అమెరికా తన సైనిక స్థావరాలను, సైనికులను ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉపసంహరించుకున్న దగ్గర నుంచి ఆ దేశంలో పరిస్థితితులు రోజురోజుకు దిగజారాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల వశం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ల దేశం నుంచి మరో దేశం వెళ్తేందుకు విశ్రప్రయత్నాలు చేస్తున్నారు.
అక్కడ ఉన్న మహిళలపై బలవంతంగా అత్యాచారం చేసేందుకు వెతుకుతున్నారంటేనే అర్థం చేసుకోవాలి అక్కడ రాక్షసత్వం ఎంతగా ఉందో అని. ఆ దేశం నుంచి మరో దేశానికి రావాలంటే అక్కడ ఒక్కటే మార్గం అది కూడా కాబూల్ ఎయిర్ పోర్ట్ మాత్రమే. అక్కడ నుంచి విదేశీయులు అయినా.. అక్కడి పౌరులు అయినా దేశం దాటడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.
ఉగ్రవాదదాడులు ఎయిర్ పోర్టే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయినా అక్కడకు ప్రజలు తండోపతండాలకు వస్తూనే ఉన్నారు. ఉగ్రదాడులు జరుగుతున్నా సరే కాబూల్ ఎయిర్ పోర్ట్ వదిలి వెళ్ళటం లేదు. ఒకపక్క కాబూల్ ఎయిర్ పోర్టులో ఉగ్రదాడి జరుగుతుందని అక్కడ ఉన్న పౌరులంతా దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముందే హెచ్చరికలు జారీ చేసినా అక్కడి నుండి ప్రజలు వెళ్లిపోయిన దాఖలాలు లేవు.
ఫలితంగా కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 180 మందికి పైగా ప్రాణాలను పోగొట్టుకోగా, 150 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. అందులో 169 వరకు ఆఫ్గాన్ పౌరులే ఉన్నారని అక్కడ అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో తాలిబన్లు కూడా 28 మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇలా ఉండగా వాస్తవంగా ఎక్కువ మందే చనిపోయి ఉంటారని అంచనా. ఇదిలా ఉండగా.. మరోసారి కూడా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…