Featured

Tarakaratna : నందమూరి కుటుంబంలో తారకరత్న చివరి కోరిక తీర్చేదేవరు…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Tarakaratna : నందమూరి తారకరత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారక రత్న గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో మళ్ళీ గుండె కొట్టుకునేలా 45 నిమిషాల పాటు కుప్పం వైధ్యులు శ్రమించారు. ఇక అక్కడినుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్న ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ వార్తలు వచ్చినా ఎవరూ ఈ విషయంలో క్లారిటీగా చెప్పలేదు. ఇక నేడు ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించారు. ఇక ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.

ఆయన చివరి కోరిక తీర్చేదేవరు…

భరద్వాజ గారు మాట్లాడుతూ తారకరత్న వారసత్వంగా సినిమాల్లోకి హీరోగా వచ్చినా తానేంటో తన నటన ఏంటో అమరావతి సినిమాలో విలన్ గా చేసి ప్రూవ్ చేసుకున్నాడు ఆ నటనకు గాను నంది అవార్డు అందుకున్నాడు అంటూ చెప్పారు. సినిమా కెరీర్ పక్కన పెడితే రాజకీయాల్లోకి రావాలని తారకరత్న అనుకున్న సమయం నుండి పార్టీ కోసం కష్టపడ్డాడు అంటూ చెప్పారు. టీడీపీలో ఉన్న అంతర్గత సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేసాడు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండటం నష్టాన్ని కలిగిస్తుందని తెలిసి నందమూరి ఫ్యామిలీని కలిపే దిశగా ప్రయత్నాలను చేసాడు తారకరత్న. ఇక వచ్చే 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి అందుకోసం కార్యకర్తలను, పార్టీ నాయకులను కలుపుకుని పనిచేసిన తారకరత్న ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం నందమూరి కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అంటూ చెప్పారు భరద్వాజ. ఇక తారకరత్న ఆరోగ్యం విషయంలో మొదటి నుండి క్లారిటీ లేదని, ఆయనకు గుండె పోటు వచ్చిన సమయంలోనే శరీరం నీలి రంగుకు మారిపోయిందంటూ ప్రచారం జరిగింది. అయితే తారకరత్న కోలుకుంటాడు అంటూ బాలకృష్ణ అక్కడే ఉండి అన్నీ తానై చూసుకున్నారు.

ఇక అప్పటికే తారకరత్న పరిస్థితి విషమించినా బయటికి చెబితే లోకేష్ పాదయాత్ర మీద ఆ ఎఫెక్ట్ పడుతుందని చెప్పడం లేదు అంటూ వార్తలు వచ్చాయి. అయితే నందమూరి కుటుంబం నుండి అందరూ వెళ్లి తారకరత్న ను పరామర్శించడం ఇవన్నీ ఆ వార్తలకు ఊతం ఇచ్చాయి. ఇక కొద్దిరోజులు తారకరత్న గురించి హెల్త్ బుల్లిటెన్స్ వచ్చినా చివరికి అవి కూడా ఆపేసారు. అసలు ఏం జరుగుతోంది అనేది బయటి వారికి తెలియకపోవడం అనుమానాలకు బలం చేకూర్చింది. చివరికి నిన్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి హైదరాబాద్ తరలించడంతో అందరికీ ఏదో చెడు వార్త వినబోతున్నాం అనేది అర్థమైంది. అయితే తారకరత్న విషయంలో అసలేం జరిగిందనేది బయటవారికీ మాత్రం గందరగోళంలాగే ఉంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago