దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన హీరో టూ వీలర్ మోటార్స్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా హీరో మోటార్స్ కంపెనీలు మూతబడనున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న హీరో కంపెనీ ఈ విధంగా తమ సంస్థలన్నింటినీ మూసివేయడానికి గల కారణం కేవలం కరోనా మహమ్మారి అని చెప్పవచ్చు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసులు సంఖ్య అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ అమలు చేశారు . మరికొన్ని చోట్ల రాత్రి సమయాలలో కర్ఫ్యూ విధించారు.ఈ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితుల కారణంగానే కంపెనీ కొద్దిరోజులపాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు ప్రతి ప్లాంటు మూసివేసి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఈ విధంగా ప్లాంటు మూసివేసి ఉన్న సమయంలో మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసుకుంటామని కంపెనీ వెల్లడించింది. అదే విధంగా కంపెనీకి చెందిన అన్ని ఆఫీసులు కూడా మూసివేయడంతో తమ కంపెనీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ను నిర్వహిస్తున్నారు. ఈ విధంగా కంపెనీ వాహనాల తయారీలను నిలిపివేస్తే వాహనాలపై అధిక ఒత్తిడి పడే అవకాశాలు ఏమాత్రం లేవని తెలియజేసింది.
మే 1 తర్వాత యధావిధిగా ప్లాంటు తెచ్చుకున్న తర్వాత కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సదరు కంపెనీ తెలియజేసింది. ఇప్పటికే తమ కంపెనీ గురుగ్రామ్, ధారుహెరా, హరిద్వార్, హలోల్, చిత్తూరు, నీమ్రానా వంటి ప్రాంతాల్లో తయారీ ప్లాంట్లులు ఉన్నట్లు హీరో మోటార్స్ తెలిపారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…