Tag Archives: upasana

Upasana: రామ్ చరణ్ పై రివేంజ్ తీర్చుకుంటున్న ఉపాసన… వైరల్ అవుతున్న వీడియో!

Upasana: ఇండస్ట్రీలో మెగా హీరో రామ్ చరణ్,ఉపాసన దంపతులకు ఎంతో మంచి క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్నారు. ఇలా ఈ ఇద్దరు సెలబ్రిటీలకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎంతోమందికి ఆరోగ్యానికి సంబంధించిన విలువైన సూత్రాలను చెబుతూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉన్నటువంటి ఉపాసన కొన్నిసార్లు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇలా తరచూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ఉపాసన తాజాగా ఒక ఫన్నీ వీడియో షేర్ చేశారు అయితే ఇందులో రామ్ చరణ్ పై ఈమె రివెంజ్ తీర్చుకుంటున్నట్లు ఉంది.

నేటిజన్స్ రామ్ చరణ్ ఉపాసనకు సంబంధించిన రెండు వీడియోలను కలిపి ఒక వీడియోగా క్రియేట్ చేశారు అయితే ఈ వీడియోని సరదాగా తీసుకున్నటువంటి ఉపాసన ఆ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే గత కొన్ని నెలల క్రితం అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలలో భాగంగా మెగా ఫ్యామిలీ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

Upasana: అబ్బాయిల ఫన్ అమ్మాయిల కౌంటర్

ఈ వేడుకలలో భాగంగా రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్ ఉపాసన ముగ్గురు ఒకే సోఫాలో కూర్చున్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసనని పక్కకు పంపించడంతో సాయిధరమ్ తేజ్ రామ్ చరణ్ ఇద్దరూ నవ్వుకున్నారు. అయితే ఈ వీడియోకి గతంలో కరోనా సమయంలో రామ్ చరణ్ ఓ ఛాలెంజ్ చేస్తూ తన భార్య ఉపాసనకు సపర్యలు చేసిన వీడియోని కలిపి ఒక వీడియోగా క్రియేట్ చేశారు. ఈ వీడియోకి అబ్బాయిల ఫన్ అమ్మాయిల కౌంటర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇలా ఈ వీడియో చూసినటువంటి అభిమానులు ఉపాసన రాంచరణ్ పై రివెంజ్ తీర్చుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Upasana Konidela: కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా దంపతులకు క్షమాపణలు చెప్పిన ఉపాసన!

Upasana Konidela: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న
కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంటూ చివరికి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ దంపతులు మంగళవారం సాయంత్రం వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఈ క్రమంలోనే నటి కియారా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేము శాశ్వత బంధంలోకి వెళ్ళామని మాకు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ తన పెళ్లి ఫోటోలను షేర్ చేసారు. ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు రామ్ చరణ్ దంపతులను తన పెళ్లికి ఆహ్వానించారు. అయితే కొన్ని కారణాలవల్ల రామ్ చరణ్ దంపతులు కియారా పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త జంటకు క్షమాపణలు చెప్పారు.

Upasana Konidela: పెళ్లికి రాలేకపోయాను…

ఈ సందర్భంగా వీరికి పెళ్లి ఫోటోలను ఉపాసన షేర్ చేస్తూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.. మీకు పెళ్లి శుభాకాంక్షలు అని శుభాకాంక్షలు తెలియజేస్తూ .. పెళ్లికి రాలేకపోయినందుకు క్షమాపణలు కూడా తెలిపారు. ఇలా ఉపాసన కీయారా దంపతులకు క్షమాపణలు తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.

Ramcharan: రామ్ చరణ్ కి కొడుకుపుట్టాలి….మనసులో కోరిక బయట పెట్టిన సుస్మిత!

Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా చిరంజీవి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. చిరంజీవి నెలకొల్పిన మెగా సామ్రాజ్యం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అలాగే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు.
ఇక అపోలో హాస్పిటల్స్ అధినేత్రి అయిన ఉపాసనని రామ్ చరణ్ ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ఇక ఇప్పటికి వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయింది.

వివాహం జరిగి పది సంవత్సరాలు గడిచిన కూడా మెగా కుటుంబంలో వారసుడు రాకపోవడంతో అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా వారసుడు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులకు శుభవార్త తెలియజేశాడు. ప్రస్తుతం ఉపాసన గర్భంతో ఉంది. ఈ క్రమంలో రాంచరణ్ కి అబ్బాయి పుట్టాలని కొందరు కోరుకుంటుంటే లేదు అమ్మాయి పుడుతుందని మరికొందరు అంటున్నారు.

Ramcharan: ఇప్పటికే నలుగురు ఉన్నారు…

ఈ క్రమంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ఇటీవల రామ్ చరణ్ కి పుట్టబోయే పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత చిరంజీవి నటిస్తున్న సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాకు కూడా పనిచేసింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుస్మిత రామ్ చరణ్ కి పుట్టబోయే పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో సుస్మిత మాట్లాడుతూ ఇప్పటికే మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. రామ్ చరణ్ కి పుట్టబోయేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాకు సంతోషమే. కానీ రామ్ చరణ్ కి అబ్బాయి పుడితే మాకు చాలా స్పెషల్ ” అంటూ తన తమ్ముడు రామ్ చరణ్ కి అబ్బాయి పుట్టాలని కోరుకుంది.

Chiranjeevi: ఆ వార్త వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాను… ఎమోషనల్ కామెంట్స్ చేసిన మెగాస్టార్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. గత ఏడాది చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి13వ తేదీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

తన కొడుకు కోడలు తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయాన్ని తలుచుకొని ఈయన ఎమోషనల్ అయ్యారు. ఉపాసన రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం చెప్పగానే నాకు సురేఖకు ఎంతో సంతోషం వేసింది. ఆ సంతోషంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు.

Chiranjeevi: ఆరు సంవత్సరాలుగా శుభవార్త కోసం ఎదురుచూసాం…

రామ్ చరణ్ ఉపాసన జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన అనంతరం ఈ శుభవార్తను మాకు తెలియజేశారు. ఆ సమయంలో తమకు చాలా సంతోషం వేసిందని గత ఆరు సంవత్సరాల నుంచి ఈ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నామని ఈయన తెలిపారు. అయితే ఉపాసనకు మూడు నెలలు పూర్తి అయిన తర్వాతనే ఈ శుభవార్తను అందరితో పంచుకున్నామని ఈ సందర్భంగా చిరంజీవి ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Upasana: పిల్లల్ని కనడం 20 ఏళ్ల ప్రాజెక్టు… పిల్లల విషయంలోనూ బిజినెస్ కోణంలో ఆలోచించిన మెగా కోడలు!

Upasana: ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగా కుటుంబం నుంచి రాంచరణ్ మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు పెళ్లి చేసుకుని పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా పిల్లల గురించి ఏ విషయం ఆలోచించకపోవడంతో మెగా అభిమానులు కొంతమేర నిరాశ వ్యక్తం చేశారు. ఇకపోతే రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేయడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇలా మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లల విషయం గురించి గతంలో ఉపాసన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాసన పిల్లల్ని కనడం గురించి మాట్లాడుతూ.. పిల్లల్ని కనడం అంటే 20 ఏళ్ల ప్రాజెక్టు అని ఈమె తెలిపారు.

పిల్లల్ని కనడానికి మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ఈ ప్రపంచంలోకి ఒక ప్రాణిని తీసుకురావడం అనేది చాలా పెద్ద బాధ్యత వారు పుట్టిన తర్వాత వారికి ఏం కావాలి ఏం చేయాలి అనే విషయాలు గురించి ముందుగానే సన్నద్ధం అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచించాలని ఇలాంటి విషయాల గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే పిల్లల కోసం ప్లాన్ చేయాలని ఈమె తెలిపారు.

Upasana: పిల్లలను కనడానికి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి…

ఈ సందర్భంగా పిల్లలకు కావలసిన అవసరాలన్నింటిని ముందుగానే సమకూర్చి పిల్లలను ప్లాన్ చేసుకోవాలంటూ గతంలో ఉపాసన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే పిల్లలను కనడాన్ని కూడా ఉపాసన ఒక బిజినెస్ ఉమెన్ గా బిజినెస్ యాంగిల్ లోనే చెప్పారని చెప్పాలి. ఇలా ఉపాసన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Upasana: తల్లి కాబోతున్న ఉపాసన… సంతోషంలో మెగా అభిమానులు!

Upasana: మెగా వారసుడు రామ్ చరణ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈయన 2012వ సంవత్సరంలో తాను ప్రేమించిన ఉపాసన కామినేనినీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా వీరిద్దరు పిల్లల గురించి ఆలోచించకపోవడంతో పలుమార్లు ఈ విషయం గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.

ఇక పిల్లల గురించి సరాసరి ఉపాసనకు ప్రశ్నలు తలెత్తడంతో ఆమె అది తన వ్యక్తిగత విషయమని చెప్పాల్సిన సమయంలో తానే చెబుతానని చెప్పారు.మరోవైపు మెగా అభిమానుల సైతం మెగా వారసుడు కోసం ఎదురుచూస్తూ ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే త్వరలోనే మెగా ఇంట బుల్లి వారసుడు రాబోతున్నారని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారనే విషయాన్ని చిరు ట్విట్టర్ వేదికగా అధికారకంగా ప్రకటించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Upasana: మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేవు…


ఈ క్రమంలోనే చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ …రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఈ సందర్భంగా చిరంజీవి తెలియజేశారు. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ రాంచరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tollywood Heros Wife’s: ఈ టాలీవుడ్ హీరోల భార్యల సంపాదన తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Tollywood Heros Wife’s: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ ఒక్కో సినిమాకి హీరోలు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ హీరోలు సంపాదిస్తుండగా వీరి భార్యలు మాత్రం తామేమి తక్కువ కాదంటూ హీరోలకు పోటీపడి మరి డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోల భార్యలు సంపాదన తెలిస్తే మాత్రం దిమ్మతిరిగి పోవాల్సిందే.

ఉపాసన కొణిదెల: రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా కోట్లు సంపాదిస్తుంటే ఉపాసన సైతం పలు వ్యాపారాల ద్వారా రామ్ చరణ్ కు పోటీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని ఉపాసన చూసుకుంటూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.

అల్లు స్నేహారెడ్డి: ఐకాన్ సార్ అల్లు అర్జున్ సతీమణిగా ఎంతో గుర్తింపు పొందిన స్నేహ రెడ్డి హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో డైరెక్టర్ గా విధులు నిర్వహించడమే కాకుండా ప్రముఖ మ్యాగజైన్ కు ఎడిటర్ గా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

సింగర్ చిన్మయి: హీరో రాహుల్ రవీందర్ సతీమణిగా పేరుగాంచిన సింగర్ చిన్మయి సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాహుల్ రవీంద్ర కన్నా భారీ మొత్తంలో సంపాదించడమే కాకుండా తన భర్త కన్నా అధిక మొత్తంలో ఇన్కమ్ టాక్స్ లు చెల్లిస్తున్నారు.

వేరోనిక: మంచు విష్ణు భార్యగా గుర్తింపు పొందిన వెరోనికా కి క్లాతింగ్ కంపెనీకి ఆమె ఓనర్ గా ఉన్నారు. కుటుంబ ప‌రంగా ఉన్న వ్యాపారాలు కూడా చూసుకోవడమే కాకుండా మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాకు ఈమె డిజైనర్ గా వ్యవహరించారు.

Tollywood Heros Wife’s:

స్వాతి:నందమూరి కళ్యాణ్ రామ్ భార్యగా స్వాతి అందరికీ సుపరిచితమే ఈమె ఎంబిబిఎస్ పూర్తి చేయడమే కాకుండా హైదరాబాద్ లో ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీని నడుపుతున్నారు. క‌ళ్యాణ్‌రామ్ సినిమాల వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ అంతా ఈ కంపెనీల్లోనే జరుగుతుంది.

Upasana: మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయనున్న మెగా కోడలు..? క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..?

Upasana: మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే గతంలో కొంతకాలం సినిమాలకు దూరమైన చిరంజీవి రాజకీయాలలో చురుగ్గా పాల్గొని ప్రజారాజ్యం పార్టీని కూడా స్థాపించాడు. అయితే అనూహ్య కారణాలవల్ల ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఆ తర్వాత మళ్లీ సినిమాలలో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలలోనటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇక చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ దసరా కానుకగా ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో పొలిటికల్ విషయాలను కూడా విలేకరులతో ముచ్చటించాడు.

ఈ సమావేశంలో ఒక విలేకరి మాట్లాడుతూ…మీ వారసురాలిగా మీ కోడలు ఉపాసన రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మల్కాజిగిరి స్థానంలో ఎంపీగా పోటీచేస్తున్నారన్న విషయం నిజమేనా…? అని ప్రశ్నించగా.. చిరంజీవి స్పందిస్తూ…. ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు. అయినా ఇలాంటి వార్తలను క్రియేట్ చేసేవారు మంచి సినిమాలను తీయొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.

 

Upasana: రాజకీయాలకు దూరంగా ఉపాసన..

ఇకపోతే ఉపాసన ఇలాంటి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆమె అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా బాధ్యతలు వ్యవహరించడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆరోగ్య విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. ఎన్నో సామాజిక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇక ఉపాసన రాజకీయాలలోకి రాబోతుందనే వార్తలు గురించి మెగాస్టార్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు చెక్ పడింది.

Ram Charan: రామ్ చరణ్ పెళ్లి ఉపాసనతో కాకుండా ఆ స్టార్ హీరో కూతురుతో చేయాలనుకున్నారా..ఆమె ఎవరంటే?

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉండే జంటలలో రామ్ చరణ్ ఉపాసన జంట ఒకటి.వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.వీరి వివాహం జరిగి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఇలా చిరంజీవి స్నేహితులగా ఉన్నటువంటి వారిలో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. ఈ క్రమంలోనే ఈ హీరోలు ఇద్దరు ఒకరి సినిమాలకు మరొకరు ఎంతో సహాయ సహకారాలు చేసుకున్నారు. ఈ స్నేహ బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని భావించారట.

అయితే మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కు వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితకు వివాహం చేయాలని వీరిద్దరూ భావించారట.ఇదే విషయాన్ని చిరంజీవి రామ్ చరణ్ దగ్గర చెప్పగా రాంచరణ్ ఉపాసనని ప్రేమిస్తున్నాననే విషయాన్ని చెప్పడంతో మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.ఇదే విషయాన్ని వెంకటేష్ కి చెప్పగా పిల్లల సంతోషం కన్నా మనకి ఏది ముఖ్యం కాదు వారికి ఇష్టం వచ్చిన విధంగానే చేద్దాం అంటూ ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.

Ram Charan: మెగా కోడలు అయ్యే అవకాశాన్ని వదులుకున్న ఆశ్రిత…

ఈ విధంగా వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత మెగా కోడలు అయ్యే అవకాశాన్ని కోల్పోయారు లేదంటే వెంకటేష్ కుమార్తె మెగా కోడలుగా అడుగుపెట్టేది.ఇలా రామ్ చరణ్ తాను ప్రేమించిన అమ్మాయి ఉపాసనని పెళ్లి చేసుకోగా ఆశ్రిత సైతం హైదరాబాద్ రేస్ క్లబ్ కోర్స్ ఓనర్ సురేందర్ రెడ్డి మనవడుతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఈమె కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలా ఈ రెండు జంటలో ప్రేమ వివాహాలు చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు.

Upasana: పిల్లల గురించి స్పందించిన ఉపాసన… మీకలా అర్థమైందా.. పూర్తి వీడియో చూడండి అంటూ కామెంట్స్?

Upasana: మెగా కోడలిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపాసన పిల్లల విషయం గురించి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ప్రతి ఒక్కరు మీరు పిల్లల గురించి పెద్ద ఎత్తున ప్రశ్నలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు పిల్లల గురించి ప్రశ్నలు ఎదురైన సమయంలో ఉపాసన సరైన సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని తప్పుకునేవారు.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఈమె ఓ కార్యక్రమంలో భాగంగా సద్గురుని కలిసినప్పుడు తాను పిల్లల గురించి ప్రశ్నించిన విషయం మనకు తెలిసిందే. నేను తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ నన్ను పిల్లల గురించి ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు అంటూ ఈమె సద్గురిని ప్రశ్నించారు.ఇక సద్గురు ఈమెకు సమాధానం చెబుతూ ప్రస్తుతం పెరిగిపోతున్న జనాభా వల్ల పిల్లలను కనకపోవడమే మంచిది. ఇలా పిల్లలను ఎవరైతే వద్దనుకుంటారో అలాంటి వాళ్లకు తాను బహుమానం ఇస్తానని చెప్పారు.

Upasana: త్వరలోనే మెగా గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఉపాసన.. వారసుడోస్తున్నాడు అంటూ ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

అయితే ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు జనాభా తగ్గించడం కోసమే ఉపాసన దంపతులు పిల్లలను వద్దనుకుంటున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఉపాసన స్పందిస్తూ ఓ మై గాడ్ మీకు అలా అర్థమైందా.. అంటూ విచారం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే తాను సద్గురుతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాతే ఓ నిర్ణయానికి రండి అని చెప్పారు.

పిల్లల గురించి వస్తున్న వార్తలపై విచారం వ్యక్తం చేసిన ఉపాసన…

ఈ వీడియోతో పాటు తాను చేసిన పోస్ట్ కూడా చూడాలని ఉపాసన ఈ సందర్భంగా పిల్లల గురించి మరోసారి స్పందించారు.పిల్లలు వద్దు అనుకునే వారికి సద్గురు బహుమానం ఇస్తానని చెప్పారు. అయితే ఆ బహుమానం తీసుకోవడానికి మా తాతయ్య ఒప్పుకోవడం లేదు అంటూ ఉపాసన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉపాసన పోస్ట్ చేయడంతో తనకు బహుమానం వద్దంటే పిల్లలు కావాలని అర్థం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఉపాసన పిల్లలు కనాలనే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తుంది అయితే ఈ శుభవార్త ఆమె ఎప్పుడు చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.