Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?
Tollywood:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు మధ్య గత కొంత కాలం నుంచి టికెట్ల రేట్ల విషయంపై పలు వివాదాలు విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే నటుడు మోహన్ బాబు ఇలాంటి వివాదాలకు చోటివ్వకుండా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసి వారిని సన్మానించి మన ఇబ్బందులను తెలియచేయాలని వెల్లడించారు.
అయితే అప్పుడు మోహన్ బాబు చెప్పిన విధంగానే ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని మరోసారి కలవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి సినిమా టికెట్ల రేట్లను పెంచాలని ఎన్నోసార్లు ఏపీ ప్రభుత్వానికి విన్నపం చేసిన ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్టు ప్రవర్తించింది.
ఈ క్రమంలోనే మరోసారి చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి కొరటాల శివ తదితరులు వెళ్లి ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో చర్చించిన కొద్ది రోజులకు కొత్త జీవో విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం షరతులతో కూడిన టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర పరిశ్రమకు ఊరట లభిస్తుందని పలువురు సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమ పై సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి టాలీవుడ్ పెద్దలు కలిసి సన్మాన సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ డేట్స్ అడ్జస్ట్ అయినప్పుడే అసలు స్పష్టత రానుంది. ఇకపోతే గతంలో సీఎంతో మీటింగుకు మమ్మల్ని ఆహ్వానించలేదని పలువురు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ ను కలవడం కోసం ఎవరెవరు వెళ్తారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…