Taapsee: మెగాస్టార్ చిరంజీవిని చూడగానే చిన్నపిల్లలా మారిపోయిన తాప్సీ.. ఆనందానికి అవధులు లేవు!
Taapsee: ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సొట్ట బుగ్గల చిన్నది తాప్సి తెలుగులో పలు చిత్రాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈమె తిరిగి తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.
స్వరూప్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఈ సినిమా ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
లేకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు మార్చి 30వ తేదీ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డికి, మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాకి కూడా నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి రావడంతో తాప్సి చిన్న పిల్లగా మారిపోయి పెద్ద ఎత్తున సందడి చేసింది. మెగాస్టార్ రావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈక్రమంలోనే ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవిని చూసిన తాప్సీ వెంటనే అతనిని హగ్ చేసుకొని సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు విషయాల గురించే తాప్సి ముచ్చటించారు.ఇలా వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూడటంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె ఈ సినిమా గురించి వేదికపై మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…