Categories: FeaturedMovie News

బుల్లితెరపై సందడి చేయనున్న రష్మిక -విజయ్ దేవరకొండ..

వెండితెరపై సెన్సేషనల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ రష్మిక జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై ఈ జోడీ చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వెండితెరపై వీరిద్దరి మధ్య జరిగిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు. ఈ విధంగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఇకపై బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు.

బుల్లితెరపై ఈ జంట కలిసి ఏ షోలోనో, లేదా ఏ కార్యక్రమంలోనూ నటించలేదు. ఈ జంట కలిసి ఓ కమర్షియల్ యాడ్ ద్వారా బుల్లితెరపై సందడి చేయనున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాణిజ్య ప్రచారకర్తగా కొనసాగుతున్న సబ్బుల తయారీ సంస్థకు ఇకపై విజయ్ దేవరకొండ -రష్మిక బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరించనున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరిపై ఇటీవల యాడ్ కి సంబంధించిన షూటింగ్ ముంబైలోని ఓ హోటల్లో చిత్రీకరించారు. ఈ యాడ్ కోసం బంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మోకాళ్లపై కూర్చుని రష్మికకు ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్లు ఉన్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ జంట కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా అందరిని ఫిదా చేసేలా ఉందని, కామెంట్లు పెడుతున్నారు. అయితే వీరిద్దరూ నటించిన ఈ కమర్షియల్ యాడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

8 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

8 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

8 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

8 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

8 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

8 hours ago