Tag Archives: tweet

Bindu Madhavi: బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసిన కోలీవుడ్ హీరో.. ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా ?

Bindu Madhavi: తెలుగు సినీ ప్రేక్షకులకు సినీ నటి అయిన బిందుమాధవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిందు మాధవి ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. మొదట ఆవకాయ బిర్యాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ హీరోయిన్ గా నటించిన బిందుమాధవి మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత బిందుమాధవి కొద్దిరోజుల పాటు తెలుగు సినిమాలలో నటించలేదు.

Bindu Madhavi: బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసిన కోలీవుడ్ హీరో.. ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

ఆ తరువాత కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే బిందు మాధవి ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిందు మాధవి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తోంది. బిగ్ బాస్ ద్వారా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది బిందు మాధవి.

Bindu Madhavi: బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసిన కోలీవుడ్ హీరో.. ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

మొదటి నుంచి కూడా ఓటింగ్ విషయంలో ముందంజలో ఉంటూ టైటిల్ హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ గా దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా బిందుమాధవి లవ్ ఫెయిల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బిందు మాధవి తమిళ్ హీరో అయిన హరీష్ కళ్యాణ్ తో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అయితే గతంలో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని జోరుగా ప్రచారం కొనసాగిన సంగతి మనకు తెలిసిందే.

బెస్ట్ విషెస్ టు మై డియర్…

తాజాగా హీరో హరీష్ కళ్యాణ్ బిగ్ బాస్ లో ఉన్న బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. దీంతో వీరిద్దరి పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. మాధవి ఇప్పటికే తమిళ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి మనందరికీ తెలిసిందే. హీరో హరీష్ కళ్యాణ్ కూడా అదే సీజన్ లో మరొక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వినిపిస్తున్నాయి. హీరో హరీష్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ.. బెస్ట్ విషెస్ టు మై డియర్ ఫ్రెండ్ బిందు మాధవి..యూ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rajamouli Thanks: ఉరుములతో కూడిన ప్రశంసలు కురిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు… రాజమౌళి ట్వీట్ వైరల్!

Rajamouli Thanks: గత నాలుగు సంవత్సరాల నుంచి రాజమౌళి ఎంతో ప్రాణం పెట్టి తెరకెక్కించిన RRR ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదలై అద్భుతమైన విజయాలను తన సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను దక్కించుకుంది. ఇలా సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున ఈ సినిమాపై స్పందిస్తూ అద్భుతమైన రివ్యూ ఇస్తున్నారు.

Rajamouli Thanks: ఉరుములతో కూడిన ప్రశంసలు కురిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు… రాజమౌళి ట్వీట్ వైరల్!

ఇప్పటికే స్టార్ సెలబ్రెటీలు చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, మంచు బ్రదర్స్,సుకుమార్, శంకర్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు. ఇక ఈ సినిమా ద్వారా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగి పోతున్నాయి.

Rajamouli Thanks: ఉరుములతో కూడిన ప్రశంసలు కురిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు… రాజమౌళి ట్వీట్ వైరల్!

ఈ విధంగా ఈ సినిమాపై ప్రతి ఒక్కరూ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేయడంతో వీరందరి ట్వీట్ల పై రాజమౌళి స్పందిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఉరుములతో కూడిన ప్రశంసలు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. మీ అందరి ప్రశంసలతో ఆనందంతో పొంగిపోతుంది అంటూ రాజమౌళి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

యూరప్ వెకేషన్ ప్లాన్ చేసిన జక్కన్నా…

ఇక మూడు సంవత్సరాలనుంచి జక్కన్న తన కుటుంబ సభ్యులు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేసారు.ఈ విధంగా ఈ సినిమాతో మూడు సంవత్సరాల నుంచి బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతో త్వరలోనే యూరప్ వెకేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఏప్రిల్ మొదటి వారంలో రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక 15 రోజుల పాటు యూరప్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

RRR Movie రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించిన మంచు బ్రదర్స్.. విష్ చేయడానికి ఏమీ లేదంటూ ట్వీట్!

RRR Movie: గత కొంత కాలం నుంచి మెగా కుటుంబానికి,మంచు కుటుంబానికి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. ఇక మా ఎన్నికల సమయంలో ఈ మనస్పర్ధలు మరింత ఎక్కువగా చోటు చేసుకున్నాయి.ఇక మెగా బ్రదర్ నాగబాబుకి మోహన్ బాబు కుటుంబానికి మధ్య ఏదో ఒక విషయం గురించి వివాదం వస్తూనే ఉంది.

RRR Movie రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించిన మంచు బ్రదర్స్.. విష్ చేయడానికి ఏమీ లేదంటూ ట్వీట్!

తాజాగా మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలలో భాగంగా మంచు మనోజ్ పరోక్షంగా మెగా బ్రదర్ నాగబాబు పై విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా మెగా కుటుంబానికి మంచు కుటుంబానికి మనస్పర్థలు ఉన్నప్పటికీ రామ్ చరణ్ నటించిన RRR సినిమాపై మంచు బ్రదర్స్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

RRR Movie రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించిన మంచు బ్రదర్స్.. విష్ చేయడానికి ఏమీ లేదంటూ ట్వీట్!

ఈ సందర్భంగా మనోజ్ స్పందిస్తూ ఇది ఎంతో గొప్ప సినిమా ఈసినిమాని జక్కన్న మలిచిన విధానం ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో ఎంజాయ్ చేశాను ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.ప్యూర్ విజువల్ ట్రీట్, ఇంత గొప్ప సినిమాను నిర్మించిన నిర్మాత డి.వి.వి దానయ్యగారికి థాంక్స్. కీరవాణిగారు అద్భుతమైన సంగీతం అందించారు అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.

రికార్డుల కోసం ఎదురు చూస్తున్న…

ఇక ఈ సినిమా గురించి విష్ణు స్పందిస్తూ… ఎన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తెలుగు సినిమాలో ఎంత గొప్ప సమయమో ఇది. ఇక్కడ విష్ చేయడానికి ఏమీ లేదు రాజమౌళి గారు నా సోదరులు, చరణ్, మొత్తం చిత్ర బృందానికి అభినందనలు అంటూ విష్ణు ట్వీట్ చేశారు.ఈ విధంగా ఈ సినిమా గురించి వీరిద్దరు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Poonam Kaur: ఏం జరిగినా భావోద్వేగాలతో పయనించాలని వస్తోంది … నాలుగు సంవత్సరాల కథ అంటూ… పూనమ్ ట్వీట్!

Poonam Kaur: నటి పూనమ్ కౌర్ ఏం చేసినా అది ఒక సంచలనంగా మారుతుంది.ఈమె పలు సినిమాల్లో నటిగా నటించినా రాని గుర్తింపు సోషల్ మీడియా వేదికగా వివాదాస్పదమైన ట్వీట్లు ద్వారా బాగా గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదో ఒక వార్త ద్వారా నిత్యం సోషల్ మీడియా వార్తల్లో నిలిచే పూనమ్ గత రెండు రోజుల నుంచి వరుస ట్వీట్లతో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

Poonam Kaur: ఏం జరిగినా భావోద్వేగాలతో పయనించాలని వస్తోంది … నాలుగు సంవత్సరాల కథ అంటూ… పూనమ్ ట్వీట్!

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా గురించి వాట్సాప్ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా పూనమ్ కౌర్ మరొక ట్వీట్ ద్వారా వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంచలనమైన పోస్ట్ చేశారు.

Poonam Kaur: ఏం జరిగినా భావోద్వేగాలతో పయనించాలని వస్తోంది … నాలుగు సంవత్సరాల కథ అంటూ… పూనమ్ ట్వీట్!

ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ… ఏం జరిగినా కూడా నేను భావోద్వేగాల గుండా ప్రయాణించాల్సి వస్తోంది ఇలా వెళ్లడం సులభమైన విషయం కాదు… నాలుగు సంవత్సరాల కథ అయితే తొలిసారిగా పాజిటివ్ అని తెలియడంతో ఈ పోస్ట్ చేస్తున్నాను. ఆ భగవంతుడు ప్రజలను షరతులు లేని ప్రేమ కొంచెం కృతజ్ఞత, బాధ్యతలతో ఆశీర్వదిస్తాడు అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి…


పూనమ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు. నాలుగు సంవత్సరాల కథ ఏంటి పాజిటివ్ రావడం ఏంటి అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా గత రెండు రోజుల నుంచి పూనమ్ సంచలనమైన ట్వీట్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

Poonam Kaur: అక్కా… బావ సినిమా సూపర్ హిట్.. వైరల్ గా మారిన పూనమ్ కౌర్ ట్వీట్!

Poonam Kaur: నటి పూనమ్ కౌర్ సినిమాలలో కొన్ని వివాదాల ద్వారానే ఎంతో ఫేమస్ అయ్యారు.ఇలా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ గత మూడు రోజుల నుంచి వరుస హిట్లతో సోషల్ మీడియా వార్తలలో నిలుస్తుస్తున్నారు.ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రిని కలవడం కోసం సినీ పెద్దలు వెళ్లి ఆయన ముందు చేతులు పట్టుకొని నిలుచుని మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు అంటూ ఈమె సంచలనమైన ట్వీట్ చేశారు.

Poonam Kaur: అక్కా… బావ సినిమా సూపర్ హిట్… చర్చనీయాంశంగా మారిన పూనమ్ ట్వీట్!

ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ గురించి వర్మ చేసిన కామెంట్లపై కూడా ఈమె స్పందిస్తూ మహిళలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదలైన తర్వాత పూనమ్ కౌర్ మరోసారి ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Poonam Kaur: అక్కా… బావ సినిమా సూపర్ హిట్… చర్చనీయాంశంగా మారిన పూనమ్ ట్వీట్!

తాజాగా పూనమ్ కౌర్ వాట్సప్ చాట్ కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే స్క్రీన్ షాట్ లో ఒక వ్యక్తి ఏదో స్టేటస్ పెట్టుకుని ఉండగా మరొక వ్యక్తి వాట్ ఇన్ అని అడుగగా ఆ వ్యక్తి సినిమాకొచ్చా అక్క… బావ సినిమా ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ ఎమోజీలను రిప్లైగా ఇచ్చారు. ఇక వాటికి సిగ్గుపడుతున్నట్టుగా నిజాయితీగా సినిమా రివ్యూ చెప్పమని అడుగుతారు.సరే అంటూ అవతలి వ్యక్తి రిప్లై ఇచ్చాడు.

సినిమా హిట్ నన్ను నమ్మండి…

అక్క సినిమా హిట్ నన్ను నమ్మండి ప్రామిస్ గా చెబుతున్నా అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వాట్సప్ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ పూనమ్ షేర్ చేయడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు ఈ అక్క ఎవరు.. తమ్ముడు ఎవరు.. అసలు బావ ఎవరు అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలు పెట్టారు. ఏది ఏమైనా పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేసినా లేదా పోస్ట్ పెట్టిన అది ఎవరి గురించి అని తెలుసుకోవడం కోసం నెటిజన్లు ఎన్నో తంటాలు పడుతుంటారు.మొత్తానికి ఈమె షేర్ చేసిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Poonam Kaur: ఆ డైరెక్టర్లు మహిళలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు… పూనమ్ ట్వీట్ వైరల్!

Poonam Kaur: నటి పూనమ్ కౌర్ సినిమాలలో కన్నా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్లు క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Poonam Kaur: ఆ డైరెక్టర్లు మహిళలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు… పూనమ్ ట్వీట్ వైరల్!

పూనమ్ కౌర్ ఏదైనా ఒక విషయం పై ట్వీట్ చేసింది అంటే అది ఎవరిని ఉద్దేశించి చేసిందనే విషయం తెలియక తల పీక్కుంటారు. ఈ క్రమంలోనే పూనమ్ తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంతో హుందాగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై వర్మ స్పందిస్తూ ట్వీట్ చేయడం మనకు తెలిసిందే.

Poonam Kaur: ఆ డైరెక్టర్లు మహిళలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు… పూనమ్ ట్వీట్ వైరల్!

ఈ క్రమంలోనే వర్మ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన స్పీచ్ లో ఇదే బెస్ట్ అంటూ చేసిన ట్వీట్ పై పూనమ్ స్పందించారు. ఈ సందర్భంగా ఈమె ట్వీట్ చేస్తూ ఒక దర్శకుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేస్తూ మూలగ… సైలెంట్ గా ఉండిపోతారు. మరొక దర్శకుడు ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.

అయితే ఈ ఇద్దరు దర్శకులు డబ్బులు ఇచ్చి బాడుగకు ఏజెంట్లను తెచ్చుకున్న వారే.

వీరిద్దరూ మహిళలను ఆయుధాలుగా చేసుకుని వాడుకుంటారని పూనమ్ ట్వీట్ చేశారు.ఇక ఈమె చెప్పిన ఆ ఇద్దరు దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ అని తెలిసిపోతుంది. మరోక దర్శకుడు ఎవరంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఆలోచనలో పడ్డారు. మొత్తానికి పూనమ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Poonam Kour: వాళ్ళ దగ్గర చేతులు కట్టుకోవడం బాధనిపించింది.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ ! వెంటనే డెలీట్..

Poonam Kour: పూనమ్ కౌర్.. ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు దగ్గర అవుతూ.. నెట్టింట ట్రోల్ అవుతూ ఉంటుంది. ఆమె నటించిన సినిమాలకు వచ్చిన ఫేమ్ కంటే.. వివాదాలతోనే ఎక్కువగా వార్తలో నిలుస్తుంటారు.

Poonam Kour: వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి…పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ !

ఇక ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు.. సినిమాలకు సంబంధించి విషయాలను ఆమె అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఇలా ఆమె ఇన్ స్టా, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. ఇలా చేసిన ట్వీట్లలో ఆమె ఒకానొక సమయంలో వైరల్ అవుతూ ఉంటాయి.

Poonam Kour: వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి…పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ !

తాజాగా ఆమె చేసిన ట్వీట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకు ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే.. ఇటీవల టాలీవుడ్ లో సినిమా టికెట్ల ధరలను పెంచాలని ఇండస్ట్రీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే సినీ పెద్దలు ఇటీవల సీఎం జగన్ ను కలిసిన విషయం విధితమే.

ఎంటర్‌‌టైన్మెంట్ రాజకీయాలుగా ..


అయితే అక్కడ సీఎం జగన్ దగ్గర చిరంజీవి లాంటి పెద్ద హీరోలు సీఎం జగన్ ను అభ్యర్థించారు సినిమా టికెట్ల రేట్లను పెంచమని. ఆ సీన్ నచ్చని పూనమ్ ఇలా రాశారు. అందులో ” నేను మనస్పూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు.. ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళను వాళ్ళు తక్కువ చేసుకొని చేతులు కట్టుకొని ఉండడం బాధనిపిస్తోంది. వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి” అని రాసి దానికి బ్రోకెన్ హార్ట్ సింబల్స్ జోడించింది. అయితే కాసేపటికే ఈ ట్వీట్ ని పూనమ్ డిలీట్ చేసింది. తర్వాత మరో ట్వీట్ చేసింది. అందులో ఇలా రాసి ఉంది. రాజకీయాలు వినోదం గాను, వినోదాలు రాజకీయాలుగా మారుతున్నాయని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్స్ వైరల్ గా మారాయి.

Pushpha Movie: మీమ్స్ స్టార్ అల్లు అర్జున్.. ఉత్తరాదిన పుష్ప ఫాలోయింగ్ మాములుగా లేదుగా!

Pushpha Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా ఓ రేంజ్ లో ప్రేక్షకులను సందడి చేస్తోందని చెప్పవచ్చు.దక్షిణాది రాష్ట్రాలలో అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది కనుక ఇక్కడ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Pushpha Movie: మీమ్స్ స్టార్ అల్లు అర్జున్.. ఉత్తరాదిన పుష్ప ఫాలోయింగ్ మాములుగా లేదుగా!

కానీ ఉత్తరాది రాష్ట్రాలలో పుష్ప సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడడంతో ప్రతి ఒక్కరు పుష్ప రాజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.హిందీలో ఈ సినిమా ఏకంగా వంద కోట్లను క్రాస్ చేసింది అంటే ఈ సినిమాకి ఏ స్థాయిలో క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లుఅర్జున్ డైలాగ్స్, మేనరిజమ్స్ మీమ్స్ క్రియేటర్ లకు చాలా పని చెప్పాయని చెప్పవచ్చు.

Pushpha Movie: మీమ్స్ స్టార్ అల్లు అర్జున్.. ఉత్తరాదిన పుష్ప ఫాలోయింగ్ మాములుగా లేదుగా!

పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే ఏకంగా భారత ప్రభుత్వమే ఇతని సినిమాలోకొన్ని ఫోటోలను ఉపయోగించుకొని మాస్క్ పెట్టుకోవడం వల్ల ప్రాధాన్యత ఏమిటి హెల్మెట్ ధరించడం వల్ల ప్రయోజనాలు గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తోంది. ఇక ఉత్తరాది రాష్ట్రాలలో చాలామంది పుష్ప స్టైల్లో మీమ్స్, వీడియోస్ క్రియేట్ చేసే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

వైరల్ గా మారిన వీడియోస్..

ఈ క్రమంలోనే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కేవలం హిందీలోనే కాకుండా గుజరాత్ లో కూడా పుష్ప మేనరిజం చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. గుజరాత్ లో ఏకంగా ప్రో కబడ్డీ టీమ్ కూడా పుష్ప రాజ్ ను లిమిటెడ్ చేసిందనే చెప్పాలి. పుష్ప సైడ్ ఎఫెక్ట్ కొదువులేదని చెప్పాలి. ఇలా పుష్ప వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

RGV: ఏపీ మంత్రి కొడాలి నాని పై సెటైర్ వేసిన వర్మ.. గుడివాడలో గోవా కల్చర్ అంటూ ట్వీట్..!

RGV: వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఏ విషయం గురించి మాట్లాడినా పెద్ద వివాదం చెలరేగుతోంది.నిన్న మొన్నటి వరకు సినిమా టికెట్ల వ్యవహారం పై ఏపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన వర్మ తాజాగా ఐశ్వర్య ధనుష్ విడాకుల విషయంపై స్పందించారు.

RGV: ఏపీ మంత్రి కొడాలి నాని పై సెటైర్ వేసిన వర్మ.. గుడివాడలో గోవా కల్చర్ అంటూ ట్వీట్..!

ఇదిలా ఉండగా తాజాగా వర్మ మరోసారి ఏపీ మంత్రి కొడాలి నాని పై వర్మ సెటైర్లు వేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..గుడివాడలో గోవా కల్చర్ తీసుకురావడం గురించి మంత్రి కొడాలి నానిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

RGV: ఏపీ మంత్రి కొడాలి నాని పై సెటైర్ వేసిన వర్మ.. గుడివాడలో గోవా కల్చర్ అంటూ ట్వీట్..!

గుడివాడలో గోవా కల్చర్ ను తీసుకువస్తూ గుడివాడ ప్రజలకు గోవాలో ఉన్నామనే ఫీలింగ్ కల్పించారని మంత్రి పై వర్మ సెటైర్ వేశారు. గుడివాడ ప్రజలను గోవా తీసుకువెళ్ళవచ్చు కానీ, గోవా వారిని గుడివాడ తీసుకురాలేము అంటూ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాకు తెలిసిన నాని నాచురల్ స్టార్ నాని..

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ట్వీట్ పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.గతంలో సినిమా టికెట్ల విషయంలో కొడాలి నాని స్పందిస్తే వర్మ నాకు ఈ కొడాలి నాని ఎవరో తెలియదు నాకు తెలిసింది కేవలం నాచురల్ స్టార్ నాని మాత్రమేనని తెలిపారు.ఈ విషయం పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ కొడాలి నాని ఎవరో తెలియదు అన్నారు మరి ఇప్పుడు ఎలా ట్వీట్ చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వర్మ గుడివాడను గోవాతో పోలుస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు.

Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!

Singer Chinmayi: గాయని చిన్మయి గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆమె సింగింగ్ తో పాటు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేస్తుంది. అయితే ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటుంన్నారు. మొన్న హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను ఈమె తప్పుపడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సంగతి తెలిసిందే.

Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!

ఇలా ఆమె స్త్రీల సమస్యలపై ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతుంది. అలాగే సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు.. వారు ఎదుర్కొంటున్న బాధలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ సమాజంలో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో చిన్మయితో పలువురు మహిళలు తమకు ఎదురైన సమస్యలను చెప్పగా.. వారికి ఆమె సూచనలు, సలహాలను ఇస్తూ వస్తోంది. దీనిలో కూడా ఎలాంటి మానసిక సంఘర్షణలకు చోటు లేకుండా చిన్మయి సలహాలు ఇస్తుంటారు.

Singer Chinmayi: ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది..! సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్..!

తాజాగా సింగర్ చిన్మయి తన ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో, హీరోయిన్‌ని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించినందుకు బాధితురాలికి పలువురు హీరోయిన్లు , సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు.

అయినా సినిమా అవకాశాలు రాలేదు..

వారిలో మలయాళ నటి పార్వతి తిరువోత్ కూడా ఒకరు. ఈ ఘటన తర్వాత పార్వతి పలు మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేసింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పోరాటం వల్ల తనకు సినిమా అవకాశాలు పోయాయని.. అంతకముందు తాను ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించానని.. అవి అన్నీ హిట్ అయ్యాయని.. అయినా సినిమా అవకాశాలు రాలేదని ఆమె చెప్పారు. ఆ పోరాటం వల్లే తనకు ఇలా జరిగిదంని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ.. అవకాశాలు రాలేదని.. అలాగే ఫైటింగ్ కూడా చేస్తూ.. హీరోయిన్ కు సపోర్ట్ చేసినందుకు తనను బెదిరించారని చెప్పింది. ప్రస్తుతం తాను రెండు సినిమాల్లోనే నటిస్తున్నానని చెప్పింది పార్వతి. ఈ విషయంపై గాయని చిన్మయి స్పందించింది. ‘‘పార్వతి లాంటి మంచి నటి నిజం చెప్పినందుకు సినిమా అవకాశాలు కోల్పోయింది. లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి పక్షాన మాట్లాడినందుకే అలాంటి నటికి ఈ పరిస్థితి ఏర్పడిందనేది నిజం. చాలామంది మహిళలు మౌనంగా ఉంటారు. ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది’’ అని చిన్మయి ట్వీట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, నటుడు దిలీప్ కుమార్ అరెస్టయి, బెయిల్‌పై తిరిగి వచ్చారు. జనవరి 18 వరకు అరెస్టు చేయరాదని కేరళ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.