Categories: FeaturedGeneral News

అమాయకుడిని మోసం చేయాలని చూసిన మహిళా పోలీస్.. చివరకు ఏమైందంటే..!

చట్టం ఎవరికీ చుట్టం కాదు. చేతిలో అధికారం ఉంది కదా.. అని లంచాలకు పాల్పడితే ఏదో ఒక రోజు శిక్ష అనుభవించడం అనేది జరుగుతుంది. ఇలానే ఓ మహిళా పోలీసు ఓ అమాయకుడి దగ్గర డబ్బులు తీసుకొని అబద్దం ఆడింది. చివరకు అతడు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు శివగంగ జిల్లా ఇళయాంకుడికి చెందిన అర్షద్.. ఓ బిజినెస్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అతడికి తెలిసిన వారి వద్ద సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. వాటిని అతడు తన బ్యాగ్ లో భద్రపరుచుకున్నాడు. ఇంకా తనకు డబ్బులు అవసరం ఉండటంతో అతడు తన సోదరుడితో బైక్ పై నాగమలై పుదుకొట్టైకు వెళ్లాడు. అక్కడ అర్షద్ తన సోదరుడు డబ్బులు ఇస్తామన్న స్నేహితుడి కోసం ఎదురుచూశారు. ఆ ప్రదేశానికి అక్కడే పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై వాసంతి వచ్చారు. ఆ బ్యాగ్ లో ఏముందంటూ తీసుకున్నారు.

రేపు స్టేషన్ కు వచ్చి ఆ బ్యాగ్ ను కలెక్ట్ చేసుకోమని చెప్పారు. దీంతో వాళ్లు తెల్లారి స్టేషన్ కి వెళ్లి బ్యాగ్ అడిగారు. అందులో న్యూస్ పేపర్స్ తప్ప.. డబ్బులు లేవని ఆ మహిళా ఎస్సై సమాధానం ఇచ్చింది. దీంతో అతడు మధురై జిల్లా ఎస్పీకి విషయం చెప్పాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వాసంతిని, ఆమె సోదరుడు, మరో ముగ్గురు కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అంతే కాకుండా ఆమెను విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఆమె దీనిపై కోర్టును ఆశ్రయించగా వాదోపవాదనల తర్వాత ఆమె వద్ద రూ.2.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారికి కోర్టు సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

11 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

12 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

19 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

20 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

20 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago