అజ్ఞాత వాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి.. రాజకీయాల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు పవన్.. దానికి కారణం డబ్బు..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది..అయితే డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాన్న పవన్ కోరిక ‘వకీల్ సాబ్’తో తీరింది.
ఇప్పుడు ‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఇటు హీరో పవన్ కళ్యాణ్, అటు నిర్మాత దిల్ రాజు ఫుల్ హ్యాపీ అంట..ఎందుకంటే నాన్చి నాన్చి బయటకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది.వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో లాభాల పంట పండించింది.
ఈ సినిమా ఇప్పటిదాకా మొత్తం 150 కోట్ల వసూళ్లు సాధించినట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా.. ముందుగా అనుకున్న దాని ప్రకారం.. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కోసం రూ.50 కోట్ల పారితోషికంతోపాటు లాభాల్లో వాటా ఇస్తానని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడట..ఇప్పుడు అన్నీ పోను పవన్ కళ్యాణ్ కు లాభాల్లో వాటాగా మరో రూ.15 కోట్లు ఇచ్చినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అంటే వకీల్ సాబ్ సినిమాకు గాను పవన్ కు ఏకంగా రూ.65 కోట్ల పారితోషికం వచ్చిందన్న మాట..ఇక నిర్మాత దిల్ రాజుకు అన్నీ పోను రూ.50 కోట్లు లాభం వచ్చినట్టు సమాచారం.
ఇక ఇందులోంచి రూ.కోటి రూపాయలను వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ కు రెమ్యూనరేషన్ గా పంచినట్టు తెలుస్తోంది. ఇక పార్ట్ నర్ బోనీకపూర్ కు కూడా ఇందులోనే వాటా ఇవ్వనున్నారు.ఇలా ఒకే ఒక్క సినిమాతో నిర్మాత దిల్ రాజు, పవర్ స్టార్ పవన్ లాభాల పంట పండించుకున్నారు. వీరిద్దరికి ఈ సినిమా ఊహించని సంపదను తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ విషయం గురించే చర్చ సాగుతోంది.. !!
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…