Tag Archives: tollywood

‘టాలీవుడ్’లో రకుల్ ప్రీత్ సింగ్ నటించే చివరి సినిమా అదేనా..?

తెలుగులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించే చివరి సినిమా అదే అంటూ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది.. ఆ సినిమానే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా. కొండపొలంతో పాటు మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ హీరోగా రికార్డ్స్ బ్రేక్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కబడితే రిలీజ్ చేస్తారని సమాచారం.

మరి ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్‌ని టాలీవుడ్‌లో సక్సస్ ట్రాక్ ఎక్కిస్తుందా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్.కెరటం సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో పేరు తెచ్చుకున్న రకుల్ ఆ తర్వాత వరసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ ఇటు టాలీవుడ్‌లో.. అటు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగింది. మెగా హీరోలతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలతో సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.

ఆసమయంలో రకుల్ రెమ్యూనరేషన్ కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది.అయితే పూజా హెగ్డే, కీర్తిసురేష్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ వచ్చి క్రేజీ స్టార్స్‌గా మారడంతో రకుల్ క్రేజ్ తగ్గిపోయింది. బ్యాడ్ లక్ అన్నట్టుగా రకుల్ నటించిన సినిమాలు కూడా ఆసమయంలో హిట్ కాలేదు. ఇక సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన మన్మధుడు 2 సినిమా చేయడం.. ఆ సినిమా డిజాస్టర్ కావడం రకుల్ కెరీర్ మీద గట్టిగానే ప్రభావం చూపించింది.

అయినా నితిన్‌తో చెక్ సినిమా, క్రిష్ – వైష్ణవ్ తేజ్ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. దాంతో రకుల్ మళ్ళీ టాలీవుడ్‌లో తన సత్తా చూపిస్తుందనుకున్నారు. కానీ చెక్ సినిమా ఫ్లాపయి చెక్ పెట్టేసింది. ఇప్పుడు రకుల్ హోప్స్ అన్నీ క్రిష్ – వైష్ణవ్ తేజ్ సినిమా మీదే అంటున్నారు. కాగా బాలీవుడ్‌లో మాత్రం రకుల్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.. మరి క్రిష్ సినిమాతోనైనా ఈ అమ్మడు మళ్ళీ తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి..!!

మరో సారి రిపీట్ కానున్న సూపర్ హిట్ కాంబో..ఆ దర్శకుడితో నాని సినిమా..!!

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్. అంతే కాదు విభిన్న మైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చివరిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన వి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటించారు.

ఈ సినిమా పేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. వరుస సినిమాలతో దూసుకు వస్తున్నాడు నాని. ఇప్పటికే శివ నిర్వాణం దర్శకత్వం వహిస్తున్న టక్ జగదీష్ సినిమా ను పూర్తి చేసాడు. ఏ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా తర్వాత టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘అంటే .. సుందరానికీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఇదిలా ఉంటే త్వరలో మరో సినిమాతో రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చేసారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ లో వీళ్లీద్దరి కాంబోలో సినిమా రాబోతుందని అంటున్నారు. ఇక మారుతి ప్రస్తుతం గోపీచంద్ కథానాయకుడిగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను రూపొందిస్తున్నాడు. తనదైన యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా ఆయన రాశి ఖన్నాను తీసుకున్నాడు. గోపిచంద్ తో సినిమా కంప్లీట్ అయ్యాక నాని తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి…!!

‘ఇలాంటి ఆ వీడియోలు చూసి మీ కష్టాల్ని మర్చిపోండి’ : రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య కి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరీ ఈ మధ్య కాలంలో అయితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా గడుపుతోంది..ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన ఫాలోవర్స్ కి అలాగే ప్రజలకు దైర్యం చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ హీరోయిన్.. సమాజంలోని సమస్యల పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు ఆమె.

ఈ క్రమంలోనే తాజాగా కరోనా సెకెండ్ వేవ్ పరిస్థితి పై తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్ లో తన శైలిలో స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ ను ప్రస్తుతం నెటిజన్లు షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. ‘మనం మన బాధలను, ద్వేషాలను వంటి ఎమోషన్స్ ను లెక్కలేనంతగా మోసి మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కానీ కేవలం భాధ పడటానికి ఈ శరీరం లేదు కదా.. బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కొని ఆనందించడానికి మనం ఉన్నాం.

నిజమే ఇప్పుడున్న పరిస్థుతులను చూసుకుంటే మనమంతా ఇప్పుడు చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఐతే ఆలోచించండి ఈ కష్టకాలం మరెంతో కాలం ఉండదు. ఎక్కువ రోజులు ఉండని దాని గురించి ఎందుకు భయం. కాల ప్రవాహంలో ఏదైనా మర్చిపోవాల్సిందే, మారిపోవాల్సిందే.. అదే కాలానికి ఉన్న గొప్పదనం. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకే సంతోషంగా ఉండాలంటే ఏది చేయాలో అదే చేయండి. ఎక్కువుగా స్టాండప్‌ కామెడీ వీడియోలను, లేదా క్యూట్‌ పప్పీ(కుక్కపిల్ల)ల వీడియోలను చూసి మీ కష్టాలను మర్చిపోండి.

ముఖ్యంగా కరోనా జాగ్రత్తలు పాటించండి. సురక్షితంగా ఉండండి’ అంటూ మొత్తానికి రేణూ ఎంతో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది.ఇక ప్రస్తుతం రేణు దేశాయ్‌ బుల్లితెర పై ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే ఒక సినిమాని డైరెక్ట్ కూడా చేస్తోంది. ఆల్ రెడీ రేణు దేశాయ్ మరాఠీలో ఒక సినిమా తీస్తే.. అక్కడ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అందుకే తన సినీ దర్శకత్వ జర్నీని టాలీవుడ్ కు మకాం మార్చింది. తెలుగు సినిమా చేస్తే.. ఎంత లేదు అన్నా సినిమాకి ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ దొరుకుతుంది. పైగా పవన్ మాజీ భార్యగా ఇక్కడ సాంకేతిక బృందం అన్ని విధాలుగా సినిమా కోసం సహకరిస్తారు. ఈ కారణాల వల్లే రేణు తెలుగు సినిమా చేస్తోందట రేణు దేశాయ్..!!

నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి ఇంద్రజ..!!

బిగ్ బాస్ అనే రియాల్టీ షో బుల్లితెరపై ఎంతటి క్రేజ్ ని దక్కించుకుందో అందరికీ తెలిసిందే.. ప్రత్యేకంగా ఈ షో గురించి చెప్పేదేముంది.. ఇక ముఖ్యంగా తెలుగులో కూడా ఈ బిగ్‌ రియాల్టీ షోకి ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది… అందుకే ఈ షో ప్రతి సీజన్ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మరి ఇలాంటి షోలో పాల్గొనే అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోలేరు అనుకుంటాం. కానీ, ఈ షోను రిజక్ట్ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు.ఆ లిస్టులో మాజీ హీరోయిన్‌ ఇంద్రజ కూడా చేరింది. బిగ్‌ బాస్‌ నాల్గొ సీజన్‌ లో ఇంద్రజకు అవకాశం వచ్చిందట.

అయితే షోలో పాల్గొంటానికి ఆమె ఆసక్తి చూపించలేదట.ఒకప్పుడు హీరోయిన్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ, ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా రాణించలేదు, అలాగే ఎలివేట్ అవ్వాల్సిన స్థాయిలో కూడా ఆమె హీరోయిన్ గా ఒక వెలుగు వెలగలేకపోయింది. ఇక గతకొద్ది కాలంగా సినిమాలలో తిరిగి నటించడానికి ఆసక్తి చూపిస్తోన్న ఇంద్రజ, ఇటీవల బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కామెడీ షోకి జడ్జీగా కూడా కనిపిస్తోంది.

అయితే తాజాగా ఆమె ఓ చానెల్‌ కు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలోనే బిగ్‌ బాస్‌ షో పై తన మనసులోని మాటను మొత్తానికి బయట పెట్టింది ఈ సీనియర్ హీరోయిన్.మరి ఇంద్రజ మాటల్లోనే ‘నిజానికి ‘బిగ్‌ బాస్‌’ నాల్గో సీజన్‌ లో నాకు ఆఫర్‌ వచ్చింది. కానీ అప్పుడు నేను రాలేనని వారికీ చెప్పాను. అయితే బి బాస్ లోకి వెళ్లలేకపోవడానికి కారణం ఆ షో పై నెగిటివ్ భావన ఉండటం వల్ల కాదు. నా ఫ్యామిలీ ఇప్పటికీ చెన్నైలో ఉంటుంది. నేను నా ఫ్యామిలీని వదిలి.. నెలలు తరబడి నేను వేరే ప్రపంచంలో ఉండలేను అందుకే బిగ్‌బాస్‌లోకి వెళ్లలేదు’ అని చెప్పుకొచ్చింది.

మరి భవిష్యత్తులో మళ్ళీ బిగ్ బాస్ నుండి అవకాశం వస్తే వెళ్తారా అని అడిగితే.. ‘అవకాశం వచ్చినా నెను వెళ్లను. అయితే గెస్ట్‌గా అవకాశం వస్తే మాత్రం వెళ్తాను. అది కూడా డబ్బులు కోసం కాదు. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్‌ నాగార్జునని చూడడానికే వెళ్తా’ అంటూ చిలిపి నవ్వు నవ్వింది. అన్నట్టు ఇంద్రజ నాగార్జునతో ఓ సూపర్ హిట్ సాంగ్ లో ఆడిపాడింది. ఇక ఇంద్రజకు నాగ్‌ హోస్టింగ్‌ చాలా బాగా అని అనిపిస్తోందట. నాగ్ ఇప్పటికీ స్టైలీష్‌గా, అందంగా ఉన్నారు’ అంటూ నాగార్జున పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇంద్రజ…!!

శ్రీదేవి పెట్టిన కండిషన్స్ ని తట్టుకోలేక ఆ సినిమాలో హీరోయిన్ ని మార్చి చిరంజీవి ఎంత పెద్ద హిట్ కొట్టాడో తెలుసా..??

తెలుగు ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో హీరోగా అత్యున్నత స్థాయికి ఎదిగి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి..దాదాపు150 కి పైగా చిత్రాల్లో నటించిన చిరూ కి.. ఆయన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి… అలాంటి సినిమాల్లో ఒకటి కొండవీటి దొంగ చిత్రం. ఈ సినిమా పేరు వింటే మెగా ఫాన్స్ ఎంతో సంతోష పడతారు.

ఆరోజుల్లో యువకులకు ఈ సినిమా అంటే ఎంతో క్రేజ్ ఉండేది. తెలుగు పరిశ్రమను ఓ ఊపు ఊపడంతో పాటు తెలుగు సినిమా మీద ఇండియన్ సినిమా ఫోకస్ చేసేలా చేసింది.కొండవీటి దొంగ సినిమా గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్ర ఉంది. చిరంజీవి వరుస అపజయాలతో బాధపడుతున్న రోజుల్లో ఈ సినిమా వచ్చింది. కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం మీద త్రివిక్రమరావు నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ స్టోరీ అందించారు.

ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే రాశారు.ఈ సినిమాలో హీరోయిన్ పైనా చాలా డిస్కర్షన్ జరిగింది. మొదట శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారు. ఆమె ఎక్కువ కండీషన్లు పెట్టడంతో విజయశాంతిని సంప్రదించారు. తను ఓకే చెప్పడంతో ఆమె పేరును ఓకే చేశారు. విలన్ రోల్ కోసం అమ్రిష్ పురిని తీసుకున్నారు. ఆరోజుల్లో తొలి 70 ఎంఎం సినిమా కావడంతో చాలా జాగ్రత్తగా సినిమాను రూపొందించారు.ఇక ఈ సినిమాకు ఇళయ రాజా మ్యూజిక్ ఇచ్చారు. చిరు కెరీర్ లోనే ఈ సినిమా సంగీతం బెస్ట్ గా నిలిచింది.

సినిమాలోని అన్ని పాటలు మంచి విజయాన్ని సాధించాయి. ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పట్లో ప్రతి ఇంట్లో ఈ సినిమా పాటలే వినిపించాయి. ఈ సినిమా విజయాన్ని చూసి అగ్ర హీరోలు సైతం ఆశ్చర్యపోయారు అంటే కొండవీటి దొంగ పవరేంటో తెలుసుకోవచ్చు. ఇక నాగబాబు చిరంజీవి మధ్య ఉన్న ఫైట్. లాస్ట్ లో అమ్రీష్ పూరి, చిరంజీవి మధ్య ఉన్న ట్రైన్ ఫైట్ ఒక సంచలనం అయ్యాయి.ఈ సినిమా తొలి వారంలో రూ. 74 లక్షల షేర్ సాధించింది. అనంతరం వెనక్కి తిరిగి చూసుకోలేదు.దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది..!! 

లవ్ స్టోరీ రివీల్ చేసిన హీరోయిన్ ఇంద్రజ.. మతాలు వేరు.. కానీ?

ఒకప్పటి అందాల నటి హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో సహజసిద్ధమైన నవ్వులను పంచుతూ జడ్జి స్థానానికి న్యాయం చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ సందడి చేస్తున్న ఇంద్రజ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టారు.

ఈ సందర్భంగా ఇంద్రజ తన భర్త మహ్మద్ అబ్సర్‌తో ప్రేమ పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలను ముచ్చటించారు. నేను తెలుగు బ్రాహ్మణ అమ్మాయిని. ఇప్పటికీ కూడా బ్రాహ్మణ అమ్మాయి గానే ఉన్నాను. కానీ నా భర్త మాత్రం ముస్లిం. తన మనసుకు నచ్చిన ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ మనసుకి, మతానికి సంబంధం ఉండదు అంటూ ఈమె తెలిపారు.

ఆరు సంవత్సరాల నుంచి ఇద్దరం మంచి స్నేహితులుగా ఉంటూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తరువాతే, తను అన్ని విషయాలలో ఎంతో సపోర్ట్ గా ఉంటాడని నమ్మినప్పుడే అతడిని వివాహం చేసుకున్నాననే ఈ విషయాన్ని ఇంద్రజ తెలిపారు.మహ్మద్ అబ్సర్‌ కి ఇండస్ట్రీతో పరిచయం ఉంది. ఆయన రైటర్ గా, యాడ్ ఫిలిమ్ మేకర్ గా,పలు సీరియల్స్ లో కూడా నటించారు. అదేవిధంగా వారి కుటుంబానికి బిజినెస్లు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.ఇండియాలో ఆ బిజినెస్ లన్నీ తన భర్త , మామగారు చూసుకుంటే కాలిఫోర్నియాలో తన బావగారు చూసుకుంటారని తెలిపారు.

ఇంద్రజ తన భర్తతో కలిసి సినిమాల గురించి చర్చించుకుంటారని, నేను చేసే సినిమాలలో కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉండేదని, అయితే అది కొంతవరకు మాత్రమే ఉండేది. ఇప్పటివరకు తన భర్త ఇది చేయాలి, అది చేయకూడదనే ఎలాంటి షరతులు ఎప్పుడు పెట్టలేదని ఇంటర్వ్యూ సందర్భంగా ఇంద్రజ తెలిపారు.

అసలు ఆనందం పొందేది అక్కడ మాత్రమే అంటున్న నిధి అగర్వాల్!

నిధి అగర్వాల్ ఈ పేరు వింటే చాలు కుర్రకారు మతి పోతుంది. అక్కినేని యువ హీరో లైనా నాగ చైతన్య సవ్యసాచి,అఖిల్ మిస్టర్ మజ్ను వంటి సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈమెకు అవకాశాలు తగ్గినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులను సందడి చేస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన జోడీ కట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ విధంగా నిధి అగర్వాల్ నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులలో మాత్రం ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది.

సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకిలకు మత్తెక్కిస్తుంది. సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే ప్రతి ఒక్క ఫోటోలలో నిధి తన అందాలను చూపెడుతూ ఏమాత్రం తగ్గకుండా అభిమానులను అలరిస్తోంది. అదే విధంగా ఈ ముద్దుగుమ్మ అందాలకు ముగ్ధులైన అభిమానులు తమిళనాడులో ఏకంగా ఈమెకు గుడి కూడా కట్టించారు.

తాజాగా నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఎంతోమంది కుర్రకారుల మనసు కొల్లగొట్టింది. ఈ వీడియోలో నిధి ఫోటో షూట్ నిర్వహించారు. ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మతిపోయే కిక్కెక్కించే ఈ వీడియోకు నిధి” గుర్తుపెట్టుకోండి ఆనందం అనేది ఓ ప్రయాణం, గమ్యం కాదు” అనే క్యాప్షన్ జోడించింది. నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ ‘సలార్’ లో శ్రుతిహాసన్ రోల్ అదేనట..!!

టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లకు మళ్ళీ ఛాన్సులు రావడం చాలా కష్టం.. కానీ శ్రుతిహాసన్ కి మాత్రం ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.. గత కొంతకాలంగా అసలు సినిమా ఆఫర్లే లేని ఈ ముదురు భామకి ఇప్పుడు వరుస హిట్స్ వస్తున్నాయి.. ఈ ఏడాది ప్రారంభంలో రవితేజ సరసన క్రాక్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకుంది అందాల భామ శృతిహాసన్ . ‘క్రాక్’ సినిమా బాక్సాఫీసు వద్ధ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ హిట్‏తో శృతిహాసన్ తిరిగి ఫాంలోకి వచ్చింది. దీంతో ఈ అమ్మడుకి భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముందుగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ నటించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ సలార్‏లో శృతిహాసన్ నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం.

ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సలార్.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ ఇదే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో శృతి ఓ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం గా ఉండబోతుందని అంటున్నారు.

ప్రస్తుతం సలార్ సెట్ హైదరాబాద్ శివారులో రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం భారీ సెట్లను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కాబోతుంది…ఇక పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కనుక హిట్ అయితే మళ్ళీ శ్రుతిహాసన్ కి టాలీవుడ్ లో తిరుగుండదనే చెప్పాలి.అన్నట్టు ప్రభాస్ తో ఈ అమ్మడు నటించే తొలి సినిమా ఇదే కావడం విశేషం..!!

‘వకీల్ సాబ్’ లాభాల్లో పవన్ కి భారీ వాటా..ఎన్ని కోట్లో తెలుసా..??

అజ్ఞాత వాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి.. రాజకీయాల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు పవన్.. దానికి కారణం డబ్బు..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది..అయితే డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాన్న పవన్ కోరిక ‘వకీల్ సాబ్’తో తీరింది.

ఇప్పుడు ‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఇటు హీరో పవన్ కళ్యాణ్, అటు నిర్మాత దిల్ రాజు ఫుల్ హ్యాపీ అంట..ఎందుకంటే నాన్చి నాన్చి బయటకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది.వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో లాభాల పంట పండించింది.

ఈ సినిమా ఇప్పటిదాకా మొత్తం 150 కోట్ల వసూళ్లు సాధించినట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా.. ముందుగా అనుకున్న దాని ప్రకారం.. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కోసం రూ.50 కోట్ల పారితోషికంతోపాటు లాభాల్లో వాటా ఇస్తానని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడట..ఇప్పుడు అన్నీ పోను పవన్ కళ్యాణ్ కు లాభాల్లో వాటాగా మరో రూ.15 కోట్లు ఇచ్చినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అంటే వకీల్ సాబ్ సినిమాకు గాను పవన్ కు ఏకంగా రూ.65 కోట్ల పారితోషికం వచ్చిందన్న మాట..ఇక నిర్మాత దిల్ రాజుకు అన్నీ పోను రూ.50 కోట్లు లాభం వచ్చినట్టు సమాచారం.

ఇక ఇందులోంచి రూ.కోటి రూపాయలను వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ కు రెమ్యూనరేషన్ గా పంచినట్టు తెలుస్తోంది. ఇక పార్ట్ నర్ బోనీకపూర్ కు కూడా ఇందులోనే వాటా ఇవ్వనున్నారు.ఇలా ఒకే ఒక్క సినిమాతో నిర్మాత దిల్ రాజు, పవర్ స్టార్ పవన్ లాభాల పంట పండించుకున్నారు. వీరిద్దరికి ఈ సినిమా ఊహించని సంపదను తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ విషయం గురించే చర్చ సాగుతోంది.. !!

భారీగా పడిపోయిన ‘వకీల్ సాబ్’ కలెక్షన్లు.. కారణం ఏంటో తెలుసా..??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ.. నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.. ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 9 న విడుదలైన వకీల్ సాబ్ అభిమానుల అంచానలకు తగ్గట్టు బ్లాక్ బస్టర్ విజయంనమోదు చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల విరామం తర్వాత వచ్చినా.. ఆయన పవర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. కానీ సినిమా మొదలయినప్పటి నుంచి దీనికి కష్టాలు తప్పట్లేదు.

ఇప్పటికే ఈ సినిమా నటీనటులకు, ప్రొడ్యూసర్లకు కరోనా సోకింది. పవన్ కల్యాణ్‌, దిల్ రాజు, నివేథా తామస్ కరోనా బారిన పడ్డారు. విజయోత్సవాలు కూడా చేసుకోలేక పోయారు.ఇదిలా ఉంటే కరోనా వైరస్ ప్రకపంనలు సృష్టిస్తున్న నేపథ్యంలో బుధవారం నుండి తెలంగాణలో థియేటర్లన్నింటినీ మూసివేసింది తెలంగాణ ఎగ్జిబ్యూటర్ల అసోసియేషన్ సంఘం. కానీ ‘వకీల్ సాబ్’ విషయంలో మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చింది.

భారీ బడ్జెట్ సినిమా కావడతో దీనికి కొన్ని ఆంక్షలతో మినహాయింపు ఇచ్చారు. ఈ వారాంతం వరకు ‘వకీల్ సాబ్’థియేటర్లలో ఆడనుంది. అయితే సోమవారం నుండి ఈ సినిమాను కూడా ఆపేస్తారు.
కొన్ని థియేటర్లలో ఈరోజు నుంచే ‘వకీల్ సాబ్’ సినిమాను నిలిపివేశారు. ‘వకీల్ సాబ్’ మూవీకి వారం రోజులుగా సరైన రెస్పాన్స్ కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఉగాది తర్వాత నుంచి థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రావట్లేదు.

హైదరాబాద్ సిటీ సెంటర్ లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో కూడా 25మందికి మించి రావట్లేదు. దీంతో థియేటర్ యజమానులు క్లోజ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వకీల్ సాబ్‌కు పెద్ద నష్టమే చేస్తోంది. ఎందుకంటే ఈసినిమాకు 120కోట్ల దాకా షేర్ మార్కెట్ జరిగిందని సమాచారం. మరి అంత మొత్తంలో ఇప్పటికీ కూడా వసూలు చేయలేదు. ఇది పవన్ ఫ్యాన్స్ క పెద్ద దెబ్బే అని చెప్పాలి…!!