అజ్ఞాత వాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి.. రాజకీయాల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు పవన్.. దానికి కారణం డబ్బు..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది..అయితే డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాన్న పవన్ కోరిక ‘వకీల్ సాబ్’తో తీరింది.
ఇప్పుడు ‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఇటు హీరో పవన్ కళ్యాణ్, అటు నిర్మాత దిల్ రాజు ఫుల్ హ్యాపీ అంట..ఎందుకంటే నాన్చి నాన్చి బయటకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది.వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో లాభాల పంట పండించింది.
ఈ సినిమా ఇప్పటిదాకా మొత్తం 150 కోట్ల వసూళ్లు సాధించినట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా.. ముందుగా అనుకున్న దాని ప్రకారం.. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కోసం రూ.50 కోట్ల పారితోషికంతోపాటు లాభాల్లో వాటా ఇస్తానని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడట..ఇప్పుడు అన్నీ పోను పవన్ కళ్యాణ్ కు లాభాల్లో వాటాగా మరో రూ.15 కోట్లు ఇచ్చినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అంటే వకీల్ సాబ్ సినిమాకు గాను పవన్ కు ఏకంగా రూ.65 కోట్ల పారితోషికం వచ్చిందన్న మాట..ఇక నిర్మాత దిల్ రాజుకు అన్నీ పోను రూ.50 కోట్లు లాభం వచ్చినట్టు సమాచారం.
ఇక ఇందులోంచి రూ.కోటి రూపాయలను వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ కు రెమ్యూనరేషన్ గా పంచినట్టు తెలుస్తోంది. ఇక పార్ట్ నర్ బోనీకపూర్ కు కూడా ఇందులోనే వాటా ఇవ్వనున్నారు.ఇలా ఒకే ఒక్క సినిమాతో నిర్మాత దిల్ రాజు, పవర్ స్టార్ పవన్ లాభాల పంట పండించుకున్నారు. వీరిద్దరికి ఈ సినిమా ఊహించని సంపదను తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ విషయం గురించే చర్చ సాగుతోంది.. !!
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…