Tag Archives: tweet

‘బోర్ కొడుతోంది’ అంటూ మంచు విష్ణు ట్వీట్.. ఏకిపారేసిన నెటిజన్లు..

కొన్ని రోజుల కిందటే మా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నో వివాదాల నడుమ విజయవంతంగా ఎన్నికలు ముగిసి.. అధ్యక్ష పీఠంపై మంచు విష్ణు కూర్చున్నారు. తాజాగా మంచు విష్ణు ఓ పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ట్రోల్స్ తో రెచ్చిపోతున్నారు. అసలేంటి ఆ ట్వీట్.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. గత రెండో రోజులుగా మళ్లీ ‘మా’ వ్యవహారాలు రచ్చకెక్కాయి.

మా కార్యాలయానికి తాళాలు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారని..ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు ఆరోగ్యం బాగాలేకపోతే.. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తుండగా.. మా అధ్యక్షుడు మాత్రం పట్టించుకోకపోవడంపై ట్రోలింగ్ జరిగాయి.

దీంతో మంచు విష్ణు దీనికి సమాధానంగా.. తాను ఆసుపత్రి వర్గాలతో మాట్లాడానని.. అతడికి అన్ని విధాలా అండగా ఉంటానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్వీట్ పై నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. ఇది పోస్టు చేసిన మరుసటి రోజే మంచు విష్ణు మరో పోస్ట్ వేశాడు.

బోర్ ఫీల్ అవుతున్నాను అంటూ తీరిగ్గా అలా సేద తీరుతున్న ఫోటోను షేర్ చేశాడు. ఇక దీనిపై కూడా నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. రకరకాల కామెంట్లతో ట్రోల్ చేసి పడేశారు. నీ సినిమాలు చూసినప్పుడు కూడా మాకు అదే ఫీలింగ్ అని.. మా బిల్డింగ్ కట్టించు బోర్ ఉండదు.. మోసగాళ్లు సీక్వెల్ తియ్ బోర్ కొట్టదు.. అంటూ అతడి ట్వీట్ పై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

అద్భుతం సినిమాపై చిరంజీవి ట్వీట్.. సంతోషంలో చిత్ర యూనిట్ సభ్యులు..

ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీలో విడుదలైన అద్భుతం సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ మెప్పిస్తోంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీలో టాప్ లో ట్రెంట్ అవుతోంది. ఈ సినిమా చూసిన వారికి సూపర్ గుడ్ ఫిల్మ్ అనే ఆలోచన వస్తుంది. అయితే దీనిలో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు.

మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 19న నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాను బడా హీరోలు సైతం మెచ్చుకుంటున్నారు. జీవిత రాజశేఖర్ కుమార్తెకు ఈ సినిమాలో మంచి మార్కులు పడ్డాయి. ఆమె నటనకు ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలో.. ఒకే ఫోన్ నంబర్ ను ఇద్దరు వ్యక్తులకు ఇస్తే..ఏం జరుగుతుంది.

ఆ నంబర్ ను కూడా హీరో, హీరోయిన్ల వద్దనే ఉంటాయి. ఇక వాళ్ల మధ్య ఎలా ప్రేమ మొదలవుతుంది.. అస్సలు అలా ఒకే నంబర్ ను ఇద్దరికి ఎలా ఇస్తారు.. ఇవన్నీ చక్కగా వివరించి.. సినిమాలో చూపించారు. తజాగా ఈ చిత్రం గురించి మెగస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీ తాను నిన్న రాత్రి సినిమా చూశానని.. ఇది ఒ​క న్యూ ఎంగేజింగ్‌ నోవెల్‌ సినిమా అని ట్వీట్ చేశారు… ఇంకా తేజ సజ్జా, శివానీల నటన చాలా ఇంప్రెసివ్‌గా ఉందన్నారు’’.

మూవీ చిత్ర సభ్యులకు కంగ్రాట్స్ చెప్పారు. ఇక తేజ సజ్జల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి కథలను ఎంచుకుంటూ.. హీరోగా దూసుకుపోతున్నాడు. బాలనటుడిగా అతడికి మంచి పేరు ఉంది. ఇంద్ర సినిమాలో అయితే చిరంజీవి బాల్యంలో ఉన్న క్యారెక్టర్ ను పోషించాడు. ఇక మెగాస్టార్ చేసిన ట్వీట్ కు తేజ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు.

మరోసారి బండ్ల గణేష్ పై నెటిజన్లు రెచ్చిపోయారు.. సంచలనంగా మారిన ట్వీట్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ అభిమాన హీరో, హీరోయిన్లకు చాలామంది దగ్గర అవుతున్నారు. తమ వ్యక్తిగత వివరాలను పంచుకోవడం.. కామెంట్లో అభిమానులు తమ స్పందనను తెలియజేయడం చూస్తున్నాం. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒకానొక సమయంలో ఆ ట్వీట్ లు వివాదానికి కూడా దారి తీస్తాయి.

సెలబ్రిటీలు చేసే ఆ చిన్న పొరపాటు కారణంగా అది పెద్ద సంచలనంగా మారడంతో పాటు.. తీవ్ర గొడవకు దారి తీస్తుంది. ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ విషయంలో అలానే జరిగింది. బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతడు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పప్పులో కాలేశాడు. దానిలో పరోక్షంగా అనిల్ రావిపుడిపై విమర్శించాడు. ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావాలనే చేశాడా.. అర్థం చేసుకుకోకుండా చేశాడా అనే సందేహంలో ఉన్నారు నెటిజన్లు.. ఏదేమైనా ఆ ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ రోజు అనిల్ రావిపుడి పుట్టినరోజు సందర్భంగా అతడు ఆయనకు శుభాకంక్షలు తెలిపాడు. ఆ ట్వీట్ చూసిన ఓ నెటిజన్ ఇలా ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ తో అనిల్ రావిపుడి చిత్రం ఉంటుందో.. ఉండదో.. పీకేతో మూవీ తీయొద్దు అన్ని చెప్పు అన్నా.. అంటూ ట్వీట్ చేశాడు.

దానికి బండ్ల గణేష్ ఇలా ట్వీట్ చేశాడు. మీ ప్రేమకు ధన్యవాదాలు అని అతను చెప్పాడు. నిజంగానే బండ్ల గణేష్ కు అనిల్ తో పవన్ కళ్యాణ్ సినిమా తీయడం ఇష్టం లేదనే సెన్స్ లో ఆ ట్వీట్ ఉంది. దీంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆ ట్వీట్ గందరగోళంగా మారింది. ఇదిలా ఉండగా దీనిపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.

విద్యార్థుల కష్టాలు తీర్చిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. ఒక్క ట్వీట్ తోనే..

బస్సులపై అసభ్యకర పోస్టర్లు అంటించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే.. వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ఇలా అతడు చేస్తున్న కార్యక్రమాలతో మర్పు స్పష్టంగా కనపడుతోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలపై సజ్జనార్ స్వయంగా స్పందిస్తూ.. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు పలు సంస్కరణలకు వీసీ సజ్జనార్ నాంది పలికారు. ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఎక్కువ మంది ఎక్కడికైనా వెళ్లాలంటూ.. బస్సులను బుక్ చేసుకునే వెసులు బాటును కూడా కల్పించారు. అంతేకాకుండా పెళ్లిళ్లకు ఆర్టీసీ బస్‌ను బుక్‌ చేసుకుంటే.. నూతన వధూవరులకు కానుకలు అందిస్తున్నారు.

బాలల దినోత్సవం సందర్భంగా 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు, ప్రయాణికులను ఆక‌ట్టుకునేందుకు సజ్జనార్‌.. ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు. తాజాగా మరో సమస్యకు పరిష్కారం చూపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న సమస్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి ట్వీట్ చేసింది.

విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు వీడియో తీసి పంపించారు. ఆ ట్వీట్ కు ఎండీ వెంటనే స్పందించి.. చర్యలు తీసుకోవాలని సంబంధిత డిపో అధికారులకు ఆదేశించాడు. వెంటనే వారి కి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. దీనితో 200 మంది విద్యార్థులకు ఉపశమనం కలిగినట్లు అయింది. దీంతో అతడికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

విడాకులపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. కాసేపటికే ఆ ట్వీట్ డిలీట్..!

ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఎస్‌వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత..అడపాదడపా పలు సినిమాల్లో నటించింది. కానీ ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. తర్వాత ఆమె చేసే సినిమాలు హీరోయిన్ పాత్రలను వదిలేసి.. హీరోయిన్ కు సైడ్ క్యారెక్టర్ లేదా సిస్టర్ క్యారెక్టర్లు చేస్తూ ఉంది.

అది కూడా గత కొంత కాలంగా వెండితెరకూ దూరంగా ఉంటూ వస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమె వేసే ప్రతి ట్వీట్‌పై, పెట్టే ప్రతి పోస్ట్‌పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తుంటారు. ఆమె తన అభిప్రాయాలను, ఫొటోలు, వీడియోలను ఫాలోవర్స్ తో పాటు.. ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఆమె విడాకుల అంశంపై ఓ విశ్లేషణాత్మక ప్రశ్నలను లేవనెత్తారు. అదేంటంటే.. ‘ విడాకుల అనంతరం పెయిన్ అనేది ఆడవాళ్లకు మాత్రమే ఉంటదా.. మగవాళ్లకు ఉండదా.. ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు..వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సొసైటీ పక్షపాత ధోరణితో ప్రొజెక్ట్ చేస్తుందా.. ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా?” అని పూనమ్ రాసుకొచ్చింది.

అయితే ఈ ట్వీట్‌ చేసిన గంట వ్యవధిలోనే పూనమ్‌ పోస్ట్‌ను డిలీట్‌ చేయడం గమనార్హం. అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది..? ఎందుకు డిలీట్ చేసింది..? విడాకుల అంశంపై ఇంత లోతైన పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం పట్ల ఆంతర్యం ఏంటన్నది అర్థం కావడం లేదు.

బస్సు కండక్టర్ వద్ద చిల్లర తీసుకోవడం మర్చిపోయిన విద్యార్థి.. చివరకు ఏమైందంటే?

ఇటీవల ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్ వివిధ రకాల సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ట్విట్టర్ ద్వారా ఎలాంటి అభ్యర్థనలు వచ్చినా స్పందిస్తున్నారు.

సమస్య గురించి ఎవరైనా ఫొటో తీసి పోస్టు చేస్తే.. దానిని 24 గంటల్లో పరిష్కరిస్తున్నారు. ఇటీవల అతడు బస్సులపై అసభ్యకరమైన పోస్టులు అంటించవద్దని వచ్చిన రిక్వెస్ట్ కు స్పందించి వెంటనే ఆ పోస్టర్లను తొలగించారు. అంతే కాకుండా ఇటీవల ఆర్టీసీ ఉద్యోగుల జీతాల విషయంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకొని వారికి నెలలో మొదటి తారీఖునే జీతాలు పడే విధంగా చర్యలు తీసుకున్నారు.

ఇక తాజాగా జరిగిన ఘటనలో ఓ వ్యక్తి టికెట్ తీసుకున్నాడు. సీతాఫల్‌ మండీకి చెందిన లిక్కిరాజు బాలానగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో బస్సులో ఎక్కి రూ.100 నోటు ఇచ్చాడు. దానికి చిల్లర లేకపోవడంతో ఆ కండక్టర్ టికెట్ వెనకాల రూ.80 రాసి ఇచ్చాడు. వాటని దిగే ముందు తీసుకోవాలని విన్నవించాడు. కానీ ఆ ప్రయాణికుడు ఆ బస్సు కండక్టర్ ను అడగడం మర్చిపోయాడు.

అయితే ఆ విద్యార్థి ఈ సమస్య గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. స్పందించిన ఎండీ జీడిమెట్ల డిపో మేనేజర్‌ మురళీధర్‌ రెడ్డిని పరిశీలించాలని ఆదేశించారు. అతడు దానిని పరిశీలించి నిజమని నిర్ధారించుకొని అతడి ఫోన్ పేకు రూ.80 చెల్లించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఎండీ సజ్జనార్ ను , డిపో మేనేజర్ ను ప్రశంసించారు.

రానా విరాట పర్వం గాసిప్ పై స్పందించిన బళ్లాల దేవుడు .. ట్వీట్ వైరల్..!

బళ్లాల దేవుడు రానా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం “విరాటపర్వం”. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. తాజాగా సాయి పల్లవి నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.

ఇకపోతే సాయి పల్లవి రానా నటించిన విరాట పర్వం సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ ఉండడంతో అభిమానుల సినిమా పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమా గురించి పలు పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సోషల్ మీడియా వేదికగా ఇన్ సైడ్ టాక్ అంటూ సినిమా గురించి లేనిపోని వార్తలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై ఆయన స్పందించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇన్ సైడ్ టాక్ విరాట పర్వం నుంచి సంగీత దర్శకుడు తప్పుకున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ పై స్పందిస్తూ రీ ట్వీట్ చేశాడు.

ఈ క్రమంలోనే రానా స్పందిస్తూ “ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది” అంటూ రానా గట్టిగా కౌంటర్‌ వేయడంతో సదరు నెటిజన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యి వెంటనే తాను చేసిన పోస్ట్ డిలీట్ చేశారు. ప్రస్తుతం రానా చేసిన రీట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల గురించి వస్తున్న ఈ విధమైనటువంటి వార్తలపై స్వయాన వారే స్పందించడం గమనార్హం.

ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది: నాగ చైతన్య

సోషల్ మీడియాలో సమంత నాగ చైతన్య దంపతుల గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే శనివారం సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య స్పందిస్తూ తాము వివాహ బంధం నుంచి విడిపోతున్నాం అని చెబుతూ… వారి విడాకుల గురించి అధికారిక ప్రకటన చేయడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు షాక్ కి గురయ్యారు.ఈ విషయం వెల్లడించిన తర్వాత చైతన్య మరోసారి సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి పోస్టులు చేయలేదు.

తాజాగా నేడు నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని ట్వీట్ చేశారు. అయితే తన సంతోషానికి కారణం ఏంటనే విషయానికి వస్తే… సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఇప్పటికి అపోలో హాస్పిటల్ లో ఉంటూనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడుతున్నారు.

తాజాగా నిన్న సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తాను ఆరోగ్యంగా ఉన్నానని, కోలుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పలువురు సెలబ్రిటీలు ఈ ట్వీట్ పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య సాయి తేజ్ ట్వీట్ పై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రేమతో అని నాగచైతన్య ట్వీట్ చేశారు.

సమంతతో విడాకులు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందించని నాగచైతన్య మొట్టమొదటిసారిగా సాయి తేజ ఆరోగ్యం గురించి స్పందించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సాయి తేజ్ ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు తన ఆరోగ్యానికి ఏ ప్రమాదం లేదని తెగ సంబర పడుతున్నారు.

ఒక్క ట్వీట్ తో చైతూ – సమంతల బ్రేకప్ అనుమానాలను మరోసారి పెంచేసిన సమంత..!

కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కంటే ముందు నుంచి నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీకి సంబంధించి పాటలు హల్ చల్ చేశాయి. లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే నేడు లవ్ స్టోరీకి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. సమంత, నాగ చైతన్యకు సంబంధించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్లిద్దరు విడిపోయారని.. విడాకులు కూడా తీసుకుంటున్నారంటూ కోడై కూస్తున్నాయి.

అయితే సమంత వాటికి అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టినట్టే కనిపించింది. ఎలా అంటే.. నాగ చైతన్య ట్విట్టర్ లో లవ్ స్టోరీ ట్రైలర్ పోస్ట్ చేయగా.. దానిని కోట్ చేస్తూ సమంత స్పందించారు. ఇక ట్రైలర్ పై ఆమె ‘విన్నర్’ అని కామెంట్ పెట్టింది. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపింది. ఆ కామెంట్ చూసి నెటిజన్లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టకేలకు అభిమానుల అనుమానాలకు ఒక్క ట్వీట్ తో తెరపడినట్లు అయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆ ట్వీట్ కేవలం లవ్ స్టోరీ సినీ బృందానికి, సాయి పల్లవికి మాత్రమే చెప్పినట్లు ట్యాగ్ చేశారు. ఇది మళ్లీ మరో వివాదానికి దారి తీస్తుందా..? ఇదిలా ఉండగా.. సమంత, నాగచైతన్యది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. ఏమాయ చేశావే సినిమాతో ఇద్దరు ప్రేమలో పడి.. పెళ్లి దాకా తెచ్చకున్నారు.

తాలిబన్లనై ఆర్జీవీ ట్వీట్.. వాళ్లు అలాంటి వారే అంటూ..!

ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. దాదాపు దేశం మొత్తం స్వాధీనం చేసుకున్నారు. కొన్ని దేశాల అండదండలతో వారు ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి వెళ్లిపోయారు. దీంతో అక్కడ అరాచకపాలన మొదలైంది. సైనికుడు, పౌరుడు అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్లు దాడులకు పాల్పడుతున్నారు. మహిళల విషయానికి వస్తే బలవంతపు పెళ్లిలు, లైంగిక దాడులు చోటుచేసుకుంటున్నాయి.

అయితే ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్‌లో జరుగుతోన్న పరిమాణాలపై ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. అమెరికా సైన్యాలు ఆఫ్గన్‌ను వీడడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. ఇక అక్కడ చిక్కుకున్న విదేశియలు వారితో పాటు స్వదేశీయులు కూడా దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఏ చిన్న అకకాశం దొరికినా ఉపయోగించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కాబూల్‌ నగరంలోని ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి విదేశాలకు వెళుతోన్న విమానాల రెక్కలపై వేలాడుతూ వెళుతోన్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నాయి. ఇదిలా ఉంటే సుమారు 20 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న తాలిబన్లు మళ్లీ అధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకోవడంతో రచ్చ చేస్తున్నారు. అధ్యక్ష భవనంలో వారు చేస్తున్న హంగామా అంతాఇంతా కారు. అయితే టాలీవుడ్ లో కాట్రవర్సీటీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాలిబన్ల వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు.

తాలిబన్లు అధ్యక్ష భవనంలో చేతిలో ఆయుధాలు పట్టుకొని జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోని షేర్‌ చేస్తూ.. ‘వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని’ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. అక్కడ ప్రతీ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకున్న తాలిబన్లు కాబుల్ లోని ఓ ఎమ్యూజ్ మెంట్ పార్కులో ఎలక్ట్రిక్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలులాగా ఆడారు. ఆ వీడియోను ఆర్జీవీ షేర్ చేస్తూ.. ఇది నిజమే.. తాలిబన్లు చిన్ని పిల్లలు అంటూ స్పందించారు. అయితే ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా పాజిటివ్ గా స్పందించారు.