కే జగన్నాధరావు తెలిపారు. దీనిలో సూక్రోజ్ తో పాటు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయని వివరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం PMFME కింద బెల్లం ఉత్పత్తిని పెంచడానికి ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

చక్కెర ను వైట్ పాయిజన్ అని ఎందుకంటారో తెలిస్తే.. ఇకపై ఎప్పుడు కూడా చక్కెర ముట్టరు!

సాధారణంగా మన రోజువారి జీవితంలో ఉపయోగించే వాటిలో చక్కెర ఒకటి. ప్రతిరోజు కాఫీ, టీలలో చక్కెరను విరివిగా ఉపయోగిస్తారు.అదేవిధంగా వివిధ రకాల తీపి పదార్థాలను తయారు చేసుకోవాలన్న చక్కెరతోనే ఎక్కువగా తయారు చేసుకుంటాము.ఈ విధంగా రోజుకు అధిక మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. అయితే చక్కెర తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి రోజు అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల శరీర బరువు అమాంతం పెరిగిపోతారు. అదే విధంగా ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడటానికి కూడా చక్కెర ప్రధాన కారణం.మనం ఏదైనా తీపి పదార్థాలు తిన్నప్పుడు అందులో ఉన్నటువంటి చక్కెర మన శరీరంలో ఉన్నటువంటి కొల్లాజెన్ కి అతుక్కుంటుంది. ఇది నెమ్మదిగా ప్రోటీన్లను తొలగించడంతో మన చర్మం పై ముడతలు మచ్చలు ఏర్పడతాయి.

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలో ఊబకాయం ఒకటి. ఊబకాయం అనేది మనం చక్కెర తినకపోయినా ఇతర రకాల పానీయాలు చాక్లెట్ వంటి వాటిని తిన్నప్పుడు వాటిలో ఉన్న చక్కెర మన శరీరంలోకి ప్రవేశించి ఊబకాయానికి దారితీస్తుంది. అదేవిధంగా అధిక మొత్తంలో చక్కెర తీసుకున్నప్పుడు కాలేయ సమస్యలకు దారితీస్తుంది.

ప్రతి రోజు అధిక మొత్తంలో చక్కెర తీసుకోవటంవల్ల గ్లూకోస్ పూర్తిగా మెదడుకు చేరకపోవడం వల్ల మెదడు తన పనితీరును కోల్పోతుంది. ఇది క్రమంగా జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తుంది. ముఖ్యంగా చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకోసమే రోజువారి ఆహారంలో భాగంగా చక్కెరను మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల ఈ విధమైన దుష్ప్రభావాల కారణంగానే చక్కెరను వైట్ పాయిజన్ అని పిలుస్తారు.

మీకు షుగర్ ఉందా.. అయితే అది ఏ టైప్?

ప్రస్తుతం మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సమస్యలలో షుగర్ వ్యాధి సమస్య ఒకటి. చాలామంది తాము మధుమేహంతో బాధపడుతున్నామని చెబుతుంటారు కానీ, అది ఏ విధమైనటువంటి షుగర్ అనే విషయం చాలా మందికి తెలియదు. షుగర్ లో రెండు రకాలు ఉంటాయి. అది టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. అనే రెండు రకాలు ఉంటాయి.

సాధారణంగా టైప్ 1 డయాబెటిస్ ఎక్కువగా చిన్నపిల్లలు యుక్తవయసు వారిలో వస్తుంది. కానీ టైప్ 2 డయాబెటిస్ అనేది 45 సంవత్సరాల పైబడిన వారిలో వస్తుంది.అయితే తాజా అధ్యయనాల ప్రకారం ఈ విధమైనటువంటి రెండు రకాల షుగర్ వ్యాధితో బాధపడే వారికి చికిత్స విధానం కూడా వేరే ఉంటుందని నిపుణులు తెలియజేశారు.

షుగర్ వ్యాధితో బాధపడే వారు టైప్ 1, టైప్2 డయాబెటిస్ తో బాధపడుతున్నరా అనే విషయాన్ని జన్యువుల ద్వారా తెలుసుకోవచ్చని ఈ అధ్యయనంలో నిరూపితమైనది. ఈ క్రమంలోనే టైప్ వన్ డయాబెటిస్ తో బాధపడేవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. రోగనిరోధక శక్తిలోని కొన్ని కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల పై దాడి చేయటం వల్ల వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఈ విధంగా ఇన్సులిన్ ఉత్పత్తి కాని వారు టైప్ 1 డయాబెటిస్ బారిన పడతారు.ఇది ఎక్కువగా చిన్నపిల్లలు యుక్తవయసు వారిలో అధికంగా వస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగినప్పటికీ, ఆ ఇన్సులిన్ సరైన క్రమంలో శరీరం ఉపయోగించకపోవడం వల్ల వారు టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారు. టైప్2 డయాబెటిస్ అధికంగా 45 సంవత్సరాలు పైబడిన వారిలో వస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారికి కూడా టైప్ 2 డయాబెటిస్ రావడం గమనార్హం. అదేవిధంగా మన జీవన శైలిలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా వస్తోంది.

మధుమేహంతో బాధపడేవారు ఈ షుగర్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

ప్రస్తుత కాలంలో రోజురోజుకు అనేకమందిని వెంటాడుతున్న సమస్యలలో మధుమేహ సమస్య ఒకటి. మధుమేహంతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చక్కెర కలిగినటువంటి ఆహార పదార్థాలను దూరం పెడుతూ చక్కెర స్థానంలో బెల్లం తీసుకుంటున్నారు.

మధుమేహంతో బాధపడేవారు చక్కెర పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా శరీర బరువు పెరగడంతోపాటు, లివర్ జబ్బులు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు వెంటాడుతాయి. ఈ క్రమంలోనే మధుమేహంతో బాధపడేవారు పంచదార పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా బెల్లం పై ఆధార పడుతున్నారు.

మధుమేహంతో బాధపడేవారు పంచదార కాకుండా, పంచదారకు బదులుగా కోకోనట్ షుగర్ వాడటం వల్ల వారికి ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తూ చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. ఎవరైతే మధుమేహంతో సతమతమవుతుంటారో అలాంటి వారికి కోకోనట్ షుగర్ ఎంతో ప్రయోజనకరం.

మధుమేహంతో బాధపడే వారు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. అయితే మనం ఉపయోగించే సాధారణ పంచదారలో గ్లైసీమిక్ ఇండెక్స్ 60 నుంచి 65 శాతం ఉండటం వల్ల ఇది మధుమేహులలో మరింత తీవ్రతను కలుగజేస్తుంది. అదేవిధంగా కోకనట్ షుగర్ లో గ్లైసీమిక్ ఇండెక్స్ కేవలం 35 శాతం మాత్రమే ఉంటుంది. కనుక కోకనట్ షుగర్ తీసుకోవటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ మాత్రమే కాకుండా దీంట్లో ఇన్సులిన్ ఉంటుంది. ఇది మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. కనుక మధుమేహంతో బాధపడే వారు నిరభ్యంతరంగా సాధారణ చక్కెరకు బదులుగా కోకోనట్ షుగర్ తీసుకోవచ్చు.

రైతులకు అలర్ట్.. ఈ పంట వేస్తే లక్షల్లో ఆదాయం మీ సొంతం..!

దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త పథకాలు అమలు చేస్తున్నా రైతుల జీవితాల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు అకాల వర్షాలు, వరదలు నష్టాలను మిగులుస్తున్నాయి. పెరుగుతున్న మందులు, ఎరువుల రేట్ల వల్ల పంట మంచి రేటుకే అమ్ముడయినా రైతులకు లాభాలు రావడం లేదు. అయితే కొన్ని పంటలు వేస్తే రైతులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

కరోనా, లాక్ డౌన్ వల్ల పంట చేతికి వచ్చినా నష్టాలు చవిచూసిన రైతులు మంచి రేటు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే అధిక మొత్తంలో ఆదాయాన్ని సులువుగా సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న పంటల్లో బ్లాక్ వీట్(నల్ల గోధుమలు) ఒకటి. రైతులు ఈ పంట ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని, ఎక్కువ లాభాలను సులువుగా పొందే అవకాశం ఉంటుంది.

సాధారణ గోధుమలతో పోలిస్తే ఈ గోధుమలకు నాలుగు రెట్లు ఎక్కువ ధరను పొందవచ్చు. క్వింటాల్ నల్ల గోధుమల ధర 8,000 రూపాయలకు పైగా పలుకుతుంది. పోషకాలు పుష్కలంగా ఉండే నల్లగోధుమలు అనేక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. షుగర్, ఒబెసిటీ, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడే వాళ్లు నల్ల గోధుమలతో చేసిన ఆహారం తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి.

ఐరన్ లోపంతో బాధ పడే వాళ్లకు సైతం ఆ సమస్యను దూరం చేయడంలో బ్లాక్ వీట్ సహాయపడుతుంది. శీతాకాలం ఈ పంటను పండించటానికి అనువైన కాలం. ఫర్టిలైజర్ దుకాణాలలో ఈ పంటకు సంబంధించిన విత్తనాలు లభిస్తాయి.