Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు… కారణం అదేనా?
Tollywood:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు మధ్య గత కొంత కాలం నుంచి టికెట్ల రేట్ల విషయంపై పలు వివాదాలు విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే నటుడు మోహన్ బాబు ఇలాంటి వివాదాలకు చోటివ్వకుండా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసి వారిని సన్మానించి మన ఇబ్బందులను తెలియచేయాలని వెల్లడించారు.
అయితే అప్పుడు మోహన్ బాబు చెప్పిన విధంగానే ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని మరోసారి కలవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి సినిమా టికెట్ల రేట్లను పెంచాలని ఎన్నోసార్లు ఏపీ ప్రభుత్వానికి విన్నపం చేసిన ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్టు ప్రవర్తించింది.
ఈ క్రమంలోనే మరోసారి చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి కొరటాల శివ తదితరులు వెళ్లి ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో చర్చించిన కొద్ది రోజులకు కొత్త జీవో విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం షరతులతో కూడిన టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర పరిశ్రమకు ఊరట లభిస్తుందని పలువురు సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమ పై సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి టాలీవుడ్ పెద్దలు కలిసి సన్మాన సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ డేట్స్ అడ్జస్ట్ అయినప్పుడే అసలు స్పష్టత రానుంది. ఇకపోతే గతంలో సీఎంతో మీటింగుకు మమ్మల్ని ఆహ్వానించలేదని పలువురు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ ను కలవడం కోసం ఎవరెవరు వెళ్తారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…