Tag Archives: telugu film industry

Pawan kalyan: పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఉంగరం ప్రత్యేకత ఏమిటో తెలుసా..? పవన్ జాతకం మారబోతోందా?

Pawan kalyan: తెలుగు సినీ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ క్రేజ్ ఉందో మనందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. పవన్ కళ్యాణ్ ఒక వైపు హీరోగా సినిమాలు తీస్తూనే మరొకవైపు జనసేన పార్టీ అధినేతగా పార్టీ ప్రచారాల లో చురుకుగా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రెండు మూడు సినిమాలలో నటిస్తూ ఉన్నారు పవన్.

Pawan kalyan: పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఉంగరం ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

ఆ సినిమాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే జనసేన తొమ్మిదవ ఆవిర్భావ సభకు లక్షలాదిగా అభిమానులు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఆ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం సమయంలో వేలికి ధరించి ఉన్న ఉంగరం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ చేతికి పగడపు ఉంగరం ధరించాడని, మామూలుగా ఇలాంటి ఉంగరాలను జాతకంలో దోషాలు తొలగి పోవాలి అన్న ఉద్దేశంతో దరిస్తారు అని చెబుతూ ఉంటారు.

Pawan kalyan: పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఉంగరం ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి దైవభక్తి కూడా ఎక్కువే అన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటాడు. అలాంటి పవన్ కుడిచేతికి అలాంటి పగడపు ఉంగరం ధరించి కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఉంగరానికి సంబంధించి కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే పగడపు ఉంగరాన్ని దర్శకుడు త్రివిక్రమ్ సూచన మేరకే ధరించి ఉంటాడు అని కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అతి సన్నిహితుడు గా భావించే పవన్ కళ్యాణ్ స్నేహితుడు మాటను గౌరవించి ఆ ఉంగరాన్ని ధరించినట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జీవితాన్ని మారుస్తుందా….

మరి నాలుగు క్యారెట్స్ బరువున్న ఈ ఉంగరం పవన్ కళ్యాణ్ కు కెరీర్ పరంగా, రాజకీయపరంగా మంచి చేస్తుందా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా అధికారంలోకి తీసుకు వస్తుందా అని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఆ ఉంగరం ధరించడం పై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి అందరూ అనుకున్న విధంగా పవన్ దరించిన ఆ పగడపు ఉంగరం పవన్ కళ్యాణ్ జీవితాన్ని మార్చే పోతుందా? లేదా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాడు పవన్ కళ్యాణ్.

Adi Pinishetty: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఆది పినిశెట్టి.. వధువు ఎవరో తెలుసా?

Adi Pinishetty: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో, నటుడు ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆది పినిశెట్టి ఒకవైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు విలన్ క్యారెక్టర్ లలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఆది పినిశెట్టి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంది అంటే పెద్ద పెద్ద హీరోలు కూడా ఆది పినిశెట్టి ని వారి సినిమాల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆది పినిశెట్టి కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Adi Pinishetty: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఆది పినిశెట్టి.. వధువు ఎవరో తెలుసా?

ఇక అది సినిమాలో పాత్ర ఏదైనప్పటికీ ఆ పాత్రలో పూర్తిగా లీనమై తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అదేవిధంగా సినిమా సినిమాకు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది పినిశెట్టి. ప్రస్తుతం బోలెడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఆది పినిశెట్టి త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్న వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అతని సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఆది పినిశెట్టి గత కొంతకాలంగా నిక్కీ గల్రానీ తో కలిసి పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. నిక్కీ గల్రానీ గురించి అందరికి తెలిసిందే.

Adi Pinishetty: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఆది పినిశెట్టి.. వధువు ఎవరో తెలుసా?

ఈమె కూడా కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి ఇలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అలాగే ఈమె బుజ్జిగాడు సినిమా ఫిలిం సంజన గల్రానీ కి చెల్లెలు అన్న విషయం కూడా తెలిసిందే. ఇక నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి కలసి మలుపు అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలో వీళ్లిద్దరు మనసులో ఒకటి అయ్యాయని, అప్పటి నుంచి ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు అని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ జంట పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారట.

త్వరలోనే పెళ్లి ముహూర్తం ఫిక్స్..

వీరిద్దరి పెళ్ళికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కానుందట. ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన ఆది పినిశెట్టి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందస్తుగానే ఆది పినిశెట్టికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ విషయంపై ఆది పినిశెట్టి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇకపోతే ఆది పినిశెట్టి ప్రస్తుతం హీరో రామ్ పోతినేని నటిస్తున్న బుఆఫో 19 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరో రామ్ పోతినేని సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

Hero Nani – Nagashaurya: ఓకే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని, నాగశౌర్య… మరి గెలుపెవరిదో?

Hero Nani – Nagashaurya: సాధారణంగా ఒకే కథాంశం ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఒక లైన్ ప్రేరణగా తీసుకొని వివిధ రకాలుగా సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు.అయితే తాజాగా ఇలా ఒకే పాయింట్ తీసుకొని నాని, నాగశౌర్య ఇద్దరు ఒకే కథతో రెండు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

Hero Nani – Nagashaurya: ఓకే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని, నాగశౌర్య… మరి గెలుపెవరిదో?

కరోనా రాకముందు అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా కృష్ణ బృందా విహరి సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.ఈ సినిమాలో నాగసౌర్య బ్రాహ్మణ కుర్రాడుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపోతే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా అంటే సుందరానికి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Hero Nani – Nagashaurya: ఓకే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని, నాగశౌర్య… మరి గెలుపెవరిదో?

ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. ఇందులో కూడా నాని బ్రాహ్మణ కుర్రాడిగా సందడి చేయనున్నారు. ఇలా ఒకే కథతో రెండు సినిమాలతో ఈ ఇద్దరు హీరోలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ రెండు సినిమాలలో ఇద్దరు కూడా బ్రాహ్మణ కుర్రాళ్ళుగా కనిపించడమే కాకుండా వీరి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకే విధంగా ఉన్నట్లు సమాచారం.

అంచనాలను పెంచిన నాని….

మరి బ్రాహ్మణ గెటప్ ఈ హీరోలకు ఎవరికి కలిసి వస్తుంది.. బాక్సాఫీస్ దగ్గర ఎవరు ఎలాంటి విజయాలను అందుకుంటారో తెలియాల్సి ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న అంటే సుందరానికి సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Actress Rajani: నిన్నటితరం హీరోయిన్ రజిని టెన్త్ క్లాస్ కూడా చదువలేదని మీకు తెలుసా?

Actress Rajani: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా 150 సినిమాలలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిన్నటితరం హీరోయిన్ గురించి అందరికీ తెలిసిందే. ఈమె తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోలందరి సరసన నటించారు. తెలుగులో ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన తప్ప మిగిలిన అందరితోనూ నటించి మంచి గుర్తింపు పొందారు.

Actress Rajani: నిన్నటితరం హీరోయిన్ రజిని టెన్త్ క్లాస్ కూడా చదువలేదని మీకు తెలుసా?

ఇలా ఇండస్ట్రీలో ఒక ఒక సమయంలో అగ్ర హీరోయిన్ గా కొనసాగిన రజిని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ గృహిణిగా ఇంటికే పరిమితం అయి తన పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారగా కొనసాగిన ఈమె ఎంతో చాకచక్యంగా ఇంగ్లీష్ మాట్లాడుతారు.

Actress Rajani: నిన్నటితరం హీరోయిన్ రజిని టెన్త్ క్లాస్ కూడా చదువలేదని మీకు తెలుసా?

ఇలా ఇంగ్లీషులో ఏకధాటిగా మాట్లాడే రజినినీ చూస్తే ఈమె ఉన్నతమైన చదువులు చదువుకుందనీ భావిస్తారు. నిజానికి ఈమె పదవ తరగతి కూడా పూర్తి చేయలేదు. ఇలా పది కూడా పూర్తికాని రజిని ఏకదాటిగా ఇంగ్లీష్ మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

తమిళ సినిమాతో వెండితెరకు ఎంట్రీ…

రజిని పదవ తరగతి చదువుతున్న సమయంలో ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. 1984 లో డైరెక్టర్‌ మణివణ్ణన్ రజనిని ఎక్కడో చూసిన ఓ ప్రొడక్షన్ మేనేజర్ అమ్మాయి బాగుందని మణివణ్ణన్‌కు చెప్పాడు. దీంతో రజిని తల్లిదండ్రులకు కబురు పంపి తనకు సినిమాల్లో నటించే అవకాశాన్ని కల్పించారు.ఇలా తమ కూతురికి ఊహించని విధంగా సినిమా అవకాశం రావడంతో ఆమె తల్లిదండ్రులు కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొట్టమొదటిసారిగా హీరో మోహన్ సరసన “ఇళమే కాలందు” అనే తమిళ సినిమాలో నటించి వెండితెరకు పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమె సినిమాలలో నటిస్తూ అగ్రతారగా కొనసాగారు.

Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?

Trivikram -Pawan Kalyan:తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగా, కెరియర్ పరంగా ఉన్న స్నేహితులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మొట్టమొదటిసారిగా వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో వీరీ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పాలి. ఈ సినిమా నుంచి ఇండస్ట్రీలో వీరీ అనుబంధం అలాగే కొనసాగుతూ వస్తోంది.

Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?

మాటల మాంత్రికుడుగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజంగానే తన మాటలతో పవన్ కళ్యాణ్ ను తన మాయలో వేసుకున్నారు.పవన్ కళ్యాణ్ సినిమా అంటే తప్పనిసరిగా అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగస్వామ్యం ఉండాల్సిందే. ఇలా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస రీమేక్ చిత్రాలను చేస్తున్నారు.

Trivikram -Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా వాడుతున్న త్రివిక్రమ్…. మామూలు లేదుగా?

ఈ రీమేక్ చిత్రాలకు స్క్రీన్ప్లే అందించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉంది.అయితే ఈ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించడం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించారు.

బంగారు గనిలా పవన్ కళ్యాణ్…

ఇక ఈ సినిమా కోసం పని చేసినందుకుగాను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకంగా 20 కోట్ల రూపాయలను సంపాదించారు. సాధారణంగా ఒక డైరెక్టర్ సినిమా చేస్తే తీసుకునే పారితోషికాన్ని ఈయన స్క్రీన్ ప్లేకి మాత్రమే తీసుకున్నారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ మాయలోపడి రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకవైపు అభిమానులు రీమేక్ చిత్రాలు వద్దు అంటూ అభిమానులు మొత్తుకుంటున్నా ఈయన మాత్రం పూర్తి తెలుగు చిత్రాలను పక్కనపెట్టి వరుస రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.ఇక పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రానికి కూడా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ 20 కోట్ల వరకు డిమాండ్ చేశారని సమాచారం. ఇలా పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకొని త్రివిక్రమ్ కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. ఏదిఏమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ బంగారు గనిగా మారిపోయాడు.

Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?

Manchu Family: గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తరచూ ఏదో ఒక వార్తతో మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక ఇటీవలే మంచు విష్ణు, మోహన్ బాబు వద్ద హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తున్న నాగ శ్రీను అనే వ్యక్తి మంచు వారి ఆఫీసులో 5 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను దొంగలించాడు అంటూ పోలీసులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగ శ్రీను ని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తూ పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?

అంతేకాకుండా ఈ విషయంపై నాగ శ్రీను ఒక సెల్ఫీ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అధికార పక్షాలు వైరల్ అయిపోయింది. ఆ వీడియోలో నాగ శ్రీను తాను ఎటువంటి దొంగతనం చేయలేదని, అనవసరంగా మంచు ఫ్యామిలీ తనపై లేని నిందలు వేస్తోందని తెలిపాడు. అదేవిధంగా తనను మంచు ఫ్యామిలీ వారి చెప్పుకోలేని విధంగా చిత్రహింసలు పెట్టారు అని చెప్పుకొచ్చాడు.అలాగే నాగ శ్రీను ని మోహన్ బాబు కులం పేరుతో దూషించడమే కాకుండా సదరు వ్యక్తి తల్లిని కూడా అసభ్యకర రీతిలో మాట్లాడుతూ ప్రవర్తించాడు అని పోలీసులకు తెలిపాడు.

Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?

ఇక నాగ శ్రీను ఆ మాటలు చెప్పిన అప్పటినుంచి ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా ఇదే వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగ శ్రీను ని కులం పేరుతో దూషించిన మోహన్ బాబు, మంచు విష్ణు వెంటనే అతనికి క్షమాపణలు తెలపాలి అన్ని నాయి బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరికి మద్దతుగా బీసీ కుల సంఘాల నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారు. నాగ శ్రీను కి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. కానీ క్షమాపణ చెప్పకపోగా ఈ విషయం ఫై స్పందించడం గురించి పక్కన పెడితే అసలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

క్షమాపణలు తెలియజేయాలి…

దీనితో నాయి బ్రాహ్మణ సంఘాలు మరొకసారి ఈ విషయంపై స్పందించాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు ప్రభుత్వ అధికారులను కలిసి మంచు మోహన్ బాబు నాగ శ్రీనుకి క్షమాపణలు తెలపాలి అంటూ వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా నాగ శ్రీను చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని అనంతరం విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలి అని కోరాయి నాయి బ్రాహ్మణ సంఘాలు. దీనితో మరొకసారి మంచు బాబు ఫ్యామిలీ వార్తల్లోకెక్కింది. మరి ఈ సారి అయినా ఈ విషయంపై మంచు ఫ్యామిలీ స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి మరి. ఈ విధంగా మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు సోషల్ మీడియాలో నిలుస్తూ ట్రోలింగ్స్ కి గురవుతూ, నెటిజన్స్ ఆగ్రహానికి లోనవుతున్నారు. ఒకసారి మంచు విష్ణు సోషల్ మీడియాలో నిలువగా, మరొకసారి మంచులక్ష్మి, మరోసారి మంచు మోహన్ బాబు ఇలా ఒకరి తర్వాత ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

Naveen polishetty: బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా కష్టమని అన్నారు: నవీన్ పోలిశెట్టి

Naveen polishetty: కాలం మారుతున్న కొద్దీ సినిమాల్లో కథలు మారుతూ ఉంటాయి.అదేవిధంగా సినిమాలు చూసే అభిమానుల అభిరుచులు కూడా మారుతూ ఉంటాయి. అభిమానులు కూడా ఎప్పుడూ ఒకటే విధమైన కథలు కాకుండా రొమాంటిక్ గా, కామెడీ గా ఉన్న సినిమాలు ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే లాజిక్స్ అయినప్పటికీ కామెడీ ఉంటే చాలు అని భావిస్తూ ఉంటారు అభిమానులు. ఇక ఆ కోవలో వస్తున్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతుండటం విశేషాలు. అలాంటి లాజిక్ కథనాలతోతెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న చిత్రం జాతి రత్నాలు.

హీరో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వం విషయం తెలిసిందే.. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జోగిపేట శ్రీకాంత్ గా నటించి కడుపుబ్బా నవ్వించాడు నవీన్. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన నవీన్.. రెండో సినిమాగా జాతిరత్నాలు చేసి మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.

Naveen polishetty: బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా కష్టమని అన్నారు: నవీన్ పోలిశెట్టి

జాతి రత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్టి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఈ ఈ సినిమా విడుదల అయ్యి మార్చి 11 నాటికీ ఏడాది పూర్తి అయిన సందర్భంగా జాతిరత్నాలు తాజాగా చిత్రయూనిట్ సినిమా విశేషాలను మరోసారి గుర్తుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ నవీన్ పోలిశెట్టి. ఓ వీడియో షేర్ చేశాడు. జాతి రత్నాలు సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ మూవీ విడుదలయ్యే సమయానికి వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదు. కరోనా కారణంగా అప్పటికే చాలా వరకు థియేటర్లన్నీ మూతపడ్డాయి.

Naveen polishetty: బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా కష్టమని అన్నారు: నవీన్ పోలిశెట్టి

ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను..

అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మా సినిమా విడుదలైన మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి సూపర్ హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపాడు నవీన్ పొలిశెట్టి. అనంతరం తన తండ్రితో అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఒక్కడివే ఎలా రా అంటూ వాళ్ళ నాన్న తో చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోను అని తెలిపాడు నవీన్ పోలిశెట్టి.

Poonam Kaur: పవన్ కళ్యాణ్ ని తలుచుకుంటే సిగ్గు వచ్చేస్తుంది.. : పూనమ్ కౌర్..!

Poonam Kaur: పూనమ్ కౌర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో వినిపించే పేర్లలో పూనమ్ కౌర్ పేరు కూడా ఉంటుంది. ఏదో ఒక విషయం పట్ల పూనమ్ కౌర్ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎక్కువగా కాంట్రవర్సీలు వివాదాస్పద లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా రాజకీయంగా సినిమాపరంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈమె చేసే కొన్ని వాక్యలు కొన్ని కొన్ని సార్లు కాంట్రవర్సీ లకు దారి తీస్తూ ఉంటాయి.

అయితే సినీ ప్రేక్షకులకు నటిగా కూడా ఈమె సుపరిచితమే. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా మందికి సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీలు ద్వారానే ఈమె బాగా సుపరిచితం. చాలామంది ఈమెను కాంట్రవర్సి క్వీన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా పూనమ్ కౌర్ సమాజంలో జరిగే పలు విషయాల పట్ల కూడా స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె కొన్ని కొన్ని సార్లు ట్రోలింగ్స్ కు సైతం గురి అవుతూ ఉంటుంది.

Poonam Kaur: పవన్ కళ్యాణ్ ని తలుచుకుని సిగ్గు పడిన పూనమ్ కౌర్..?

తనపై వస్తున్న కామెంట్లను ఆమె చూసీచూడనట్టుగా వదిలి వేస్తూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఆమెపై మితిమీరి, అసభ్య పదజాలంతో కామెంట్ చేస్తే మాత్రం అటువంటి వారిని విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈమె తన ట్వీట్లతో సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా పూనమ్ కౌర్ నాతిచరామి సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

Poonam Kaur: పవన్ కళ్యాణ్ ని తలుచుకుని సిగ్గు పడిన పూనమ్ కౌర్..?

ఏం మాట్లాడినా తప్పు…

ఈ నేపథ్యంలోనే పూనం కౌర్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరు అవుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సిగ్గు పడింది.సదరు యాంకర్ పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలు చెప్పండి అనగా.. పవన్ కళ్యాణ్ గురించి ఏమి మాట్లాడినా తప్పే, ఏది మాట్లాడినా కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. అతని గురించి పాజిటివ్ గా మాట్లాడినా కూడా నెగిటివ్గా వార్తలను సృష్టిస్తూ తప్పుగా అర్థం చేసుకుంటారు అని తెలిపింది. అనంతరం ఆమె పవన్ గురించి మాట్లాడుతూ అయ్యో.. నాకు సిగ్గు వచ్చేస్తుంది దేవుడా! అంటూ పవన్ కళ్యాణ్ తలచుకుని సిగ్గు పడింది. అయితే కొందరు తన కెరీర్ ను నాశనం చేయడానికి ప్రయత్నించారని ఆ సమయంలో మానసికంగా ఎంతో నష్టాన్ని చవిచూశాయి అని తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ తో మీరు నటించారు కదా అని అడగగా..లేదు.. చాలామంది చేయనివ్వకుండా కొన్ని ప్రయత్నాలు చేశారు అని చెప్పుకొచ్చింది. పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి.

Poonam Kaur: పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడినా తప్పే:పూనమ్ కౌర్

Poonam Kaur: తెలుగు సినీ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అంతేకాకుండా పూనన్ కౌర్ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ తో తరచుగా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది పూనమ్ కౌర్.

Poonam Kaur: పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడినా తప్పే:పూనమ్ కౌర్

ఈ నేపథ్యంలోనే కొన్నిసార్లు ఆమె చేసే పలు వ్యాఖ్యలు అప్పుడప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు ఆమె ట్రోలింగ్స్ కి కూడా గురవుతూ ఉంటుంది. ఇక తన ఫై మితిమీరి ట్రోలింగ్స్ చేసేవారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు పూనం కౌర్ తనకు సంబంధం లేని విషయాల గురించి స్పందిస్తూ ఉంటుంది. రాజకీయాల గురించి, అదేవిధంగా సినిమాల గురించి ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది.

Poonam Kaur: పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడినా తప్పే:పూనమ్ కౌర్

ఈ నేపథ్యంలోనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ కౌర్ ను సదరు యాంకర్ పవన్ కళ్యాణ్ గురించి అడగగా కాంట్రవర్సి అంటూ సమాధానం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడిన, నెగిటివ్ గా మాట్లాడిన ప్రాబ్లమే అవుతుందని ఆమె తెలిపింది అయితే ఇంతకు ముందు అతనితో మీరు కలిసి నటించారు కదా అని యాంకర్ ప్రశ్నించగా..

ఇంకా మాట్లాడాలంటే సిగ్గేస్తుంది…

ఆ విషయంపై స్పందిస్తూ.. చాలామంది చేయనివ్వలేదు అని చెప్పుకొచ్చింది.. ఇంకా మాట్లాడుతూ అయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది.. దేవుడా,అంటూ పవన్ కళ్యాణ్ ను తలచుకొని నవ్వేసింది పూనమ్ కౌర్. ఇకపోతే పూనమ్ కౌర్ తాజాగా నటించిన చిత్రం నాతిచరామి. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత నాతిచరామి సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా క్రమంగా వరుసగా ఇంటర్వ్యూలకు పాల్గొంటోంది.

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?

Tollywood:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు మధ్య గత కొంత కాలం నుంచి టికెట్ల రేట్ల విషయంపై పలు వివాదాలు విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే నటుడు మోహన్ బాబు ఇలాంటి వివాదాలకు చోటివ్వకుండా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసి వారిని సన్మానించి మన ఇబ్బందులను తెలియచేయాలని వెల్లడించారు.

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?

అయితే అప్పుడు మోహన్ బాబు చెప్పిన విధంగానే ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని మరోసారి కలవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి సినిమా టికెట్ల రేట్లను పెంచాలని ఎన్నోసార్లు ఏపీ ప్రభుత్వానికి విన్నపం చేసిన ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్టు ప్రవర్తించింది.

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?

ఈ క్రమంలోనే మరోసారి చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి కొరటాల శివ తదితరులు వెళ్లి ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో చర్చించిన కొద్ది రోజులకు కొత్త జీవో విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం షరతులతో కూడిన టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర పరిశ్రమకు ఊరట లభిస్తుందని పలువురు సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

హాజరుకానున్న సినీ ప్రముఖులు…

ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమ పై సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి టాలీవుడ్ పెద్దలు కలిసి సన్మాన సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ డేట్స్ అడ్జస్ట్ అయినప్పుడే అసలు స్పష్టత రానుంది. ఇకపోతే గతంలో సీఎంతో మీటింగుకు మమ్మల్ని ఆహ్వానించలేదని పలువురు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ ను కలవడం కోసం ఎవరెవరు వెళ్తారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.