టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లకు మళ్ళీ ఛాన్సులు రావడం చాలా కష్టం.. కానీ శ్రుతిహాసన్ కి మాత్రం ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.. గత కొంతకాలంగా అసలు సినిమా ఆఫర్లే లేని ఈ ముదురు భామకి ఇప్పుడు వరుస హిట్స్ వస్తున్నాయి.. ఈ ఏడాది ప్రారంభంలో రవితేజ సరసన క్రాక్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకుంది అందాల భామ శృతిహాసన్ . ‘క్రాక్’ సినిమా బాక్సాఫీసు వద్ధ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ హిట్తో శృతిహాసన్ తిరిగి ఫాంలోకి వచ్చింది. దీంతో ఈ అమ్మడుకి భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముందుగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ నటించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ సలార్లో శృతిహాసన్ నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం.
ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సలార్.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ ఇదే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో శృతి ఓ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం గా ఉండబోతుందని అంటున్నారు.
ప్రస్తుతం సలార్ సెట్ హైదరాబాద్ శివారులో రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం భారీ సెట్లను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కాబోతుంది…ఇక పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కనుక హిట్ అయితే మళ్ళీ శ్రుతిహాసన్ కి టాలీవుడ్ లో తిరుగుండదనే చెప్పాలి.అన్నట్టు ప్రభాస్ తో ఈ అమ్మడు నటించే తొలి సినిమా ఇదే కావడం విశేషం..!!
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…