టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయిన వారిలో సింగర్ సునీత ఒకరు. ఈమె తన మధురమైన గానంతో ఎన్నో పాటలు పాడి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఎన్నో సంవత్సరాల నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న సునీత తన ఒంటరి జీవితానికి గుడ్ బై చెబుతూ తన జీవితంలోకి తన స్నేహితుడు అయినటువంటి రామ్ వీరపనేనిని రెండవ పెళ్లి చేసుకుని ఆహ్వానించింది.
ఈ క్రమంలోనే సింగర్ సునీత పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. పెళ్లీడుకొచ్చిన పిల్లలను పెట్టుకుని తాను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అప్పట్లో పెద్దఎత్తున వీరిపై విమర్శలు కురిపించారు. అయితే సునీత తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను పడిన కష్టాలను చూస్తే మాత్రం ఆమె నిర్ణయం సరైనదేనని చెప్పవచ్చు. అందరి ఆడ పిల్లలలాగే తను కూడా తన జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలని ఎన్నో కలలు కన్నానని అయితే ఆ కలలన్నీ ఆవిరైపోయాయని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.
జీవితంపై విరక్తి వచ్చి బతుకుతున్న నాకు రామ్ జీవితం పై కొత్త ఆశలను కల్పించాడని అతడు నాకు ప్రపోజ్ చేసినప్పుడు అతని మాటల్లో నిజాయితీ కనిపించిందని, అందుకే తనని పెళ్లి చేసుకున్నానని సునీత తెలియజేశారు. రామ్ ని రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనపై విమర్శలు ఏ మాత్రం తగ్గడం లేదని, కేవలం అతని వెనక ఉన్న ఆస్తిని, డబ్బును చూసి పెళ్లి చేసుకున్నాను అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు.
నిజానికి రామ్ కి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో, అతని లావాదేవీలు తనకు తెలియదని, ఇలా తెలియదని చెప్పినా కూడా ఎవరు నమ్మరనే విషయం తనకు తెలుసని ఈ సందర్భంగా సునీత రామ్ ఆస్తుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఏది ఏమైనా ఎన్నో బాధలు, అవమానాలు పడిన తర్వాత సునీత రెండవ పెళ్లి చేసుకుని ప్రస్తుతం తన జీవితంలో సంతోషంగా ఉందని మాత్రం తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…