Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కావాల్సి ఉండగా మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రెండవ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని హాస్పిటల్స్ సన్ని వేషాలను కూడా చిత్రీకరించాల్సి ఉండగా చిత్ర బృందం ఈ సన్నివేశాలను హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ షూటింగ్లో మహేష్ బాబు పూజా హెగ్డే పై చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా హాస్పిటల్లో షూటింగ్ చిత్రీకరించాల్సిన నేపథ్యంలో మహేష్ బాబు క్యారవాన్ యశోద హాస్పిటల్ ముందు కనిపించింది. దీంతో అభిమానులు కొంతపాటి ఆందోళనకు గురైనప్పటికీ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఇలా త్రివిక్రమ్ సినిమాలో మరోసారి హాస్పిటల్ సన్నివేశాలను పెట్టడంతో ఈయన గత సినిమా సన్నివేశాలనే పునరావృతం చేస్తున్నారు అంటూ నేటిజెన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Mahesh Babu:శరవేగంగా SSMB 28 చిత్రీకరణ…
ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో దాదాపు 11 సంవత్సరాలు తర్వాత సినిమా రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా మంచి విజయాలను అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.