Poonam Kour: పూనమ్ కౌర్.. ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు దగ్గర అవుతూ.. నెట్టింట ట్రోల్ అవుతూ ఉంటుంది. ఆమె నటించిన సినిమాలకు వచ్చిన ఫేమ్ కంటే.. వివాదాలతోనే ఎక్కువగా వార్తలో నిలుస్తుంటారు.
ఇక ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు.. సినిమాలకు సంబంధించి విషయాలను ఆమె అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఇలా ఆమె ఇన్ స్టా, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. ఇలా చేసిన ట్వీట్లలో ఆమె ఒకానొక సమయంలో వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా ఆమె చేసిన ట్వీట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకు ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే.. ఇటీవల టాలీవుడ్ లో సినిమా టికెట్ల ధరలను పెంచాలని ఇండస్ట్రీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే సినీ పెద్దలు ఇటీవల సీఎం జగన్ ను కలిసిన విషయం విధితమే.
అయితే అక్కడ సీఎం జగన్ దగ్గర చిరంజీవి లాంటి పెద్ద హీరోలు సీఎం జగన్ ను అభ్యర్థించారు సినిమా టికెట్ల రేట్లను పెంచమని. ఆ సీన్ నచ్చని పూనమ్ ఇలా రాశారు. అందులో ” నేను మనస్పూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు.. ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళను వాళ్ళు తక్కువ చేసుకొని చేతులు కట్టుకొని ఉండడం బాధనిపిస్తోంది. వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి” అని రాసి దానికి బ్రోకెన్ హార్ట్ సింబల్స్ జోడించింది. అయితే కాసేపటికే ఈ ట్వీట్ ని పూనమ్ డిలీట్ చేసింది. తర్వాత మరో ట్వీట్ చేసింది. అందులో ఇలా రాసి ఉంది. రాజకీయాలు వినోదం గాను, వినోదాలు రాజకీయాలుగా మారుతున్నాయని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్స్ వైరల్ గా మారాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…