యుక్తవయసులో ఈ హీరోలందరూ హిట్, సూపర్ హిట్ సినిమాలు తీసి తమ అభిమానుల చేత కీర్తించబడ్డారు. సాధారణంగా హీరోలు వయసు మళ్లడంతో తండ్రి, తాత పాత్రలకు పరిమితమవుతారు. అక్కినేని మినహా, ఎన్టీ రామారావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు తమ సినిమాలతో సందడి చేశారు.
1993 సంవత్సరం సీనియర్ హీరోల అందరికి కలసి వచ్చిందని చెప్పవచ్చు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్,కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మేజర్ చంద్రకాంత్ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు ప్రధాన పాత్ర పోషించారు.
మోహన్ బాబు, నగ్మా, రమ్యకృష్ణలు హీరో, హీరోయిన్లుగా నటించారు. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమా రావడంతో అభిమానులు ఎన్టీ.రామారావుకు బ్రహ్మరథం పట్టారు. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది.
తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో “పచ్చని సంసారం” సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, ఆమని హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇదే సంవత్సరం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో “ఏవండీ ఆవిడ వచ్చింది” చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో శోభన్ బాబు, వాణిశ్రీ, శారద హీరో, హీరోయిన్లుగా నటించారు. చక్కటి కుటుంబ కథా చిత్రంగా వచ్చి సినిమా విజయాన్ని సాధించింది.
ఇదే సంవత్సరంలో ఎం.ఎం.మూవీ ఆర్ట్స్, శరత్ దర్శకత్వంలో “బావా బావమరిది” చిత్రం విడుదలయింది. ఇందులో కృష్ణంరాజు, జయసుధ, సిల్క్ స్మిత ప్రధానపాత్రలు పోషించగా సుమన్, మాలశ్రీ హీరో, హీరోయిన్లుగా నటించారు. రాజ్ కోటి అందించిన చక్కటి పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
1993 గీత ఆర్ట్స్, బి.గోపాల్ దర్శకత్వంలో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించారు. చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందడంతో.. ఒక నాగేశ్వరరావు మాత్రమే 1993 లో విజయాన్ని అందుకోలేక పోయారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…