ఓ పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన వాహనంలో జరిగిన ఘటన చూసి సెక్యూరిటీ గార్డ్ ఆశ్చర్యపోయాడు. అక్కడ ఏం జరిగిందంటే.. పాఠశాలకు ఎదరురుగా ఓ వాహనం పార్క్ చేసి ఉంది. దానిని తొలగించేందుకు అతడు ప్రయత్నించాడు. ఆ వాహనంలో ఒక 16 ఏళ్ల అమ్మాయితో పాటు.. ముగ్గురు అబ్బాయిలు ఉండటం చూసి షాక్ అయ్యాడు.
ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలోని అరుంబాక్కంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అరుంబాక్కంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కోటీశ్వరన్.. పాఠశాల ఆవరణలో పార్క్ చేసిన వాహనాన్ని తరలించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆ బస్సులో నలుగురు వ్యక్తులను చూశాడు. అందులో మగ డ్రస్ లో 16 ఏళ్ల బాలికతో పాటు మరో ముగ్గరు అబ్బాయిలు ఉన్నారు. అతడిని చూసిన ముగ్గురు వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయారు.
అక్కడే ఉన్న ఆ బాలికను అతడు పోలీసులకు అప్పగించాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ యువతిది చెన్నైలోని జామ్బజార్ మీర్జాకిపేట్ అని తెలుసుకున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురు స్నేహితులు నిజాం, కార్తీక్, దేవ లతో కలిసి బయటకు వచ్చినట్లు పోలీసులకు ఆమె తెలిపింది. వారు ప్రైవేట్ స్కూల్ గోడ దూకి.. అక్కడ పార్క్ చేసిన బస్సులో గంజాయి తాగినట్లు విచారణలో ఆ బాలిక చెప్పింది. ఆ తర్వాత ఆ బాలిక నిద్రలోకి జారుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు ఆ బాలిక తండ్రిని పిలిపించారు. అతడిని కూడా విచారించారు. ఆ తర్వాత జిల్లా శిశు సంక్షేమ అధికారి.. యువతిని తన తండ్రితో కలిసి పంపించారు. దీనిపై పోలీసులు.. యువతి వేధింపులకు గురైందా.. అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…