Charan -Upasana: చరణ్ ఉపాసన పెళ్లి బంధానికి పదేళ్ళు… పెళ్లి రోజు వేడుకల కోసం అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు?
Upasana: మెగా కోడలిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపాసన పిల్లల విషయం గురించి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ప్రతి ఒక్కరు మీరు పిల్లల గురించి పెద్ద ఎత్తున ప్రశ్నలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు పిల్లల గురించి ప్రశ్నలు ఎదురైన సమయంలో ఉపాసన సరైన సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని తప్పుకునేవారు.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఈమె ఓ కార్యక్రమంలో భాగంగా సద్గురుని కలిసినప్పుడు తాను పిల్లల గురించి ప్రశ్నించిన విషయం మనకు తెలిసిందే. నేను తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ నన్ను పిల్లల గురించి ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు అంటూ ఈమె సద్గురిని ప్రశ్నించారు.ఇక సద్గురు ఈమెకు సమాధానం చెబుతూ ప్రస్తుతం పెరిగిపోతున్న జనాభా వల్ల పిల్లలను కనకపోవడమే మంచిది. ఇలా పిల్లలను ఎవరైతే వద్దనుకుంటారో అలాంటి వాళ్లకు తాను బహుమానం ఇస్తానని చెప్పారు.
అయితే ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు జనాభా తగ్గించడం కోసమే ఉపాసన దంపతులు పిల్లలను వద్దనుకుంటున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఉపాసన స్పందిస్తూ ఓ మై గాడ్ మీకు అలా అర్థమైందా.. అంటూ విచారం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే తాను సద్గురుతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాతే ఓ నిర్ణయానికి రండి అని చెప్పారు.
ఈ వీడియోతో పాటు తాను చేసిన పోస్ట్ కూడా చూడాలని ఉపాసన ఈ సందర్భంగా పిల్లల గురించి మరోసారి స్పందించారు.పిల్లలు వద్దు అనుకునే వారికి సద్గురు బహుమానం ఇస్తానని చెప్పారు. అయితే ఆ బహుమానం తీసుకోవడానికి మా తాతయ్య ఒప్పుకోవడం లేదు అంటూ ఉపాసన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉపాసన పోస్ట్ చేయడంతో తనకు బహుమానం వద్దంటే పిల్లలు కావాలని అర్థం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఉపాసన పిల్లలు కనాలనే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తుంది అయితే ఈ శుభవార్త ఆమె ఎప్పుడు చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…