Tag Archives: trivikram srinivas

Mahesh Babu: యశోద హాస్పిటల్ ముందు మహేష్ కేరవాన్… ఏమైందంటూ ఆందోళనలో అభిమానులు!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కావాల్సి ఉండగా మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రెండవ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని హాస్పిటల్స్ సన్ని వేషాలను కూడా చిత్రీకరించాల్సి ఉండగా చిత్ర బృందం ఈ సన్నివేశాలను హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ షూటింగ్లో మహేష్ బాబు పూజా హెగ్డే పై చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా హాస్పిటల్లో షూటింగ్ చిత్రీకరించాల్సిన నేపథ్యంలో మహేష్ బాబు క్యారవాన్ యశోద హాస్పిటల్ ముందు కనిపించింది. దీంతో అభిమానులు కొంతపాటి ఆందోళనకు గురైనప్పటికీ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఇలా త్రివిక్రమ్ సినిమాలో మరోసారి హాస్పిటల్ సన్నివేశాలను పెట్టడంతో ఈయన గత సినిమా సన్నివేశాలనే పునరావృతం చేస్తున్నారు అంటూ నేటిజెన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.


Mahesh Babu:శరవేగంగా SSMB 28 చిత్రీకరణ…

ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో దాదాపు 11 సంవత్సరాలు తర్వాత సినిమా రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా మంచి విజయాలను అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Singer Sunitha: స్టార్ హీరోకి అక్కగా వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న సింగర్ సునీత!

Singer Sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి అందరికీ సుపరిచితమే ఈమె తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సునీత తనలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఈమె నటించబోతుందని, ఈ సినిమా ద్వారా ఈమె వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్ర చాలా కీలకంగా ఉండడంతో త్రివిక్రమ్ సునీతను సంప్రదించారని, సునీతకు కూడా ఆ పాత్ర నచ్చడంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సునీత వెండితెర ఎంట్రీ ఇవ్వబోతుందని తెలియడంతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Singer Sunitha: SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్….

ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే కృష్ణ ఇందిరా దేవి మరణించడంతో ఈ షూటింగ్ కొన్ని రోజులపాటు వాయిదా పడి తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించబోతున్నారు.

Bandla Ganesh: లాభాలు వచ్చే చోటే వ్యాపారం చేయాలి… మీరంతా అడుక్కు తింటున్నారా.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈయన ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బండ్ల గణేష్ ఎన్నో విషయాలను వెల్లడించడమే కాకుండా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో బండ్ల గణేష్ త్వరలోనే న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తానంటూ తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో న్యూస్ ఛానల్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో బండ్ల గణేష్ ఇంతెత్తున ఫైర్ అయ్యారు.

త్వరలోనే న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తామన్నారు కదా అంటూ యాంకర్ ప్రశ్నించగా డబ్బులు వచ్చే చోట, లాభాలు వచ్చే చోట వ్యాపారం చేయాలని ఆలోచించడంలో తప్పులేదు కదా అంటూ బండ్ల గణేష్ సమాధానం చెప్పారు.అయితే బాగా లాభాలు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించగా మరి మీరంతా అడుక్కుతింటున్నారా అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. మీకు చాలా కోపం వస్తున్నట్టుంది అంటూ మరోసారి యాంకర్ మాట్లాడటంతో కోపం రాదా.. కోపం ఇంతే రావాలని ఎక్కడైనా రాసుందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Bandla Ganesh: నేనే త్రివిక్రమ్ ను తిట్టాను…

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ పై కూడా ఈయన నోరు విప్పారు.గతంలో ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నుతిడుతూ ఒక ఆడియో లీక్ అయింది. అయితే గతంలో ఆ వాయిస్ నాది కాదన్న బండ్ల గణేష్ తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా ఆ వాయిస్ నాదే నేనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తిట్టాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.మొత్తానికి ఆ వీడియో పై స్పందించి బండ్ల గణేష్ నిజం ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: త్రివిక్రమ్ చేసిన పనికి మాటలు పడాల్సి వస్తుంది… డైరెక్టర్ పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోలలో ఈయన ఒకరు.ఇకపోతే నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక స్టార్ హీరో పుట్టినరోజు కనక వస్తే ఆయన నటించిన సినిమాలు తిరిగి విడుదల కావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే సెప్టెంబర్ రెండవ తేదీ జల్సా సినిమా ప్యారిస్ లో కూడా ప్రదర్శితం కానుంది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలుపుతూ ఒక నేటిజన్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై ‘లార్గో వించ్‌’ డైరక్టర్‌ జెరోమ్‌ సల్లే రీట్వీట్‌ చేశారు. అక్కడితో ఆగకుండా ‘పవన్‌ కోసం ఏదైనా బహుమతి కావాలా? ఏదైనా స్క్రిప్ట్ లాంటిది అంటూ రీ ట్వీట్ చేశారు.

‘లార్గో వించ్‌’ సినిమా ఆధారంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ హీరోగా అజ్ఞాతవాసి సినిమాని చేశారు. ఈ సినిమా పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా ‘లార్గో వించ్‌’ ఆధారంగా చేసే ఫ్లాప్ కావడంతో ఈ సినిమా డైరెక్టర్ జెరోమ్‌ సల్లే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ట్వీట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జెరోమ్‌ పై మండిపడుతున్నారు.

పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే చెప్పు కానీ మళ్ళీ ఫ్లాప్ అయిన సినిమాని గుర్తు చేస్తూ ఈ గుచ్చుడు ఏంది అంటూ కామెంట్లో చేస్తున్నారు. మరికొందరైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న పనికి ప్రస్తుతం
జెరోమ్‌ వల్ల ఇన్ని మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు.ఇక మరికొందరైతే ఈయన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీకు అజ్ఞాతవాసి సినిమా అంత బాగా నచ్చి ఉంటే ఇప్పటికీ ప్రింట్ అలాగే ఉంది వచ్చి పట్టుకెళ్ళూ అంటూ తమదైన శైలిలో కౌంటర్స్ ఇస్తున్నారు.

 

 

Pawan Kalyan: మర్చిపోదామన్న గుర్తు చేస్తున్నారుగా….

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ అజ్ఞాతవాసి సినిమా అంత డిజాస్టర్ సినిమా ఏదీ లేదని చెప్పాలి.ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా మర్చిపోవాలని ప్రయత్నాలు చేస్తున్న ఇలా ఈ సినిమా గురించి గుర్తు చేస్తూ ఆయన పుట్టినరోజు ఇలాంటి ట్వీట్లు చేయడంతో అభిమానులు కాస్త అప్సెట్ అయ్యారని తెలుస్తోంది.ఇకపోతే నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నారు.

Hero Tarun -Mahesh Babu: మహేష్ బాబు సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్న తరుణ్.. ఇందులో నిజమెంత?

Hero Tarun -Mahesh Babu: మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా విజయం అనంతరం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాని చేయనున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటేనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఖలేజా అతడు సినిమాలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే సినిమాలో కీలకపాత్ర ఉంటే ఇతర హీరో హీరోయిన్లను తీసుకోవడం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో మరో హీరో పాత్ర కూడా ఉండటంతో ఈ పాత్రలో నటించడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకప్పటి ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు తరుణ్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు సినిమాతో తరుణ్ ఇండస్ట్రీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Hero Tarun -Mahesh Babu: సంతోషంలో తరుణ్ ఫాన్స్…

ఈ విధంగా మహేష్ బాబు సినిమా ద్వారా తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియడంతో తరుణ్ అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ విషయం గురించి ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసేవరకు వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.

Anupama Parameswaran: ఆ హీరోతో కలిసి నైట్ సినిమాకి వెళ్లాను.. అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్?

Anupama Parameswaran: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయం అవసరం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని తాజాగా నిఖిల్ సరసన ఈమె కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సాధారణంగా ప్రతి ఒక్క నటి నటులు వారి సినిమా విడుదలైతే తప్పనిసరిగా విడుదలైన రోజు చూస్తారు. మరికొందరైతే వారి నటించిన సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎలా వస్తుందోనని దొంగ చాటుగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి రావడం చేస్తుంటారు.

ఈ విధంగానే అనుపమ పరమేశ్వరన్ శర్వానంద్ ఇద్దరు కలిసి నటించిన శతమానం భవతి సినిమా విడుదలైన రోజు వీరిద్దరూ కలిసి ఆ రోజు రాత్రి సినిమాకు వెళ్లారని,అయితే వీరిద్దరూ కలిసి నటించిన శతమానం భవతి సినిమాకు మాత్రం కాదంటూ ఈమె షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. మరి వీరిద్దరూ వీరి నటించిన సినిమా కాకుండా మరో ఏ సినిమాకు వెళ్లారని విషయానికి వస్తే…

Anupama Parameswaran: మెగాస్టార్ కి పెద్ద అభిమానిని…

శతమానం భవతి సినిమా విడుదలైన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా విడుదలైంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా చూడటానికి వెళ్లారని ఈమె వెల్లడించారు.ఇక తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టమని తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా కూడా అదేనని ఈ సందర్భంగా అనుపమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Nuvvu Naku Nachav: వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా గురించి అలాంటి టాక్ వచ్చిందా.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్?

Nuvvu Naku Nachav: విక్టరీ వెంకటేష్ ఆర్తి అగర్వాల్ జంటగా కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్.ఈ సినిమా ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమైన ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు.ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా కథ సిద్ధం చేశారు. ఈ కథ విన్నర్ వెంకటేష్ క్షణం కూడా ఆలోచించకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ లో బ్రహ్మానందం సన్నివేశాలు అవుట్ డోర్ షూటింగ్ లేదు కానీ కొందరు సూచనల మేరకు సురేష్ బాబు ఈ సన్నివేశాలను జత చేశారు.

ఇక ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ తండ్రి పాత్రలో నాజర్ రఘువరన్ వంటి నటులను పరిశీలించారు. అయితే ఈ పాత్రకు కేవలం నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే న్యాయం చేయగలరని భావించిన దర్శక నిర్మాతలు ఆయన కోసం ఎదురు చూశారు. ఆ సమయంలోనే ప్రకాష్ రాజ్ పై ఫిలిం ఛాంబర్ బ్యాన్ విధించింది. అయితే ఆయనకు ఆ బ్యాంక్ తొలగిపోయే వరకు వేచి చూసిన దర్శక నిర్మాతలు అనంతరం ఆయనతో ఈ సినిమా చేశారు.

రెండు వారాలు కూడా కష్టమే అన్నారు…

ఈ విధంగా ఈ సినిమా 190 నిమిషాల నిడివితో థియేటర్లో విడుదలైంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి కనబడచకపోవడంతో ఈ సినిమా ఫలితం ఆశాజనకంగా లేదని చెప్పాలి.అయితే మొదటి వారం ఈ సినిమా చూసిన ప్రేక్షకాభిమానులు ఈ సినిమా రెండు వారాలు కూడా థియేటర్లో ఆడడం కష్టమని భావించారు. అయితే రెండవ వారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు పుంజుకోవడమే కాకుండా హిట్ టాక్ సొంతం చేసుకుంది.వెంకటేష్ ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలబడిందని చెప్పాలి.

Trivikram Srinivas: భార్యతో కలిసి ఉన్నపలంగా సొంతూరుకు వెళ్లిన త్రివిక్రమ్.. కారణం?

Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇలా సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత గ్రామం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న కాళ్ళకూరు. అయితే ఈయన అప్పుడప్పుడు తన సొంత గ్రామానికి వెళుతూ ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఉన్నఫలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్య సౌజన్యతో కలిసి సొంత గ్రామానికి వెళ్లారు.

ఈ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్యతో కలిసి తన సొంత గ్రామమైన కాళ్ళకూరు వెళ్లడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఈ గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనార్థం త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు తమ సొంత గ్రామానికి వెళ్లారని తెలుస్తుంది. గురు పౌర్ణమి సందర్భంగా త్రివిక్రమ్ దంపతులు సొంత గ్రామానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

ఇకపోతే త్రివిక్రమ్ దంపతులు స్వామివారి దర్శనార్థం ఆలయానికి వెళ్ళగా ఆలయ పండితులు ఈ దంపతులను సాదరంగా ఆహ్వానించి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఈ దంపతులను సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఇకపోతే ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గురు పూర్ణిమ సందర్భంగా ఇలా తమ సొంత గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

మొదటిసారి పాన్ ఇండియా సినిమా నిర్మించబోతున్న త్రివిక్రమ్…

ఇకపోతే తాను ప్రతిఏటా స్వామి వారి దర్శనార్థం తన సొంత గ్రామానికి వస్తానని ఈ సందర్భంగా త్రివిక్రమ్ పేర్కొన్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురం సినిమా ద్వారా మంచి హిట్ కొట్టిన శ్రీనివాస్ ఇప్పటివరకు ఎలాంటి సినిమాలకు దర్శకత్వం వహించలేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకి దర్శక పర్యవేక్షకుడిగా బాధ్యతలు తీసుకున్నారు.త్వరలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది ఈ సినిమా ఆగస్టు 2వ వారం నుంచి షూటింగ్ పనులు జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

Tanikella Bharani: త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి రచయితలు అందరికీ రెమ్యూనరేషన్ పెంచాడు.. అప్పట్లో ఐదు వేలు మాత్రమే కానీ ఇప్పుడు.. : తనికెళ్ల భరణి

Tanikella Bharani: తనికెళ్ల భరణి ఎన్నో సినిమాలకు రచయితగా, ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ల భరణి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో తాను రచయితగా నటుడిగా ఉండటం వల్ల ఎంతోమంది నేను సెట్ లోకి వెళ్ళగానే ఒక కాలి పేపర్ ఇచ్చి నా డైలాగ్స్ నన్ను రాసుకోమని చెప్పేవారు.

రచయితగా నటుడిగా ఉండటం వల్ల ఇది నాకు చాలా డిసడ్వాంటేజెస్ గా ఉండేదని,మరికొందరైతే దారుణంగా మిమ్మల్ని పెట్టుకున్నది ఎందుకు సార్ అంటూ నా చేత డైలాగులు రాయించుకునే వారంటూ తనికెళ్ల భరణి ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే అప్పట్లో రచయితలకు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి ఈ సందర్భంగా ఈయన ప్రస్తావించారు.

అప్పట్లో రచయితలకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు. నేను రచయిత గా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో నాకు కేవలం ఐదు వేలు మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి రచయితలు ఇండస్ట్రీలోకి వచ్చారో అప్పుడే రచయితలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచారని తనికెళ్ల భరణి వెల్లడించారు.

డైరెక్టర్లకు సమానంగా…

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం రచయితగా పని చేస్తే ఆయన డైరెక్టర్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రచయితలకు డైరెక్టర్లకు ఒకే ఈ రకమైన ప్రాధాన్యత ఇస్తున్నారని, రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని తనికెళ్ళ భరణి వెల్లడించారు. అప్పట్లో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం రచయితలకు మంచి సంపాదన ఉంటుందని తనికెళ్ల భరణి వెల్లడించారు.

Trivikram Srinivas : త్రివిక్రమ్ సినిమాలో ఆ ఒక్క రోల్‌కు అసలు పాపులారిటీ రావడం లేదు.. కారణం అదేనా..?

మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగా అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు, పాటలు ఇలా ప్రతీ అంశం అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో.. దానికి ఎదురుంటే విలన్ పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో భాషకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. విలన్ పాత్రకైనా సరే ఓ ప్రాంతీయ భాష నేపథ్యాన్ని తీసుకొని ఆ భాషా నేపథ్యంలో చాలా గమ్మత్తైన పదాలను పేర్చి ఆసక్తికరమైన డైలాగులను రాస్తారు.

దీనికి ఉదాహరణగా చెప్పాలంటే అత్తారింటికి దారేది సినిమాలోని కోట శ్రీనివాస రావు పాత్ర. ఆ పాత్ర నిడివి సినిమాలో ఉండేది చాలా తక్కువ సేపే. అయినా పాత్ర తాలూకా స్వభావం మాత్రం చాలా ప్రభావం చూపించింది. ఇక పాత్రలో కోట అద్భుతంగా నటించారు. కోట పాత్రకు త్రివిక్రమ్ రాసిన డైలాగులు చాలా బావుంటాయి. అన్నేళ్ళ అనుభవం ఉన్న కోటకు కూడా ఓ పదం ఏంటో అర్థం కాక దాని అర్థం ఆ పదాన్ని ఏ ప్రాంతం వారు వాడతారో తెలుసుకునే ఆసక్తి కలిగించింది. ‘నీ బిడ్డ ప్రేమంటే అంత గౌరవిత్తన్నావ్.. నా బిడ్డ పెళ్లంటే గుడ్డెద్దుకంత గౌరవం లేదీడికి.. దాని పెండ్లికొండిన పల్లావ్ వాసన పదూళ్ళకి తగలాలనుకున్యా.. ఇప్పుడీ గొడవ నూరూళ్ళకు తెలిసిందీ.. ఎంత బగిసాట్లూ’ అని ఓ ఫ్లోలో డైలాగులు రాశారు.

ఈ పాత్ర, డైలాగులకు మంచి పేరొచ్చింది. ఈ పాత్ర పోషించిన కోటకు మంచి పేరు వచ్చి అందరూ ప్రశంసించారు. చాలా మంది ఈ పాత్రలో నటించిన కోట గురించి గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఈ డైలాగులో ఉన్న ఎంత బగిచాట్లు అనే మాటకు అర్థం తెలీలేదన్నారు ఓ సందర్భంలో కోట. దీనిబట్టి అర్థమవుతుంది.. త్రివిక్రమ్ ప్రతీ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో. అయితే, ఆయన సినిమాలలో ఒకే హీరోయిన్‌ను పదే పదే రిపీట్ చేస్తారని అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలలో హీరోయిన్ పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

Trivikram Srinivas :త్రివిక్రమ్ సెకండ్ లీడ్‌లో చేసే హీరోయిన్స్‌కు బలమైన పాత్రను రాయలేకపోతున్నారు

అయితే, ఆయన సినిమాలలో విలన్ పాత్రకు కూడా దక్కిన మంచి గుర్తింపు సెకండ్ లీడ్ రోల్ చేసే యంగ్ హీరోయిన్స్‌కు మాత్రం దక్కడం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ జల్సా సినిమాను రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఇందులో పార్వతీ మెల్టన్, కమిలినీ ముఖర్జీలు కీలక పాత్రలో కనిపించారు. పార్వతీని మంచి గ్లామర్ రోల్‌లో చూపించారు. ఓ సాంగ్ కూడా ఉంటుంది. కానీ, ఎందుకనో మళ్ళీ ఆమె కనిపించలేదు. ఆ పాత్రకు అంతగా పేరు దక్కలేదు. అలాగే అ.. ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించింది.

ఈ సినిమానే ఆమెకు తెలుగులో మొదటి సినిమా. ఇందులో సమంత, నితిన్ జంటగా నటించారు. సెకండ్ లీడ్ చేసిన అనుపమ ఇప్పుడు ఎవరికీ గుర్తు రాదు. అత్తారింటికి దారేది సినిమాలో కూడా ప్రణీత నటించిన సంగతి తెలిసిందే. పవన్‌తో మంచి డ్యూయట్ కూడా ఉంటుంది. కానీ ఆ సినిమాకు వచ్చిన పేరు ఎక్కువ శాతం సమంతకే. అజ్ఞాతవాసి సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా కీర్తి సురేశ్..సెకండ్ హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యూయేల్, అరవింద సమేత సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఈషా రెబ్బ సెకండ్ లీడ్‌లో, అల వైకుంఠపురములో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా నివేతా పేతురాజ్ కీలక పాత్రలో కనిపించారు. కానీ, ఈ సెకండ్ లీడ్ క్యారెక్టర్స్ చేసిన వారెవరు అంతగా పాపులర్ కాలేదు. ఎందుకనో త్రివిక్రమ్ సెకండ్ లీడ్‌లో చేసే హీరోయిన్స్‌కు కథలో అంత బలమైన పాత్రను రాయలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఈ కారణంగానే కొందరు ఆయన సినిమాలో సెకండ్ లీడ్ కోసం అడిగితే నో చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.