దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన హీరో టూ వీలర్ మోటార్స్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా హీరో మోటార్స్ కంపెనీలు మూతబడనున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న హీరో కంపెనీ ఈ విధంగా తమ సంస్థలన్నింటినీ మూసివేయడానికి గల కారణం కేవలం కరోనా మహమ్మారి అని చెప్పవచ్చు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసులు సంఖ్య అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ అమలు చేశారు . మరికొన్ని చోట్ల రాత్రి సమయాలలో కర్ఫ్యూ విధించారు.ఈ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితుల కారణంగానే కంపెనీ కొద్దిరోజులపాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు ప్రతి ప్లాంటు మూసివేసి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఈ విధంగా ప్లాంటు మూసివేసి ఉన్న సమయంలో మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసుకుంటామని కంపెనీ వెల్లడించింది. అదే విధంగా కంపెనీకి చెందిన అన్ని ఆఫీసులు కూడా మూసివేయడంతో తమ కంపెనీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ను నిర్వహిస్తున్నారు. ఈ విధంగా కంపెనీ వాహనాల తయారీలను నిలిపివేస్తే వాహనాలపై అధిక ఒత్తిడి పడే అవకాశాలు ఏమాత్రం లేవని తెలియజేసింది.
మే 1 తర్వాత యధావిధిగా ప్లాంటు తెచ్చుకున్న తర్వాత కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సదరు కంపెనీ తెలియజేసింది. ఇప్పటికే తమ కంపెనీ గురుగ్రామ్, ధారుహెరా, హరిద్వార్, హలోల్, చిత్తూరు, నీమ్రానా వంటి ప్రాంతాల్లో తయారీ ప్లాంట్లులు ఉన్నట్లు హీరో మోటార్స్ తెలిపారు
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సమస్యతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు…
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
ఐపీఎల్ 2026 సీజన్లో కీలక మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జట్టు ప్రాక్టీస్ సెషన్లో…
జుట్టు సంరక్షణలో చాలా మంది చేసే ఒక చిన్న పని — దువ్వడం. అయితే ఇది చిన్న విషయం అనిపించినా,…
వైశాఖ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడుతుంది. ఈ మాసంలో చేసే పూజలు, దానధర్మాలు విశేష ఫలితాలను…