Tag Archives: tollywood

బంఫర్ ఆఫర్ కొట్టేసిన ఇస్మార్ట్ భామ..ఏకంగా ఎన్టీఆర్ కి జోడిగా..!!

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శశకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ తో పాటు యూత్ లో మాంచి క్రేజ్ ను దక్కించుకుంది నభా నటేష్…సినిమాలో తన అంద చందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.. ఈ సినిమా తో నభనటేష్ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది.

అందంతోపాటు నటనతో ఆకట్టుకున్న నభనటేష్ ఆతర్వాత రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ వయ్యారి యంగ్ హీరో నితిన్ తో జతకట్టనుంది. కుర్ర హీరో నితిన్ నటిస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ అంధాధున్ రీమేక్ మ్యాస్ట్రో సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో ఓ భారీ ఆఫర్ ను అందుకుందని తెలుస్తుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’​ వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఆ కలయికలో ఎన్టీఆర్ ​30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల ట్వీట్​ చేశారు. జూన్‌ రెండో వారం నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వాని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా నాభ నటేష్ నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ సినిమాతో మళ్ళీ నభా నటేష్ టాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు..మరి దీనిపై త్వరలోనే ఓ స్పష్టత ఇవ్వనుందట చిత్ర యూనిట్.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇప్పటికే క్లైమాక్స్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదల ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది..!!

ముద్దులు, హగ్గులతో గాల్లో తేలిపోతున్న బుట్టబొమ్మ.. కారణం ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో పూజ హెగ్డే ఒకరు. పూజా హెగ్డే నటించిన సినిమాలు విజయవంతం కావడంతో ఈమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బుట్టబొమ్మ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది.హీరోయిన్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పూజాహెగ్డే రోజురోజుకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది.

పూజా హెగ్డే తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే ఈమెకు మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. కేవలం సోషల్ మీడియా పరంగా, సినిమాల పరంగా ఎవరి జోలికి వెళ్ళకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ గతంలో ఒకసారి హీరోయిన్ సమంత విషయంలో పూజా హెగ్డే చేసిన కామెంట్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

సమంత ఏమీ అంత క్యూట్ గా కనిపించడం లేదంటూ ఈమె కామెంట్ చేశారు. తరువాత తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిపారు. మొత్తానికి ఈ బుట్ట బొమ్మ చేసిన కామెంట్ సమంత అభిమానుల మధ్య పూజ అభిమానుల మధ్య చిన్న యుద్ధంలా మొదలైంది. అప్పటి నుంచి అభిమానులు సమంతకు, పూజా హెగ్డే కు మధ్య పోలికలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ విషయంలో కూడా ఇద్దరు ఒకే స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు.

తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 13 మిలియన్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే కూడా 13 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకోవడంతో ఆమె గాల్లో తేలిపోతున్నారు. తన అభిమానులకు, ఫాలోవర్ లకు ముద్దులు, హగ్గులు ఎమోజీ లను షేర్ చేస్తున్నారు. అదేవిధంగా అందరికీ థ్యాంక్స్ లవ్లీస్.. అంటూ ఓ క్యూట్ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే పూజా హెగ్డే అఖిల్” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, ప్రభాస్ “రాధేశ్యామ్”,”ఆచార్య”చిత్రాలలో చేస్తున్నారు.

బుల్లితెరపై సందడి చేయనున్న రష్మిక -విజయ్ దేవరకొండ..

వెండితెరపై సెన్సేషనల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ రష్మిక జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై ఈ జోడీ చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వెండితెరపై వీరిద్దరి మధ్య జరిగిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు. ఈ విధంగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఇకపై బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు.

బుల్లితెరపై ఈ జంట కలిసి ఏ షోలోనో, లేదా ఏ కార్యక్రమంలోనూ నటించలేదు. ఈ జంట కలిసి ఓ కమర్షియల్ యాడ్ ద్వారా బుల్లితెరపై సందడి చేయనున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాణిజ్య ప్రచారకర్తగా కొనసాగుతున్న సబ్బుల తయారీ సంస్థకు ఇకపై విజయ్ దేవరకొండ -రష్మిక బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరించనున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరిపై ఇటీవల యాడ్ కి సంబంధించిన షూటింగ్ ముంబైలోని ఓ హోటల్లో చిత్రీకరించారు. ఈ యాడ్ కోసం బంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మోకాళ్లపై కూర్చుని రష్మికకు ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్లు ఉన్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ జంట కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా అందరిని ఫిదా చేసేలా ఉందని, కామెంట్లు పెడుతున్నారు. అయితే వీరిద్దరూ నటించిన ఈ కమర్షియల్ యాడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది

రష్మికకు ప్రపోజ్ చేసిన విజయ్ దేవరకొండ.. సీక్రెట్ మీట్ పై క్లారిటీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతోనే మంచి విజయాలను సొంతం చేసుకుని వరుస అవకాశాలతో దూసుకు పోతున్నారు. వీరిద్దరు జంటగా నటించిన “గీత గోవిందం”,”డియర్ కామ్రేడ్”చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో మనకు తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసిన ప్రేక్షకులు నిజంగానే వీరి మధ్య ఏదో నడుస్తోందని ఊహాగానాలు తీశారు.

కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఈ జంట మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీరిద్దరికీ వీలు దొరికినప్పుడల్లా బయట కలుస్తూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ముంబైలో ఓ రెస్టారెంట్లో ఈ జంట కెమెరా కంటపడటంతో అందరిలో ఉన్న అనుమానానికి మరింత బలం చేకూరింది.

ముంబై హోటల్ లో వీరిద్దరు జంటగా కనిపించడమే కాకుండా రష్మికా చేతిలో ఫ్లవర్ బొకే ఉండటంతో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి నటువంటి వీడియో బయటకు రావడంతో వీరిద్దరి సీక్రెట్ గా కలిసిన విషయం గురించి క్లారిటీ వచ్చింది.

ఇండస్ట్రీలో ఈ జంటకు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని ఒక కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్నారు. ఈ షూట్ ముంబైలోని ఒక రెస్టారెంట్లో జరిగింది. త్వరలోనే టెలికాస్ట్ కాబోయే ఈ యాడ్ కు సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ రష్మికకు మోకాళ్లపై కూర్చుని ఏదో గిఫ్ట్ ఇస్తూ ప్రపోజ్ చేస్తున్నట్టు ఉంది. ఈ వీడియోలో ఈ జంటను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.గత కొన్ని రోజుల నుంచి ఎంతో హాట్ టాపిక్ గా ఉన్న వీరు సీక్రెట్ మీటింగ్ గురించి మొత్తానికి ఈ విధంగా క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు.

వైరల్ గా మారిన పవన్ కళ్యాణ్ ..రేణు దేశాయ్ రొమాంటిక్ ఫోటో!

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో తీయని జ్ఞాపకాలు ఉంటాయి. అయితే ఆ జ్ఞాపకాలను అప్పుడప్పుడు నెమరువేసుకుంటూ ఎంతో సంబరపడిపోతూ ఉంటాము.ఈ ఇలాంటి సన్నివేశాలు సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి తీపి జ్ఞాపకాన్ని నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమకు బీజం పడింది కూడా ఈ సినిమానే ద్వారానే అని చెప్పవచ్చు. ఎంతో విజయం సాధించిన ఈ సినిమా ఏప్రిల్ 20, 2000 సంవత్సరంలో విడుదలయింది.సరిగ్గా ఈ సినిమా విడుదల అయ్యి 21 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నటి రేణు దేశాయ్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు.

బద్రి సినిమాలో యే చికీతా పాట అప్పట్లో ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. అయితే ఈ పాటకు సంబంధించిన ఓ స్టిల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. ”చికీతా షూటింగ్ చేస్తుండగా తీసిన పిక్ ఇది. ఇందులో నా దుప్పటా నాకు సన్ స్క్రీన్ నుంచి రక్షణ కల్పించగా.. పవన్ తో బాంబింగ్ ఫొటో” అంటూ తన ఇన్స్టాలో కామెంట్ పెట్టింది.

రేణు దేశాయ్ షేర్ చేసి ఈ ఫోటో చూసిన నెటిజన్లు మరోసారి పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ జోడి ఫోటో పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.

టాలీవుడ్ లో మరో భారీ మల్టీస్టారర్.. బాక్స్ బద్దలవ్వాల్సిందే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కి ఆ సినిమాల్లో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాలు ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే మరో భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధమవుతోందని అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది.


అల వైకుంఠపురములో సినిమాతో గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గీతా గోవిందం సినిమా తరువాత ఆ స్థాయి సక్సెస్ అందుకోని విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాలో నటిస్తున్నారు. తమ తరువాత సినిమాల ద్వారా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోలుగా ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

యాత్ర సినిమా దర్శకుడు మహేష్ వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడు యాత్ర 2 సినిమాను కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. యాత్ర సినిమాతో హిట్ కొట్టిన మహేష్ వి రాఘవ్ అద్భుతమైన స్క్క్రిప్ట్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అంటే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు శుభవార్త అనే చెప్పాలి.

అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ రగ్గుడ్ లుక్ తో కొత్తగా కనిపించనున్నారు. బన్నీకి జోడీగా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటిస్తున్నారు.

ఆ హీరో మీదకి చెప్పు విసిరారంటున్న సుధా చంద్రన్!

ప్రతి వారం ఈటీవీలో ప్రసారం అయ్యే “అలీతో సరదాగా” కార్యక్రమానికి సినీ సెలబ్రిటీస్ వచ్చి ఎన్నో విషయాలను గురించి తన అభిమానులతో పంచుకుంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలను సరదాగా అభిమానులతో పంచుకున్నారు. 1985వ సంవత్సరంలో సుధా చంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మయూరి చిత్రం ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంది అందరికీ తెలిసిందే.

ఈ చిత్రంలో కథానాయికగా సుధా చంద్రనే నటించగా కీలక పాత్రలో శుభాకర్‌‌ నటించాడు. ఇంకా ఈ సినిమాలో సుభా చంద్రన్ తన నటన ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించింది అంటే సినిమా విడుదలై 30 సంవత్సరాలు అవుతున్న సుధా చంద్రన్ ను చూడగానే మీరు మయూరి కదా అనేంతగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ప్రస్తుతం సుధా చంద్రన్ బుల్లితెర టీవీ షోలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సుధా చంద్రన్ “ఆలీతో సరదాగా” షోలో పాల్గొని ఆమె జీవిత విశేషాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.

ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఐఏఎస్ లేదా ఐఎఫ్‌ఎస్‌ అవుతే చూడాలని మా అమ్మ భావించింది. అనుకోకుండా నటిగా వెండితెరకు పరిచయం అయ్యానని సుధా చంద్రన్ తెలిపారు. ఇప్పుడు ఎంతోమంది బయోపిక్ చిత్రాలను మనం చూస్తున్నాం. కానీ 1985 సంవత్సరంలో మొట్టమొదటి బయోపిక్ చిత్రం “మయూరి” చిత్రాన్ని రామోజీరావు నిర్మించారని ఆమె తెలిపారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సుధా చంద్రన్ కంటే నన్ను మయూరిగానే ఎంతోమంది గుర్తు పడుతుంటారని తెలియజేశారు.

ఒకరోజు గుంటూరు ఫంక్షన్ లో పాల్గొనడానికి నేను, ఈ సినిమాలో హీరోగా నటించిన శుభాకర్‌‌ ఆ పంక్షన్ కు వెళ్ళాము. అక్కడ స్టేజ్ పై మేము ఉన్నప్పుడు కింద నుంచి ఎవరో శుభాకర్‌ పై చెప్పు విసిరారు. అంతేకాకుండా “మీరే కదా మయూరిని బాధపెట్టిన హీరో” అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సినిమాలలో మాత్రమే నటించానని, నిజ జీవితంలో ఆ వ్యక్తిని నేను కాదని చెప్పినప్పటికీ ప్రేక్షకులు అతని మాటలు నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు మయూరిని అంతలా ఇష్టపడ్డారని సుధా చంద్రన్ తెలిపారు. అంతేకాకుండా ఆమెకు యాక్సిడెంట్ అయిన సన్నివేశాలు, తన తల్లి మరణం? తన జీవిత భాగస్వామిని ఎలా కలుసుకున్నారనే విషయాలను గురించి తెలుసుకోవాలంటే ఈ నెల 28న ప్రసారం కాబోయే “ఆలీతో సరదాగా” కార్యక్రమాన్ని చూడాల్సిందే.

వకీల్ సాబ్ నుంచి మరో ఫోటో లీక్.. ‘అదిరిపోయే లుక్’లో పవన్ కళ్యాణ్, శృతి హాసన్!

సాధారణంగా కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు దర్శకనిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు తెలియనివ్వరు. అలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా విషయంలో మాత్రం సినిమాకు సంబంధించిన ఫోటోలు బయటకు విడుదల అవుతున్నాయి. అసలే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

తమ అభిమాన నటుడు నటించబోయే సినిమాలో ఎలా ఉంటుందోనని ఎంతో ఆతృతగా ఎదురు చూసే అభిమానులకు ఇలా ఫోటోలు లీక్ అవడంతో కొంతవరకు ఆనందంగానే ఉన్నా, చిత్ర బృందానికి మాత్రం ఎంతో ఇబ్బందిగా ఉందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫోటో లీక్ కావడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ సంఘటన జరిగి కొద్దిరోజులు గడవకముందే మరొక ఫోటోలు లీక్ అవడంతో చిత్ర బృందం ఈ విషయంపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడవ సినిమా అని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం లీక్ అవడంతో, పాట చిత్రీకరణకు సంబంధించిన ఫోటో అని తెలుస్తోంది. హిందీలో మంచి విజయం సాధించిన “పింకీ” చిత్రానికి రీమేక్ గా “వకీల్ సాబ్” చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.ఎస్.తమన్ సమకూర్చనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన “మగువా మగువా” అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సమంత పారితోషకం చూసి నోరెళ్లబెడుతున్న స్టార్ హీరోయిన్లు..?

సమంత.. ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ హీరోయిన్.. ఆతర్వాత తన నటనతో క్యూట్ నెస్ తో అందరిని ఆకట్టుకుంది. తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న ఈ భామ అక్కినేని వారి కోడలు అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ తన అభిమానులకు దగ్గర ఉన్న ఈ భామ సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెరపై, ఓటిటిపై యాంకర్ గా కూడా షోస్ చేస్తూ మరింత దగ్గరగా ఉంటుంది.

అందుకే మొన్నటి వరకు సినిమాకు 2 కోట్లు తీసుకునే ఈ హీరోయిన్ ఇప్పుడు ఓ రేంజ్ కు వెళ్ళిపోయింది. ఒక షో కి సమంత ఏకంగా అక్షరాల కోటి రూపాయల పారితోషకం అందుకుంది. విని షాక్ అవుతున్నారా..! నిజంగానే ఈ హీరోయిన్ అక్షరాల కోటి రూపాయిల పారితోషికం అందుకుంది. ఓటిటి ‘ఆహా’లో ప్రసారం అవుతున్న సామ్ జామ్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కి ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయలు పారితోషికం అందుకుంది.

పెళ్లి తర్వాత సమంత అసలు సినిమాల్లోకి రాదు అనుకుంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ లాక్ డౌన్ లో సైతం సమంత అభిమానులకు దగ్గరగా ఉంటూనే బోలెడన్ని అడ్వేర్టైజ్మెంట్లు చేసి కోట్లలో సంపాదించిది అంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు కూడా వైరల్ అయ్యాయి. ఇక లాక్ డౌన్ లో టెర్రాస్ గార్డెనింగ్, వంటకాలు చెయ్యడంతో పాటు మెగా కోడలు ఉపాసనతో కలిసి ప్రజలకు హెల్త్ టిప్స్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఈ లాక్ డౌన్ సఖీ అంటూ బట్టల షాప్ ని కూడా ప్రారంభించింది సమంత. ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో నటిస్తుంది. ఏది ఏమైనా అక్కినేని కోడలు అన్నిటిలోను ముందు ఉంటుంది అని అనడంలో సందేహం లేదు.

రానా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి!

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి తన నటన ద్వారా అందరినీ ఆకట్టుకుంది. కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలపై ఆమె దృష్టి సారించింది.ఫిదా సినిమాతో మంచి హిట్ ని సంపాదించుకున్న సాయిపల్లవి వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా చిత్రం “విరాట పర్వం”సినిమాలో హీరో రానా సరసన నటిస్తున్నారు.

తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి పల్లవి, విరాట పర్వం సినిమాలో రానా పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. విరాట పర్వం సినిమాలో ఎంతో కీలకమైన పాత్రలో తను నటిస్తున్నారు. సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరోయిన్ ది కీలక పాత్ర అయినప్పటికీ ముందుగా హీరోయిన్ల పేర్లను పెట్టడానికి ఇష్టపడరు. కానీ విరాటపర్వం టైటిల్ కార్డ్స్ లో తన పేరు కంటే నా పేరే ముందు ఉండాలని రానా చెప్పారు. రానా సమానత్వానికి విశ్వసించే వ్యక్తి అని ఇంటర్వ్యూ ద్వారా సాయి పల్లవి రానా గురించి తెలిపారు.

రానా లాంటి ఒక మంచి వ్యక్తితో ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు. అయితే ఈ రోజు రానా పుట్టిన రోజు కావడంతో విరాటపర్వం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విరాటపర్వం ఫస్ట్లుక్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య సరసన “లవ్ స్టోరీ” సినిమాలో కూడా నటిస్తున్నారు.