దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన హీరో టూ వీలర్ మోటార్స్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా హీరో మోటార్స్ కంపెనీలు మూతబడనున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న హీరో కంపెనీ ఈ విధంగా తమ సంస్థలన్నింటినీ మూసివేయడానికి గల కారణం కేవలం కరోనా మహమ్మారి అని చెప్పవచ్చు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసులు సంఖ్య అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ అమలు చేశారు . మరికొన్ని చోట్ల రాత్రి సమయాలలో కర్ఫ్యూ విధించారు.ఈ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితుల కారణంగానే కంపెనీ కొద్దిరోజులపాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు ప్రతి ప్లాంటు మూసివేసి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఈ విధంగా ప్లాంటు మూసివేసి ఉన్న సమయంలో మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసుకుంటామని కంపెనీ వెల్లడించింది. అదే విధంగా కంపెనీకి చెందిన అన్ని ఆఫీసులు కూడా మూసివేయడంతో తమ కంపెనీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ను నిర్వహిస్తున్నారు. ఈ విధంగా కంపెనీ వాహనాల తయారీలను నిలిపివేస్తే వాహనాలపై అధిక ఒత్తిడి పడే అవకాశాలు ఏమాత్రం లేవని తెలియజేసింది.
మే 1 తర్వాత యధావిధిగా ప్లాంటు తెచ్చుకున్న తర్వాత కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సదరు కంపెనీ తెలియజేసింది. ఇప్పటికే తమ కంపెనీ గురుగ్రామ్, ధారుహెరా, హరిద్వార్, హలోల్, చిత్తూరు, నీమ్రానా వంటి ప్రాంతాల్లో తయారీ ప్లాంట్లులు ఉన్నట్లు హీరో మోటార్స్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…