NTR - Charan: ఎన్టీఆర్, చరణ్ ని చూసి అసూయ వేస్తుందని షాకింగ్ కామెంట్స్ చేసిన తమిళ స్టార్ హీరో..?
NTR – Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో RRR సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు అనే పాట ప్రతి ఒక్కరి నోటి వెంట రావడమే కాకుండా ఈ పాటకు ప్రతి ఒక్కరు కాలు కదుపుతున్నారు. ఇక పోతే ఈ సినిమాలో నటించిన ఈ హీరోల పై స్టార్ హీరో మాధవన్ స్పందిస్తూ వీరి గురించి కామెంట్ చేశారు.
ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య ఉన్న ఈ సాహిత్యం చూస్తుంటే నాకు అసూయ కలుగుతుందని మాధవన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఈ సినిమాలో వీరిద్దరిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. హాట్సాఫ్. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. భారతీయ సినీ చరిత్రను తిరగరాస్తారు అంటూ మాధవన్ ట్వీట్ చేశారు.
హీరో మాధవన్ చేసిన ట్వీట్ కి స్పందించిన ఆర్ఆర్ఆర్’ టీమ్.. ‘థాంక్యూ మ్యాడీ సర్!.. మేం కూడా అందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభంజనం సృష్టించేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాము థియేటర్లను తొందరగా తెరచుకోవాలని ఆశిద్దాం.. అంటూ మాధవన్ ట్వీట్ కి రీప్లే ఇచ్చారు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…