కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కంటే ముందు నుంచి నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీకి సంబంధించి పాటలు హల్ చల్ చేశాయి. లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే నేడు లవ్ స్టోరీకి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. సమంత, నాగ చైతన్యకు సంబంధించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్లిద్దరు విడిపోయారని.. విడాకులు కూడా తీసుకుంటున్నారంటూ కోడై కూస్తున్నాయి.
అయితే సమంత వాటికి అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టినట్టే కనిపించింది. ఎలా అంటే.. నాగ చైతన్య ట్విట్టర్ లో లవ్ స్టోరీ ట్రైలర్ పోస్ట్ చేయగా.. దానిని కోట్ చేస్తూ సమంత స్పందించారు. ఇక ట్రైలర్ పై ఆమె ‘విన్నర్’ అని కామెంట్ పెట్టింది. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపింది. ఆ కామెంట్ చూసి నెటిజన్లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎట్టకేలకు అభిమానుల అనుమానాలకు ఒక్క ట్వీట్ తో తెరపడినట్లు అయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆ ట్వీట్ కేవలం లవ్ స్టోరీ సినీ బృందానికి, సాయి పల్లవికి మాత్రమే చెప్పినట్లు ట్యాగ్ చేశారు. ఇది మళ్లీ మరో వివాదానికి దారి తీస్తుందా..? ఇదిలా ఉండగా.. సమంత, నాగచైతన్యది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. ఏమాయ చేశావే సినిమాతో ఇద్దరు ప్రేమలో పడి.. పెళ్లి దాకా తెచ్చకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…