Tag Archives: tamanna

Thamannah: తమన్నాకు కోపం వస్తే చేసే పని ఏంటో తెలుసా.. ఇదేం అలవాటు?

Thamannah: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తమన్న ఒకరు. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుని ప్రస్తుతం అక్కడ కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం తమన్న సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మొదట్లో సినిమాలలో మాత్రమే నటించేవారు కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో బిజీ అయ్యారు. తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికి సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా తమన్నాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్నా బయటకు వచ్చిన ప్రతిసారి కూడా అందరిని చాలా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు ఇక మీడియా పట్ల కూడా ఈమె దురుసుగా ప్రవర్తించరు. ఇలా ఎప్పుడు నవ్వుతూ సహనంతో ఉండే తమన్నకు కోపం వస్తే కనుక ఆమె కోపాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేరని తెలుస్తుంది.

ఒంటరిగా గడుపుతారు..
ఈమెకు కనుక కోపం వస్తే చుట్టుపక్కల వారితో ఏమాత్రం మాట్లాడరని వెంటనే తన గదికి వెళ్లి తలుపులు వేసుకొని గదిలో ఒంటరిగా కూర్చుంటారని తెలుస్తుంది. ఇలా తన కోపం చల్లబడిన తర్వాత చల్లనీటి షవర్ చేసి బయటకు వచ్చి తాను ఎందుకు అలా ఉన్నాననే విషయాన్ని అందరితోనూ పంచుకుంటారట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇదేం అలవాటు అంటూ పలువురు ఈమె అలవాట్లపై కామెంట్లు చేస్తున్నారు.

Thamannah: ఆ సినిమాను మిస్ చేసుకుని ఇప్పటికి బాధపడుతున్నాను… తమన్నా కామెంట్స్ వైరల్!

Thamannah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి తమన్న ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్నా రజినీకాంత్ గారితో నటించడం గురించి మాట్లాడుతూ తన సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటినుంచి రజనీకాంత్అంటే తనకు చాలా ఇష్టం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అయితే రజనీకాంత్ గారితో ఒక ఫోటో అయిన దిగాలన్నదే తన కోరిక అని తెలిపారు. కానీ ఆ కోరిక నెరవేరుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని కానీ నెల్సన్ కారణంగా ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చిందని అందుకు డైరెక్టర్ నెల్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇకపోతే తన సినీ కెరియర్ గురించి కూడా తమన్న మాట్లాడుతూ తాను కెరియర్ పరంగా ఇప్పటికీ ఏదైనా బాధపడే విషయం ఉందా అంటే అది ప్రభాస్ తో చేయాల్సిన సినిమా అని తెలియజేశారు.ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో ముందుగా తనకే హీరోయిన్గా అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే అప్పటికే తాను బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలో నటించలేకపోయాను.

Thamannah: ఆ బాధ ఇప్పటికీ ఉంది..


ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలో తానే నటించి ఉంటే బాగుండేదనిపించింది.ఇలా ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు తాను ఇప్పటికీ బాధపడుతూనే ఉంటానంటూ ఈ సందర్భంగా తమన్న తెలిపారు. అయితే ఈమెకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు కానీ అది కాజల్ పాత్రలోనా లేక తాప్సి పాత్రలోనా అన్న విషయం మాత్రం తెలియలేదు.

Tamannaah: హీరోలలో ఆ తేడా ఎప్పుడూ చూడను… సినిమాలపై ఇప్పటికీ అదే ఆసక్తి ఉంది: తమన్నా

Tamannaah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాల కాలం అవుతున్నప్పటికీ ఇంకా ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈమె కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె హీరో సత్యదేవతో కలిసి గుర్తుందా సీతాకాలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమన్నా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కథలో కంటెంట్ ఉండి ప్రేక్షకులు అభిరుచికి అనుగుణంగా సినిమాలు చేయడానికి తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు.తన మొదటి సినిమా శ్రీ సినిమా చేసే ముందు ఎలాంటి ఆసక్తి ఉందో ఇప్పటికీ సినిమాలపై అదే ఆసక్తి ఉందని వెల్లడించారు. ఇక కథ నచ్చితే ఆ సినిమాలో హీరో చిన్న హీరోనా పెద్ద హీరోనా అని తేడా ఎప్పుడూ చూడనని ఈమె తెలియజేశారు.

Tamannaah: ఓటీటీ యాక్టింగ్ కి ఓ మంచి ప్లాట్ ఫామ్..

ఇక హీరో సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూసిన తర్వాత అతనితో కలిసిన నటించాలనే భావన కలిగింది. ఇలా గుర్తుందా సీతాకాలం సినిమాతో అవకాశం వచ్చిందని తెలిపారు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా ఓటీటీల ద్వారా యాక్టింగ్ పరంగా ఇంకో ఫ్లాట్ ఫామ్ దొరికిందని నేను భావిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా తమన్నా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరు భోళాశంకర్ సినిమాలో మిల్క్ బ్యూటీ ఫిక్స్.. అధికారిక ప్రకటన చేసిన చిత్ర బృందం..!

మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరు ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా రీమేక్ చిత్రమైన భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో చిరంజీవి తో పాటు కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తోంది.

అన్నాచెల్లెళ్ల మధ్య సాగే అనుబంధంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించే అవకాశాన్ని మిల్క్ బ్యూటీ తమన్నా కొట్టేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో తమన్నా నటించడం కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయం గురించి తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని తమన్నా దక్కించుకున్నారు.

ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి సరసన నయనతారతో పాటు తమన్నా కూడా నటించారు. ఇక ఈ సినిమా నవంబర్ 11వ తేదీ ప్రారంభం కావడంతో నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

కోహ్లీ డేటింగ్ చేసిన హీరోయిన్లు వీళ్లే..! అందులో మిల్కీ బ్యూటీతో పాటు మరికొంతమంది..

ఇండియాలో ప్రతీ ప్రేక్షకుడు ఎక్కువగా ఇష్టపడే విషయాల్లో క్రికెట్ ఒకటైతే.. మరొకటి సినిమా. ఇక ఇక్కడ క్రికెట్ గురించి చెప్పుకుంటే.. ఆస్ట్రేలియా కంటే వన్డేలో వరల్డ్ కప్ లు గెలుచుకుంది తక్కువే అయినా.. ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హీరోల కంటే కూడా టీమిండియా క్రికెటర్లకే ఎక్కువ పాపులారిటీ ఉందనడంలో సందేహం లేదు. ఇక విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమిండియా రథసారధి విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఉన్న రికార్టులను త్వరలోనే కోహ్లీ అధిగమించే సత్తా కూడా ఉందని కొందరు మాజీ క్రికెటర్లు కూడా చెప్పిన విషయం తెలిసిందే. అంతలా తన ఆటతో ఆకట్టుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాందించుకున్నాడు విరాట్.

2013 సంవత్సరంలో హెడ్ అండ్ షోల్డర్స్ షాంప్ ప్రకటన కోసం మొదటిసారిగా కలిసిన విరాట్, అనుష్క వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్లింది. వీరిద్దరు 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతక ముందే విరాట్ చాలామందితో ప్రేమాయణం నడిపినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో పాపులర్ హీరోయిన్లు కూడా ఉన్నట్లు టాక్. విరాట్ కోహ్లీకి మొదటి లవ్ తమిళం, కన్నడంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సాక్షి అగర్వాల్ తో ప్రేమాయాణం నడిపాడు.

ఆర్సీబీకి మద్దతుగా స్డేడియానికి వచ్చినప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడి.. తర్వాత వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఇషా బెల్లాతో రెండు ఏళ్లు లవ్ ఎపైర్ నడిపాడు. ఈమె బ్రెజిల్ కు చెందిన మోడల్. కొన్ని ఇండియన్ మూవీల్లో కూడా నటించింది. అమీర్ ఖాన్ తలాష్ మూవీ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇషా బెల్లా. తెలుగులోని విజయ్ దేవర కొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలోనూ నటించింది. 2013లో విరాట్ కోహ్లీతో ప్రేమాయణం నడిపింది. సింగపూర్ లో వీళ్లిద్దరూ కలిసి షాపింగ్ లాంటివి చేస్తుండగా మీడియాలకు కూడా దొరికిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరు విడిపోయారు.

విరాట్ కోహ్లీ హీరోయిన్ తమన్నాతో కలిసి 2012 లో ఓ అడ్వైజ్‌మెంట్‌లో నటించాడు. వీరిద్దరి మధ్య కొన్నేళ్ల వరకు ప్రేమాయాణం నడిచినట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎంపీఎల్ యాప్ కోసం ఇద్దరు మరో సారి యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా కన్నడ నటి సంజన గల్రానీతో కూడా కోహ్లీ లవ్ లో ఉన్నాడట. ఆమె బుజ్జిగాడు సినిమాలో నటించింది. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది సంజన గల్రానీ. పంజా సినిమాలో నటించిన సారా జేన్ దియాస్ తో కూడా విరాట్ కోహ్లీ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

విజయ్ సేతుపతితో బైక్ రైడ్ చేసిన.. మిల్క్ బ్యూటీ!

మిల్క్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న నటి తమన్నా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వెండితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ బ్యూటీ చూపు బుల్లితెర పై కూడా పడింది. తాజాగా వివిధ భాషలలో ప్రసారం కానున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం కోసం తెలుగులో తమన్నాను హోస్ట్ గా ఎంపిక చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా మిల్క్ బ్యూటీ తమన్నా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి బైక్ పై తమన్నాను దించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా విజయ్ సేతుపతి ఈ కార్యక్రమం సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తను పడిన ఆకలి బాధలను తెలిపారు.అయితే తెలుగులో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమన్నా ఈ కార్యక్రమానికి న్యాయం చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో అలాంటి సందేహాలకు పులిస్టాప్ పెట్టినట్లు అయింది. ఇకపోతే మాస్టర్ చెఫ్ ఈ కార్యక్రమాన్ని తమిళంలో కూడా నిర్వహించనున్నారు. అయితే తమిళంలో హీరో విజయ్ సేతుపతి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగులో మాస్టర్ చెఫ్ కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన అందుకు గాను తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ సమాచారం.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ఎంతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3, గోపీచంద్ సిటీ మార్, నితిన్ మాస్ట్రో వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అనంత శ్రీరామ్ ఏ సినిమాలోని పాట రాయడానికి దాదాపు70 రోజుల సమయాన్ని తీసుకున్నాడు.?

కోటి కాంతులతో విరాజిల్లేది ఆ కోదండరాముడు అయితే లక్షల విలువచేసే అక్షరాలను లిఖించేది ఈ అనంత శ్రీరాముడు. సందర్భోచితంగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి వారి మాటలనే తన పాటలుగా చేసి సందర్భాన్ని, సంగతిని ప్రేక్షకుడి కళ్ళకు కట్టినట్టుగా వినసొంపుగా తన పాటలహరిలో పరవశింప చేస్తాడు.

 

ప్రేమ పాటలను అనంత శ్రీరామ్ అలవోకగా ప్రేక్షకుడి మనసుకు తాకేలా తన కలాన్ని కదుపుతాడు. ప్రేమికుల్లో ప్రేమికుడు అవుతాడు.వారి సరససల్లాపాలను సరిగమలతో చుట్టేస్తాడు. వారి విరహాన్ని విసుక్కుంటాడు. వారి విహారానికి పక్షి లాంటి రెక్కలు తొడుగుతాడు. ప్రేమికుల యెదలో చేరి అన్నీచేస్తూ ఉంటాడు. ఆ వయసులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం అని పలుకుతాడు. ప్రేమికుల మనసులో ఊహా ప్రపంచాన్ని నిర్మిస్తాడు. వారిని ఆనందడోలికల్లో ఊగిస్తాడు.

ఇలాంటి అందమైన అనుభూతి గల పాటలను రాసే అనంత శ్రీరామ్ కి ఒక సందర్భంలో బాహుబలి లోని ఒక పాట రాయడానికి ఆ సినిమా దర్శకుడు రాజమౌళి శ్రీరామ్ ని సంప్రదించాడు. అప్పుడు బాహుబలి లో తమన్నా మాహిష్మతి సామ్రాజ్య తిరుగుబాటు యోధురాలు అదేవిధంగా కథానాయకుడు ప్రభాస్ ఓ గిరిజన తెగలో పెరుగుతున్న యోధుడు. వీరి మధ్య ఏ భాష సరళిని వాడాలి గ్రామ్యమా గ్రాంథికమమా.? అన్నది ఒక అంశం.

ప్రభాస్ తమన్నా లు అన్యోన్యంగా ఉండేటప్పుడు ప్రభాస్ తమన్నాకు వేసిన పచ్చబొట్టు వారి కౌగిలింతలో కలిసేచోటా బావగర్భిత పాట రాయాలని రాజమౌళి చెప్పగా.. అనంత శ్రీరామ్ కి మరింత సమయం కావాల్సి వచ్చింది. అలా పచ్చబొట్టేసిన.. పిల్లగాడా అనే పాట రాయడానికి అనంత శ్రీరామ్ దాదాపు 70 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. బాహుబలి సినిమాలో అలాంటి పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.